సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష
సాహిత్యం వ్యాసాలు

కాకోరి నుండి నక్సల్బరి దాకా ….

ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని
సాహిత్యం కవిత్వం

కాలం తొంగి చూస్తోంది

లిప్తలన్నిటినీ కొలిచిధాన్యపు గాజకు పోద్దాం యీ రెణ్ణెల్లలోఒక్క నీటిగింజమిగిలితే నీమీదొట్టు ఆగడానికే ముందక్కడ?జల్లలో మిగలడానికి చేపలా అవి!కారిపోయే కన్నీరేకదాచివరకుమన దోసిట్లో మిగిలింది    ***   ***    ****కాలం నిన్నూ నన్నూ గమనిస్తోంది ఆసుపత్రుల్లో నవజాత శిశువుల కేరింతలు లేవునదుల్లో సృష్టినిమోసే జీవమూ లేదుపీక్కుతినేయగా మిగిలిన అస్తుల లెక్కనీవో, నేనో అప్పజెప్పాలి రాజూ లేడు..మంత్రీ లేడూ పూచీపడడానికిరాజ్యం పేరున సరిహద్దులు మాత్రమే వున్నాయిఅక్కడా మానవ హననమేపేరు ఎదయితేనేం?న్యాయంలేదు అడ్డుపడడానికిచట్టం పేరున సంకెలలు మాత్రమే వున్నాయిఅక్కడ నిండా మోసమే!***     ***      ***తర్కించుకొని తడిమిచూసుకుందామా కాసేపులిప్త కాలమైనా చాలులే! అగ్నిధారలై  ఏళ్లుగా కలసి ప్రవహించిన మనంఎప్పుడు  విడిపోయాం!కలవలేనన్ని పాయలుగా మత మానవులుగాస్త్రీలుగా , పురుషులుగాకులాలుగా,
సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం
సాహిత్యం కవిత్వం

చేవ

నాకు కావాల్సిందివేరు నెత్తురులో ఇంకిపోయిన సముద్రంఇక్కడ నుంచుంటే అక్కడ రాలిపడే ఆకుల చర్మం కాదుమూలాల్లోకి ఇంకా ఇంకా నడవాల్సిన బాకీఎప్పుడూ వెంటాడుతుందిమట్టి తన గుట్టు విప్పమని పిలుస్తుందిగుండెల నిండా పర్వతాల్ని మోస్తూ పరుగులు పెట్టే వెర్రి వాగులుకొరడాలై కొడుతూ ఉంటాయ్పూర్తికాని ఇల్లూ తెరవలేని తలుపులూ తెల్లారేసరికిఎజెండాలను దండే నికి తగిలిస్తాయ్ ఇటుపక్క ఎండ నిప్పులు చిమ్ముతుంటేఅటుపక్కకు తిరిగే అడవి నోటినిండా పాఠాలేఒంగిపోయారా లొంగిపోయారా మొసళ్ళ పళ్ళు తోమారామృగాల వళ్ళు పట్టారా లేక తోడేలునూ మేకనూ కలిపిఒకే వేటుకు నరికారా తరవాతి విషయం తరతరాలుగా కనురెప్పల కింద వణుకుతున్నకన్నీటి వంతెన మీద నడుస్తూ ఎప్పటికప్పుడు పైకప్పులువిరిగిపడుతున్నా తట్టుకొని నిలబడే అడుగు
సాహిత్యం కవిత్వం

కాసిన్ని అక్షరాలివ్వండి

ఒక కఠోర వాస్తవం రాయాలి చెయ్యందించరూ గొప్ప కవిత రాయలి అక్షరాలు అరువివ్వరూ ఎక్కడో పొంగిన రోహింగ్యాల రోదనలు కాదు అక్కడెక్కడో తాలిబన్ల ఉన్మాదం కాదు భారతీయ తాలిబన్లు చేసే అత్యాచారానంతర పాశవిక హత్యలు,  రక్షక భటుల రక్షణలో అర్ధరాత్రి శవదహనాలు, రైతుల మీదుగా నడిపే రథాల విన్యాసాలు, అదేమని అడిగే గొంతుల్లోకి ఉపాలు, కోరెగాం కోరలు,  అబ్బసొమ్మేదో అమ్ముకున్నట్లు ప్రజల ఆస్తుల, హక్కుల అమ్మకాలు,  అన్నిటినీ నిలేసి అడగాలని వుంది  ఆవేదనకు పదాలు చాలకున్నాయి.. అక్షరాల సేద్యం చేసేవరకూ ఎవరన్నా కొన్ని తాలక్షరాలో, పొల్లక్షరాలో ఇచ్చి ఆదుకోరూ
సాహిత్యం కవిత్వం

వాళ్ళు ముగ్గురు

వాళ్ళు ముగ్గురే అనుకునివాళ్ళని లేకుండా చేస్తేఇంకేమీ మిగలదనివిషం పెట్టిచిత్రహింసలకు గురిచేసికొయ్యూరు అడవుల్లోహతమార్చిసంబరాలు చేసుకున్నావు కానీ ఆ చిత్రహింసలకొలిమిలోంచిఫీనిక్స్ పక్షిలావేలాదిమంది సాయుధప్రజా విముక్తి సైన్యంపుట్టుకొచ్చింది నువ్వో కాగితప్పులవనిరుజువయిందిస్పార్టకస్ నుండిదండకారణ్య ఆదివాసీ వరకునెత్తుటి పుటలలోంచిమరల మరలవిముక్తి నినాదంవినబడుతూనే వుంది అమరత్వం పొత్తికడపులోంచిఉద్యమ నెల వంకలుఉదయిస్తూనే వుంటారు శ్యాం మహేష్ మురళీఅమర్ రహే అమర్ రహే
సాహిత్యం కవిత్వం

మానవత్వం చంపబడుతోంది

మానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి సోంతలాభం కోంతమానిపోరుగువారికి తోడ్పడవోయ్గీసుకున్న దేశభక్తి గీతదాటిఅడుగు ముందుకేసిసోంతలాభం అసలే వద్దుప్రజలకోరకే తన ప్రాణమంటుమానవత్వం శిఖరమెక్కినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి అన్నం రాశులు ఒకచోటఆకలి మంటలు ఒకచోటవ్యత్యాసాల ఎత్తుపల్లాలు ఆర్పడానికినాలుగడుగులు ముందుకేసిఅన్నం రాశులు ఆకలి సంచులు నింపినమనిషి చంపబడ్డాడుమానవత్వం చంపబడుతోందిమాట్లాడుకుందాం రండి నెత్తురు మండే శక్తులు నిండేసైనికులారా రారండిపిడికిట్లో నినాదం పిడుగులు పట్టుకొనిమరో నాలుగడుగులు ముందుకే నడిచికోయ్యూరు నండి కోయ్యూరు దాకజనం అలజడి నాడిస్టెతస్కోప్ చేతులతో పట్టినమరో ప్రపంచపు నూతన మానవుడుమానవత్వం నాటుకుంటూ వస్తున్నమనిషిని చంపేశారు రండి చంపబడ్డ మానవత్వాన్ని పిడికిళ్ళ నిండా మనిషింత తెచ్చుకుందాం
కథలు సాహిత్యం

అమ్మ పాటల పుస్తకం

సాయంకాలం సిస్టం షెడౌన్‌ చేస్తూ ఆఫీసుకు అన్నం డబ్బా, నీళ్ల బాటిల్‌ తీసుకొని  లేచాను. గ్రిల్‌ తలుపు ఒకటి తీశాను. ఓరగానే. ఇంకాపూర్తిగా తెరవలేదు. బైటి గేటు తీసుకొని వచ్చి వాళ్లు  జొరబడ్డారు. గ్రిల్‌ రెండు తలుపులు బార్లా తీసుకొని వచ్చేశారు. పదిహేను మంది ఉంటారేమో.    వాళ్లలో ఒకాయన తాము ఎవరో చెప్పుకున్నాడు. ఇంకో ఆయన మెడలోని  రాజముద్ర చూపుకున్నాడు. నేను కంగారు పడుతున్నాననుకొని ‘మీరు కూచోండి.. కూచోండి’ అని సిస్టం ముందున్న కుర్చీని ఇటు తిప్పారు.    నేను ఫ్యాన్‌ స్విచ్‌ వేస్తూ ‘మీరు వస్తారని అనుకుంటూనే ఉన్నా’ అన్నాను.    ఒకాయన ఒకింత చిన్నగా నవ్వాడు.    ‘ఎలా అనుకున్నారు?
కథలు సాహిత్యం

సమరంలో సంబరాలు

విపరీతమైన వర్షం కురుస్తోంది. చుట్టూ చిమ్మ చీకట్ల కమ్ముకున్నాయి. ఎటూ దారి కానరావడం లేదు. ఎదురుగా ఉన్న మనుషుల ఆకారాలు కూడా స్పష్టంగా అగుపడడం లేదు. ఆ వర్షం మధ్యనే కంపెనీ నడక సాగిస్తోంది. అయితే, దారి కానరాని పెద్దలు చేతి రుమాలు అడ్డం పెట్టుకొని లైటు వెలుతుర్లు ఎక్కువ దూరం వెళ్లకుండా అనివార్యంగా లైటు వినియోగిస్తూ తడుముకుంటూ తమ గార్డుల స‌హాయంతో నడుస్తున్నారు. గెరిల్లాలు తమ ప్రయాణం ఎవరికీ అర్ధం కాకుండా ఉండడానికి సాధారణంగా ఊర్లు తగులకుండానే వెళ్తుంటారు. కానీ, వర్షంతో రాత్రి దారి తప్పితే తెల్లవారి ఎదురయ్యే ప్రమాదాలు ఆలోచించిన కమాండర్ ఊరి మధ్యలో నుండే