ఆర్ధికం

రుణ ఊబిలో ప్రపంచ దేశాలు

ప్రపంచ దేశాల రుణభారం ప్రమాదకర స్థాయిలో పెరగడం వల్ల ప్రజల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లోని ప్రభుత్వాలు అసాధారణంగా 97 ట్రిలియన్‌ డాలర్ల రుణభారాన్ని కలిగి ఉన్నాయి. ఈ మొత్తం దాదాపు ప్రపంచ వార్షిక ఆర్థిక ఉత్పతి కంటే ఎక్కువ. 2023లో అభివృద్ధి చెందుతున్న దేశాలు 847 బిలియన్‌ డాలర్ల వడ్డీని చెల్లించాయి. ఇలాంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్య భవిష్యత్‌ ఆలోచనలను కార్యరూపం దాల్చేలా వ్యవహరించడం కష్టతరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆర్థిక మాంద్యం, మహమ్మారి లేదా ప్రకృతి విపత్తులు వంటి షాక్‌లకు ప్రభుత్వాలు శీఘ్రంగా స్పందించే సామర్థ్యాన్ని కోల్పోతూ వస్తున్నాయని తాజాగా ఐఎంఎఫ్‌
సమకాలీనం

పర్యావరణం కోసం ప్రాణాలు కోల్పోయిన  కార్యకర్తలు 

‘గ్లోబల్ విట్‌నెస్’ రిపోర్టు ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా, 2012 నుండి పర్యావరణ పరిరక్షణా కర్తవ్యంలో  మొత్తం 2,106 మంది ప్రాణాలు కోల్పోయారు. 2023లోనే, కనీసం 196 మంది పర్యావరణ రక్షణ కార్యకర్తలు తమ ఇళ్లను లేదా సముదాయాలను రక్షించుకోవడానికి పోరాడుతూ మరణించారు. వీటిలో భారత్ పదో స్థానంలో ఉంది. పర్యావరణం, భూమి హక్కుల కోసం మాట్లాడే వారిపై జరుగుతున్న హింసకు సంబంధించిన ఈ ఆందోళనకరమైన సంఖ్య ప్రపంచ సంక్షోభాన్ని నొక్కి చెబుతుంది. కొలంబియా వరుసగా రెండో ఏడాది కార్యకర్తలకు అత్యంత ఘోరమైన దేశంగా వుంది. 2023లో, గ్లోబల్ విట్‌నెస్ రికార్డ్ చేసిన ఒక్క సంవత్సరంలో మరే ఇతర దేశం కంటే
ఆర్ధికం

భారత్‌ను ఆవరిస్తున్న ఆర్థిక మాంద్యం

అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో మనదేశ పరిస్థితి చూస్తే రూపాయి విలువ వెలవెలపోతూ… రికార్డు స్థాయి పతనాన్ని చవి చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. చరిత్రలోనే ఇదివరకూ ఎప్పుడూ లేని స్థాయిలో రూపాయి పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో సెప్టెంబర్‌ 27న రూపాయి విలువ 82కు పతనమయ్యింది. అంతర్జాతీయ ద్రవ్య మార్కెటులో డాలరుతో రూపాయి మారక విలువ అక్టోబర్‌ 19న ఏకంగా 79 పైసలు కోల్పోయింది. తొలిసారి రూపాయి మారకం విలువ 83.20కి క్షీణించింది. రూపాయి మారక విలువ చరిత్రలోనే ఇది అతిపెద్ద పతనం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో రూపాయి మారకం
ఆర్ధికం కాలమ్స్

భావ స్వేచ్ఛ‌కు డిజిటల్ సంకెళ్లు

కేంద్రంలో నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడేళ్లు పూర్తయింది. అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ప్రచార ఉధృతిలో చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. సామాన్యులకు, సంక్షోభంలో ఉన్న రైతులకు, అణగారిన వర్గాల ప్రజలకు ప్రయోజనం కలిగే ఒక్క చర్య చేపట్టలేదు. సమర్థ పాలన స్థానే అసమర్థత, ఏ మాత్రం పారదర్శకత, సమిష్టి నిర్ణయాలు లేని, నియంతృత్వ పోకడలున్న పాలకుడే మోడీలో కనిపిస్తాడు. కొవిడ్ మహమ్మారి విలయ తాండవం చేసిన, చేస్తున్న కాలంలోనూ మోడీ, ఆయన లెప్టినెంట్ అమిత్ షాల అనాలోచిత, ప్రజావ్యతిరేక చర్యలు దేశ అభివృద్ధిని అతలాకుతలం చేశాయి. మోడీ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి.
కవి నడిచిన దారి

నా అన్వేష‌ణే నా క‌విత్వం

జీవితం చాలా నేర్పిస్తుంది. పట్టుతప్పి పడిపోతున్న సమయంలో, పోరాడి పోరాడి అలసి విసిగిపోయిన సమయంలో ఏదో చిన్న ఆశ దృక్పధమై నిలబెడుతుంది. ఎత్తు పల్లాలు దాటుకుని ముళ్ళ దారుల్లో గాయాలను మాన్పుకుని ముందుకు సాగే మార్గమొకటుందని మనమూహించకుండా తారసపడే ఒకానొక సమయం పట్టి పలకరిస్తుంది. గమ్యమేదైనా ప్రస్తుతం నేను నడవాల్సిన దారిని విస్మరించకుండా అదే సమయంలో నాకు నేను వేసుకున్న ప్రశ్నలకు సమాధానమింకా వెతుకుతూనే ఉన్నాను. ఆ అన్వేషణే నా యీ కవిత్వం. 2015 లో మొదలు పెట్టిన సాహితీ ప్రయాణం 2019 లో ఏడవ రుతువుగా రూపు దిద్దుకుని దేశమంతా వాళ్ళ ఊరు నుంచి అటుగా వంగిన
ఆర్ధికం

జిడిపి పెరిగినా.. మారని బతుకులు

నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అభివృద్ధి నినాదాలు, ప్రజాకర్షణ వాగ్దానాల ప్రచార పటాటోపం తప్ప ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టింది శూన్యం. అందులో భాగంగానే దేశంలో ఆర్థికాభివృద్ధి పరుగులు పెడుతోంది.. ఉద్యోగ, ఉపాధి కల్పన కొత్త పుంతలు దొక్కుతోంది. ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయి. ఇవి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలుకుతున్న ప్రగల్భాలు. ప్రధాని మోడీ వల్లెవేస్తున్న ‘వికసిత భారత్‌’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ఈ కఠోర నిజం కేంద్ర ప్రభుత్వానికి చెందిన స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రొగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ మంత్రిత్వశాఖ తాజా పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పిఎల్‌ఎఫ్‌ఎస్‌)తో బహిర్గతమైంది. 2023 అక్టోబర్‌లో నిరుద్యోగిత రేట్‌ 10
ఆర్ధికం

యుద్ధ ఆవరణలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ

  యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా, ఇయు, నాటో దేశాలు రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి. కొవిడ్‌ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్భణానికి దారి తీస్తోంది. కొవిడ్‌ కాలంలో దెబ్బతిన్న సరఫరా గొలుసులు ఇప్పటికి పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరు చుట్టుపై రోకలి పోటులా ఇంతలోనే యుక్రెయిన్‌ సంక్షోభం వచ్చి పడింది. యుద్ధం ఎంత ఎక్కువ కాలం సాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అంతగా నష్టం వాటిల్లనుంది. యుద్ధం దీర్ఘకాలం
లోచూపు సాహిత్యం సమీక్షలు

అంటరాని అస్తిత్వపు ఆత్మకథ

      ప్రజలను తమ నుంచి తమనే కాకుండా యావత్ చరిత్ర నుండి కూడా పరాయీకరించే నేటి విధ్వంసక  కాషాయ రాజకీయ ఫాసిస్టు పాలనా సందర్భంలో ఇప్పటికి  పదేళ్ల క్రితమే డా. వై.వి. సత్యనారాయణ గారు రాసిన My Father Balaiah అనే ఇంగ్లీష్ పుస్తకానికి ఎంతో ప్రాసంగికత ఉంది. తెలుగులోనూ అనువాదమై  వచ్చిన ‘’మా నాయన బాలయ్య’’ అనే పుస్తకాన్ని ఒకానొక దళిత కుటుంబపు  ఆత్మకథాత్మక పూర్వీకుల జీవిత చరిత్రగానే గాక యావత్ మాదిగ అస్తిత్వపు మూలాల దృఢ ప్రకటనగా చూస్తేనే చాలా సముచితంగా ఉంటుంది. ఇలా  ప్రకటించడంలో స్వీయ  అస్తిత్వానికి సంబంధించిన అచంచల ఆత్మవిశ్వాసం,
లోచూపు కాలమ్స్

అంటరానితనం గాయాలకు అక్షరభాష్యం ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’

ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి. ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన
సమకాలీనం వ్యాసాలు కాలమ్స్

పెరిగింది కొండంత – తగ్గింది గోరంత

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది.