కాలమ్స్ లోచూపు

తెహ్జీబ్ జిందాబాద్ !

అసమ సమాజంలో జీవితం బరువు మోసే వాళ్ళే దేన్నైనా అర్థం చేసుకోగలరు. కొన్ని కొన్ని సార్లు అపార్ధం చేసుకోనూవచ్చు. అలా అపార్థం చేసుకోవడం కూడా ఒక రకంగా అర్థం చేసుకునే క్రమమే.కనుక అపార్థం చేసుకున్నవాళ్ళకే ఎప్పటికైనా సరిగ్గా  అర్థం చేసుకోగలిగే అవకాశాన్ని (చారిత్రిక)జీవితానుభవాలే అందిస్తాయి. అలా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళే నిర్భయంగా ప్రశ్నిస్తారు. బలంగా ప్రతిఘటిస్తారు. రాజీ లేకుండా పోరాడుతారు. వాళ్లే ప్రజలు. అలాంటి ప్రజల్లో సహజంగానే సహజీవన సంస్కృతి(తెహ్ జీబ్) ఉంటుంది. స్పష్టాస్పష్టంగానే కావొచ్చు ఎన్నో ప్రజాస్వామిక విలువలు ఉంటాయి. వారికి విభిన్న మతాల పట్ల తమవైన లౌకిక వైఖరులు ఉంటాయి. తమవైన ప్రత్యేక భక్తి
కాలమ్స్ బహుజనం

‘బ్లాక్‌ ఇంక్‌’లో పిల్లల కన్నీరు

ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని. ‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు. క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను 'అంటరాని'గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని
ఆర్ధికం కాలమ్స్

ఆధిపత్య లక్ష్యంతో బైడెన్‌ విదేశాంగ విధానం

అమెరికా అధ్యక్ష పీఠంపై  ఎవరున్నా దాని సామ్రాజ్యవాద విధానాల్లో మార్పు ఉండదన్న విషయాన్ని డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన నూతన అధ్యక్షుడు జో బైడెన్‌ తన భౌగోళిక రాజకీయ విధానాల ద్వారా రుజువు చేస్తున్నారు. ట్రంప్‌ విధానాల వల్ల దూరం జరిగిన మిత్రులను ఒకటి చేసే పనిలో బైడెన్‌ నిమగ్నమై ఉన్నారు. కొంత కాలంగా జి-20 దేశాల ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా అమెరికా నాయకత్వంలోని పాత సామ్రాజ్యవాద కూటమి అయిన జి-7 దేశాల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యాక తిరిగి అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం పాత మిత్రులందరిని సమన్వయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాడు..
కాలమ్స్ కథావరణం

*అభివృద్ధి*ని ప్రశ్నిస్తున్న క‌థ

సీనియర్ కథా రచయిత్రి ముదిగంటి సుజాతా రెడ్డి 2018 లో ప్రచురించిన "నిత్యకల్లోలం" కథాసంపుటి లోని , ఈ కథను చదివితే నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి ? అది ఎవరి కోసం? అభివృద్ధి ఫలితాలు ఏమిటి? అవి ఎవరి కోసం ?నిత్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలు వార్తా కథనాలై, ప్రత్యక్ష ప్రసారాలై, మనసులో ఎలాంటి ఆలోచనలు కలిగిస్తున్నాయి ? మనిషి వాటికి ఎలా స్పందిస్తున్నాడు  అనే ప్రశ్నలు మనల్ని వెంటాడతాయి.నిద్రపుచ్చటం కన్నా ప్రశ్నించటం మంచిది అనుకుంటే, ప్రశ్నించే గుణం ,తత్వం ఈ రచయిత్రి కి ఈ రచయిత్రి సృష్టించిన అనేక పాత్రలకు పుష్కలంగా ఉన్నాయి.*అన్నీ మరిచిపోయి మనిషి
కథ..కథయ్యిందా!

రాబందు – గాలివాన

ఇది, 'ఒక పక్షి కత'. దీన్ని పి.వరలక్ష్మి రాసింది.అరుణతారలో సెప్టెంబర్ 2009లో అచ్చయ్యింది. ఈకలు లేని తెల్లని బట్టతల.బలమైన బూడిదరంగు రెక్కలు , కుడిచివర నుండి ఎడమచివర దాకా ఏడడుగుల విశాలమైనవి.పొడువాటి మొనదేలిన , గుహద్వారంలా తెరుచుకొనే ముక్కు.'ఔచ్..'మని అరచిందంటే దడుసుకొని ఆమడదూరం ఎగిరపోయే బక్కప్రాణులు. ఇదీ యీ కథలోని రాబందు బీభత్స గంభీర సోందర్యం.ఎప్పటికైనా తన గుంపు  నాయకుడిగా యెదగాలనుకుంది.ఎదిగింది. అది తన వొంపుదిరిగిన బలమైన ముక్కుతో , చచ్చినప్రాణుల కఠినమైన శరీరభాగాలను చీల్చేది.దాన్ని చూసి సాటి పక్షులు నోరెళ్ళబెట్టేవి. కాలక్రమంలో చచ్చినవాటినీ, బలహీనమైన వాటినీ వేటాడితే యేం గొప్పా? అనుకొని మన రాబందు, లేల్లనీ, గొర్లనీ
కాలమ్స్ కొత్త కవిత్వం

మానవుడే కవితా వస్తువు

ఆధునిక కవిత్వ  రచన దానియొక్క  రూప పరమైన  శిల్ప పరమైన చర్చ  చేసే టప్పుడు రెండు ప్రధాన అంశాలు ముందుకు వస్తాయి.కవి  హఠాత్తుగా ఊడిపడిన సృజన కారుడు కాదు .తన అస్థిత్వం ,భౌగోళిక  స్థితి గతులు  తన అనుభవ౦ . రెండవది తన భావ జాలం. వీటిపై ఆధార పడిన ప్రాపంచిక  దృక్పధ ౦. కవిత్వ౦ మానవుని అంతర్ బహిర్ యుద్ధారావం  అనుకుంటే ,అంతిమంగా మానవుడు ,  మానవుని  అస్థిత్వం ప్రధాన భూమిక వహిస్తాయి. రాజకీయ భావజాలం వుండట మనేది కవి యొక్క చైతన్యం పై ఆధార పడి వుంటుంది . రాజకీయ పరమైన అంశాలు  కవిత్వంగా  ఎలా మలచ
కాలమ్స్ కథా తెలంగాణ

*ఊడలమర్రి*లో విధ్వంస మూలాలు

సాహిత్యం ద్వారా సరికొత్త ప్రభావవంతమైన ఆలోచనల్ని పోగుచేసుకోవ‌డం ఇలాంటి  కథల ద్వారనే సాధ్యం అవుతుంది.పాఠకులను ఎదురుగా కూర్చొబెట్టుకుని ఉపాధ్యాయుని మాదిరిగా అద్బుతమైన ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తోంది. ప్రత్యక్షంగా తీర్పులు, పంచాయతీలు, పరిష్కారాలు పాఠకుడికి అవసరం అనిపించడంలేదు. కథను చదువుతున్న పాఠకుడి మనో అంతరంగంలో ఒక చిన్న అలజడిని, అల్లకల్లోల్లాన్ని సృష్టించినా రచయిత లక్ష్యం నెరవేర్చినట్లుగానే భావించాలి. ఈ దృక్పథంలో పరిశీలించినపుడు పి. చిన్నయ్య గారి కథలు అదే బలమైన ప్రభావాలను పాఠకుడి మనుసుపై తనదైన ముద్రను వేయడంలో 'ఊడలమర్రి' కథలకు ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. రచయిత, పాఠకుడికి ఏ మాత్రం విసుగు కల్పించకుండా
కాలమ్స్ ఆర్ధికం

ఉపాధి డమాల్

కరోనా సెకెండ్ వేవ్ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. ప్రతి మనిషి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్న దయనీయ స్థితి. ఒకవైపు జనాలు పిట్టల్లా రాలుతుండడంతో చావు భయం వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు అంతమవుతుందో తెలియని భయానక వాతావరణంలో భారతీయ సమాజ జీవనం సాగిస్తోంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్లా భయాందోళన రాజ్యమేలుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫల ప్రభుత్వంగా ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ సర్కార్‌కు కూడా ఇప్పుడు ఊపిరాడడం లేదు. అన్ని వైపుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలతో మోడీ సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ స్థితిలో అంతర్జాతీయ పత్రికలు మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని
కాలమ్స్ లోచూపు

అస్తిత్వాలు, ఆధునికత, ప్రగతిశీల సామాజిక పరివర్తన

అస్తిత్వాలు,అస్తిత్వవాదాలు ఒకటి కాదు. కాబట్టి అస్తిత్వాల చర్చ అస్తిత్వవాద చర్చ మాత్రమే కానవసరం లేదు. ఇలా అంటున్నామంటే,అస్తిత్వ వాదాలను  పట్టించుకోనవసరం లేదని కాదు.అస్తిత్వాల విముక్తి కోసం అస్తిత్వవాదాలను సీరియస్ గా పట్టించుకొని విమర్శనాత్మకంగా పరిశీలించాల్సిన అవసరాన్ని గుర్తించడమని అర్థం.     చరిత్రలో ప్రాచీనకాలం నుండే మానవ అస్తిత్వాలు ఉనికిలో ఉంటూ వస్తున్నాయి.ఆ అస్తిత్వాలన్నీ మారకుండా  ఒకే విధంగా లేవు. వేర్వేరు స్థల కాలాలలోని  ఉత్పత్తి సంబంధాలతో వాటికున్న సంబంధాల పరస్పర ప్రభావాలను బట్టి అవి మారుతూ  ప్రత్యేకతలను సంతరించుకున్నాయి. ఒకే కాలంనాటి నిర్దిష్ట అస్తిత్వాలను పరిశీలించినా, అవి వేర్వేరు దేశాలలో విభిన్నంగా ఉండి వేర్వేరు చలన క్రమాలను కలిగి ఉంటాయి.కనుక
కాలమ్స్ లోచూపు

గుండెల్నిమండించే మంటో కథలు

మన దేశంలో ఒక జీవన విధానంగా చెప్పబడుతున్న హిందూమతం నిజానికి చరిత్రలో ఒక జన జీవనహనన విధానంగానే అమలవుతూ వస్తున్నది. మిగతా మతాల కంటే దుర్మార్గంగా ఇది అసమానతలను దైవ సృష్టిగా వ్యాఖ్యానించి, వాటిని ప్రజలు ప్రశ్నించడానికి వీలు లేకుండా చేసింది. ఫలితంగానే బ్రాహ్మణీయ వర్ణ వ్యవస్థ, కులాంతరాల కట్టడుల వ్యవస్థ ఉనికిలోకి వచ్చి పాలకుల చేతుల్లో అవి విభజన అస్త్రాలుగా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. చరిత్రలో ప్రజల్ని విభజించి పాలించడం కొత్తేమీ కాదు గాని, వలసవాద పాలనాంతంలో 1947 లో జరిగిన దేశవిభజన విలయం మాత్రం అతిపెద్ద చారిత్రక విషాదం. ఎందుకంటే, గురజాడ అన్నట్టుగా మతాలు మాసి