కథలు అల‌నాటి క‌థ‌

పోలీసు దాడి

పొలుమారు మీద కూలీకి పోయినోళ్ళు అడుగుల్లో అడుగులేస్తూ ఇల్లకు జేరుతున్నరు. ఊల్లే సాగల్లు తిరుగుతున్నరు. లచ్చవ్వ ఆయిల్ల గాసం కోసం పొయికింద కయితే ముండ్లకంప ఏరుకచ్చింది. పొయిమీద సంగతి యాదికచ్చేటాల్లకు గుండెల్ల రాయి పడ్డట్టయింది. పొద్దున్నే సోలెడు గట్కకోసం మాదిగిండ్లన్నీ తిరిగింది యాదికచ్చేటాల్లకు ఉన్న పాణం తుస్సు మన్నది. ‘‘కూలీకి పోయినకాడ పటేలు కూలిత్త డనుకుంటే నాలుగురోజులు ఆగల్నన్నడు, కూలోల్ల ఇండ్లల్ల మనులు మాన్యాలున్నట్టు. పూటగాసపోల్లం కూలియ్యమని పట్టుపడితే కావురాలచ్చినయని ఎగిరెగిరిపడ్డడు. మొన్నటిదాక సంఘం మాటని సెప్పినట్టిన్నరు. ఇప్పుడు పోలీసోళ్ళ బిప్రి జూసుకుని మల్ల సాగిచ్చుకుంటాండు’’ తనలోనే అనుకుంటా కాళ్ళు కడుక్కొని ఇంట్లకు వోయింది లచ్చవ్వ. ‘‘ఈ దిక్కుమాల్ల
సాహిత్యం కవిత్వం

బాల్యమే సరికొత్త ప్రపంచం

మహా రంగస్థలం అదొక మహారంగస్థలంసజీవ రసాయన సమ్మేళనంసామాన్యుల అసాధారణ రంగస్థలంఏ నాట్యాచార్యులు నేర్పని మెలుకువలువేకువ నేర్పని కువకువలుసానుభూతి పవనాలు వీచేది అక్కడేకోపోద్రిక్తులయ్యేది అక్కడేఏ ఇంట్లో అల్లు డు గిల్లాడోఏ కొత్త కోడలు ఎపుడు నిద్ర లేచిందో తెలి సేది అక్కడేసిగపట్లు, తలంట్లుబొబ్బట్లు, ఉడుంపట్లు, తలరాతలపై ముఖ ప్రదర్శనలు అక్కడేఎవరు ఎక్కడ నోరుజారారోతేలిపోయే ది అక్కడేబిందెలదరువు, గానకచ్చేరిఅక్కడే, అదొక మహా రణస్థలంతాగి తెగ వాగేవాడితాట తీసే ధ్వంసరచన చేసేది అక్కడేరకరకాలముఖ భంగిమలు, హావాభావాలు…అదొక మహా రంగస్థలం…… 2. కాసిన్ని ఊసులు అరెరె పెద్దోడా,చిన్నోడా, బుజ్జోడా బలే గురి పెట్టారు రా బాబుల్లారనా చిన్నారి బాలల్లారజీవితమే వేట అయిన చోటమీతో కొన్ని
సాహిత్యం కవిత్వం

విలక్షణ యుద్ధంలోకి..!!

ఇది పోయే కాలం కదా..ఇది పోగొట్టుకునే కాలం కదా.. అయిన వాళ్ళనూ..అంటుగట్టుకున్నోళ్ళనూ.. జ్ఞాపకాల సీసాలోకిమనసు గాయాలు మాన్పేఅమ్మఒడి స్పర్శగాతర్జుమా చేసుకునిఔషధంలా ఒంపుకునిబిరడా బిగించుకునిబరిగీసుకు బతుకుతున్నదినిజమే కానీ.. ఆస్తులో ఆత్మాభిమానాలోహోరెత్తిన హోదాలో..అందలాలో.. ఆలింగనాలో.. బంపర్ ఆఫర్లుగాకలిసొచ్చినకలసొచ్చిన వైరల్ రుతువులో..క్లియరెన్సు సేల్ ధమాకాలో.. ఒడిసి పట్టిననెత్తుటి త్యాగాల గద్దెలుతాకట్టు పెట్టినదగుల్బాజీ తనమా..?? ఏమైందనీఏమైపోయిదనీఇప్పుడెందుకీతలపోతంతంటావా.. వీళ్లంతానావాళ్ళనుకున్న నమ్మకం.. వీళ్ళుమాత్రమేనావాళ్ళనుకున్న భ్రమాతేలిపోయిందిప్పుడు..మనసు తేటబారిందిప్పుడు.. కురిసే మబ్బులకరచాలనం కోసంవొళ్ళంతా చిట్లినబిడ్డల నెత్తుటి చారలుత్యాగాలు తలకెత్తుకుని.. తలదాచుకునే మట్టిగోడలన్నీఎర్రమన్ను అలికితెల్లని ఆశలు విరబూసేసఫేదు సున్నపు ఛీటాల్లో.. హరివిల్లై విరబూసేహరియాలీలను దర్శిస్తూ.. మా అమ్మీలు పాడేచెక్కు చెదరని ఆశలమొహరం మాథంవిషాద గీతాలు భుజంమీద చెయ్యేసినన్నెప్పుడూఓదారుస్తుంటాయి.. ఆకురాలు కాలంఅడవి లేని
సాహిత్యం వ్యాసాలు

