సాహిత్యం కవిత్వం

కాలం తొంగి చూస్తోంది

లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం యీ రెణ్ణెల్లలోఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు ఆగడానికే ముందక్కడ?జల్లలో మిగలడానికి చేపలా అవి!కారిపోయే కన్నీరేకదాచివరకుమన దోసిట్లో మిగిలింది    ***   ***    ****కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవునదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదుపీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్కనీవో, నేనో అప్పజెప్పాలి రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికిరాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయిఅక్కడా మానవ హననమేపేరు ఎదయితేనేం?న్యాయంలేదు అడ్డుపడడానికిచట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయిఅక్కడ నిండా మోసమే!***     ***      ***తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపులిప్త కాలమైనా చాలులే! అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనంఎప్పుడు  విడిపోయాం!కలవలేనన్ని పాయలుగా మత మానవులుగాస్త్రీలుగా , పురుషులుగాకులాలుగా,
సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం
సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు
సాహిత్యం కవిత్వం

మానవత్వం చంపబడుతోంది

మానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి సోంతలాభం కోంతమానిపోరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసోంతలాభం అసలే వద్దుప్రజలకోరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం రాశులు ఒకచోటఆకలి మంటలు ఒకచోటవ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికినాలుగడుగులు ముందుకేసిఅన్నం రాశులు ఆకలి సంచులు నింపినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి నెత్తురు మండే శక్తులు నిండేసైనికులారా రారండిపిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొనిమరో నాలుగడుగులు ముందుకే నడిచికోయ్యూరు నండి కోయ్యూరు దాకజనం అలజడి నాడిస్టెతస్కోప్ చేతులతో పట్టినమరో ప్రపంచపు నూతన మానవుడుమానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం
సాహిత్యం కథలు

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?
సాహిత్యం కథలు

సమరంలో సంబరాలు

విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల స‌హాయంతో నడుస్తున్నారు. గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే
సాహిత్యం వ్యాసాలు

మునికాంతపల్లి కతలు

పాఠకుడి నోట్సు ప్రవేశిక:నదుల వొడ్లు ( మన శ్రీపాద వారి గోదావరి వొడ్డు), సముద్రతీరాలు (తగళి శివశంకరపిళ్ళై "రొయ్యలు"),  ఎడారి మైదానాలు ( పన్నాలాల్ పటేల్ 'జీవితమే ఒక నాటక రంగం') కథలకు పుట్టినిల్లులా? యేమో!బహుశా ఇసుకకు కథా, నవలా సాహిత్యానికి  విడదీయరాని దగ్గరి-దూరపు చుట్టరికం యేదో ఉంది. అలాంటి ఒక చిన్ననది  సువర్ణముఖి. నెల్లూరుజిల్లా నాయుడు పేట పక్కన తొండనాడు ముఖద్వారపు నదిగా... దాని ఒడ్డున ఒక  మునికాంతపల్లి  మాలవాడ. ఆ మాలవాడనుంచి సాహిత్యం వస్తే ఎట్టా వుంటుందిరయ్యా? మడిగట్టుకున్న  అగ్రహారపు వాక్యమై అస్సలు వుండదు. అన్ని సాంప్రదాయిక మర్యాదలనూ ఎడమకాలితో అవతలికి తోసే పొగరు కనిపించ
సాహిత్యం కారా స్మృతిలో

