సంభాషణ

సాహ‌సిక మేధావి, ప‌త్రికా ర‌చ‌యిత న‌ర్మ‌ద‌

రాలిపడుతున్న ప్రతి పువ్వు తన అమరత్వపు గుబాళింపులతో ప్రజల మనసులను ఆవహిస్తుంది ఎగిసిపడుతున్న ప్రతి కన్నీటి చుక్క అమరుల ఆశయాల సాధనకై ఆదేశిస్తున్నది, శాసిస్తున్నది           2022 ఏప్రిల్‌ 9, మహారాష్టలోని గడ్‌ చిరోలీ విప్లవోద్యమ చరిత్రలో మరో విషాదకర దినంగా మిగిలిపోతుంది. ఆ ఉద్యమానికి దాదాపు రెండున్నర దశాబ్దాల కాలం అలుపెరుగని విప్లవ సేవలు అందించి దండకారణ్య విప్లవ ప్రజలు అపార ప్రేమాభిమానాలను చూరగొన్న  కామ్రేడ్‌ నర్మదక్క తుదిశ్వాస విడిచింది.  గత మూడు సంవత్సరాలు గా అనేక తప్పుడు కేసులలో ఇరికించబడి విచారాధీనంలో వున్న 61 సంవత్సరాల  న‌ర్మ‌ద కేన్సర్‌ వ్యాధికి సరైన చికిత్స దొరుకకుండా పోయి,
సంభాషణ

“నీడలు” పెంచిన ఆశలు

(ఇటీవల విరసం సభల్లో ప్రదర్శించిన నాటిక ముందు వెనుకల కళాత్మక అనుభవం ) మొదట్లో నాకు ఈ నాటకం మీద పెద్ద అంచనాలు ఏమి లేవు. ఓ రోజు పాణి గారు నాకు ఫోన్ చేసి  సిటీ యూనిట్ సభ్యులు వరలక్ష్మి గారి కథ "నీడలు" ను నాటకంగా వేద్దామనుకుంటున్నారు . మీతో మాట్లాడతారట " అంటూ ప్రస్తావన తెచ్చాడు. ఆ తర్వాత అనుకున్నట్లే చందు ఫోన్ చేసి" నీడలు "కథను నాటకంగా రాస్తే, యూనిట్ సభ్యులు నాటకం వేస్తారని , మీకు వీలవుతుందేమో చూడమని చెప్పాడు.                                           *** ఆ కథ ను నాకు పంపడం, నేను
ఇంటర్వ్యూ సంభాషణ

 అవును. ఈరోజు యుధ్ధ పరిస్థితి వుంది” – హిమాంశు కుమార్

'ఆసియన్ స్పీక్స్' , 'అరోరా ఆన్‌లైన్' కోసం రెజాజ్ ఎం షీబా సిదీక్ 2022 ఆగస్టు 26న గాంధేయవాది, మానవ హక్కుల కార్యకర్త హిమాంశు కుమార్‌ను ఎర్నాకులంలో ఇంటర్వ్యూ చేశారు. యుఏ(పి)ఏకి వ్యతిరేకంగా జరిగిన మానవహక్కుల సదస్సులో ప్రసంగించేందుకు హిమాంశు కుమార్ కేరళకు వచ్చారు.  సుమారు ఒక గంటసేపు జరిగిన సంభాషణలో హిమాంశు భగత్ సింగ్ మాటలను ప్రతిధ్వనించారు, “భారతదేశ శ్రామిక ప్రజానీకాన్ని, సహజ వనరులను కొన్ని పరాన్నజీవులు దోపిడీ చేస్తున్నంత కాలం యుద్ధస్థితి ఉనికిలో ఉంది, ఉంటుంది. వారు పూర్తిగా బ్రిటిష్ పెట్టుబడిదారులు లేదా మిశ్రణ బ్రిటీష్-ఇండియన్ లేదా పూర్తిగా భారతీయులు కావచ్చు”.  గోంపాడ్ ఊచకోతపై స్వతంత్ర దర్యాప్తును కోరినందుకు
సంభాషణ

ఇల్లు వర్సెస్ రోడ్డు

“ఇల్లు ఖాళీ చేసినప్పుడు…” ఈ కవిత 88 లో అచ్చుకి దిగింది. కరీంనగర్ పల్లెటూళ్ళలో ఎక్కడో పడివున్న నా మొహం మీకు చూపించింది. కాబట్టి దాని పట్ల నాకు వల్లమాలిన అమ్మతనం లాంటిదేదో వుంది.అసలు అందులో ఏం ఉంది? నన్ను దాచిపెట్టిన నాలుగ్గోడలు , వాటిమీద పెంచుకున్న ప్రేమ ప్లస్ కోపం, రాసుకున్న నిట్టూర్పులు , ఇంతే కదా. “పట్టా మార్చిన పడక్కుర్చీలా, నే వున్న ఇల్లు \ కొత్త శరీరం కోసం ఎదురుచుస్తు౦ది\భయానికీ ఓటమికీ , ఎడారితనానికీ మీసాలు దిద్ది హుందాగా కనిపి౦చేందుకు \ కరడు కట్టిన స్వార్ధానికి పురి విప్పిన అసూయకీ తెల్లటి చొక్కా తొడిగి
సంభాషణ

జైలు జీవితపు భయంకర వాస్తవాలు

నిరాకర్ నాయక్ — వాస్తవిక కథనం నేను -2011 నుండి 2015 వరకు, సుమారుగా మూడున్నరేళ్లు, 'దేశద్రోహ' తప్పుడు ఆరోపణల కింద వేర్వేరు జైళ్లలో మొదట సోర్డా సబ్-జైలులో, తర్వాత బ్రహ్మపూర్ సర్కిల్ జైలులో, ఆ తరువాత ఒడిశాలోని భంజానగర్ స్పెషల్ సబ్-జైలులో ఉన్నాను. ఎనిమిదేళ్ల నాటి పూర్తిగా తప్పుడు, కల్పిత కేసుకు సంబంధించి నన్ను రెండవసారి 2019లో మళ్లీ అరెస్టు చేసి మరో ఏడాదిన్నర పాటు సొరాడ, భంజానగర్ జైళ్లలో ఉంచారు. నేను ఇప్పుడు బెయిల్‌పై ఉన్నాను. నాపై దాఖలైన మొత్తం పది కేసుల్లో మూడింటిలో నేను నిర్దోషిగా విడుదలయ్యాను, మిగిలిన ఏడు కేసులు విచారణలో ఉన్నాయి.
సంభాషణ

పులి

"సార్ అతను చచ్చిపోయేట్టు వున్నాడు. మనం కొట్టిన దెబ్బలకు అతను స్పృహ తప్పి పడిపోయాడు సార్" కానిస్టేబుల్ పరాంకుశం కంగారు మాటలకి డి.ఎస్.పి వజేరా చిరాకుగా మొహం పెట్టాడు.2 డిసెంబర్ 2002, సోమవారం మధ్యాహ్నం 3:45 కు, బిజీగా ఉన్న ముంబై దగ్గరి ఘాట్కోపర్ స్టేషన్ సమీపంలో బస్సు సీటు కింద గుర్తు తెలియని వ్యక్తులు ఉంచిన బాంబు పేలింది. బస్సు వెనుక భాగంలో బాంబు ఉంచారు. ఈ పేలుళ్లలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. 50మందికి పైగా గాయపడ్డారు. ఘట్కోపర్ చివరి స్టాప్ కావడంతో, బస్సులోని ప్రయాణికులందరూ అప్పటికే దిగిపోయారు. తిరుగు ప్రయాణానికి ప్రయాణికులు ఇంకా బస్సులోకి ప్రవేశించలేదు.
సంభాషణ

పూచిన చెట్టుకిందనే రాలిన పువ్వు

చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. నాలుగు సంవత్సరాలుగా కాన్సర్ వ్యాధి పీడితురాలైన నిర్మల, ఆ చికిత్స కోసం హైదరాబాదు వచ్చి ఉన్న సందర్భంలో 2019 లో అరెస్టయింది. బొంబాయిలోని బైకుల్లా జైలులో కరోనా రెండు సంవత్సరాలూ సరైన చికిత్స కూడా అందక కాన్సర్ వ్యాధి ముదిరిపోయి, అనేక అవయవాలకు వ్యాపించింది. ఇక కొద్ది నెలల కన్న ఎక్కువ బతకదని వైద్యులు చెప్పిన తర్వాత, బొంబాయి హైకోర్టు ఆదేశం మేరకు ఆమెను జైలు నుంచి, హాస్పైస్ (చికిత్స కూడా అవసరం లేని స్థితికి చేరినవారిని
సంభాషణ

ప్రభాతభేరి

మమతలు కరిగి మానవత్వం మసకబారుతున్నప్పుడు మనుసును ఏదో చీకటి పురుగు కొరికిన బాధ.కనుల ముందటి మనుషులు ఉన్మాద ప్రతీకలుగా  మారుతున్నప్పుడు గుండె పుండవుతోంది.ఉక్కిరిబిక్కిరై ఊపిరి సలపదు.ఏటి ఊట చెలిమెలా గొంతుతడిపిన మనుషులూ బీటలువారిన ర్యాగడిలా బిర్రబిగిసి పోతున్న కాలం.భయం పురుగు కరిసి మాటలురాక మ్రన్పడినట్లనిపిస్తోంది.హరితవనం మధ్యనున్నా ఆకులురాలిన మోడులమధ్యున్నట్లనిపిస్తోంది.మనుషులు మాట్లాడుకుంటున్న మార్కెట్ సక్సెస్ మంత్రాలు కనపడని రేసులు తోడేళ్లు కొండ్రగాళ్ల ఊళ్లాలనిస్తున్నయ్. ఆకురాలిన కాలంలో మండుటెండలను ధిక్కరిస్తూ చిగురించే పూసుగుమానుల ఊసులినాలన్పిస్తోంది.వడగాడ్పులను వెక్కిస్తూ ఎదిగే ఇప్పవనాల లేతాకుల ఎరుపు చూడాలనిపిస్తోంది. పట్టపగలు మిట్టమధ్యాహ్నం నీరవ కమ్మిన నిషిని తలపిస్తున్నప్పుడూ జలపాతహోరునలుముకున్న  వెలుగువెన్నెల ఎంత అద్భుతం. భయం కమురువాసన మధ్య
సంభాషణ

నిషేధంపై విరసం అభ్యంతర పత్రం

5.5. 2021టు సోమేష్ కుమార్‌ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,తెలంగాణ ప్రభుత్వం,హైదరాబాదు.ఫ్రంఅరసవెల్లి క్రిష్ణఅధ్యక్షుడువిప్లవ రచయితల సంఘం6-1-\16-7ఎ\1పెద్దిరాజు స్ట్రీట్ పైజర్ పేటవిజయవాడ-1520001విషయం: జీవో ఎంస్ నెం. 73, తేదీ 80.3.2021, జనరల్ అడ్మినిష్ట్రేష‌న్‌ (ఎస్పిఎల్డి)శాఖ-తెలంగాణప్రజా భద్రతా చట్టం-1992- విప్లవ రచయితల సంఘాన్ని చట్ట వ్యతిరేక సంస్థగా ప్రకటించడం, దానిపై విరసం అభ్యంతరం,సమాధానం. రెఫరెన్స్: 1. దిన పత్రికలకు 28. 4. 2021నాడు ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంస్ 73. 2.ఆంధ్రజ్యోతి దిన పత్రిక, తేదీ: 2442021, పేజీ 1,3. 3.తెలంగాణ ప్రజా భద్రతా చట్టం, 1992పైన ఉదహరించిన రెఫరెన్స్ 3 ప్రకారం ప్రభుత్వం ఒక సంస్థను చట్ట వ్యతిరేకమని పత్రికల్లో ప్రకటన
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

*మీలా బ‌త‌క‌డం మీకే సాధ్యం*

మాష్టారూ‌ మీరూ అబద్ధాలాడతారని అనుకోలేదు. 'వందేళ్ళుంటాను ..ఈ వందేళ్ళూ కథకి, కథానిలయానికి చెయ్యాల్సిన పనులున్నాయి అవి పూర్తిచెయ్యాలి'  అని‌ మాటిచ్చి  ఇలా చెప్పాపెట్టకుండా వెళ్ళిపోవడం ఏమైనా బాగుందా? మీరూ మోసం చెయ్య‌గలరా ? మీ మాటమీద నమ్మకంతో మేం ధైర్యంగా ఉంటే కూతుర్ని మాత్రం రప్పించుకుని మాకు చెప్పకుండా  అర్థాంతరంగా వెళ్ళిపోవడం మోసం కాదా మాష్టారూ. మీరు ఆడినమాట తప్పుతారని కలలో కూడా అనుకోలేదు. ప్రతి ఏడాదీ ఫిబ్రవరి రెండో శని,ఆదివారాలు కథానిలయం వార్షికోత్సవాలు జరుగుతాయని, ఆ రెండురోజులూ అదొక సాహిత్యోత్సవంగా జరగుతుందని, దేశవిదేశాల నుండి కథాభిమానులు వస్తారని ముందురోజే రాకపోతే ఊరుకునేది లేదని ఎన్నన్నారు..మూడేళ్ళుగా ఆ సందడే