సాహిత్యం కథలు

నిన్న ఈవేళ

(ఈ క‌థ ఆంధ్ర‌ప్ర‌భ స‌చిత్ర‌వార ప‌త్రిక 10.4.74 సంచిక‌లో అచ్చ‌యింది. విర‌సం ప్ర‌చురించిన చెర‌బండ‌రాజు సాహిత్య స‌ర్వ‌స్వంలోని క‌థా సంపుటంలో ఇది చోటు చేసుకోలేదు. మిత్రుడు వంగ‌ల సంప‌త్‌రెడ్డి చెర‌బండ‌రాజు సాహిత్యంపై త‌న ప‌రిశోధ‌న‌లో భాగంగా దీన్ని గుర్తించారు. శ్రీ‌కాకుళం క‌థా నిలం నిర్వాహ‌కులు దీన్ని పంపించారు. సంప‌త్‌రెడ్డికి, క‌థానిల‌యం నిర్వాహ‌కుల‌కు ధ‌న్య‌వాదాలు.- వ‌సంత‌మేఘం టీ) చేను చచ్చిపోయింది. కాలువ ఎండిపోయింది. చెరువు ఇంకిపోయింది. ఊళ్ళో కూలి జనం నాలుకల మీది తడి ఆరిపోయింది. వాళ్ళ ఎముకల్లో గలగల. కళ్ళలో గరగర. విరగ్గొట్టిన వేపకొమ్మల్లా ఎండిపోయి, కాలు పెడితే పటపటా విరిగిపోయే దశలో ఎవరి గూళ్ళలో కాళ్ళు, ఎవరి
సాహిత్యం కవిత్వం

అంతే బాధలోంచి

నమ్మకం చిట్లిన చోటకన్నీటి బోట్లను కుట్టుకుంటూఆశల పడవను నడుపుతున్నాను గాయపడిన అనుభవాలలోంచికొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను కొంత ప్రయాణంలోనిజాలు తేలియాడినపుడువ్యూహాలు పదును తేరాలి కాలాన్ని ఎదురీదడమంటేమార్పులను అవగతం చేసుకోవటమే దారులు ఇరుకవుతున్నప్పుడుఆలోచనలు పదునెక్కాలి ఒక్కోదానికి ఒక్కో హద్దు గీసిఅనంత విశ్వాన్ని గుండెల్లోంచి తీసిఅనేకానేకాలుగా దర్శించాలి చీమ బలం చూసికన్నులెగరేసిఆకాశాన్ని ఎత్తగలంఆకాశం పైకి ఎక్కగలం లక్ష్యం కుదుపుతున్నపుడురహ దారులు ఇట్టే చిగురిస్తాయి ఊహకు రూపం ఇవ్వడమంటేకొన్ని కన్నీటి మెట్లు ఎక్కటమే . ఇప్పుడు అంతే బాధలోంచి లేచితీరాలకి చేరిఇక సమీరాలు అందివ్వాల్సిన సందర్భంలోంచిచినుకుల్లా కురిసిన ఒక నేను .
సాహిత్యం కవిత్వం

ఉదయం

అర్ధరాత్రి అమాసచీకట్లో ఓ జెండా దిగిందిఓ జెండా ఎగిరింది అలసిన మేనులుఆదమరచి గాఢ నిద్ర లోఅధికార మార్పిడి చిమ్మ చీకట్లో ఏళ్ళు గడుస్తున్నాఆ అధికారం కిందికి దిగలేదుకిందోడు పైకెక్క లేదు ఊరిస్తూ ఉడికిస్తూఫలాలు అందీ అందిస్తున్నట్లునటిస్తూ అధికారం అక్కడే బహు చక్కగా రాచరికం పోలేదురాజ్యాంగం పుటల్లోనేదోబూచులాడుతుందివర్గ వైషమ్యాల సృష్ఠి లో ఆరితేరిగద్దె పై రాబందుల వికట్టహాసం సమానత్వం ఓ పగటి కలఅది తీరని దాహంపదిహేను వస్తుందివీధి వీధి న ఓ జెండారెప రెప లాడుతుందిసాయంకాలం దించబడుతుంది సూరీడు మౌనంగా కొండల మాటున దిగుతుండుఇంకెన్ని ఉదయాలు ఉదయిస్తేనిజమైన స్వరాజ్యం ఉదయిస్తుందని మథన పడుతూచాల్లే పో పో అంటూచందమామ కసిరిందివెన్నెల కురిపిస్తుందేమో
సాహిత్యం కవిత్వం

దండాలు స్వామి

దక్షిణాన పుట్టినవివిక్త కొండల్లో ఏపుగా పెరిగినరాక్ ఫోర్ట్ ఒరిగిపోయిన చెట్టంత మనిషికన్నీళ్ళతో కావేరి నిండిపోయింది చదివిన వేదాంత శాస్త్రంగొల్లుమని ప్రవచనాలను వెదజల్లుతుంది సామాజిక శాస్త్రం ఫిలిప్పీన్స్ నేర్పితేఝార్ఖండ్ క్షేత్రమయ్యింది వనాంచల్ ప్రతి మొక్కవంగి సలాం చేస్తుంది గజరాజులు గజగజ వణుకుతున్నాయిఅండగా నిలిచిన స్వామి లేడని తాను ముందుండి వేసిన ప్రతి అడుగుఆదివాసీ బతుకుల వెలుగు నింప ప్రయత్నం హక్కులకై సంధించిన ప్రశ్నలేతన చావుకి కారణమౌతుంటేపుటల్లోని రాజ్యాంగ ప్రతులుపటపట రాల్చాయి చుక్కలు వణుకుతున్న చేతులుతాగలేని నీరు ఒలుకుతుంటేఓ స్ట్రా ఇవ్వమన్నా ఇవ్వలేని న్యాయం పండు ముదుసలిపార్కిన్సన్ తో జైలు హాస్పిటల్లో..అయినా ఆఖరి శ్వాస దాకాచెద‌ర‌ని ఆదివాసీ స్వ‌ప్నంఅమరుడా! దండం!!
సాహిత్యం కవిత్వం

ప్రేమికుల

ఇసక తిన్నెల మీదఇనుపబూట్ల మహమ్మారినితరిమి కొట్టినిండు ఎడారిలోనీటిని నింపినప్రేమ మనదిగాలికి తాడు కట్టిగండ్ర గొడ్డలి తెచ్చివిష వాయువును నరికిగరికపూల వనంలోనిద్రించిన ధీరత్వం మనదిఅలసిన అడవిని లేపిపాటల పరవళ్ళు తెచ్చిదండోరా మ్రోగించిననేర్పు మనదిడియర్ఈ సుందరమధురానుభూతులుచరిత్ర తొలిపొద్దులోమహోత్తర విప్లవ జ్వాలలైఎగిసిపడుతాయి.
సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
సాహిత్యం కథలు

అధిపతి

అక్కడి వాతావరణం గంభీరంగా ఉంది. స్టూడియోలో అందరూ ఉత్కంఠతతో ఊపిరి బిగపట్టి ఎవరి పనులు వాళ్ళు నిశ్శబ్దంగా చేస్తున్నారు. యాంకర్ గొంతు సవరించుకుని మాట్లాడటం ప్రారంభించాడు. స్టూడియో లో ప్రకాశవంతమైన లైట్లు వెలిగాయు. యాంకర్ ఎదురుగా వున్న కుర్చీలో ఒక తెల్లని వెలుగు ప్రశాంతంగా కూర్చుని వుంది. దేశ వ్యాప్తంగా ప్రజలు టీవీ లకు అతుక్కుపోయారు. కర్ఫ్యూ విధించకనే దేశంలోని విధులన్నీ నిర్మానుష్యం ఆయుపోయాయి. "మొదట, ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడగడానికి నన్ను అనుమతించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఎలా సంభోదించాలో నాకు తెలియదు" యాంకర్ మొదలుపెట్టాడు."మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడతారు. అనేక ప్రార్ధనల తర్వాత మా
సాహిత్యం వ్యాసాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో భాష

రంగనాథాచార్యుల అభిప్రాయాలు ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్‌) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య
సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష
సాహిత్యం వ్యాసాలు

కాకోరి నుండి నక్సల్బరి దాకా ….

ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని