కథలు హస్బెండ్ స్టిచ్ - 3 సాహిత్యం

మాట్లాడు!!

నువ్వు నాతో మాట్లాడు ఈ ప్రపంచాన్నంతా పక్కన నెట్టేసి వింటాను నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు ఈ ప్రపంచాన్నంతా నీలోనే చూసుకుంటాను మాట్లాడు... మాట్లాడు స్నేహితుడిలా... ప్రేమికుడిలా... సహచరుడిలా రోజూ నన్ను పలకరించే తోటలోని గువ్వలా... మాట్లాడు... మాట్లాడు - స్వర “ఏమిటీ మెస్సేజీలు చెత్త కాకపోతే... ఏం మాట్లాడాలి నీతో? పని చేస్కోనీవా...?” కోపపు ఎమోజీ ఎర్రగా... చిరాగ్గా కార్తీక్ నుంచి. స్వర కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ లేవా తమ మధ్య మాటలు...? పంచుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి తెలపాల్సినవి... రోజూ చూసుకునే ఇద్దరి మనుషుల మధ్య... సహచరుల మధ్య? ఈ సంభాషణ లేని జీవితం ఏమిటి? ఈ
సాహిత్యం కథావరణం కాలమ్స్

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
సాహిత్యం వ్యాసాలు

సృజనాత్మకత‌ను నిషేధించగలరా?

యాభై సంవత్స‌రాల నుండి విరసం వైభవంగా వెలుగుతోంది. ఐతే ఆ ప్రయాణం సాఫీగా లేదు.చాల కష్టాలొచ్చాయి.నిర్బంధాలు  పెరిగాయి. కాని విరసం స్థిరంగా నిలిచింది. ఈ నిషేధం మొదటిదీ చివరిదీ కాదు. అసలు సృజనాత్మక‌త‌ని ఎవరైనా నిషేధించగలరా? అసలు నిషేధించాల్సిన అవసరం ఉందా..? చరిత్రలోకి పొతే సాహిత్యం మీద నిషేధం రకరకాల రూపాల్లో అమలుపరిచారు. సెక్స్ గురించి, రాజ్యం గురించి వ్యతిరేకంగా గొంతు విప్పితే నిర్బంధం అమలు చేసారు. చార్వాక సాహిత్యాన్ని నాశనం చేసారు. దీనిలో బ్రాహ్మణిజం ముఖ్య పాత్ర వహించింది. దేశంలో ఫాసిజం ప్రజల గొంతుల మీద ఉక్కుపాదం మోపుతున్నది. అన్ని ప్రజాస్వామిక సంస్థలని నాశనం చేస్తున్నది. ఇది
సాహిత్యం కథావరణం

” రైతుకు పనే  ప్రపంచం.రైతు పనిముట్లు కూడా అతడి కుటుంబ సభ్యులే  “

వ్యవసాయం ఆధారం చేసుకుని మనుషుల్ని పల్లెల్ని చిత్రీకరించిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒక జ్ఞాపకంగా మారిపోయింది. వ్యవసాయం అనేది వర్తమానానికి కాక గతానికి సంబంధించిన విషయంగా భావిస్తున్నారు కొందరు ఆధునికులు . అంతగా వ్యవసాయం కనుమరుగవుతూ వస్తున్నది. అయినా రైతులు రాజీ పడకుండా, జీవన పోరాటం చేస్తూనే ఉన్నారు రైతుకు బాసటగా తెలుగు కథకులు ఆది నుండి నిలబడ్డారు. అనంతపురం లాంటి రాయలసీమ జిల్లాల్లో రైతు పక్షం వహించిన రచయితలు పాదయాత్రలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. నిరసన కార్యక్రమాల్లో, ఉద్యమాల్లో రైతులతో పాటు పాల్గొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం రాయడం
సాహిత్యం వ్యాసాలు

అమ‌రక‌వి యోధుడి డైరీ..

( పాతికేళ్ళు నిండకుండానే  విప్ల‌వ క‌వి కా. ఎంఎస్ ఆర్ బూటకపు ఎన్ కౌంటర్లో  సెప్టెంబర్ 3, 1992న అమ‌రుడ‌య్యాడు. ఆయ‌న ర‌చ‌న‌లు  "కాగడాగా వెలిగిన క్షణం" పేరుతో   నవంబర్ 1992 లో అచ్చ‌య్యాయి. ఇందులో ఆయ‌న డైరీ   కూడా భాగమైంది.    చేగువేరా , భగత్ సింగ్ డైరీల‌తో పోల్చ‌ద‌గిన‌ది ఇది. చిన్న‌వ‌య‌సులోనే  ఎంఎస్ ఆర్ త‌న  భావ‌నాశ‌క్తితో విప్ల‌వ క‌విత్వాన్ని అజ‌రామ‌రం చేశాడు. ఇప్ప‌డు మీరు చ‌దువబోయేది ఆయ‌న పుస్త‌కానికి ముందు  *క్షమాపణ కోరుతూ...*  అని అచ్చ‌యిన ఆయ‌న డైరీ ర‌చ‌న‌. ఆయ‌న వ‌ర్ధంతి సంద‌ర్భంగా పున‌ర్ముద్ర‌ణ‌... వ‌సంత‌మేఘం టీం)  క్షమాపణ కోరుతూ... సూర్యునితోపాటు  మేల్కొన్నాను.
ఎరుకల కథలు

ఏనుగుల రాజ్యంలో

ఊరు మొత్తం  ఒక్కసారిగా  ఉలిక్కిపడింది. ఏనుగులు అడవి దాటి సరాసరి కోటూరు వద్ద పొలాల్లోకి వచ్చేసాయి.ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలీదు.  ఎవరూ సరిగ్గా చూడలేదు. అంత సమయం లేదు. పొలాల్లో అక్కడక్కడా  పనులు చేసుకుంటున్న రైతులు అందరూ  పలుగూ పారా కత్తీ, కొడవలి,  తట్టాబుట్టా ఎక్కడవి అక్కడే పడేసి కేకలు పెట్టుకుంటూ ఒకర్ని ఒకరు హెచ్చరించుకుంటూ పరుగుపరుగున ఊర్లోకి వచ్చేశారు. “ ఏనుగులు వచ్చేసాయి, ఏనుగులంట.. గుంపులు గుంపులుగా వచ్చేసాయంట ..” “ ఈ రోజు ఎవురికి మూడిందో ఏమో .. ఎవరి  పంటలు తినేసి, తొక్కేసి పోతాయో  ఏమో ? “  “ముండా ఏనుగులు, మిడిమాలం ఏనుగులు
సాహిత్యం వ్యాసాలు

రాజ్యం సృజ‌నాత్మ‌క‌త‌కు వ్య‌తిరేకి

సవ్యసాచిదేవ్     కవి, రచయిత, విమర్శకుడు ఇప్పుడు నేను చెప్పేది కొత్త కాదు.సృజనాత్మకత‌ అంటే కొత్తది, ప్రగతిశీలకమైనది. దానికి  రాజ్యం వ్య‌తిరేకి. రాజ్యం ఎల్ల‌ప్ప‌డు సృజ‌నాత్మ‌క‌త‌ను  వ్యతిరేకిస్తది. అది పోలీసు , అధికార యంత్రాంగం ద్వారా నిషేధం తెస్తుంది. చరిత్రను వెనక్కి తిప్పే ప్రయత్నం జరుగుతుంది. ఉపన్యాసాలు, పుస్తకాలు, సామాజిక మాధ్య‌మాలను బాగా వాడుకొని పాత కాలమే బావుంటదని చెప్తారు. నాజీల లాగ ప్రజాస్వామ్య గొంతుల్ని వినరు. తమకు మద్దతుగా ప్రజలని కూడగడుతారు. అంతిమంగా తామే ప్రజాస్వామ్య వాదులమని చెప్పుకుంటారు.హిందువులు కానీ వారిపై దాడి చేస్తారు. వ్యక్తిగత విషయాలపై బురద చల్లుతారు. కాంగ్రెస్ కాలం లో తమను బాహాటంగా
సాహిత్యం సమీక్షలు

చీకటి నుండి వెలుగు దాకా….

మనం ఇక్కడి దాకా ఎలా చేరుకున్నాం. ఈ చేరుకు దారితీసిన భౌగోళిన, భౌతిక పరిస్థితులకు ఉన్న కార్యాకారణ సంబంధమేమిటి? నూత్న భారతదేశ నిర్మాణంలో భాగమయిన శ్రామికవర్గ సంస్కృతిని ధ్వంసం చేసి మతరాజ్యంగా భారత సమాజం నిర్మిత మవుతున్న చారిత్రక దశను, ఈ కాలంలో జరిగిన, అనేక చారిత్రక అంశాలను, ముఖ్యంగా మతరాజకీయాులను బహు పార్య్వాలలో ఆకార్‌ పటేల్‌ రచన మన 'హైందవరాజ్యం పరిచయం చేసింది. ఒక కాలానికి, భారత పాలకవర్గాల మతసంస్కృతికి, సంబంధించిన విషయం మాత్రమే కాదు. భారత ప్రజాస్వామ్యం మతాంతీకరణ వైపు అడుగులు వేయడానికి బీజాలు పడుతున్నాయనే విషయం తేటతెల్లమవుతున్నప్పుడు, ఇప్పుడున్న భారతదేశంలోని అల్ప్బసంఖ్యాకుల జీవనభద్రత ప్రమాదంలో
కొత్త పుస్తకం సాహిత్యం

లందల్ల ఎగసిన రగల్‌ జెండా… సలంద్ర

అతడు యిందూరు లందల్లో ఉదయించిన తొలిపొద్దు. వెలి బతుకుల్ని ప్రేమించిన ఎన్నెల కోన. దోపిడీ, పీడన, అణచివేత, వివక్షల నుంచి విముక్తి దారిని కలగన్న స్వాప్నికుడు. నిప్పుల పాటల డప్పై మోగిన ధిక్కార గీతం. మతోన్మాద ఆగడాలపై కాగడాలా రగిలిన రాడికల్‌ రగల్‌ జెండా. అతడు ఉస్మానియా శిగన మెరిసిన మోదుగు పూవు. అక్షరాల్ని ప్రేమించి అగ్నిపర్వతాల్ని రాజేసిన తుడుం మోతల యుద్ధగీతం. హోరెత్తే రేరేలా పాటల్లో ఆదిమ గానం. అతడు విప్లవ కవి సలంద్ర. కవి, రచయిత, జర్నలిస్టు, విప్లవకారుడు. ఎక్కడి యిందూరు!. ఎక్కడి హైదరాబాద్‌!. దారి పొడవునా నెర్రెలు వారిన బీళ్లను గుండెలకు హత్తుకున్నాడు. గుక్కెడు
సాహిత్యం సమీక్షలు

జీవన లాలస – పాఠకుడి నోట్సు

1998లో అనుకుంటాను గోదావరిఖనిలో కథల వర్కు షాప్ జరిగింది. అల్లంరాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, వారాల ఆనంద్ గార్ల పూనికతో. వర్క్ షాపు అయ్యాక బొగ్గుబాయిలు చూడటానికి పోయాము అందరమూ. పాత అండర్‌గ్రౌండ్ మైనింగ్‌తో పాటు అప్పుడప్పుడే ఓపెన్ కాస్ట్ తవ్వకాలూ మొదలయిన కాలం అది. ఒక కొండను మించివున్న పేద్ద పేద్ద యంత్రభూతాలు నిజంగానే భయపెట్టాయి. నేను, రాప్తాడు గోపాలకృష్ణ, పాణీ బొగ్గు బాయిలను చూడటం అదే మొదటిసారి. లోపల భరించలేని వేడి, ఉక్కపోత, పేద్ద ఫ్యాన్లు పెట్టి గాలి లోపలికి తోలుతున్నా అది సగదూరం కూడా పోదు. ఆకు అల్లాడిన గాలికూడా రాదు. అతి తక్కువ ఆక్సిజనే