కారా స్మృతిలో సాహిత్యం

జీవిత దృక్పథమే కథా.. కథలనిలయమే… కారా మాస్టార్

కాళీపట్నం రామారావు గారు యీ లోకం నుంచి వెళ్ళిపోవటం.. మాష్టారు గార్ని వొక‌ జ్ఞాపకంగా మాట్లాడుకోవటం బాధగా గుండెల్ని మెలిపెడుతూనే వుంది.  మాష్టారి గారితో  వ్యక్తిగతంగా.. కధానుబంధంగా..  వున్న జ్ఞాపకాలను రచయితలు మాత్రమే కాదు. యెందరో పాఠకులూ పంచుకుంటున్నారు. పరిశోధకులు కథా నిలయం తమ పరిశోధనకి యెలా వుపయోగపడిందో  గుర్తుచేసుకుంటున్నారు.  మనం రాసిన వాటినే మనం దాచుకోలేని వారెందరో వున్న కాలంలో దాదాపు మనందరి కథలని  అక్కడ భద్రపరిచే పనిని కథపై, ముందు తరాలపై యిష్టంగా.. ప్రేమగా.. బాధ్యతగా.. గౌరవంతో వారు ఆ పనిని అత్యంత శ్రద్ధగా చేశారు.  మనందరికీ తెలుసు వారు వుపాధ్యాయులని. పిల్లలకి శ్రద్ధ లెక్కలు చెపుతూ
సాహిత్యం కవిత్వం

కనుపాపల్లోనుండి

మా ఇంటిముందురోడ్డువారగా గులాబీ చెట్టుచెట్టు చిన్నదేగానిగుత్తులుగా పువ్వులుఅటుగా వెళుతున్న అందరినిపలకరిస్తున్నట్టుగా ఉంటాయి ఆ చెట్టు పువ్వులపై పడిన కళ్లల్లో ఆశ్చర్యంపెదాలపై దరహాసం నడిచివెళుతుంది ఒక పువ్వు కోసుకోమంటారా!అటుగావెళుతున్న ఒక కేకఆపిలు విన్నప్పుడెల్లావినకుడాని మాటేదో విన్నటు చిరాకు వద్దులే అనిసున్నితంగా తిరస్కరించినప్పుడుఆకేకనిరాశగానిట్టూర్పుతోవెనుదిరిగి వెళ్లిపోతుంటేపువ్వులు ఊపిరి పీల్చుకుంటూఒక కృతజ్ఞతనునా మీదకు విసిరేసేవి ప్రకృతిని శ్వాసించనివికృతదేహాలుపువ్వుల ప్రమేయంలేకుండావాటిని తాకుతున్నపుడుకాళ్ళకింద నలిపేస్తున్నప్పుడునిరశిస్తాయినినదిస్తాయియుద్దాన్ని ప్రకటిస్తాయి పువ్వులు లేనితోటపువ్వులు లేనిఇల్లుమబ్బులుకమ్మిన ఆకాశమే పువ్వులుఆహ్లాదాన్నిస్తాయిపువ్వులుఆనందాన్నిస్తాయి పువ్వులువడలిపోయి రాలిపోతున్నప్పుడుఎన్నటికీకనిపించకుండాపోతున్న బిడ్డల్లా అనిపిస్తాయి ప్రకృతినిఅమితంగా ప్రేమించే సూర్యంచెట్టునిపువ్వుల్నితన మొబైల్ ఫోన్ కెమెరాలోజ్ఞాపకాలుగా దాచుకున్నప్పుడుచెట్టుచెలిమిచేసింది శృతి చెట్టుని దాటుకుంటూ లోనికివస్తున్నప్పుడుచెట్టే తనని పాలకరించిందో!శృతియే చెట్టుని పాలకరించిందో!ముందుఎవరిని ఎవరు పలకరించిపరిచయం చేసుకున్నారోగానిసూర్యం శృతి అమరులయ్యాకచెట్టుదుఃఖమయ్యిందికన్నీళ్ల
కథలు

అడవి నేర్పిన అమ్మతనం

(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత) మీనూ, నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను. ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను. నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల
సాహిత్యం కారా స్మృతిలో

సాహిత్యంలో ప్రాసంగికత: కారా ఉదాహరణ

కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు. కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల  ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత
సాహిత్యం వ్యాసాలు

మమతా ఫాసిజం మాటేమిటో!

“ఎంత మాట! ఇట్లనవచ్చా? సందర్భశుద్ధి లేకుండా?” అనే వాళ్లుంటారని నాకు తెలుసు. సరిగ్గా అనవలసిన సందర్భం ఇదే. పైగా నిన్న మొన్న కూడా ఈ మాట అన్నవాళ్లకు ఇప్పుడు ఏ ఇబ్బందీ ఉండదు. పశ్చిమ బెంగాల్ విషయంలో సోషల్ ఫాసిజమనీ, మమతా ఫాసిజమనే మాటలు ఎప్పుడో ముందుకు వచ్చాయి. ఫాసిజాన్ని ఇన్ని రకాలుగా, ఇన్ని విశేషణాలతో చెబితే అసలు ఫాసిజం మీద విమర్శ పలుచన అవుతుందనే వాళ్లూ ఉండొచ్చు. మన దేశంలో ఫాసిజం కూడా బహురూపి. సూక్ష్మరూపి, సర్వవ్యాపి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి, పాలకవర్గ రాజకీయార్థికానికి అది అత్యంత సన్నిహితమైనది. కేవలం బ్రాహ్మణీయ హిందుత్వ వల్లనే మన దేశంలోని ఫాసిజం
సాహిత్యం వ్యాసాలు కారా స్మృతిలో

కారా క‌థ‌లో స్త్రీ కోణం

 ‘ఆదివారం’ సెలవు కాదా? కారా కథలు గతంలో (దాదాపు మూడు దశాబ్దాల క్రితం ) కొన్ని చదివాను. తన కథల్ని మనకి మిగిల్చి ఇటీవల మాష్టారు వెళ్లిపోయాక మళ్ళీ మొత్తం కథలు చదవడం మొదలుపెట్టినపుడు కొన్ని కథలని మొదటిసారిగా చదివాను. కొన్ని చదువుతున్నపుడు ముఖ్యంగా ఒకే దగ్గర చదువుతున్నప్పుడు ఆయన స్త్రీ పాత్రలను ఎంత బాగా చిత్రించారో గమనించాను. అసలు ‘కారాకథల్లో స్త్రీ పాత్రలు’ అనే అంశం మీద తప్పక రాయాలీ అనిపించింది. ఇప్పటికే  ఎవరన్నా ఆ పని చేసి ఉండకపోతే మాత్రం తప్పక చేయదగ్గ పని. నేను ప్రస్తుతానికి ఒక కథ గురించి మీతో పంచుకుంటాను.