అంతర్జాతీయ చిత్ర సమీక్ష సాహిత్యం

చివరి ఆరు రోజులు!

1943 లో జర్మనీలో జరిగిన యధా తధ సంఘటనల ఆధారంగా రూపొందించిన అద్భుతమైన డాక్యుమెంటరీ  “సోఫీ స్కోల్ – ది ఫైనల్ డేస్”.  ఈ చిత్ర దర్శకుడు ‘మార్క్ రోథెమండ్’ (Marc Rothemund). దీని వ్యవధి 120 నిమిషాలు. ఇతివృత్తం; 1943 లో, ఫిబ్రవరి 22 న , ‘సోఫీ స్కోల్’ అనే విద్యార్థినిని, ఆమె సోదరుడిని, ఇంకొక సహ నిరసనకారుణ్ణీ యుద్ధ వ్యతిరేక కరపత్రాలు పంచిపెట్టారనే నేరాన్ని మోపి, నాజీ హిట్లర్ ప్రభుత్వం గిలెటిన్ తో శిరఛ్చేదం చేసింది. ఈ శిరఛ్చేదానికి ముందు ముగ్గురికీ నేర విచారణ జరుగుతుంది. ప్రధానంగా మహిళా పాత్ర సోఫీ స్కోల్  దృష్టి
కథలు సాహిత్యం

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
సాహిత్యం వ్యాసాలు

ప్రతి విపత్తూ పెట్టుబడికి వరమే

ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య,  వారి సంపదను లెక్కించడం లో    ఫోర్బ్స్ సంస్థ  అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో,  వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది. 140 మంది వ్యక్తుల లేక  దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!) దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్  నివేదికను
కథలు

ప్రజలదే విజయం

వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు
సాహిత్యం కవిత్వం

ఇక్కడి నీడలు నీడల్లా వుండవు

మా దేహపు నీడలోనూమా ఊపిరిపాట వినిపిస్తుంది మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణమా కడుపులోకి ఎలా దూకిందోమా దేహపు నీడలోనూ కనిపిస్తుంది స్థూపాల నీడలన్నీ కలగలిసినేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయిమా దేహపు నీడలోనూఅదే త్యాగాల రంగు దట్టమైన చీకటిలోనూనిద్ర పట్టని రాత్రిలోనూనేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయిమా నీడలు మా కింద నుండి పారుతుంటాయిగుండెలు పగిలిఅచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్నమరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికిమా నీడలు పారటం నేర్చుకున్నాయి చిమ్మ చీకటిలోనూమా నీడలన్నీ సజీవమేనీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలుపిడికిళ్లుగా మారుతుంటాయిపిడికిళ్లుగా పాడుతుంటాయి ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండిఇక్కడి
సాహిత్యం కవిత్వం

పరాకాష్ట

చేతులకు సంకెళ్ళువేసినరాతను గీతనుఆపలేవుకాల్లకు సంకెళ్ళువేసినమా ఆటను అడ్డుకోలేవునోటికి సంకెళ్ళువేసినపాటను మాటనుప్రశ్నను ఆపలేవుఅక్షరం పై ఆంక్షలుశబ్ధం పై నిషేదంకదిలిక పై నిర్భందంమెదలిక పై నిఘాఅప్రకటిత చీకటిపాలనకు పరాకాష్టఇక మౌనం మండాల్సిందేశబ్ధం విస్ఫోటం చెందాల్సిందే
సాహిత్యం వ్యాసాలు

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
కొత్త పుస్తకం సాహిత్యం

వాలని మబ్బులు- వానమెతుకులు

రాయ‌ల‌సీమ రైతు క‌థ‌లు సంక‌ల‌నానికి శ్రీ‌నివాస‌మూర్తి రాసిన ముందుమాట‌ నేను ఆరోతరగతిలో వున్నప్పుడు మావూరికి ఆపిల్, దానిమ్మ, కమలాలు వంటి 'అమ్ముకునే' పండ్లు వచ్చేవి కాదు. పల్లెల్లో వాటిని కొనలేరు.అందుకని ఎవరూ తెచ్చి అమ్మరు. ( నీళ్లు లేవు కాబట్టి అరటిపండ్లు కూడా మా వూళ్ళో దొరకవు. ఎప్పుడైనా కర్నూలు పోతున్నప్పుడు వెల్దుర్తిలో బస్సు ఆగితే "అరటిపండ్లేయ్!" అంటూ బస్సును  చుట్టుముట్టే ఆడవాళ్ళ అరుపులు యిష్టంగా వింటూ ఒక డజనుకొనడం ఆనాడు మాకు అపురూపం ) వూరి కొండల్లోనో,తోటల్లోనో పండే సీతాఫలం, జామ, మామిడి కూడా బాగా అగ్గువ అయినప్పుడు మాత్రమే ఇంటిదగ్గరికి అమ్మొచ్చేవి. టమేటా కాలంలో మాత్రం
సాహిత్యం వ్యాసాలు

నిషేధాన్ని ఇలా చూద్దాం!

నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు,
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

దృక్ప‌థం అందించే ఎరుక వ‌ల్ల‌నే క‌థ గుర్తుండిపోతుంది

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి