సంపాదకీయం

విభజన చట్టం చంద్రబాబుకు గుర్తుందా?

ఈ ఎన్నికల్లో చంద్రబాబు, జగన్‌ ఎడాపెడా వాగ్దానాలు చేశారు. ఇద్దరూ చాలా సౌకర్యంగా ఒకటి మర్చిపోయారు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు చేసిన విభజన చట్టం. దానికి పదేళ్ల వయసు వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ‘నవ్యాంధ్ర’ను నిర్మిస్తానన్నాడు. కానీ విభజన చట్టం గురించి ఊసెత్తలేదు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్‌ రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు. విభజన చట్టం నోరెత్తలేదు.  చెరి ఐదేళ్లు వంతులవారి రాష్ట్రాన్ని పాలించారు. ఈ పదేళ్లలో తాయిలాలకు లోటు లేదు. ఉచితాలకు అంతులేదు. పోటీపడి సామాజిక పింఛన్లు వాగ్దానాలు చేశారు. తోచిన వరకు ఇచ్చారు. కానీ
సంపాదకీయం

మణిపూర్ మారణకాండ మాటున

‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్‌స్పెక్టివ్‌తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి