కవిత్వం

ఎదురు వనము ఎంట దెచ్చిన..

యాలపొద్దున యేరు దాటిన చిరుత నోటిిని చీల్చి లేచిన.. డ్రోను డేగల కూల్చి వేసిన.. దొంగ దాడుల శత్రు మూకల.. నేల గూల్చి నేరు గొచ్చిన.. ఎదురు పొదల ఎంట దెచ్చిన.. దారి జూపే దుసురు తీగా.. దూప దీర్చే మోదుగాకూ.. మాటు గాయే మడ్డి చెట్టూ.. గుట్టు జెప్పే బోడు మిట్ట.. వొడిల దాచిన గుండ్లు వడిసెలు.. మోపు గట్టిన ర్యాల పండ్లూ.. మాగ బెట్టిన శీత ఫలమూ.. పైలమేనా ఆ కాయలన్నీ.. కత్తు వెంట కాలి బాట దింపి పంపే జారు బండ.. వొంపు దేలిన మా డొంక తల్లీ.. వోదలి వస్తనే వనం బిడ్డల..
కవిత్వం

వాళ్ళు ఎందుకు వెళ్ళారు?

వాళ్ళు పేరుకోసమే వెళితేవాళ్లకి మారుపేరేందుకు? వాళ్ళు భూమికోసమే వెళితేవాళ్ళ అమ్మ గుడిసెలోనే ఎందుకుంది?వాళ్ళు నిధుల కోసమే వెళితే వాళ్ళ ఒంటికి ఒక్క వెండి ఉంగరమైన ఎందుకు లేదు ? వాళ్ళు వాళ్ళకోసమే వెళితేఈరోజు నిర్జీవంగా ఎందుకు పడున్నారు ? ఆకలి మంటల ఆర్తనాదాన్ని అనుభవించి వెళ్ళారు బాంచెన్ బతుకు ఇక నడవదని నినందించి వెళ్ళారుమానవత్వాన్ని మరిచిన మనకి మనిషితనాన్ని నేర్పించడానికి వెళ్ళారుదోపిడి, దౌర్జ్యాన్ని ఎదిరించి శ్రామిక రాజ్యాన్ని నిర్మించటానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారుమన బతుకుల్లో వెలుగు కోసం వెళ్ళారునీకు నాకు మనందరికీ హక్కులని పంచడానికి వెళ్ళారువాళ్ళు మనకోసమే వెళ్ళారు మన కోసమే అమరులయ్యారు.
కవిత్వం

వేణు క‌విత‌లు రెండు

1. ప్రియమైన కామ్రేడ్స్మిమ్ముల్ని ఏనాడు కలవనిమీతో ఏనాడు మాట్లాడనిప్రజలు కన్నీళ్లతో మీ చరిత్రను మననం చేసుకుంటున్నారుమీ త్యాగాలను హృదయాలకు హత్తుకుంటున్నారుఇప్పుడు మీ అమరత్వం దేశమంతా ఎర్రజెండాయి పరుచుకుందివీచే గాలిలాప్రవహించే నీరులామీరిప్పుడు గుండె గుండెకు చేరారుకనపడని బంధికాన లాదేశమంతా కాషాయ కంచెలు వేశారుమతోన్మాద హద్దులు గీశారుహద్దులను చేరిపేకంచెలను తొలిచే ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తోమీరిప్పుడు దేశమంతాఎర్రజెండై పరుచుకున్నారు.2. జ్ఞాపకాల జెండాలుబిడ్డలరా మీ జ్ఞాపకాలు మోస్తూ ఎదురుచూస్తున్నాం.....కొడుకులారా మీ ఆశయాలు మోస్తూలక్షలాది పీడిత ప్రజలుయుద్ధం చేస్తున్నారుజ్ఞాపకాలు స్మృతులు ఐనాయిఆశయాలు పోరాటం ఐనాయిబిడ్డలారా ఓ మా బిడ్డలరామీ జ్ఞాపకాలు మా కళ్ళనిండా దాచుకుంటాంమీరెత్తిన ఎర్రజెండాను మా గుండెలనిండా హత్తుకుంటాం.
కవిత్వం

ఆనంద్

అతని అక్షరాలుఅనంత కోటి పీడితజనహృదయ వేదనలోవెలిసిన నక్షత్రాలువెలుగు ఇవ్వటమే వాటి పని అతని అక్షరాలుప్రజల ప్రతిఘటన పోరులోచెక్కిన శిల్పాలురేపటి చరిత్రకు మూలాలు అతని అక్షరాలుఅమరుల రక్తములోతడిసిన విత్తనాలు ఏ పొలంలో చల్లినాఆయుధాలే మొలుస్తాయి
కవిత్వం

విప్లవ కటకం!

తాను చిరునవ్వు,చిరునామా,రాజ్య భోజ్య భస్మ ప్రాకారాల నిర్మిత కటకం….తాను దూరతీరాల సుదర్శన జనతన జాగృత ఆనంద దాయక కటకం…..విచ్చితి చిత్తంబుల చిరు కానుకుల ఘనీభవించే ఘీంకార కటకం….దారిద్రయ విముక్త దర్శన భాగ్యపు కథ కథల కటకం….అహో నావయవ్వన లోకపు దృక్పథాల చరమగీతపుహాహాకారపు కటకం….వస్తున్న వీస్తున్న దండకార్యపు కార్యకదనపు కటకం…..కనుల కావ్యపు కాలాతీత కార్యం ప్రమోద ప్రధాన ప్రదీప కటకం……విప్లవ కటకం అది విప్లవకటకం….
కవిత్వం

లేచి రా సారూ

ఏభై ఏళ్ళ మీ ఉద్యమ‌ ప్రయాణానికిసెలవంటూ నిష్ర్కమించారా మీ చేతులలో పెరిగినఎన్నెన్ని పోరాట రూపాలు మొక్కవోని మీగుండె నిబ్బరం చివరి శ్వాసవరకూ రాస్తూనే వుందన్నవార్త మీ ఆచరణకు గీటురాయి వసంత గీతంఆలపిస్తూ సాగినమీ నడక యీ అసహనఅపసవ్య వేళలోఆగిపోయి మమ్మల్నిఒంటరి చేసారు కదా సారూ ఈ ఏరువాకపున్నమి రోజు మరలమీరు సేద్యం చేయఈ నాగేటి చాళ్ళలోఉదయిస్తారు కదూ!! లే లేచి రా సారూమీ ఆకు పచ్చని ఎర్ర చుక్క టోపీధరించి ఏకే‌ అందుకునిధూలా ఆడుదురు (కామ్రేడ్ సుదర్శన్ సారుకు వినమ్ర జోహార్లతో)
కవిత్వం

నల్ల కలువ..!

అదితెలంగాణ నేల విముక్తి కోసంసాగిన సాయుధ రైతాంగ పోరాట కాలమదిదేశ ముఖ చిత్రాన్ని కర్రు నాగలితోచెక్కినవసంత మేఘ గర్జనలోపల్లెలన్నీ తడిసాయి..ఆ వర్షపు జల్లుఅన్ని పల్లెల్ని కలిపాయి..ఆ ధారగోదావరికి తాకింది.. నాటిగొండ్వాన రాజ్యంనుస్పూర్ సంస్థానంమావో నాటే - మావో రాజ్(రాజ్యం) లోపురుడోసుకున్న కటకం.! ఎన్నిఅంతరాల దొంతరలున్నవ్యవస్థలోఅతనోఒక నల్ల కలువఈ నేల మాగానపునల్ల రేగడిసింగరేణినల్ల బంగారంపు రుపుఈ దేశపు వెలుగుఅతను.. ఆరు పదులు దాటిననాలుగు పదుల ఉద్యమంనాలుగు పాదాల రాజ్యాన్నిదిక్కరించిన సుదర్శనంఅతను. అతనుఎవరని చెప్పాలిఒక విద్యార్థి ఉద్యమమనా..ఒక సికాసా అనా..ఒక రైతాంగ కార్యకర్త అనా..నల్ల ఆదిరెడ్డి, రాజలింగం సోపతాఅతను ఎవరని చెప్పాలి.ఎన్ని అని చెప్పాలి.ఏమని చెప్పాలి అతనోఉద్యమంఅతనోయుద్ధ గీతికఅతనోవిముక్తి బాటఅతనోగెరిల్లా..అతనేకటకం సుదర్శన్అతనేపోరుబాటకు
కవిత్వం

ఈ కవిత్వం అసంపూర్ణవాక్యం కాదు..

అనాదినుంచీ ఈ మతాలు మనిషికీ మనిషికీ మధ్య మాయగోడలు నిర్మించాయే తప్ప మనుష్యులందర్నీ ఏ మతమూ ఒక్కటిగా చెయ్యలేక పోయింది. అలాచేసే శక్తి ఏ మతానికీ లేదు. పైగా మనిషిమీద మనిషి కుండవలసిన విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది మతం. -మహాకవి శ్రీశ్రీ ఇప్పుడు జరుగుతున్నదిదే. మతమనే మారణహోమంలో బలౌతున్నది మాత్రం మనుషులే. మానవ వికాసానికి ఎంతమాత్రమూ ఏ మాత్రమూ ఉపయోగపడని మతంకోసం మనిషి ఎంతటి విధ్వంసానికైనా ఒడిగడతాడు. ఇవాళ ఇజ్రాయిల్‌ పాలస్తీనా యుద్దం సామ్రాజ్యవాదమే కానీ, ఈ సామ్రాజ్యవాదం పెంచిపోషిస్తున్న విషనాగుమాత్రం మతమే. అందుకే కవి మిరప మహేష్‌..                 యుద్దమంటే సాధించడం కాదు                 కోల్పోవడం మాత్రమే
కవిత్వం

యుద్ధం మాకు కొత్తేమీ కాదు

ఇప్పుడు జరిగే వైమానిక యుద్ధాలు మాకు కొత్తవి కావచ్చు మా తాతలు,ముత్తాతలు చెప్పిన కథలు, చేసిన యుద్ధాలు మా మస్తిష్కంలో ఇంకా భద్రంగానే ఉన్నాయి మీరు చేసిన అన్యాయాల, అక్రమాల తడి ఆరనేలేదు నివురు కప్పిన నిప్పులా మాకు తెలిసిన యుద్ధాన్ని దాచుకొని మా హక్కుల కోసం అందరి సహజ సంపద కోసం రాజ్యాంగ బద్దంగా పోరాటం చేయడమే మా నేరం అయితే యుద్ధం మాకు కొత్తేమీ కాదు మీరు న్యాయ వ్యవస్థని కొనుక్కున్నా మా మీద అత్యాచారాలు జరిగినా కోర్టు తీర్పులు మాకు వ్యతిరేకంగా వచ్చినా సహించాం... సహిస్తున్నాం భరించాం.. భరిస్తున్నాం కానీ ఇప్పుడు నీ పాడు
కవిత్వం

కడుపు కోత

ఎక్కడోఒక తల్లి కన్నపేగు తెగింది..తండ్రి ఆశలు ఆవిరి అయ్యాయి..అమ్మ,నాన్న వస్తారుఏదో తెస్తారనిఎదురు చూసే చూపులువాళ్ళు రాలేరన్న వార్త వినిఎక్కి ఎక్కి ఏడ్చాయి. అవికుటుంబం కోసం కూలి పనికిదేశం మొత్తం సంచరించే వలసజీవితాలు..ఇప్పుడు మన నేతలువాటికి లెక్కలు వేస్తారు,బాగానే ఉంది.. అమ్మ కడుపు కోతకు..నాన్న కన్నీళ్లకు..పసి పిల్లల భవిష్యత్తుకు..సమాధానం చెప్పేదేవరు..?ఈ మారణఖండకు కారణం ఎవరు..?వాళ్ళ బాధలో భాగంగా..😰(ఒడిశా రైలు ప్రమాదం పై) 03.06.2023