అపార్థాలను చెదరగొట్టిన కథ
ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి కథ తాగునీటి సమస్య చుట్టూ నడుస్తుంది. సారాంశంలో కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం పడే తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు నీటిని సరఫరా చేయడం