పాణి రాసిన శికారి నవలలో నన్ను అమితంగా మెప్పించిన పాత్ర, నాకు నచ్చిన పాత్ర గుమ్లి. ఏ వర్గంలో అయినా స్త్రీలు సమాజ కట్టుబాట్లకు తల వంచక తప్పదేమో అని గుమ్లి పాత్ర ద్వారా నాకు అనిపించింది. భర్త ఎలాంటి వాడైనా పిల్లల కోసం స్త్రీ జీవన పోరాటం చేయక తప్పడం లేదు. ఇది ఈ సమాజంలో స్త్రీల స్థానాన్ని తెలియజేస్తుంది.
గుమ్లి భర్త డొక్కోడు రెండో పెళ్లికి చెల్లించే కట్నం కూడా తానే ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆమె అనుకుంటుంది. అప్పుడు భర్త రెండో పెళ్లికంటే దానికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వాల్సి వస్తుందనుకున్నప్పుడు గుమ్లి పడిన వేదిన వర్ణనాతీతం. చివరగా గుమ్లి తన తెగ ఆచారాలకు లొంగిపోతుంది. బళ్లారి పున్నమినాడు తన సవతి రానూతో కలిసి పండుగ జరుపుకోవడం ఆశ్చర్యకరం.
ఈ నవలలో మరో పాత్ర శాము. వేట, సారాయి కాచడం వృత్తులుగా ఉన్న శికారీల జీవితంలో సారాయి కాయలేని పరిస్థితుల్లో తన తెగలో ధైర్యసాహసాలను నింపిన వ్యక్తి శాము. ఒక రాజకీయ నాయకుడి అన్యాయానికి బలైపోతాడు. ఇది నవలలో చాలా బాధ కలిగించే విషయం. ఇక నానా అనే వృద్ధుడి పాత్ర ఒకటి ఈ నవలలో ఉంది. నానా తన జాతి పూర్వాపరాలు చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆయన పడిన వేదనకు మనం కూడా అతీతులం కాదనిపిస్తుంది.
మరో పాత్ర లీల. ఎంతో నేర్పు, ఓర్పుగల స్త్రీగా శికారీ మహిళలను అర్థం చేసుకోడానికి లీల దారి చూపుతుంది. డొక్కోడ తన చెల్లెలు వరసైన అనరను దళితుడు పెళ్లి చేసుకున్నందుకు శికారీలు దూరం పెడతారు. ఆమెకు ఆపద వచ్చినప్పుడు డొక్కోడు ముట్టుకొని సాయం చేస్తాడు. కట్టుబాట్లను ఉల్లంఘించినందుకు కుల పెద్దలు ఏ శిక్ష విధిస్తారో అని భయపడిపోతాడు. అది మనల్ని కదిలిస్తుంది.
ఇలాంటి ఆచారాలు, కట్టుబాట్లు శికారీలలో చాలా ఉన్నాయి. ఏ జాతి, తెగ, కులం, మతాన్నయినా ఇలాంటి ఆచారాలు ముందుకు పోనివ్వవు. అంధకారంలోకి తోస్తాయి. మానవత్వాన్ని, అభివృద్ధిని దెబ్బతీస్తాయి. సంద్రాయాలేవీ మనుషుల స్వేచ్ఛకు అడ్డంపడకూడదు. అలాంటి ఆచారాలను పాటించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.
ఈ నవల చదువుతున్నంత సేపు తప్పనిసరిగా వీలు దొరికితే కర్నూలు వెళ్లి కేసీ కెనాలు పక్కన ఉన్న శికారీల దగ్గరికి పోవాలనిపించింది.
నవల చివరిలో ఉన్న పాఠకుడి నోట్స్ ప్రకారం ఈ నవలా కాలం 2003 వరకు శికారీల జీవితాన్ని ఈ నవల చిత్రించింది. మరి ఈ ఇరవై ఏళ్ల కాలంలో వారి జీవితాల్లో వచ్చిన మార్పులను రచయిత మరో నవలగా రాయాలసి ఆశిస్తున్నాను.
✊✊
మా సత్యం
చరిత్ర మూలాలను ఒకసారి గుర్తు చేసుకోవడము, గ్రంథస్తం చేయడం భవిష్యత్ తరాలకు అవసరమే.
చరిత్రను గ్రంథస్థం చేసే యత్నం ప్రాచీన కాలము నుండి మడికి సింగన 1420 నాటి నుంచి కనిపిస్తుంది అందుకు ‘సకల నీతి సమ్మతం’ ఉదాహరణ.
విప్లవోద్యమానికి సంబంధించి అందులో అమరులైన విప్లవకారుల జీవిత విశేషాలను ఉద్యమ నిర్మాణాలను, రాజ్య హింసకు వ్యతిరేకంగా పౌరహక్కులనేతల నిర్మాణాలను వారి ప్రాణ త్యాగాలను చరిత్రలో గ్రంథస్తం కావడం చారిత్రాత్మకమైన అవసరం కూడా.
చాలా వరకు విప్లవోద్యమ నిర్మాణానికి సంబంధించి గ్రంథస్థం అయింది చాలా తక్కువే.
పాణి అందులో భాగంగానే యుద్ధ ప్రతిపాదికన సిలింగేర్ ఉద్యమానికి సంబంధించి ఉద్యమ చరిత్రను అందించారు.
అట్లాగే ఇప్పుడు పాణి “అనేకవైపులా”అనే చారిత్రాత్మకమైన నవల గతితార్కిక చారిత్రక దృష్టితో వాస్తవిక సంఘటనల ఆధారంగా రచించిన నవల.
లోతైనది, విస్తారమైనది.
మేధావి వర్గ సంఖ్య అతి స్వల్పం, చేరాల్సిన వారి సంఖ్య చాలానే ఉంది! వారికి చేరుతుంది.
ఒక లక్ష్యంతో చరిత్రను గ్రంథస్తం చేయడం లో లక్ష్యం వైపు వచ్చిన పుస్తకం ఒక అడుగు.
తెలుగులో రచించడం వల్ల చాలావరకు దేశ ప్రజలకు కానీ ఇతర దేశి దేశలలో ఉన్న వాళ్ళకి గాని ప్రచారం కాకపోవడం, వల్ల తెలుగు సాహిత్య, చరిత్ర ప్రాముఖ్యత తెలుసుకోలేకపోతున్నారు.
‘అనేకవైపులా’ నవలను
ఆంగ్ల పాఠకుల కోసం అనువాదం చేయడం కూడా అవసరమే.
ఇలాంటి రచనలు ఆంగ్లంలో కూడా అనువాదం రూపంలో వెంటనే వెంటనే
వస్తే ప్రపంచ ప్రజలకు తెలుస్తుంది.
అనువాద క్రమంలో తోడై సహాయ సహకారాలతో మనమంతా ముందు ఉందాం.