ప్రపంచ వర్గ పోరాట సాహిత్యానికి చేర్పు
విస్మరణ, వక్రీకరణలతోపాటు విధ్వంసమై పోయిన ఆదివాసుల, దళితుల, బహుజనుల, మహిళల వర్గ పోరాట చరిత్ర, సాహిత్యం సిపాయి తిరుగుబాటుతోనే తిరిగి వెలుగులోకి రావడం మొదలైంది . యూరప్లో జరిగిన పారిశ్రామిక, ఫ్రెంచి విప్లవాలు, పారిస్ కమ్యూన్, రష్యా, చైనాల్లో జరిగిన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలు ప్రపంచ పీడిత ప్రజలను ప్రభావితం చేశాయి. 1967 నక్సల్బరి, శ్రీకాకుళం, ముషాహరి సాయుధ పోరాటాలు చైనా సాంస్కృతిక విప్లవం, గ్రేట్ డిబేట్ నేపథ్యంలో అర్ధవలస, అర్ధ భూస్వామిక పార్లమెంటరీ దగుల్బాజీ రాజకీయాలతో నలిగిపోయిన పీడితప్రజల ముందుకు విప్లవ శ్రేణులు వర్గపోరాటాన్ని సాయుధ రూపంలో బలంగా ముందుకు తెచ్చాయి. పదేండ్ల పోరాట అనుభవసారంతో 1977లో