లోచూపు

సమాజ చలన విశ్లేషణ

మిత్రుడు ఎన్. వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసాలను గతంలో వేర్వేరుగా వీక్షణం పత్రికలో చదివినప్పటికీ, ఇటీవల వాటిని 'సమాజ చలనపు సవ్వడి' అనే పుస్తకం రూపంలో మళ్లీ ఒక్క చోట చదివితే ఏర్పడే అవగాహన మరింత శాస్త్రీయం,సమగ్రమూ అవుతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, సామాజిక పరిణామాలను సమగ్రంగా అధ్యయనం చేసి,వాటిని శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు రాజకీయార్థిక దృక్పథానికి మించిన ప్రత్యామ్నాయ దృక్పథం ఏదీ లేదని ఈ పుస్తకం రుజువు చేస్తుంది. సమాజ స్వభావం, సామాజిక మార్పు అనే విషయాలకు సంబంధించి పరస్పర భిన్నమైన అభిప్రాయాలు ఈనాటికీ వ్యక్తమవుతున్న కాలంలో 'సమాజ చలనపు సవ్వడి' అనే ఈ పుస్తకం
సాహిత్యం కవిత్వం

పిచుకలకు రెక్కలొచ్చే వేళ

సాయీనీతో పాటుగా ఇంతమందిమాటాడుతుంటే వాడికేదో భయం కదా చావు నీ ముందు కరాళనృత్యం చేసినానీ గుండె చెదరలేదునీ నిబ్బరం వెనక వున్ననమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా? నీ మాటా నీ నవ్వే వాడినిబెదరకొడుతూ వున్నాయా? ఎందుకో మాటాడే వారంటేచెదరని నవ్వుగలవారంటేరాజుకెప్పుడూ భయమనుకుంటా ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా నువ్వెప్పుడూ అంటావు కబీరునిఆలపించమనిమనుషుల్ని ప్రేమించమని కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూదేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు న్యాయానికి గంతలు కట్టి‌న్యాయమూర్తుల గుండెలపైఉక్కుపాదం మోపితీర్పులను తిరగరాయిస్తున్నాడు చీకటిని తెరచే ఉషోదయమొకటివేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది పిచుకలకు రెక్కలొచ్చినిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతోదూరంలో లేదు బాబా !! (సాయిబాబా విడుదల కోరుతూ)
సంపాదకీయం

ఎన్నికలు – మరోసారి అర్బన్ నక్సల్స్, ముస్లింలే టార్గెట్

అర్బన్ నక్సల్ అంటే ఎవరు? అటువంటి వారున్నారా ? భారత ప్రభుత్వపు పార్లమెంట్ రికార్డ్ ల ప్రకారం అయితే లేరు. ఈ సంగ‌తి   కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రే ప్రకటించారు. కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి వారికి మాత్రం ప్రతి సభలో, సమావేశంలో అర్బన్ నక్సల్స్ గుర్తుకువస్తారు. ఈ నెల 23 న గుజరాత్ లో పర్యావరణం పై రాష్ట్రాల మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో  దేశప్రగతిని అర్బన్ నక్సలైట్లు  అడ్డుకుంటున్నారని  మోదీ అన్నాడు. దేశంలో 6000కు పైగా అప్లికేషన్ లు పర్యావరణ అనుమతుల కోసం నిరీక్షిస్తున్నాయని తెగ బాధ‌పడ్డాడు.  వీటివల్ల పెట్టుబడి
వ్యాసాలు సంభాషణ

ఈ నిషేధం పిఎఫ్‌ఐ మీదా? ముస్లింల మీదా?

బీజేపీకి ఒక ప‌ద్ధ‌తి ఉంది. అది ముందు జ‌నంలోకి ఒక రాయి విసురుతుంది.  ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో  చూస్తుంది. పెద్ద‌గా ఇబ్బంది లేకుండా వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకుంటే విరుచుకపడుతుంది.  ఒక వేళ ప్రతిఘటన వచ్చేలా కనిపిస్తే  కొంచెం వెనక్కి తగ్గుతుంది. ఇంకో వైపు నుంచి  ఇంకో రూపంలో దాడి చేస్తుంది.   దీనికి    కావాల్సినంత టైం తీసుకుంటుంది. నింపాదిగా పని చేసుకపోతుంది.   ఇదీ సంఘ్‌ ఫాసిస్టు వ్యూహం. హిందుత్వ ఫాసిజం స‌మాజంతో  భావజాల క్రీడ ఇది.   ఫాసిజానికి రాజకీయార్థిక పునాది ఉన్నప్పటికీ దాని వ్యవహారం,  వ్యక్తీకరణ ప్ర‌ధానంగా  భావజాల కేంద్రంగానే ఉంటుంది.  ఈ నెల 18, 19 తేదీల్లో దేశవ్యాప్తంగా
కాలమ్స్ క్లాసిక్స్ ప‌రిచ‌యం

హెర్‌ వోగ్ట్‌

Herr Vogt జర్మన్‌ ప్రచురణ-1860 ఇంగ్లిష్‌ అనువాదం : 1982 పుస్తకం కంపోజింగ్‌, ముద్రణ, బైండింగ్ -  ట్రేడ్‌యూనియన్‌ లేబర్‌ కార్ల్‌మార్క్స్‌ విస్తృత రచనల్లో ఒక విస్మృత గ్రంథం Herr Vogt. ఆయన సమగ్ర రచనల జాబితా తయారు చేసేటప్పుడు తప్ప ఈ పుస్తకం పేరు మరెక్కడా వినపడదు. మార్క్స్‌ ఇతర రచనల గురించి సుదీర్ఘంగా, సూక్ష్మంగా చర్చించిన పండితులు కూడా ఈ పుస్తకాన్ని, ఎందుకోగాని విస్మరించారు. ఏది ఏమైనప్పటికీ, CAPITAL రాస్తున్న దశలో ఒక సంవత్సరంపాటు ఆ కృషికి విరామమిచ్చి, ఈ పుస్తకం రాశాడు మార్క్స్‌. తనూ, ఎంగెల్స్‌ ఇతర మిత్రులకు వ్యతిరేకంగా కార్ల్‌వోగ్ట్‌ అనబడే పెద్దమనిషి
సంభాషణ

ఇద్దరు మిత్రులు – విప్లవోద్యమంలో రెండు స్రవంతులు

కత్తి మోహన్‌ రావు స్మృతిలో ఎంఎస్‌సి కెమెస్ట్రీ విద్యార్థిగా, ఆర్‌ఎస్‌యు నాయకుడుగా 1982 నుంచి మా ఇంట్లో అందరికీ తెలిసిన సన్నిహిత మిత్రుడు కత్తి మోహన్‌రావు గుండెపోటుతో మరణించి ఇప్పటికీ ఏడాదిన్నర కావొస్తుంది. ఆయన స్మృతిలో గుర్తుచేసుకోవాల్సిన విషయాలు రెండు - కాకతీయ యూనివర్సిటీలో కెమెస్ట్రీ ల్యాబ్‌ తగులబడినపుడు పోలీసులు ఆయనను అందుకు బాధ్యుణ్ణి చేసి ముద్దాయిని చేయడం. ఒకే ఊరు, సహ విద్యార్థులు చైతన్య పూర్వకంగా ఎంచుకొని ఒకరు మెడిసిన్‌లోకి ఒకరు కెమెస్ట్రీలోకి వచ్చిన ఒకే ఊరు విదార్థులు డా. ఆమడ నారాయణ, మోహన్‌రావుల ఆదర్శ జీవితం. చివరిసారి ఆయనను వరంగల్‌ జైలు నుంచి బెయిల్‌ మీద
వ్యాసాలు

ఎట్టకేలకు కప్పన్‌కు బెయిల్‌

40 ఏళ్ల యువ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్‌కు సెప్టెంబర్‌ 9న సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పౌరుల హక్కును గుర్తించినట్లైంది. కేరళ పాత్రికేయుడు సిద్ధిఖీ కప్పన్‌కు  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యుయు లలిత్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ పిఎస్‌ నరసింహలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. సెప్టెంబర్‌ 9న ఇచ్చిన తీర్పు పలు కారణాల రీత్యా విశేషమైనది. అక్రమ కేసులు బనాయించి తమకు గిట్టనివారినీ, ప్రశ్నించినవారినీ, తప్పిదాలను ఎత్తిచూపేవారినీ సుదీర్ఘకాలం జైల్లో మగ్గేట్టు చేయడం ఒక సంప్రదాయంగా మారిపోయిన కాలంలో సుప్రీం నిర్ణయం వాక్‌ స్వాతంత్య్రాన్ని ఎత్తిపట్టింది. అంతకంటే ప్రధానంగా,
సాహిత్యం కవిత్వం

అదే వర్షం

వేకువల్లేవేయి కలలు వెలిగించుకునితూరుపు కాంతులు పూసుకునిచూపులులు మార్చుకున్న రోజులుకళ్లపై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటేకళ్ళలో వెలిగే దీపాలుదారిచూపటం .మనసున ఊగే భావాలుఊరించటంఅలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లోఅలా ఊగిపోవటంబంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలావెన్నెల ఆకాశాన్ని వొంచితల నిమురుతూంటేనూ… లోలోపలజ్ఞాపకాలు తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలివొలికి చిలికినీ ప్రపంచాన్నితెరలు తీసి ప్రదర్శిస్తుంటేనూ అదే వర్షం …. నాపై వాలే చినుకుల్లోనీ జ్ఞాపకాలు తడుపుతున్నాయి . వాస్తవానికి జ్ఞాపకానికిఒక తీయని ఊహా లోకం లోకొత్త ప్రపంచాన్నికళ్ళలో నిర్మిస్తాను అర్ధమౌతోందాజీవితమంటే కన్నీళ్లే కాదుకొన్ని కౌగిలించే జ్ఞాపకాలు కూడా .
కవిత్వం

దేశమంతా నెత్తురు వాసన

దేశమంతా నెత్తురు వాసనఆ మూల, ఈ మూలదేశం నలుమూలలఏ మూల చూసినరక్తపు మరకలేనెత్తురు వాసనే. ఎనిమిదేళ్లుగా దేశంపైతోడేళ్ల మందమూకుమ్మడి దాడి,మతం పేరుతోకులం పేరుతోకూర పేరుతోనీళ్ల పేరుతోకత్తులు నెత్తుర్లుపారుస్తున్నాయి. గర్భాన్ని చీల్చిపిండాలను పొడిచినశూలంఢిల్లీ పీఠంపైరాజై కూసింది.రాజ్యంలో రక్తం వాసనమేఘంలా ముసురుకుంది.
వ్యాసాలు

మరో హిందుత్వ విషసర్పం 63 పేజీల కల్పిత రహస్య దస్తావేజు

భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ  శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల