కవిత్వం

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!

వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు !శాంతికోసం యుద్ధమై వర్ధిల్లుఐ. రా. స. శాంతిచిహ్నం ఒకచేత“ఇంతిఫదా " సంకేతంతుపాకీని మరొక చేత పట్టిగాజాలో స్వేచ్ఛగా ఉండటానికినీ పసిమొగ్గల భవిష్యత్ కోసంరక్తసిక్త అన్వేషణల మధ్యసహచరుల త్యాగాల మధ్యఅగ్రరాజ్యాల కుట్రల మధ్యదురాక్రమణదారుల మధ్యపశ్చిమాసియా చిచ్చర పిడుగైనీ జాతి కోసంనీ నేల కోసంసాగించు యుద్ధాన్ని తుదివిముక్తి దాక వర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!నీ నెత్తుటినేలలోశాంతిని పండించుపాలస్తీనా!నువ్విప్పుడు ఒంటరికాదునీపక్కన ఒమర్ ముక్తార్ స్ఫూర్తి ఉందిఅరాఫత్ త్యాగం నీతోడుందినువ్విప్పుడు పీడితదేశాల వేగుచుక్కవువర్ధిల్లు పాలస్తీనా వర్ధిల్లు!
దండకారణ్య సమయం

మావోయిస్టు నిర్మూలనకు మరో వాయిదా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలోనే అమిత్‌ షా ఛత్తీస్‌గఢ్‌కు వచ్చిన ప్రధాన లక్ష్యం మావోయిజాన్ని అంతం చేయడం గురించి గురించి మాట్లాడటం. ఛత్తీస్‌గఢ్‌ మాత్రమే కాదు, మావోయిజం ప్రభావం ఉన్న పరిసర ప్రాంతాల రాష్ట్ర అధికారులతో సహా వరుస సమావేశాలు నిర్వహించి చర్చించారు. అన్ని సమావేశాలు ముగిసిన తర్వాత చివరగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో కేవలం దండకారణ్య,  బస్తర్‌, ఛత్తీస్‌గఢ్‌ల నుండి మాత్రమే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగానే మావోయిజాన్ని నిర్మూలిస్తామని చెబుతూ అందుకు ఒక తేదీని, 2026 మార్చి కూడా ఇచ్చారు. వ్యూహాలు రచిస్తున్న తీరు, ప్రభుత్వం
ఆర్ధికం

సెబీలో ‘హిండెన్ బర్గ్’ తుఫాన్

 18 నెలల క్రితం అదానీ గ్రూప్ ఏకపక్ష సామ్రాజ్యాన్ని పునాదులతో కుదిపేసిన అమెరికాకు చెందిన ఫోరెన్సిక్ పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మరోసారి 'సమ్ థింగ్ బిగ్ న్యూస్ ఇండియా' అంటూ 'ఎక్స్'లో ఆగష్టు 10న పేర్కొన్న గంటల వ్యవధిలోనే బాంబు పేల్చింది. అదానీ గ్రూప్ అక్రమంగా నిధులు మళ్లింపునకు ఉపయోగించిన విదేశీ ఫండ్స్, షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్  ఫండ్స్ లో, బెర్ముడా (బ్రిటిష్), సింగపూర్లో లో గౌతమి ఆదానీ అన్న వినోద్ అదానీ నెలకొల్పిన కంపెనీలో 'సెబి చైర్ పర్సన్' మాధవి పూరి బుచ్' తో పాటు ఆమె భర్త 'ధవళ్ బుచ్'
సంభాషణ

కగార్ అమరుల స్థూపాల కూల్చివేత సందర్భంలో ఇంద్రవెల్లి, హుస్నాబాద్

చావంటే భయం లేని వాళ్లకు భయపడి చంపేశాడు. చచ్చి అమరత్వం పొందిన వాళ్లకు భయపడి స్థూపాలను డైనమెట్లతో కూల్చేసాడు. నక్సలైట్లే దేశభక్తులు, నక్సలైట్లకు జోహార్లు, నక్సలైట్లు నాతో చేతులు కలిపితే ఢల్లీి ఎర్రకోటపై ఎర్రజెండా ఎగరవేస్తానని నర్సంపేట, ములుగు, ఏటూరు నాగారం సభల్లో వాగ్దానం చేసిన (విప్లవకారుల దృష్టిలో ప్రగల్బాలు పలికిన) ఎన్‌.టి.ఆర్‌. 1985 సెప్టెంబర్‌ 3న డాక్టర్‌ రామనాథం హత్యతో తీవ్ర నిర్బంధం ప్రారంభించాడు. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల నాయకుల హత్యలను, టాడా ప్రయోగాన్ని, మిస్సింగ్‌ కేసులను (కొడవటి సుదర్శన్‌ ఆర్‌.వై.ఎల్‌. కార్యకర్త) కె.ఎస్‌. వ్యాస్‌ నాయకత్వంలో కుఖ్యాతి వహించిన గ్రేహౌండ్స్‌ను