కథలు “మెట్రో జైలు” కథలు సాహిత్యం

డిటెన్యూ

 సాయంత్రం లాకప్ అయ్యే ముందు గిన్తీ కోసం అందరినీ వరుసలుగా కూర్చోబెట్టారు. సాయంత్రం డ్యూటీలో ఉన్న ఒక వార్డర్ వచ్చింది.  “డిటెన్యూ లు పక్కకు నిలబడండి” అన్నది. ఇద్దరు పక్కకు నిలబడ్డారు. ఆమె ఒకసారి తాను తెచ్చుకున్న కాగితాలు చూసుకొని “ఇంకొకరు ఉండాలే” అని తలెత్తి కమల వైపు చూసింది. “నువ్వు కూడా!” నేను కూడా అప్పుడే ఆమెను చూశాను. అందరినీ లెక్కబెట్టుకొని వార్డర్ బయటికి నడిచింది. ఆమెతో పాటుగా వచ్చిన ఖైదీల ఇంచార్జ్ (శిక్షపడిన వాళ్ళని నియమిస్తారు) తాళాలు వేసి వార్డరు వెనకనే వెళ్ళిపోయింది. నేను చేతిలోకి వార్తా పత్రిక తీసుకొని చదవడం మొదలుపెట్టాను. కమల నా
కథలు

అడవి నేర్పిన అమ్మతనం

(ఒక మీనూ, ఒక మానో, ఒక పుష్ప, ఒక సుజాత) మీనూ, నీవు ఒక పాపకు తల్లివి. ఒక ఇల్లాలివి. నేనూ ఒక తల్లిగా నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. బిడ్డను కోల్పోయిన తల్లి వేదన ఎలా ఉంటుందో స్త్రీగా, తల్లిగా నాకు చెప్పాల్సిన పని లేదనే నమ్మకంతో రాస్తున్నాను. ఇప్పుడు నేను జీవితంలో ఇంకెన్నడూ చూడలేని నా కూతురు యోగితా జ్ఞాపకాలను మోస్తూనే నీతో మాట్లాడుతున్నా. బిడ్డను కోల్పోయిన కన్నీటి తడి ఇంకా ఆరక ముందే, పొంగి వచ్చే దుఃఖాన్ని అది మిపట్టుకుంటూ ఇలా రాస్తున్నాను. నీ భర్త కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హస్ గెరిల్లాల
కథలు అల‌నాటి క‌థ‌ సాహిత్యం

గుమ్మ‌న్ ఎగ్లాప్పూర్ గ్రామ‌స్థుడు

ఉద‌యం లేచింది మొదలు లింగన్న మనసంతా కకావికలమైపోతోంది. వర్షాకాలం, అడవి పచ్చగా వుంది, రాత్రి కురిసిన వర్షానికి నేలంతా బురదబురదగా వుంది. కురిసి కురిసి లింగన్న గుడిసె చెమ్మగా వుంది. ఏడేళ్ళ కూతురు ఆకలితో ఏడుస్తోంది. పదేళ్ళ కొడుకు ఆకలిగా మూలుగుతున్నాడు. లింగన్న భార్య లచ్చిమి బాలింత జ్వరం యింకా తగ్గినట్టులేదు. లింగన్న తల్లి ఎల్లవ్వ కాలుకున్న మానని గాయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది. పొయ్యిమీద అంబలి కుండ ఎక్కించడానికెవరూ లేనట్టుగా వుంది. అందరూ నిస్సత్తువగా వున్నారు. లింగన్న లేవడంతోనే కన్పించిన దృశ్యాలివి. ఇక ఎక్కువసేపు ఆ గుడిసెలో వుండలేకపోయాడు. అలవాటుగా బయటకు నడిచాడు. మబ్బులచాటునుండి సూర్యుడిరకా బయట
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
కథలు ఎరుకల కథలు

అమరజీవి మా కాంతమ్మత్త !

అనుకుంటాం కానీ, అందరికీ ఆ భాగ్యం  దక్కదు. ఆమె చనిపోయినప్పుడు ఆమె పాడె  వెనుక మూడు ట్రాక్టర్లు కదిలాయి. వాటినిండా రంగురంగుల పూలహారాలే. ” అదీ సావంటే. పుణ్యాత్మురాలు. నిద్రలో నవ్వతా నవ్వతానే పోయింది, ఏమి జనం, ఏమి జనం! ఇంత మంది యాడాడి నుంచి  వచ్చిoడారో ?.ఆ మనుషులేమి? ఆ పూలహారాలేమి? ఏమి జనం, సావు కూడా పెళ్లి లాంటిదంటే ఇట్లాంటిదేనేమో. ” అని జనం నోర్లు నొక్కుకున్నారు.  ఇంకో మాట కూడా అనేశారు   "ఎరికిలోలల్లో  ఏ సావుకైనా పై కులమోల్లు, బయట కులాలోల్లు ఇంత మంది వచ్చిండేది ఎప్పుడైనా చూసినారా ? అదీ కాంతమ్మంటే!   ” 
కథలు “మెట్రో జైలు” కథలు సాహిత్యం

మర్యాదస్తులు

“మెట్రో జైలు” కథలు: 1 “హజారీబాగ్ జైలు గాధలు” సంపుటి “ఏదినేరం”,  విరసం ప్రచురణగా పాఠకుల్లోకి వెళ్ళాక రెండవ భాగం ఎప్పుడు వస్తుంది అని చాలా మంది అడిగారు. మళ్ళీ అరెస్ట్ అయితే వస్తుంది అని సరదాగా అన్నాను. ఫాసిస్టు రాజ్యం ఆ మాటలని నిజం చేసింది. నిజానికి అలా అన్నాను కానీ భారతదేశంలో జైళ్ళన్నీ ఒకే లాగా ఉంటాయి కాబట్టి మళ్ళీ అరెస్టయినా కొత్త కథలు ఏం ఉంటాయి అని కూడా అనిపించింది. కానీ నేను రెండో సారి 2019 నవంబర్ లో అరెస్టయ్యి హైదరాబాదులోని చంచల్ గూడా జైలులో 8 నెలలు గడిపాక ఒక మెట్రోపాలిటన్
ఎరుకల కథలు

“ఆయమ్మ అంతే! ఆమె ఒక  మదర్ తెరీసా!”

మా నాయన చెమటలు కార్చుకుంటా  గసపోసుకుంటా సాయంత్రమో రాత్రో ఇంటికి వస్తాడు. ఊసురోమని   ఆయన ఇల్లు చేరే టయానికి సరిగ్గా మా అమ్మ ఎప్పుడూ ఇంట్లో ఉండదు. పగలని లేదు రాత్రని లేదు, ఎవరు ఎప్పుడొచ్చి  “ జయమ్మక్కా... ఏo చేసేది  ఇప్పుడిట్లా అయిపోయిందే ..ఇప్పుడింక నాకు నువ్వే దిక్కు. ఏం చేస్తావో, యెట్లా చేస్తావో నీ ఇష్టం అక్కా ..” అని  ఏడిస్తే చాలు, ఆయమ్మ అంతగా కరిగి పోతుంది. మాయమ్మ ముక్కుపుల్ల, ఉంగరం, కమ్మలు ఎప్పుడూ ఎవరికోసమో కుదవలోనే(తాకట్టు)  వుంటాయి. ఆ మూడూ కలిపి   ఆయమ్మ వేసుకుంది మాత్రం మా కళ్ళతో మేం మా చిన్నప్పుడు  
కథలు

మౌనం

సాయంత్రం సూర్యుడు ఆకాశం నుండి సెలవు తీసుకుని మసకబారుతున్నాడు. యాకూబ్ తన భార్య షబానా సమీపంలో నిస్సహాయంగా నిలబడి ఉండిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లడం తప్ప మరో మార్గం లేదని అతనికి అనిపిస్తోంది. కవల పిల్లలు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందితో విలవిల్లాడుతున్నారు. ఒకరు పాప. మరొకరు బాబు. షబానా: "యాకూబ్, వీళ్ల శ్వాస ఇంకా బాగా లేనట్టుంది. మన దగ్గరి ఇంటి వైద్యం చేశాం. ఇంతకన్నా చేయగలిగింది ఏమీలేదు. ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిదేమో." యాకూబ్: "నేను కూడా అదే అనుకుంటున్నా. వాళ్లను ఇక్కడ ఉంచితే ఏమైనా జరిగి పోతుందేమోనని భయం వేస్తోంది. మనం ఆలస్యం చేయకూడదు." షబానా: (పిల్లల్ని
కథలు సాహిత్యం

అది నేనె! యిది నేనె!

అల్పిక “గిది వుద్యమ కాలం. హక్కుల కోసం కొట్లాడాలె. పౌరహక్కుల సంఘానికి నేనే అధ్యక్షుడిగా వుంటా” *** “విరసం’ను నిషేధిస్తారు? విరసం మీద నిషేధానికి నేనే వుద్యమిస్తా బిడ్డా” *** “కోట్లాడి తెలంగాణ సాధించుకున్నం. ఇంక పౌరహక్కుల సంఘం లేదు, విరసం లేదు, ప్రజా కళామండలి లేదు, యే ప్రజా సంఘమూ యింక అద్దు”
కథలు

ప్రజలదే విజయం

వేసవికాలం సెలవుదీసుకుంటూ వర్షాకాలం ప్రారంభమవుతున్న సమయం. అది జూన్‌ చివరి వారం. వేసవి ఎండలతో మోడుబారిపోయి ముఖం మాడ్చుకున్న ఆ అడవితల్లి అప్పుడప్పుడే కురుస్తున్న వర్షాలకు చిగురిస్తూ అడివంతా తన అందాన్ని సంతరించుకుంటున్నవేళ. ఆ చుట్టుపక్కల ఆదివాసీ పల్లెలన్నింటిని గలగలమనే శబ్దాలతో పలకరిస్తూ పారుతున్న బలిమెల నది. ఈ సహజసిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఆ ఊరి ప్రజలందరూ దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తున్నారు. వర్షానికి తడిసి బురదగా మారిన మట్టిలో స్వేచ్ఛగా ఆడుకుంటున్నారు చిన్నపిల్లలు. ప్రకృతి ఇచ్చే ఊట నీటితో బిందెలు నింపుకొని నాలుగైదు వరసలు తలపై పెట్టుకొని కూనిరాగాలు తీస్తూ పొలం గట్లపై నడుస్తూ ఇళ్లకు