సాహిత్యం కవిత్వం

పాడె పై ప్రజాస్వామ్యం

దుక్కి దున్నినచేతులురహదార్ల పై ఏడాది గాచలనం లేనినిరంకుశ పాలన పండిన పంట అమ్మకందళారీ కనుసన్నలలోఏ తీరానికి పయనం వాడికి లాభార్జనే ఎరుకనేల రకాలెరగడునేల సత్తువ ఎరుగడుకాలం కాక ముందే రోహిణిలోనేఒప్పందాలంటూ ఎగేసుకొస్తేరైతు ఒప్పుకోవాలా?!వాడు చెప్పిన పంట పండక పోతే బాధ్యత ఎవరిది? ఒక పల్లెలఎన్నో పంటలుచిన్న కమతాల నుండి పెద్ద కమతాల దాకారైతు రైతు కి ఒప్పందంఆచరణ లో అసాధ్యంపల్లె ఒక్క యూనిట్ గాపల్లె ఒక పంటగా సాగుతుందిఅనుమానమే లేదు సుమీ!! ఎరువులు పురుగు మందుల అప్పుల కోసంఅంది వచ్చిన ధర కాడికి తెగ నమ్మిఅప్పులు తీర్చే రైతుబండ్లు కిరాయికి మాట్లాడుకునిప్రాంతం కానీ ప్రాంతానికిభాష రాని అక్షరం ముక్క
సాహిత్యం కవిత్వం

అడవి నేను

ఆకు నేనుపువ్వు నేనుచెట్టు నేనుజీవి నేను ఈ గాలి నాదేఈ నీరు నాదేఈ భూమిఈ అడవి నాదే అడవి దేహంనేనో చెయ్యినేనో కాలు నేనేనోరే లేని నోరునేనే అడవి అడవికడుపు నేనునా కడుపుఅడవి నన్నువనం ఖాళీ చేయమంటేఅడవినేఅడవి ఖాళీ చేయమన్నట్టు బతుకు కాలి బాటజీవితంనడిచి పోతూనే ఉంటుంది అడవింత తినిపించగా మిగిల్నఆకలంటారా ?వాన మబ్బుల వెనకే నడిపిస్తాం కారు మేఘాల ఖడ్గాలుకళ్ళల్లోచొర బడినాచినుకు పరిమళాలేబతుకు దీపమౌతాయి ఇంటిముఖంపట్టడాని కేముంది ?నేనేనా అడవి ఇల్లు ! నే నింకెవర్ని ? నేనురోహింగ్యానా ?నేనుశరణార్ధినా ?నేనో వలసనా ? మైదానమా!నువ్వెక్కడైనా బతికి నట్టుఅడివినినేనెక్కడైనా బతకాలి క దా ! ఈ వాగుఈ
కథలు హస్బెండ్ స్టిచ్ - 3

భ్రమాన్వితుడా…!

ఏమంది సునయన? ‘యూ హావ్‌ టు వర్క్‌ హార్డ్‌... రేపట్నించీ ఇంకో రెండు ఎక్సర్‌సైజెస్‌ ఆడ్‌  చేస్తాను, అండ్‌ డైట్‌లో కార్బ్స్‌ ఇంకా తగ్గించేయాలి. ప్రొటీన్స్‌ ఆడ్‌ చేయండి.. ఓకే, రేపు హిప్‌ లిఫ్ట్స్‌? ఫ్లిట్టర్‌ కిక్స్‌, సిసర్‌ కిక్స్‌, వి`సిట్స్‌, అప్స్‌ ఆడ్‌ చేస్తాను. డోంట్‌ వర్రీ... మీ పొట్ట తగ్గి బాడీ మంచి షేప్‌లోకి వచ్చేస్తుంది. యువర్‌ హస్బెండ్‌ స్టార్ట్స్‌ లవింగ్‌ యూ మోర్‌... శారదగారూ, జిమ్‌ కోచ్‌ సునయన కన్ను కొడ్తూ చిలిపిగా నవ్వింది. శారదా నవ్వింది. కానీ నీరసంగా, ఇబ్బందిగా. దేహ కొలతలు సంతృప్తిగా ఉంటేనే ఎక్కువ ప్రేమించే భర్త ఎందుకు? తన
ఎరుకల కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా...." వెంకట రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు ఆ ఊరి రెడ్డి గారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు. రెడ్డిగారింట్లో హాల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, ఇఒఆర్డి, పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే  పెద్ద కులాల వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. గుమ్మం బయట తలారి నిలబడి హాల్లోకి తొంగిచూస్తున్నాడు.  ఎంతైనా రెడ్డిగారు రెడ్డిగారే. ఆఫీసర్ల ఆఫీసర్లే. జవాను జవానే ఆఖరికి తలారోడూ తలారోడే. ఎటొచ్చి శ్రీనివాసులు మాత్రం శ్రీనివాసులు కాకుండా పోయాడు. సర్పంచు సర్పంచు కాకుండా పోయాడు. ఎందుకంటే
సాహిత్యం సంభాషణ

