ఇండో–అమెరికా ఒప్పందం: సామ్రాజ్యవాదపు పునర్వ్యవస్థీకరణలో భారత పాలక వర్గాల పాత్ర
2026 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం అమెరికా, భారత దేశాల మధ్య ఒక వాణిజ్య ఒప్పందం కుదిరిందని ప్రకటించి దాన్ని “చరిత్రాత్మక మైలురాయి”గా ప్రచారం చేస్తోంది. ట్రంప్ విధించిన 50శాతం సుంకాలను 18 శాతానికి తగ్గించిందని, ఇది మోదీ వల్లనే సాధ్యమయిందని ప్రకటించి మోదీకి పెద్ద ఎత్తున సన్మానం చేసి ఆయన ఎట్లా అమెరికా ఒత్తిడికి దాసోహం అయ్యాడనే వాస్తవాన్ని మరుగుపరచాలని మోదీ ప్రచార టీం పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నది. కానీ ఈ వాణిజ్య ఒప్పందం భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా పెట్టుబడులకు దాసోహం చేసే ఒప్పందం. ఈ వాణిజ్య ఒప్పందంలో ఏముంది? భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలోని










