‘ఏ దేశము తన పౌరులనుతానే చంపుకోకూడదు’
మన దేశం ఈరోజు 76వ గణతంత్ర వేడుకులను ఘనంగా జరుపుకుంటున్నది. అంటే రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సుదీర్ఘ ప్రజాస్వామిక పాలనలో రాజ్యాంగ విలువలు సంపూర్ణం కావాలి. ఈ దేశ ప్రజలందరికీ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు దక్కాలి. ప్రజలందరూ జాతి, కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా ప్రాథమిక హక్కులను అనుభవించాలి. అయితే దేశంలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో ఆదివాసీలు, దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు, హత్యాకాండ, క్రూరమైన హింసాకాండ వివిధ రూపాలలో కొనసాగుతున్నది. ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ 3వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కుల హననం యధేచ్ఛగా