కారా కథల్లో కొన్ని వైరుధ్యాలు

కాళీపట్నం రామారావు కథల ప్రాసంగికత గురించి, పాత్రల గురించి, కథాముగింపుల గురించి  చాలా కాలం నుంచి చర్చ జరిగింది.ఆయన కథల గురించి మాట్లాడుకోవడమంటే యాభై ఏళ్ల కిందటి తెలుగు సమాజం (అది ఉత్తరాంధ్రే కావచ్చు) గురించి మాట్లాడుకోవడమే.కారా తన కాలపు గడ్డు వాస్తవికతను నేరుగా చిత్రించిన వాడే.అయితే ఏ రచయితైనా తనకున్న దృక్పథం మేరకే తను రాయాలనుకున్నది రాస్తాడు.తన పరిశీలని శక్తి ప్రముఖమైన పాత్ర నిర్వహిస్తుంది.సామాజిక వాస్తవికతను సరిగ్గా పట్టుకున్న రచనలో ఆ సామాజిక వాస్తవాని కున్న అన్ని కోణాలూ ప్రతిఫలిస్తాయి.ఏదోమేరకు పాఠకుల అంచనాకు అందుతాయి.మనం 2021 లో నిలబడి 1960ల నాటి రచనల్లో , యిన్ని సంవత్సరాల
సాహిత్యం కారా స్మృతిలో

కారాతో మేము..

కాళీప‌ట్నం రామారావు మాస్టారితో నా పరిచ‌యం బ‌హుశా 1967 జ‌న‌వ‌రిలో మొద‌లైంద‌నుకుంటాను. అప్పుడు నా వ‌య‌స్సు ప‌దిహేను సంవ‌త్సరాలు. తొమ్మిదో త‌ర‌గ‌తిలో నిల‌దొక్కుకుంటున్న సమ‌యం. అదీ యువ దీపావ‌ళి ప్ర‌త్యేక సంచిక‌లో వ‌చ్చిన యజ్ఞం  కధ‌తో... కారా ఊరు ముర‌పాక. నా బాల్యంలో కొంత భాగం గ‌డిచిన మా అమ్మ‌మ్మ ఊరు వెన్నంప‌ల్లి లాంటిది. నేను పుట్టి పెరిగిన గాజులప‌ల్లి చాలా చిన్న ఊరు. అప్ప‌టి నా స్థితి- ఇప్ప‌టికీ వ‌ద‌లని - ప‌ల్లెటూరి జీవితానుభ‌వం... అత్యంత కౄర‌మైన భూస్వామిక దోపిడీ, పీడ‌న - హింస, వివ‌క్ష‌త‌లో కూడా బ‌త‌క‌డానికి నా చుట్టూ ఉన్న మ‌నుషులు చేసే భీక‌ర
సాహిత్యం కవిత్వం

దీపాల వెలుతురు నీడలో

తాము కాలిపోతూవెలుతురిస్తాయి దీపాలు సమస్త చీకటి విషాలను మ్రింగికాంతినిస్తాయి మిణుగుర్లు మన గాయాల్ని వాళ్ళ దేహాల్లో నింపుకొనిమందు కనుగొంటారు శస్త్రచికిత్సా కారులు వెలివేతలను తలరాతలుగా వ్రాయించుకొనిమైలపేరుతో మూలపడిమూతులకు కుండలు కట్టించుకునేబడుగుబతుకుల్లో ఆత్మగౌరవాన్ని తట్టి లేపుతారుజ్ఞానవంతులు కార్మీక కర్షక జనావళిఊపిరికి ప్రాణం ఉందనిరుజువుచేసిసంఘటితస్పర్శ ఎంత శక్తివంతమైందో తెలియజేసినడవడానికో పోరుబాటని సిధ్ధం చేస్తారునాయకులు వాళ్ళపాదాల్రాసిన కఠిన కాల చరిత్ర పుటలపైతలలెత్తుకొని నిలబడబానికి ప్రయత్నిస్తాయిగడ్డిపోచలు గడ్డిపోచల నుదుర్లను ముద్దాడుతుందివసంతం వసంతాన్ని కౌగిలించుకుంటుంది మేఘగర్జన గూడెం పిల్లోడి చేతిలో విల్లంబులా సాయంత్రంక్షితిజం పై ఒరుగుతుంది రేపటికొక కొత్త సూర్యుణ్ణి కంటానని వాగ్ధానం చేస్తూ...