స్పష్టత కొరవడిన‘శతర’
‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి రంగు బొమ్మలు' నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు. మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది. ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం