వ్యాసాలు

14 సంవత్సరాల తరువాత నిర్దోషులుగా తీర్పు

14 సంవత్సరాల 19 రోజుల తరువాత ప్రశాంత్ రాహి, చంద్రకళ తదితరులను ఉత్తరాఖండ్  కోర్టు UAPA కేసులో నిర్దోషులుగా ప్రకటించింది  2022 జనవరి 7న, ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లోని జిల్లా- సెషన్స్ జడ్జి ప్రేమ్ సింగ్ ఖిమల్ కోర్టు, దేశద్రోహం, రాజద్రోహం, UAPA నిందితులు ప్రశాంత్ రాహి, అతని జీవన సహచరి చంద్రకళతో పాటు మరో ఇద్దరిని నిరోషులుగా ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లో 14 సంవత్సరాల 19 రోజుల పాటు సాగిన ఈ ప్రసిద్ధ కేసులో అనేక కోణాలు వున్నాయి. 2007 డిసెంబర్ 17 న డెహ్రాడూన్‌లోని ఆరాఘర్ దగ్గర ప్రశాంత్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు
వ్యాసాలు

సంస్కృతి – మార్క్సిస్టు సాంస్కృతిక సిద్ధాంతం

(విర‌సం 28వ మ‌హాస‌భ‌ల కీనోట్ పేప‌ర్‌లోని కొన్ని భాగాలు పాఠ‌కుల కోసం- వ‌సంత‌మేఘం టీం) సంస్కృతి ఉత్పత్తి :   సాహిత్యం, కళలలాగే సంస్కృతి సామాజిక ఉత్పత్తి.  సంస్కృతిలో నుంచే  కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయి. సామాజిక ప్రపంచంలో మనిషి ఆవిర్భవించినట్లే సామాజిక సంబంధాల నుంచి సంస్కృతి రూపొందుతుంది.  అన్ని సామాజిక అంశాలకంటే ఎక్కువగా  సంస్కృతి  మనిషిని  పెనవేసుకొని ఉంటుంది.  సంస్కృతి మానవ భౌతిక జీవితావరణకు సంబంధించిందే కాదు. మానవ మనో ప్రపంచంలోనూ ఉంటుంది. మనిషి ప్రవర్తనలో, ఆలోచనా రీతుల్లోనే ఉంటుంది.  సంస్కృతి తనకు తగినట్లు మనుషుల మనో ప్రపంచాన్ని డిజైన్‌్‌ చేసుకుంటుంది. అది భౌతిక ప్రపంచంలో వలె మనస్సులో  కూడా
సాహిత్యం కవిత్వం

చేతనాస్తిత్వం

సంధ్యాకాశంలో కదులుతున్న సూర్యుడు చేతనలోంచి అచేతనలోకి వెడుతున్నాడు దూసుకొస్తున్న పున్నమి చంద్రుడు సుషుప్తిలోంచి సృజనలోకి వస్తున్నాడు నుసిలా రాలుతున్న చీకటిని కప్పేస్తున్న వెన్నెల వెలుగు దూరంగా వెలుగుతూ మలుగుతున్న చుక్కల రాయబారం ఘనీభవించిన నిద్ర మీద నిప్పురవ్వలా జ్వలిస్తున్న కలల దీపం ముఖం వాల్చిన పెరటితోటలోని పొద్దుతిరుగుడు పువ్వు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బావి గిరక మీద కూర్చున్న ఊరపిచ్చుకల కిచకిచలు అస్తిత్వం చేతనమై కురుస్తున్న వాన చినుకులు చీకటిలోంచి తొంగిచూస్తున్న వెలుగురేఖల దృశ్యం దూరపు కొండలను స్ఫృశిస్తూ సంక్షోభంలోంచి స్పష్టతలోకి సంక్లిష్టతలోంచి సంఘర్షణలోకి సందేహంలోంచి సందోహంలోకి జ్వలిస్తున్న సూర్యుడు
సాహిత్యం కవిత్వం

బహిష్కరిద్దాం

తడికలు అడ్డెట్టి తెల్ల గుడ్డ కట్టి అదే వెండి తెర భావనలో నేల పై మూడు గంటలు కూసుని చూసిన సినిమా నేల టికెట్ నుండి కుర్చీ దాకా జనం ఎగబడితే ఏడాదీ ఆడిన సినిమా కథలో అదే మూస కథనంలో కొత్తదనం కాసులు కురిపించిన సినిమా రీళ్ళ డబ్బాలు టాకీస్ టూ టాకీస్ ఓ మాదిరి పెద్ద వూరిలో ఓ టాకీసు సినిమా బండ్లు పోటాపోటీ పోస్టర్లు మైదాతో గోడలపై వినోదాన్ని పంచిన సినిమా మూకీ నుంచి టాకీ దాకా నలుపు తెలుపు నుంచి రంగుల బొమ్మ దాకా సాంకేతిక హంగుల హోరులో పెంచుకున్న బడ్జెట్ సినిమా
సాహిత్యం కవిత్వం

చివరిదాక

కలంతో కరచాలనమై అక్షరాలను అల్లుకుపోతూ అజ్ఞాతంలో దశాబ్దాలు గడిచిపోయాయి సింహవలోకనంలో గమనా గమనమై నైనాగా ఉప్పెనైపోతూ ప్రజలు అజేయులంటూ రెండుపాదాలు చివరిదాక నడిచాయి చీకటిని శిథిలంచేసే సూర్యోదయకిరణాల కోసం గుండెలుమీద పెంచుకున్న బిడ్డలకు నడకనేర్పిన సింధూరాలు నాలుగుసింహాలు నాలుగుదిక్కులు దారులుమూసి ట్రిగ్గరమీద వేలుపెట్టినా రంగులు మార్చే ఖాకీలు కనికరమైనట్టు నోట్లకట్టలపై నడిపిస్తామన్నా భయమైపోయి కాసులముందు కన్నీరై తలవంచని  తల్లీ లలితమ్మ
సాహిత్యం కవిత్వం

మృత్యువు దాడిచేసిన రాత్రి అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు కాలం నిలిచేమీ పోలేదు నీ శవం దగ్గర కూడా గతమూ వర్తమానమూ ఘర్షణ పడి నీ ఆశయ నినాదాలతో మేమే ముందుకు సాగాం సూర్యుడు సంక్రాంతి లోకి పయనించాడు రాస్తూ రాస్తూ అలవాటుగా గోడవైపు చూశాను అవును నేస్తం నువు ప్రేమగా యిచ్చిన గడియారంలో ముళ్ళు ఆగిపోయాయి సరిగ్గా నీ అస్తమయం దగ్గర కాలం ఫ్రీజ్ అయినట్లు కాదు, నీ ముళ్లబాట జీవితం అక్కడితో ముగిసింది నీ ఊపిరితిత్తుల నుంచి తీసిన నెత్తుటి సిరంజిలా సెకన్ల ముల్లు ఆగిపోయింది
సాహిత్యం వ్యాసాలు

నక్సల్బరీ కవితా విస్ఫోటనం అలిశెట్టి

అలిశెట్టి ప్రభాకర్ ను సామాజిక సంక్షోభం వున్నచోట వుండనీయలేదు. ఆ కల్లోల సమాజంలోని తుఫాను ఆయన జీవితంలో భీభత్సాన్ని సృష్టించింది. సృష్టించబడుతున్న కల్లోలాలకు కారణాలు వెదుక్కున్నాడు. ఆ కారణాలు, ఆవేశం, నిరసన కవితాత్మకమైంది. కవిత్వం రాయడానికి గొప్పగా చదువుకొనోక్కరలేదని నిరూపించాడు. స్పందించే గుణముంటే చాలు. ఆ స్పందనను ఒక క్రమంలో పేర్చుకునే నేర్పు స్పందించే గుణమే అందిస్తుంది. ఆ క్రమమే అలిశెట్టి. ఆదే ఆయన కవితాగుణం. అణచివేత, సంక్షోభాలకు కారణాలను శాస్త్రీయంగా అంచనా వేసుకోవడానికి విరసం అలిశెట్టికి చేయూత నిచ్చింది. ఆ శాస్త్రీయపు అంచనాలతో సామాజిక కుళ్ళును, కౌటిల్యాన్ని తూర్పారబట్టాడు. అట్లని నిందించడడమే పనిగా పెట్టుకోలేదు. ప్రత్యామ్నాయ మార్గాల్ని
వ్యాసాలు సమీక్షలు

