నివేదిక సంభాషణ

సాంస్కృతిక ప్రతివ్యూహపు కలనేత

విరసం సాహిత్య పాఠశాల నివేదిక విరసం 23వ సాహిత్య పాఠశాల జనవరి 7,8 తేదీల్లో  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉత్తేజకరంగా జరిగింది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల ప్రాంగణం, వాసం శివ హాలులో, నర్మద వేదికపైన రెండు రోజులు ‘ఫాసిజం ` సాంస్కృతిక ప్రతివ్యూహం’ అనే అంశంపై లోతైన చర్చ సాగింది. 7వ తేదీ శనివారం ఉదయం 11.00 గంటలకు సభా ప్రాంగణం ముందు పతాకావిష్కరణతో ప్రారంభమై ఆదివారం రాత్రి 9.00 గంటల దాకా సుమారు 16 గంటలపాటు నడిచిన సాహిత్య పాఠశాలలో వందలాది సాహిత్యాభిమానులు, సామాజిక కార్యకర్తలు, విప్లవాభిమానులు పూర్తి నిమగ్నతతో పాల్గొన్నారు.  విరసం సీనియర్‌ సభ్యులు
నివేదిక

బస్తర్ అడవుల అదృశ్యం కోసం కొత్త సాధనాలు

బస్తర్‌లో పౌర హత్యలపై మేము నివేదికను ప్రచురించిన నెలలో, మరో రెండు దఫాలు ఈ ప్రాంతంలో నక్సల్ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి, 16 మంది మావోయిస్టులు, ఒక కానిస్టేబుల్ మరణించినట్లు తెలిసింది. జూన్ ప్రారంభంలో, సునీతా పొట్టం అనే 25 ఏళ్ల కార్యకర్తను ఆమె ఇంటి నుండి బయటకు లాగి, కొట్టి, అరెస్టు చేసి అనేక కేసులు పెట్టినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో కార్పొరేటీకరణ, సైనికీకరణకు వ్యతిరేకంగా శాంతియుత ప్రచారంలో నిమగ్నమైన మానవ హక్కుల కార్యకర్తలు సుర్జు టేకం, శంకర్ కశ్యప్, ఓరం సామ్లు కోరం, లఖ్మా కోరం, రాను పోడ్యమ్ వంటి వారిని అరెస్టు చేసి హింసకు గురిచేశారు.
నివేదిక

“మాడ్ బచావో” అంటే సైనిక బలగాల హత్యాకాండ

ఈ నెల ప్రారంభంలో, నలుగురు  ఆదివాసీ రైతులను చంపి, మావోయిస్టులుగా ముద్రవేసి దాదాపు 90 మంది ఆదివాసీ రైతులను అరెస్టు చేయడంతో రాజ్యం ఆదివాసీ రైతులపై దాడిని మళ్లీ ప్రారంభించింది. ఆదివాసీలపై మారణహోమ దాడిని కొనసాగించింది. వైచిత్రమేమంటే, తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఛత్తీస్‌గఢ్ కొండల నుండి మావోయిస్టులను తరిమివేయడానికి మాడ్‌లో ప్రజా ఉద్యమాలు మారణహోమ మిలిటరీ ఆపరేషన్‌ను వ్యతిరేకించడానికి ఉపయోగించే “మాడ్ బచావో ఆందోళన్” పేరుతో అర్ధ సైనిక బలగాలు జరుపుతున్న సైనిక చర్యలో భాగంగా జులై 3న పెద్దఎత్తున కూంబింగ్ ఆపరేషన్‌లు ప్రారంభించాయి. అలాంటి సైనిక చర్యలో నారాయణపుర్ జిల్లాలోని ఘమాండీ అడవుల్లో పారామిలిటరీ బలగాలు
నివేదిక

బస్తర్లో మానవ హక్కుల ఉల్లంఘన

గత ఆరు నెలల కాలంలో బస్తర్‌లో భద్రతా దళాలు 150 మందికి పైగా ప్రజలను నిర్భయంగా హత్య చేశాయన్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాన్ని పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ప్రజలందరి దృష్టికి తీసుకురావాలనుకుంటోంది. బస్తర్‌లో మానవహక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న, పియుసిఎల్‌కు చెందిన యువ ఆదివాసీ కార్యకర్త, 26 ఏళ్ల సునీతా పొట్టామి మూల్‌వాసీ బచావో మంచ్ సీనియర్ కార్యకర్త సుర్జు టెకామ్, ఇంకా మరికొంతమందిని వివక్షారహితంగా అరెస్టు చేయడంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది. 2017లో బస్తర్‌లో జరిగిన చట్టాతీత హత్యలపై సునీతా పొట్టాం మైనర్‌గా వున్నప్పుడు మరో కార్యకర్తతో కలిసి సుప్రీంకోర్టులో పిఐఎల్
నివేదిక

సునీతా పొట్టంను ఎందుకు అరెస్ట్ చేశారు ? 

బస్తర్ ఆదివాసీ  హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడితే జైలుకు పంపిస్తారు - ఎందుకని? తమ నీరు, అడవి, భూమిపైన  ఆదివాసులకు  హక్కు వుంది. కానీ అడవి చెట్లను నరికివేయవద్దంటే,  సహజ నదులను కలుషితం చేయవద్దంటే, తమ పూర్వీకుల భూమి నుండి వెళ్లగొట్టడానికి వీల్లేదనిఅంటే  ఆదివాసులను  అభివృద్ధి వ్యతిరేకులని అంటారు. ఈ అభివృద్ధి పథకాలను అమలు చేసేందుకు పోలీసు బలగాల క్రూర ప్రయోగానికి వ్యతిరేకమగా మాట్లాడితే మావోయిస్టులని,  మావోయిస్టుల మద్దతుదారులని  ప్రకటించి ఖైదు చేస్తారు. సునీతా పొట్టం యిందుకు ఒక ఉదాహరణ. ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ ప్రభుత్వమూ, పాలనాయంత్రాంగం దృష్టిలో నేరస్థులేనని ఆమె అరెస్టు స్పష్టం
నివేదిక

కగార్ వ్యతిరేక నిరసనలు

*ఆదివాసులు, ఇతర ప్రజలపై జరుగుతున్న మారణకాండ, అణచివేతలకు వ్యతిరేకంగా విప్లవకర, ప్రజాస్వామిక పార్టీలు, సంస్థలు పంజాబ్ అంతటా జిల్లా స్థాయి నిరసనలు నిర్వహించాయి* ఛత్తీస్‌గఢ్‌లోనూ దేశంలోని వివిధ ప్రాంతాలలోనూ స్వదేశీ, విదేశీ దోపిడీ నుండి జీవనోపాధి, నీరునిఅడవులను, భూమిని రక్షించడానికి పోరాడుతున్న ఆదివాసులు, ఇతర ప్రజలపై పోలీసు ఎన్‌కౌంటర్ల పేరుతో జరుగుతున్న హత్యలు, అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) న్యూ డెమోక్రసీ, ఆర్‌ఎంపిఐ, రివల్యూషనరీ సెంటర్ పంజాబ్‌లు ఈరోజు జలంధర్, కపుర్తల, అమృత్సర్, గురుదాస్‌పూర్, షహీద్ భగత్ సింగ్ నగర్, లూథియానా, మోగా, ఫరీద్‌కోట్, సంగ్రూర్, పాటియాలాలతో సహా
నివేదిక

కగార్ ఆపరేషన్‍నుని లిపివేయాలి

నక్సల్స్ సమస్యను శాంతిభద్రతల సమస్యగా చూసినంత వరకు అమిత్ షా చెప్పినట్లు 2026 మార్చి చివరికే కాకుండా మరో వందేళ్లకు కూడా సమగ్ర పరిష్కారం చేయడం ప్రభుత్వాలకు సాధ్యం కాదనీ, దాన్ని రాజకీయ, ఆర్ధిక, సామాజిక సమస్యగా గుర్తించితేనే సరైన పరిష్కారం లభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఆదివాసీల పై మారణకాండను ఆపాలనీ, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని కోరుతూ వామపక్ష పార్టీలు, హక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13, గురువారం ఉదయం విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిరసన సభ జరిగింది. సిపిఐ ఎంఎల్  న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ అధ్యక్షతన జరిగిన
నివేదిక

అడవిని నరికితే మాకు తిండి ఎలా?

హస్‌దేవ్‌ క్షేత్ర స్థాయి నివేదిక  “వాళ్ళు మెల్లమెల్లగా అడవి మొత్తాన్ని నరికివేస్తే, మేం ఎక్కడికి వెళ్తాం? సంపాదన ఎలా? ఏం తింటాం?” తమ అడవిని కాపాడాలంటూ హరిహరపూర్‌లో ఎంతో కాలంగా జరుగుతున్న నిరసనలో పాల్గొంటున్న హస్‌దేవ్ అరణ్యలోని  ఫతేపూర్‌ గ్రామ నివాసి సంత్‌రా బాయి వేదన ఇది. నగరాల్లో వెలుగునింపడానికి ఆదివాసీల హృదయాలు నివసించే గ్రామాలను నాశనం చేస్తున్నారనేదే సంత్‌రా బాయిని వేధిస్తున్న తీవ్ర  ఆందోళన. వాస్తవానికి, 170,000 హెక్టార్లలో విస్తరించి ఉన్న హస్‌దేవ్ అడవిపైన కార్పోరేట్ చాలా కాలంగా కన్నేసింది. అందులో రెండున్నర లక్షల చెట్లను నరికాల్సి ఉంది. వాటిలో కొన్నింటిని యిప్పటికే నరికేసారు. డిసెంబరులో చలిగాలులు
నివేదిక

మైనింగ్ కోసం పసికందును చంపేస్తారా ? కార్పొరేటీకరణ,  సైనికీకరణ వ్యతిరేక వేదిక నిరసన సభ

బీహార్‌లోని కైమూర్‌లో పులుల అభయారణ్యం  ఏర్పాటుచేయాలనే సాకుతో  ఆదివాసీలను నిర్వాసితులను చేయడానికి, ఛత్తీస్‌గఢ్‌లోని హస్దేవ్ లో  ఆదివాసీ రైతుల భూమిలో చెట్లు నరికివేయడానికి, భూసేకరణకు, వ్యతిరేకంగా 2024 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో 6 నెలల పసికందు హత్యకు వ్యతిరేకంగా 2024 జనవరి 10న, కార్పొరేటీకరణ-సైనికీకరణ వ్యతిరేక వేదిక (ఫోరమ్ ఎగైనెస్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్‌ఎసిఎఎమ్), ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్ ఫ్యాకల్టీలో నిరసన సభను నిర్వహించింది. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాలలో కార్పొరేట్ దోపిడిని మరింత తీవ్రతరం చేయడం కోసం, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాల పేరుతో అనేక పారామిలిటరీ క్యాంపులను  ఏర్పాటు చేసి వేలాది బలగాలను
నివేదిక

హస్‌దేవ్ ఉద్యమకారులపై పోలీసుల దాడి

 ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అడవుల్లో పర్సా బొగ్గు గని కోసం చెట్లను నరికివేయడానికి నిరసన తెలియచేసినందుకు స్థానిక ఆదివాసీ సమాజం మూల్యం చెల్లించాల్సి వచ్చింది. నిరసనకారులపై పోలీసులు పాశవికంగా లాఠీచార్జి చేశారు, ఇందులో హస్‌దేవ్ బచావో సంఘర్ష్ సమితి కార్యకర్త రాంలాల్ కరియం, పలువురు ఆదివాసీలు తీవ్రంగా గాయపడ్డారు.  ఆగ్రహించిన ఆదివాసీ గ్రామస్తులు విల్లులు, బాణాలు, గులేరులతో చెట్ల నరికివేతను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులతో వారు వాగ్వాదానికి దిగడంతో కొంతమంది పోలీసులు కూడా గాయపడినట్లు సమాచారం. తొలుత ఘర్షణల అనంతరం భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య చెట్ల నరికివేతను ప్రారంభించారు.  హస్‌దేవ్ అడవుల్లోని పర్సా బొగ్గు గని కోసం అటవీ-