సాహ‌సోపేతంగా పురోగ‌మించండి

(ఛైర్మన్ గొంజలో ఉపన్యాసం) (ఆయ‌న త‌త్వ‌శాస్త్ర ఆచార్యుడు. విశ్వ‌విద్యాల‌యంలో పాఠాలు చెప్పేవాడు.  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర పాఠాలు నేర్చ‌కోడానికి  యూనివ‌ర్సిటీని వ‌దిలేశాడు.    నేర్చుకోవ‌డం అంటే నేర్పించ‌డం అనే గ‌తిత‌ర్కం తెలిసిన‌వాడు. ప్ర‌జ‌ల‌కు రాజ‌కీయాలు నేర్పించాడు. ఆయ‌నే పెరూ విప్ల‌వ నాయకుడు కా. గొంజాలో. ఆ దేశంలో ప్ర‌జా యుద్ధ మార్గ‌ద‌ర్శి. ప‌థ నిర్దేశితుడు. ఆయ‌న నాయ‌క‌త్వంలో పెరూ ప్ర‌పంచ పీడిత వ‌ర్గానికి ఆశారేఖ‌లాగా వెలుగొందింది. ఆ ఉద్య‌మాన్ని దెబ్బ‌తీయ‌డానికి అమెరికా, పెరూ పాల‌క‌వ‌ర్గాలు  ఆయ‌న‌ను నిర్బంధించాయి. ముప్పై ఏళ్లుగా క‌ఠిన కారాగార శిక్ష  అనుభ‌విస్తూ ఈ నెల 11న అమ‌రుడ‌య్యాడు.  ఆయ‌న ప్ర‌జ‌ల‌కు   కాల‌పు ప్ర‌పంచ మేధావుల్లో ఒక‌రు. 
సాహిత్యం కవిత్వం

ఒక రహశ్యం చెబుతా..

పట్టుపరుపులు లేవుజారి పడేంత నునుపైన కట్టడాలూ లేవు అప్పుడంతానడక నేర్పిన పూల దారుల పెరళ్ళవిఆకాశాన్ని పొదివిపట్టిన ఆనందమదినిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమదిఅప్పట్లో మనుషులుండే వారని చెప్పుకునే అరుదైన క్షణాలూ అవే! ఇప్పుడుఏవేవో లెక్కలు వేసుకుని రెండుగా చీలిపోయాంఇద్దరి మధ్యా కొలవలేనంత దూరంవేలు పెట్టి చూపిస్తూ!కూడికలు ముందు స్థానంలో ఉన్నాయనుకుంటాం కానీఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కకు తేలనితీసివేతల జాబితా అదంతా!మెదడు అట్టడుగు పొరల్లోపూడుకు పోయిన అవశేషాల నిండు గర్భమది! ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా!?నీ చోటు ఇదేనని నొక్కి వక్కాణిస్తోందా!?ఎవరు ఏమైనా అనుకోనీఒక మాట మాత్రం చెప్పుకోవాలిప్రపంచమిప్పుడు విలువల్ని వివేకాన్నిప్లాస్టిక్ జార్ లో కుదించిన
సాహిత్యం సంభాషణ

మరణానంతర ప్రేమ లేఖ

యాప నారాయణ హరిభూషణ్‌గా ఎదిగిన క్రమం మనసు తెరమీద రూపు కడుతున్నది. మానుకోట దొరల గడీల చుట్టూ మర్రి ఊడల కింద మొలిచిన గడ్డి మొక్కలు ఆంబోతులను బంధించిన ముకుతాళ్లలో బిగిసిన పిడికిళ్లు గుర్తుకొస్తున్నాయి. ఆదివాసి జీవితం ఒక విప్లవ పాఠశాల అయిన క్రమం వరంగల్‌ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీ విద్యార్థిగా జ్ఞానం అంటే రాడికల్‌ మార్పు అని నేర్చుకున్న  చదువులు. అప్పటి అధ్యాపకులు అందరు ఆ విద్యార్థుల దగ్గరే నేర్చుకున్నామన్నారు. సమాజాన్ని చదువుకోవడం.  ఖమ్మం జిల్లాలో చేపట్టిన విప్లవోద్యమ విస్తరణ,  తెలంగాణా మీదుగా దండకారణ్యం దాకా రెండడుగులు నాలుగు అడుగులుగా నడిచింది. రెండు గుండెలు ఒక దండోరాగా
ఎరుకల కథలు

అదే ప్రశ్న

ఆ ఇంటిముందు నిలబడి ఇల్లు అదేనా కాదా అన్నట్లు పరీక్షగా చూసింది కమలమ్మ. వేణుగోపాలస్వామి గుడివీధి, మల్లెపూల పందిరిల్లు, రెండంతస్థుల ఆకుపచ్చని  పాత బిల్డింగు. సుభద్రమ్మ చెప్పిన గుర్తులన్నీ సరిపోయాయి. అయినా లోపలికి వెళ్లాలంటే ఒక్కక్షణం భయమేసింది. కాళ్లకేదో అడ్డం పడుతున్నట్లు అనిపించింది. మొహమాటంగా బెరుగ్గా అనిపించింది.మళ్ళీ తనే  ధైర్యం తెచ్చుకుంది. కదలకపోతే ఆగిపోయేది తన జీవితమే అని గుర్తు తెచ్చుకుంది.ఇల్లు ఇంట్లో ఆకలితో సగం చనిపోయినట్లు, ఒంట్లో రక్తమే లేనట్లు నిస్తేజంగా కనిపించే పిల్లల మొహాలు గుర్తుకు వచ్చేసరికి ఒక్క ఉదుటున ముందుకే కదిలింది. మనుషులు ఎట్లున్నా ముందుకు వెళ్లాల్సిందే, వెళ్లకపోతే ఎట్లా కుదురుతుంది ? ముగ్గురు
సాహిత్యం సంభాషణ

ఛైర్మన్ గొంజలో వర్ధిల్లాలి , అతని శక్తివంతమైన, ప్రభావశాలియైన ఆలోచనా విధానం వర్ధిల్లాలి!

సాధారణ రాజకీయ పంథాలో ఛైర్మన్ గొంజలో వివరణలు,  ప్రపంచ విప్లవానికి అందించిన రచనలు: మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం లేకుండా, గొంజలో ఆలోచనా విధానాన్ని ఊహించలేము, ఎందుకంటే అది మన వాస్తవికతక మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానపు సృజనాత్మక అనువర్తనం. శ్రామికవర్గ భావజాలపు చారిత్రక అభివృద్ధిని, మావోయిజం ప్రధానమైనదిగా ఆ భావజాలం మార్క్సిజం-లెనినిజం-మావోయిజంగా రూపుదిద్దుకున్న మూడు దశలను అర్థం చేసుకోవడం అనేది ఇందులో కీలకాంశం. సారాంశంలో, మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని ఒక విశ్వజనీన సత్యంగా పెరూ విప్లవ నిర్దిష్ట  పరిస్థితులకు అన్వయించడం అనేది ప్రధానమైనది. అందువల్ల గొంజలో ఆలోచనా విధానం పెరూ కమ్యూనిస్ట్ పార్టీకి, ఆ పార్టీ నాయకత్వంలో జరుగుతున్న విప్లవానికి ప్రత్యేకంగా ప్రధానమైనది. గొంజలో ఆలోచనా విధానంలోని
సాహిత్యం ఈబుక్స్

జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్

ఈ సంచిక వ‌సంత‌మేఘం పాఠ‌కుల‌కు *జ‌గిత్యాల జంగ‌ల్ మ‌హ‌ల్ * విప్ల‌వోద్య‌మ చారిత్ర‌క ప‌త్రాల రెండు సంక‌ల‌నాలు ఇస్తున్నాం. విప్ల‌వాభిమానుల‌కు ఇవి  అపురూప‌మైన కానుక‌లు. న‌క్స‌ల్బ‌రీ శ్రీ‌కాకుళ పోరాటాలు దెబ్బ‌తినిపోయాక తిరిగి ఉత్త‌ర తెలంగాణ‌లో భూస్వామ్య వ్య‌తిరేక స‌మ‌ర‌శీల రైతాంగ పోరాట ప్ర‌జ్వ‌ల‌న ఉవ్వెత్తున సాగింది. అది తెలుగు నేల అంతా విస్త‌రించింది. దానికి అక్ష‌ర రూపం 1981లో వ‌చ్చిన నాగేటి చాళ్ల‌లో ర‌గిలిన రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం. అది మొద‌లు 1984లో  మ‌హారాష్ట్ర కొండ‌కోన‌ల్లో ఊపిరి పోసుకుంటున్న ఆదివాసీ రైతాంగ పోరాటాల చ‌రిత్ర అనే ప‌త్రం దాకా ఈ రెండు సంక‌ల‌నాల్లో ఉన్నాయి.  ఇవి