వ్యాసాలు

తెలుగు ప్రజల రాజకీయ, సాంస్కృతిక వికాసంలో ‘నిషేధిత’సంఘాలు

‘ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం తేలిక. ప్రజాస్వామికీకరణ చాలా కష్టం’ అని ప్రొ. శేషయ్యగారు తరచూ అనేవారు. మనలాంటి సమాజాల్లో పౌరహక్కులు   ప్రజల అనుభవంలోకి రాగల రాజకీయ, సాంస్కృతిక వాతావరణం ఏర్పడ్డం ఎంత కష్టమో చెప్తూ ఈ మాట అనేవారు. భూస్వామ్యం సాంస్కృతికంగా కూడా బలంగా ఉన్న చోట ప్రజా స్వామికీకరణకు చాలా అడ్డంకులు ఉంటాయి. ఎవరో కొంతమంది ఉదాత్త ఆశయాలతో  ప్రజాస్వామ్యం కోసం పని చేసినంత మాత్రాన అది ఎన్నటికీ ఒక భౌతిక వాస్తవంగా మారదు. వాళ్ల కృషి దోహదకారి కావచ్చు. అంత వరకే. ఆధిపత్య సంబంధాల్లో అణగారిపోతున్న జనం మూకుమ్మడిగా లేచి పోరాటాల్లోకి వచ్చినప్పుడే   ప్రజాస్వామ్యానికి కుదురు
వ్యాసాలు

ఉమ్మడి వారసత్వ ప్రదేశాలు – మతపరమైన ఎజెండాలు

1992 డిసెంబరు 6న భారతదేశంలోని వారసత్వ ప్రదేశంలో అతిపెద్ద వ్యవస్థీకృత దాడి జరిగింది. ఈ దాడి రాజ్యమూ దాని బలగాల సమక్షంలో జరిగింది. రాముడి విగ్రహాలను బయటకు తీసి తాత్కాలిక ఆలయంలో ఉంచారు. ఇప్పుడు రామమందిరం ప్రారంభోత్సవం జరుగుతోంది. కానీ అందులో మరో రాముడి విగ్రహం ఉంటుంది. లౌకిక  దేశానికి చెందిన ప్రధాని ఆలయ ప్రారంభోత్సవం పేరుతో భారత్‌తో పాటు ప్రపంచంలోని దాదాపు 50 దేశాల్లోనూ ఆసక్తిని పెంచుతున్నారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన రోజున దీపావళిని జరుపుకోవాలని, తమ నగరం లేదా గ్రామంలోని దేవాలయాలలో కార్యక్రమాలు నిర్వహించాలని సంఘ్ పరివార్ సభ్యులందరూ ప్రజలకు పిలుపునిచ్చారు. హిందూ రాష్ట్ర ఎజెండాను
వ్యాసాలు

బిల్కిస్ బానో తీర్పు: ఎక్కువ  ఉపశమనం, కొంచెం భరోసా

అత్యంత దారుణమైన వార్తలు, భయానక, దిగ్భ్రాంతికరమైన న్యాయ నిర్ణయాలు, అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల వ్యక్తిగత, అధికారిక ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు, ప్రమాదాల తుఫాను మధ్య జనవరి 8, సోమవారం నాడు సుప్రీం కోర్టు నిర్ణయం చాలా వరకు ఉపశమనం కలిగించింది. కొంత వరకు భరోసానిస్తుంది. జస్టిస్ బిబి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ 75వ స్వాతంత్య్ర  వార్షికోత్సవం సందర్భంగా మోడీ కేంద్ర , గుజరాత్ ప్రభుత్వాలు శాంతిభద్రతలతోనే కాకుండా మానవీయతకు చేసిన అత్యంత ఘోరమైన దుష్ప్రవర్తనను రద్దు చేసింది. 2002లో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుజరాత్ మారణకాండ సందర్భంగా బిల్కిస్
వ్యాసాలు

పసి పాపల నిదుర కనులపై ముసిరిన యుద్ధోన్మాదం ఎంతో..

పాలస్తీనా స్వేచ్ఛాకాంక్షపై జరుగుతున్న యుద్ధంలో పసి పిల్లల మరణాలు ప్రపంచ మానవాళిని కలచివేస్తున్నాయి. యుద్ధం ఎక్కడ జరిగినా, ఏ రూపంలో జరిగినా నెత్తురు ప్రవహించాల్సిందే. చరిత్ర పొడవునా రాజకీయాల కొనసాగింపుగా సాగిన యుద్ధాలన్నీ తీవ్రమైన విధ్వంసానికి, విషాదానికి కారణమయ్యాయి. ఏ నేల మీది జరిగే యుద్ధాలకైనా దురాక్రమణే లక్ష్యం. అది పాలస్తీనాలో ఒక రకంగా ఉండొచ్చు. కశ్మీర్‌లో ఇంకోలా ఉండొచ్చు. దేశం మధ్యలోని దండకారణ్యంలో మరోలా ఉండొచ్చు. ఎక్కడైనా సరే, ఏ రూపంలో అయినా సరే దురాక్రమణ కోసం సాగే యుద్ధాలు పిల్లలను బలి తీసుకుంటాయి. పాలస్తీనాలో చనిపోతున్న పిల్లల కోసం అనుభవిస్తున్న అనంతమైన దు:ఖం దండకారణ్యాన్ని కూడా
వ్యాసాలు

త‌పాలా ఉద్యోగులంటే మోదీకి ఎందుకింత కక్ష ? 

చెడ్డ‌ పోస్టుమ్యాన్ ఉండ‌డు.. , మంచి పోలీస్ క‌నిపించ‌డు.. అనేది ఓ నానుడి. అంటే..  పోస్ట్ మ్యాన్ పని విధానం ఎంత‌  నిస్వా ర్థంగా త్యాగ‌పూరితంగా ఉంటుందో ఈ సామెత తెలియ‌జేస్తున్న‌ది. నేటికీ మారుమూల గ్రామం మొద‌లు న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల దాకా త్యాగ‌పూరితంగా సేవ‌లు అందిస్తున్న ప్ర‌భుత్వ విభాగం ఏదైనా ఉన్న‌ది అంటే అది తంతి త‌పాలా శాఖ (పోస్ట‌ల్ డిపార్ట్ మెంటు) మాత్ర‌మేన‌ని చెప్పుకోవాలి. వృత్తి నిబ‌ద్ధ‌త‌తో ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందిస్తున్న గ్రామీణ త‌పాలా ఉద్యోగులు త‌మ స‌మ‌స్య ల ప‌రిష్కారం కోసం  కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరుతూ స‌మ్మె చేస్తే, వారిని కేంద్రంలోని న‌రేంద్ర‌మోదీ బీజేపీ ప్ర‌భుత్వం
వ్యాసాలు

చదువులు ఎలా ఉండాలి? చదువుల సారం ఏమిటి?

(త్వరలో విడుదల కానున్న కొకు నవల చదువు పునర్ముద్రణకు రాసిన ముందుమాట) కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన నవలలో ఒక పెద్ద నవల చదువు. ఇది 1950లో మొదటిసారిగా అచ్చు అయింది. అప్పటి నుండి ఇది అనేక పర్యాయాలు పునర్ముద్రణ పొందింది. సహజంగానే చదువు అనే టైటిల్‌ ఆ నవలకు ఉండడంతో ఇది ఆనాటి విద్యా విధానానికి సంబంధించిన నవల అని చాలా మంది అనుకోవడం కద్దు. కానీ ఇది చదువులకు మాత్రమే పరిమితమైన నవల కాదు. 1915 నుంచి 1935 వరకు అంటే దాదాపు రెండు దశాబ్దాల కాలపు ఆంధ్రదేశ సాంఘిక చరిత్ర చిత్రణ ఈ నవలలో
వ్యాసాలు

అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు: ప్రజాస్వామ్యం ఎక్కడ?

ప్రజా శేయస్సును పక్కన పెట్టి కార్పొరేట్ దోపిడీకి అనుకూలంగా వుండే అభివృద్ధి నమూనాను విధించే ప్రయత్నంలో అటవీ భూముల నుండి తమని నిర్వాసితులను చేయడానికి ప్రయత్నిస్తున్న రాజ్యంతో ఆదివాసులు పోరాడుతున్నారు . సాంప్రదాయకంగా జీవించే భారతీయ ఆదివాసులు  జీవనోపాధి కోసం అడవులపై ఆధారపడుతూ   నిరంతర పోరాటంలో చిక్కుకున్నారు. అనివార్యంగా విదేశీ మూలధనంపై ఆధారపడే ప్రాజెక్ట్‌‌ల కోసం, భారతదేశ సహజ వనరుల కార్పొరేట్ దోపిడీ కోసం అడవుల్లో నివసించేవారిని చట్టబద్ధంగా నిర్వాసితులను చేసేందుకు రాజ్యానికి అటవీ హక్కుల చట్టం 2006(ఫారెస్ట్ రైట్స్ యాక్ట్-ఎఫ్ఆర్ఎ), ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 (ఎఫ్‌సిఎ) వంటి చట్టాలు రాజకీయ సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. "పరిరక్షణ" అనే
వ్యాసాలు

బ్రాహ్మణీయ హిందుత్వ సాధనాలు  ద్వేషం, భయం, పెత్తనం, హింస

(త్వరలో విడుదల కానున్న పాణి వ్యాసాల సంపుటి ద్వేషభక్తి కి రాసిన ముందుమాట) గత పదేండ్ల హిందుత్వ పాలనను చీకటి కాలంగా గుర్తించడం మామూలు విషయమయ్యింది. నిజమే, చీకటి అలుముకుంటుంది, కాని వాస్తవానికి చీకటి లేనిదెప్పుడు? అయితే చీకటి ఎప్పుడూ వుండేదే కదా అనుకుంటే  ఇప్పుడు మరింత  గాఢంగా మారుతున్న చీకటికి ఎటువంటి ప్రత్యేకత లేదా అనే మరో ప్రశ్న వస్తుంది. అసలు చీకటి, వెలుగులతో మాత్రమే సంక్లిష్టమైన కాలాన్ని, సమాజ చలనాన్ని, అందులోని సంఘర్షణలను అంచనా వేయగలమా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే చీకటి, వెలుగులను విశాల సామాజిక, రాజకీయార్థిక అవగాహనతో చారిత్రకంగా అంచనా వేయాల్సివుంటుంది. 
వ్యాసాలు

“పార్లమెంటులో ప్రమాదం లేని పొగ “

డిసెంబర్ 13 , 2023 న షుమారు 1.01 గంటలకు ఇద్దరు వ్యక్తులు పార్లమెంటులో ప్రమాదం లేని పొగ వ్యాపింప చేయడం ద్వారా తీవ్ర అలజడి సృష్టించారు. ఈ ఘటన దేశ వ్యాపిత సంచలన వార్తా. ప్రమాదాన్ని ఊహించటం, చిలవలు పలావులుగా వర్ణించటం లో మీడియా సంస్థలు పోటీపడ్డాయి. వారు అలజడి సృష్టించారు కానీ ఎ ఒక్కరికి హాని తలపెట్టలేదు. ఆస్తులు విధ్వంసం చేయలేదు. మన పార్లమెంటు సభ్యులు మాత్రం ఆందోళనకు గురై ఆ వ్యక్తులను చితక బాదారు. పోలీస్ నైజం ప్రదర్శించారు. పార్లమెంట్ లోకి ప్రవేశించిన ఇరువురు, వారికి సహకరించిన మరో నలుగురు తమ భావాలను తెలియజేసే
వ్యాసాలు కొత్త పుస్తకం

కులం – విప్లవోద్యమం

(త్వరలో విడుదల కానున్న *కులం - విప్లవోద్యమం* పుస్తకానికి రచయిత  రవి నర్ల రాసిన  ముందుమాట ) కారంచేడు మారణకాండ తరువాత విప్లవోద్యమంలోకి వచ్చిన వాళ్లం. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్ల అమలు కంటే ముందే మురళీధర్‌ రావు కమిషన్‌ నివేదిక ఆధారంగా ఎన్‌టి రామారావు ప్రభుత్వం ఓబిసి లకు రిజర్వేషన్లను పెంచినప్పుడు విప్లవ విద్యార్థి సంఘాలకు చెందిన వారిని మినహాయిస్తే మిగతా అగ్రకులాల విద్యార్థులందరూ రిజర్వేషన్‌ వ్యతిరేక ఆందోళన మొదలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా రిజర్వేషన్ల పక్షంలో బలంగా నిలబడిన రాడికల్‌ విద్యార్థి ఉద్యమంలో తొలి అడుగులు నేర్చుకున్న వాళ్లం.  అందువల్ల దళిత ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలను, కులంతో