విశ్లేషణ

స్పష్టత కొరవడిన‘శతర’

‘శతర’ ఆదివాసీ కవిత్వం పేరుతో కళింగాంధ్ర కవి సిరికి స్వామినాయుడు అతని కొత్త కవిత్వసంపుటిని ప్రకటించాడు. ఈ సంపుటిలోకి అతని తొలి రెండు సంపుటాలు 'మంటిదివ్వ', 'మట్టి రంగు బొమ్మలు' నుంచితీసుకున్న ఆదివాసీ నేపథ్య కవితలనూ చేర్చాడు. మొత్తానికి ఈ సంపుటి ఆదివాసీ జీవితాన్ని-జీవన సౌందర్యాన్ని-సాంస్కృతిక విశేషాలను,ఆదివాసీ జీవిత కుదుపులను-ఆ కుదుపులకు కారణమైన ఆర్థిక సామాజిక రాజకీయ అంశాలను అతనికున్నచైతన్యపరిధిలో అతను రాయడం జరిగింది. ఆదివాసీలు పోరాటం చేయాల్సిన ఆవశ్యకతను చెప్పే కవితలనూ స్వామినాయుడు రాయడం మెచ్చదగినది. ఏ కవికైనా కొన్ని పరిధులుంటాయి. ఆ పరిధులు మూలంగానో లేదా ఏదైనా ఒక ఘటన జరిగినప్పుడు ఆ ఘటనకి తక్షణం
విశ్లేషణ

సందిగ్ధత విప్లవానికి దారి చూపుతుందా?

ప్రముఖ కవి విమల సారంగ అంతర్జాల పత్రికలో రాసిన కొత్త కవిత ‘కాల యవనికపై నిలిచి..’ ఈ కాలపు విషాదాన్ని గాఢంగా పలికింది. వేలాది, లక్షలాది మంది దు:ఖాన్ని ఆమె తన గొంతులో వినిపించారు. కవిగా విమల లోతైన చూపే ఆమె కవితా శిల్పం. అందులో తీవ్రమైన దు:ఖం, ఆర్తి ఉంటాయి. ఒక రకమైన అంతర్‌ దృష్టి ఉంటుంది. చాలా బరువైన, తాదాత్మ్య భావనలతో ఆమె కవిత్వాన్ని నిర్మిస్తారు. తాను ఏమనుకుంటున్నదీ సూటిగా చెప్పేస్తారు. తన వ్యక్తిత్వంలోంచి తన వైఖరులను కవిత్వం చేస్తారు. వస్తువు, దృక్పథం ప్రధానమైన కవిత్వంలో శిల్పం ఎలా ఉంటుందో విమలలో చూడవచ్చు. అది చాలా
విశ్లేషణ

సామ్రాజ్యవాద వైరుధ్యాలలో కొత్త సమస్యలు,ఉద్రిక్తతలను తెచ్చే ట్రంప్ ప్రతిపాదనలు

 యుద్ధ నిబంధనలను మార్చడం ద్వారా ఉక్రెయిన్ లో నెలకొన్న ప్రతిష్టంభనను అధిగమించాలని అమెరికా ఆరాటం             1. గత మూడు దశాబ్దాలుగా అబివృద్ధి చెంది, రూపు దిద్దుకున్న అమెరికా సామ్రాజ్యవాదం ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల గురించి (రెండవసారి అధికారం చేపట్టిన) ట్రంప్ పరిపాలనా వ్యవస్థ స్పందించింది. అదిప్పుడు సాపేక్షికంగా తిరోగమించాల్సి రావడమేకాక, దాని ప్రత్యర్థులు(రష్యా, చైనా) దగ్గరై. తన ప్రపంచాధిపత్యాన్ని సవాలు చేసేవిగా తయారయ్యారు. ఈ మౌలిక సమస్యలు ఏమంత దూరంగా లేవని భావించిన ట్రంప్ పరిపాలనా వ్యవస్థ వీటి పైన దృష్టి సారించింది. ఈ పరిణామాలు అమెరికాకు ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, అవి ఇంకా కొనసాగుతున్నాయి. అమెరికాకు తన 
కాలమ్స్ విశ్లేషణ

బస్తరును కాపాడుకుందాం

ప్రొఫెసర్‌ సాయిబాబా రాజ్య వ్యవస్థీకృత హింస, నిర్బంధం కారణంగా అమరుడైన సందర్భంగా గత అక్టోబర్‌ నుంచి విజయవాడ బుక్‌ ఫెయిర్‌ (జనవరి మొదటి వారం) దాకా కవులు, రచయితలు బుద్ధిజీవుల్లో ఊహించిన దానికన్నా ఎక్కువగా స్పందన వచ్చింది. ఒక నెల కూడా గడవకుండా ఫిబ్రవరి 8, 9 తేదీల్లో సాయిబాబా అమరత్వం సందర్భంలో సంక్షోభ కాలంలో సాహిత్యం భూమిక’ గురించి విరసం ఏర్పాటు చేసిన రెండు రోజుల సాహిత్య పాఠశాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో యువత ఎక్కువగా పాల్గొన్నారు. ఈ సాహిత్య పాఠశాలను ప్రారంభిస్తూ సాయి సహచరి వసంత
విశ్లేషణ

త్యాగాల తల్లుల పేగుబంధాలు.. వియ్యుక్క కథలు

వియ్యుక్క కథలు 6 సంపుటాలు నా చేతికందినప్పటి నుంచీ 6 పుస్తకాలు చదివి వివరంగా సమీక్ష గానీ, వ్యాసం గానీ రాయాలనుకుంటూనే ఉన్నాను.  పుస్తకం వచ్చిన వెంటనే వస్తే ఉన్నంత తాజాదనం ఉండదేమో అనే ఆలోచన వల్ల ఇప్పటికి ‘‘అమ్మతనం’’ కి సంబంధించిన 8 కథలను ప్రత్యేకంగా పరిశీలించే పనికి పూనుకున్నాను. ఇక విషయంలోకి వస్తే ‘‘అమ్మతనం’’ పూర్వకాలంలో లేదా సాంప్రదాయంలో మాతృత్వం అనే మాటకు సరిపోల్చదగిన మాట. కానీ మనం అమ్మతనం అని అనుకోవడంలోనే సహజత్వం వ్యావహారికం ఉన్నాయని నా భావన. ఇప్పుడు కథల గురించి తెలుసుకుందాం. ‘‘పిల్లలు’’ అనే కథ తాయమ్మ కరుణ రాసింది. సుమ,
విశ్లేషణ

గడ్చిరోలీ ఎన్‌కౌంటర్‌: 17 జూలై.  సూర్జాఘడ్‌ కోసం సూరజ్‌ఖుండ్‌

అమరుల బంధుమిత్రుల సంఘం 22వ వార్షికోత్సవం కగార్‌ వ్యతిరేక  దినంగా జరుపుకుంటున్న ఒక రోజు ముందు కారంచేడు దళిత ఆత్మగౌరవ పోరాటాలను దేశమంతా స్మరించుకున్న రోజు గడ్చిరోలీ (మహారాష్ట్ర) జిల్లాలో, మావోయిస్టుల రాజకీయ చిత్రపటంలో దండకారణ్యం మీద భారత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వాలు భారీ ఎన్‌కౌంటర్‌ జరిపి 12 మంది మావోయిస్టులు చనిపోయినట్లు, ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్లు ప్రకటించింది. పూర్తిగా బిజెపి ప్రభుత్వం కానప్పటికీ శివసేన నుంచి ఏక్‌నాథ్‌శిండేను మరికొందరు ఎంఎల్‌ఏలను ఎత్తుకుపోయి అస్సాం ముఖ్యమంత్రి కరడుగట్టిన బ్రాహ్మణీయ ఫాసిస్టు హేమంతశర్మ అజమాయిషీలో క్యాంపు పెట్టి ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వాన్ని (ఎంవిఎ సంకీర్ణ
విశ్లేషణ

అంతిమ యుద్ధ సమయంలో జీవన సంఘర్షణల తాజా  చిత్రణ ‘విస్తరణ’ కథ

అరుణతార జులై  కథల సంచికలోని పాణి కథ ‘విస్తరణ’సమకాలీన ప్రపంచంలోని జీవన సంఘర్షణలను చిత్రించింది. విధ్వంసం, నిర్మాణం, విస్తరణ  అనేవి విరుద్ధ శక్తుల దృక్పథాలను బట్టి ఉంటాయి. వాటిని వర్తమాన జీవితంలోని అనుభవాల నుంచి, ఉద్వేగాల నుంచి, అవగాహనల నుంచి చిత్రించిన తాజా కథ ఇది. దేశంలో వివిధ రూపాలలో వేళ్ళూనుకుంటున్న ఫాసిజం తనకు అడ్డుగా నిలుస్తున్న ఆదివాసీ ప్రాంతాలలో జరుగుతున్న పోరాటాలే లక్ష్యంగా దేశాన్ని హిందూ కార్పొరేట్ల గుప్పిట్లో పెట్టడానికి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ మొదలు పెట్టింది. ఆ తర్వాత వేగవంతమైన కార్పొరేటీకరణకు అనుగుణంగా  హిందుత్వ శక్తుల చేతిలో అది ఆపరేషన్‌ సమాధాన్‌గా మారింది.