వ్యాసాలు

నోయిడా కార్మికుల ధర్మాగ్రహం.

దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం,గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా(న్యూ ఓఖ్లా ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ అథారిటీ) ప్రణాళికా బద్ధ పారిశ్రామిక పట్టణం. జాతీయ రాజధాని ప్రాంతంలో ఒక భాగం. యమునా మరియు హిండన్ నదుల మధ్య మైదాన ప్రాంతంలో 17 ఏప్రిల్ 1976 నాటి యూపి పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి చట్టం కింద ఈ నగరం ఆ ప్రాంతానికి విస్తరణగా సృష్టించబడింది. రాజధాని నగరం న్యూఢిల్లీ కేంద్రానికి ఆగ్నేయంగా దాదాపు నలబై కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రక్కనే ఘజియాబాద్ అనే మరొక నగరం ఉంది. ఇక్కడ దేశ, విదేశీ బహుళజాతి కంపెనీల, చిన్న,మధ్య