జీవితం మలచిన కవి

'పూలపరిమళం'లో కోడం కుమారస్వామి రాసిన ఇరవయ్యేళ్ల (2000-20) నలభై ఎనిమిది కవితలు ఉన్నాయి. కాలంగా రెండు దశాబ్దాలు దీర్ఘకాలమే. ఇంకో కొత్త తరానికి ఆహ్వానం పలికి చోటిచ్చే కాలం. ఆయన సంవత్సరానికి రెండు మూడు కవితలకు మించి రాసినట్లు లేదు. అందులోనూ 2004 నుంచి 2007 దాకా రాసినట్లు లేదు. 2014 నుంచి కొంచెం ఎక్కువగా రాస్తున్నాడు. ఆయన జీవితం చాల మాగిన సారవంతమైన మట్టి బతుకు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి వణికిన కోట్లాది కష్టజీవుల్లో అతను ఒకడు. ఈ అన్ని రుతువుల్లోనూ, అన్ని అననుకూలతలలోనూ, ఆహారాన్వేషణలో దానినే మనం బతుకు తెరువు అంటున్నాం. ఆయన
సంపాదకీయం

బీహార్ విప్ల‌వ సాహిత్యోద్యమ శిఖ‌రం

కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ బీహార్‌ రాష్ట్రానికి చెందిన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమ ప్రధాన నాయకులలో ఒకరు. ఆయన తన 89వయేట, డిసెంబర్‌ 23న తీవ్ర అనారోగ్యంతో మరణించారు. 1983 లో విరసం చొరవతో అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి (ఏఐఎల్‌ఆర్‌సి) ఏర్పడిరది. అదే సంవత్సరం అక్టోబర్‌ 14, 15 తేదీలలో ఏఐఎల్‌ఆర్‌సి ప్రథమ జాతీయ మహాసభలు ఢిల్లీలో జరిగాయి. ఈ మహాసభల్లో బీహార్‌ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రతినిధులలో కామ్రేడ్‌ రాజ్‌ కిషోర్‌ ఒకరు. ఆ రాష్ట్రం నుండి రెండు విప్లవ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఏఐఎల్‌ఆర్‌సిలో భాగస్వామ్యం అయ్యాయి. వాటిల్లో ఒకటి, క్రాంతికారీ బుద్ధిజీవి సంఘం
వ్యాసాలు

ఏడు నెలల మహత్తర సిల్‌గేర్ పోరాటం

డిసెంబర్ మాసం, చలి కాలం రాత్రి 10 గంటల సమయం. సిల్‌గేర్ గ్రామం…. చింత చెట్టు కింద మండుతున్న నెగళ్ళ  చుట్టూ దాదాపు 30 మంది యువతి, యువకుల బృందం కూచుని వుంది. మంటల నుంచి వచ్చే వెలుతురు చీకటిని చీలుస్తూ, చెట్ల నీడల్లో మెరుస్తోంది.  ఛత్తీస్‌గఢ్‌లో ఈ ప్రాంతంలో ఈ సమయంలో ఇలా సమావేశం జరగడం చాలా అసాధారణమైన విషయం. భద్రతా బలగాలు,  మావోయిస్టు తిరుగుబాటుదారుల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న దారుణ, సుదీర్ఘ పోరాటానికి కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్‌లోని అడవికి నడిబొడ్డున వున్న సిల్‌గేర్ అనేక మంది అమాయకులు ఎదురుకాల్పుల్లో చిక్కుకున్న యుద్ధ భూమి. సాధారణంగా