వ్యాసాలు

ఈకాలపు స్త్రీవాద కవిత  ‘బొట్టు’

ఇండియాలో స్త్రీలు అనగానే కట్టు బొట్టు అంటూ మొదలుపెడతారు. అందం మాటున అణచివేత ఉంది. సాంస్కృతిక కట్టడి ఉంది. స్వేచ్ఛగా కదలడానికి వీలు లేని ఆహార్యం స్త్రీలకు నిర్దేశితమైంది. తరాలు మారినా, ఎన్ని కొత్త ఆలోచనలు చేసినా ఇష్టంగానో అయిష్టంగానో ఈ గుదిబండను స్త్రీలు మోస్తూనే ఉన్నారు. ‘తగలెయ్యాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన స్త్రీవాదులతో సహా. ఎందుకంటే అది వదిలించుకోవడం అంత సులభం కాదు. అది వ్యక్తిగత అభిరుచికి సంబంధించినది మాత్రమే కాదు. అది సమాజంలో నీ ఉనికిని, గుర్తింపును, గౌరవాన్ని నిర్దేశించేది. ఒక కుటుంబానికి సంబంధించిన, సమూహానికి సంబంధించిన సంస్కృతి సంప్రదాయాల భారాన్ని మోయవలసింది స్త్రీలే.
సంపాదకీయం

టీఎం కృష్ణ: కళా సాంస్కృతిక చర్చా సందర్భం

లోకం పట్టని ఒక చిన్న ప్రపంచంలోకి దేశ రాజకీయాలన్నీ వచ్చి చేరాయి. శిష్టులకు తప్ప ఇతరులకు చోటులేని రంగం గురించి మామూలు మనుషులు మాట్లాడుతున్నారు. భక్తిమార్గానికి తప్ప మరి దేనికీ అవకాశం లేని కర్ణాటక సంగీత సంప్రదాయాన్ని కొత్త ప్రమాణాలు పరీక్షిస్తున్నాయి.  రసజ్ఞులకే పరిమితమైన  ఇహపరాలను దాటి ఇదంతా సామాజిక చర్చా సందర్భమైంది. దీనికంతా కారణం టిఎం కృష్ణ అనే కర్ణాటక సంగీత విద్వాంసుడికి మద్రాసు సంగీత అకాడమీ ‘సంగీత కళానిధి’ అనే అవార్డు ప్రకటించడం. దాని మీద ఆ రంగంలోని ప్రముఖులు నిరసన తెలపడం.  వాళ్లు సంగీత అకాడమీ  తమకు అంతక ముందు  ఇచ్చిన అవార్డులను వెనక్కి
వ్యాసాలు

ఛత్తీస్‌గఢ్‌లోశాంతి చర్చలు

ఏ రాజకీయ పార్టీ (కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, బిజెపి) అధికారంలో ఉన్నా వర్గ పోరాటానికి సంబంధించి సామ్రాజ్యవాద ` భూస్వామ్య (అర్ధ వలస ` అర్ధ భూస్వామ్య) దళారీ రాజ్యానికి విప్లవోద్యమం పట్ల ఒక దీర్ఘకాలికమైన వ్యూహం, ఆయా సందర్భాలకు ఎత్తుగడలు ఉంటాయి. 2004లో కేంద్రంలోను, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండి మావోయిస్ట్టు పార్టీ ప్రతిపాదించిన ఒక సానుకూల వాతావరణాన్ని కల్పించి చర్చలకు పిలిచింది కానీ పీపుల్స్‌వార్‌తో చేసిన చర్చల ప్రతిపాదనను అది ఎం.సి.సి. వంటి మరో సాయుధ విప్లవ పార్టీతో మావోయిస్టు పార్టీగా ఏర్పడి చర్చలకు వచ్చిందనే ఎరుక కలగగానే రెండవ విడత చర్చల వాగ్దానాన్ని
సంభాషణ

తల్లి ఆవేదన

అది జనవరి 2024 కొత్త సంవత్సరం. ప్రపంచం సంతోషంలో మునిగి ఉంది.  కొంతమంది రాత్రి 12 (ఉదయం అనుకోవచ్చు) తాగిన మైకం గూడ దిగక ముందే పొద్దున మళ్ళీ తాగి సంతోషంతో మునిగి పోయి వుండొచ్చు. మాకు ఆదివాసులకు అలాంటివి తెలియవు. మాకు 2005 నుండి, కష్టాలు కన్నీళ్ళ, తర్వాత గ్రీన్‌హంట్‌ 2017 నుండి సమాధాన్‌ 2022 నుంచి సూరజ్‌కుండ్‌ దాడి  జరుగుతూనే వుంది. అందుకే కొత్త సంవత్సరం అంటే మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఈరోజు మంచిగా ఎలా గడుస్తుందనే. అదే మాకు  మంచి రోజు. ఎందుకంటే భారతదేశంలో కాశ్మీర్‌ తర్వాత ఎక్కువ కేంద్ర బలగాలు ఉన్నది
stories

Teachers

‘It looks like our comrades who have gone to the village have returned’. As soon as they heard these words, some of the guerillas walked towards the make-shift kitchen holding mugs in their hands. The place they call kitchen has not yet taken the shape befitting the name. A make-shift stove was made by placing three stones in a triangular shape. Fire was lit by gathering firewood and placing it
సమీక్షలు

మెరుపులాంటి, భాస్వరంలాంటి కవిత్వం 

మట్టి గాయపడినా , చెట్టు గాయపడినా , మనిషి గాయపడినా  కన్నీళ్లు పెట్టుకుంటాడు. అక్షరాలతో యుద్దాన్ని ప్రకటిస్తాడ.  సానుభూతి కాదు. సంఘీభావం ముఖ్యమనే మాటపై నిలబడుతాడు.  నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న రోజుల్లో ఉదయ్ కవిత్వం ఈ ఫాసిస్టు  దాడికి ప్రతిదాడిలాంటిది.  గాయానికి మందులాంటిది. ఈ మనుషుల కోసం, సమానత కోసం, బువ్వ కోసం, భుక్తి కోసం తనువు రాలే వరకు పోరాడుతున్న మిత్రులను గుండెకు హత్తుకుంటాడు.  పోరాట గీతాల్ని ఆలపిస్తాడు. అమరత్వాన్ని కీర్తిస్తాడు,. అమరుల బాటల్లో నడవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తాడు. మనల్ని సమాయత్తం చేస్తాడు. ఈ నేల చెప్పే గాథలను, కన్నీళ్లను మనలో ఒంపుకుందాం. ఈ
సమీక్షలు

మనకు తెలియని శికారిలు

కర్నూల్ రాజవిహార్ సెంటర్ అత్యంత ఖరీదైన మనుసులు తిరుగాడే ప్రాంతం.పెద్దపెద్ద షాపింగ్ మాల్స్, బహుళ  అంతస్థుల భవనాలు, సామాన్య మానవుడు అడుగు పెట్టలేని మౌర్య ఇన్ హోటల్, మెడికల్ కాలేజీ హాస్టల్, ఆధునికత పేరుతో కట్టేబట్ట కరువై ఖరీదైన  కార్లలో తిరిగే మనుషులు( చిరిగిన జీన్స్). వీటన్నిటి మధ్య ఎండిన ఎదకు చిన్నపిల్లను అతికించుకుని అడుక్కునే మహిళలు. వారికి తోడు చెదిరిన జుట్టు, చిరిగిన బట్టలతో వాహనాల పొగ మొత్తం మొఖానికి పులుముకుని నడుస్తూ అడుక్కునే బాలికలు. వారి దీనస్థితి  చూసి  ఎవరూ  జాలిపడరు. ఎందుకంటే వాళ్ళు "శికారీలు". మా చిన్న తనంలో శికారీలు అప్పుడప్పుడు అడుక్కోవడానికి మా
దండకారణ్య సమయం

ఏకకాలంలో శాంతి చర్చలు – సైనిక చర్యలు

దేశంలో దండకారణ్యం వంటి విశాలమైన ఆదివాసీ ఆవాస భూగోళంలో, జనతన రాజ్యం వంటి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ దశాబ్దాలుగా పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అక్షరాలా సాయుధ వర్గ యుద్ధంలో అప్రతిహతంగా పోరాడుతూ ఎన్‌కౌంటర్‌లు మొదలు కేంద్ర ప్రభుత్వ వాయు సైన్య ఆకాశ బాంబింగ్‌కు కూడ గురవుతున్న తరుణంలో ఛత్తీస్‌గఢ్‌, రaార్ఖండ్‌ రాష్ట్రాలు మొదలు దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీ సమాజాలు జల్‌, జంగల్‌, జమీన్‌, ఇజ్జత్‌ (ఆదివాసి స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు ప్రతిఘటన మాత్రమే కాదు, ఇంకా విస్తృతార్థంలో అస్తిత్వ స్వీయ గౌరవ చైతన్యం)లను కాపాడుకోవడానికి నూతన పోరాట రూపాలు ఎంచుకుంటున్నారు. అటువంటి సాంస్కృతిక వ్యక్తీకరణ రూపాలను
సమీక్షలు

వేమన, వీరబ్రహ్మం దృక్పథం

వేమన, వీరబ్రహ్మాల్ని తెలుగు పాఠక లోకం ముందు మరోసారి చర్చకు పెట్టినందుకు ముందుగా ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ వారిని అభినందించాలి. వీరిద్దరూ సామాజిక సంస్కర్తలు, తరువాతే కవులు.  ఈ పుస్తకం పేరు ‘‘తెలుగు సాహిత్యంలో వేమన వీరబ్రహ్మం - ఒక సంభాషణ’’. రచయిత జి.కల్యాణరావు.  మూడు వందల సంవత్సరాల క్రితం కవులు వేమన, వీరబ్రహ్మ  సంఘ సంస్కర్తలు. సాంస్కృతిక విప్లవం మార్పును కోరుతుంది. సంస్మరణ మార్పును కాక మరమ్మత్తులు కోరుతుంది. సంస్కరణ మార్పుకు వ్యతిరేకం కాదు. ముందుస్తు రూపం. పైగా ఈ కవులు కలం పట్టేనాటికి మార్పుకు సంబంధించిన రాజకీయ సిద్ధాంతం ఇంకా రూపొందలేదు కదా! ఈ నేపథ్యంలో
సమీక్షలు

భావుకత, అన్వేషణ కలగలసిన కవిత్వం

ఖమ్మం జిల్లా రచయిత్రి రూప రుక్మిణి కలం నుండి జాలు వారిన అక్షరాలు సమకాలీన జీవితాన్ని సుతిమెత్తగా స్పృశిస్తాయి. సమాజాన్ని హెచ్చరిస్తూ, ఇవ్వాల్టి జీవన పరిస్థితుల లోతులను భావుకతతో అన్వేషిస్తూ, వ్యక్తీకరిస్తూ సాగిన కవితల సమాహారమే ‘‘మిగుల్చుకున్న వాక్యాలు కొన్ని’’ సంపుటి. శూన్యం కవితలో.. ‘‘పచ్చి గుండెను తవ్వి చూడకు భరోసాగా భుజమెప్పుడు పానుపు కాలేదని తప్పొప్పుల లెక్కల్లో ఆమెకెప్పుడూ విశేషాలేమీలేని సశేషాలే మిగిలాయి’’ అంటూ మహిళ బతుకును ఆవిష్కరించారు. ‘ఒంటరి’  కవితలో ‘‘క్షణాలన్నీ పొరలు పొరలుగా తెగి పడుతూ పగిలిన అద్దం పైన మరకల్లా’’ అంటూ  వేదనను పలికించటానికి అద్దాన్ని వస్తువుగా తీసుకుని వర్తమానాన్ని కళ్ళ ముందుంచారు.