పోడు భూముల స‌మ‌స్య‌కు ఇదీ ప‌రిష్కారం

ఆదివాసీల అభివృద్ధికి, హక్కుల రక్షణ కొరకు రాజ్యాంగంలో పొందుపర్చిన ఐదవ షెడ్యూలు, ఆరవ "షెడ్యూలు - వీటి వెలుగులో ప్రత్యేకంగా తీసుకొచ్చిన పెసా చట్టం, 1/70 చట్టం ఆచరణలో నీరుగారిపోయిన ఫలితమే నేటి ఆదివాసీల దుర్భర జీవితాలు. అలాగే “నేషనల్‌ పాలసీ ఆన్‌ (టైబల్స్‌”లో గిరిజన జీవన వికాసానికి ప్రత్యేక సంస్థలు - సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఐ.టి.డి.ఎ), సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టులు (ఐ.టి.డి.పి.), గిరిజన సహకార సంస్థలు (జి.సి.సి, సంస్కృతి, సాంప్రదాయాలు పరిరక్షణ - పరిశోధన కోసం “టైకార్‌” సంస్థలు దశాబ్దాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. విద్యారంగంలో ప్రత్యేకంగా ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్నియల్‌ స్కూల్స్‌, కాలేజీలు మరియు షెడ్యూల్‌
సాహిత్యం కవిత్వం

వసంత మేఘమై కురస్తాం.

దిగులు పడకు నేస్తంవర్గ పోరాటాల చరిత్ర మనది.రేపటి సూర్యోదయం కోసం త్యాగం అనివార్యమైనది.తూర్పు పవనానాలువికసిస్తున్నాయి.అక్రమ చట్టాలతోమతాల మరణహోమం జరుగుతున్నది.బూటకపు ప్రజాస్వామ్య వ్యవస్థలకుళ్లును కడుగుదం.రండి నేస్తం…త్యాగం బాటలో చిందిన రక్తంను విత్తనాలుగా చల్లుదాం.నేల రాలిన చోటపువ్వులు వికసిస్తున్నయ్.కష్టాలు కన్నీళ్లు లేనిసమాజం కోసం కవాత్ చేద్దం..రేపటి వసంతం కోసంకదలి రండి .మరో వసంత మేఘమై కురస్తాం…..
సాహిత్యం వ్యాసాలు

వ‌ర్గ పోరాట ఆచ‌ర‌ణ‌లో సంస్కృతి

(విప్ల‌వోద్య‌మ స్థావ‌రాల‌లో వ‌ర్గ‌పోరాట ఆచ‌ర‌ణ నుంచి సాగుతున్న నూత‌న సంస్కృతీ వికాసాన్ని వివ‌రిస్తూ ప్ర‌గ‌తి సుదీర్ఘ వ్యాసం రాశారు.ఈ వ్యాసంలోని  కొన్ని  భాగాలు మీ  కోసం - వ‌సంత‌మేఘం  టీం)  మన దేశంలోని ప్రజాస్వామిక విప్లవానికి దాదాపు 160 సంవత్సరాలకు పైబడిన చరిత్రఉంది. నిర్ధిష్టంగా మన దేశంలో దీర్హకాల ప్రజా వ‌ర్గ‌పోరాటానికి  50 సంవత్సరాలకు పైబడినచరిత్రే ఉంది.   ల‌క్ష‌లాది మంది భాగ‌స్వామ్యంతో, వేలాది మంది అమ‌ర‌త్వంతో   ఒక నూతన చరిత్రను నిర్మిస్తున్నారు.  ఇందులో  నూతన కళా సంస్కృతుల వికాసం జ‌రుగుతున్న‌ది.  అది, నూతన ప్రజాసంస్కృతికి పునాదులు వేసింది. వాటిని మనం మరింత బలోపేతం చేస్తూ ప్రజల ప్రజాస్వామికసమాజ నిర్మాణ దిశలో, దోపిడీ
కథావరణం సాహిత్యం కాలమ్స్

” రైలు కూడా మొగోడే..అంటున్న వినోదిని కథ ‘కట్ట’ “

డాక్టర్ వినోదిని రాసిన "కట్ట" కథ అరుణతారలో 2015 జనవరిలో ప్రచురితమైంది. ఆమె రాసిన 11 కథలతో "బ్లాక్ ఇంక్" కథాసంపుటిని లిఖిత ప్రెస్ హైదరాబాద్ వారు 2015 అక్టోబర్ లో ప్రచురించారు. ప్రధాన స్రవంతి పత్రికలు అచ్చు వేయడానికి నిరాకరించిన  కథలివి.వాడల లోపలి కథలు.  అసలు కథలు ఎందుకు ప్రచురించడానికి భయపెడతాయి? కథలు ప్రచురించడంలో మొహమాటం ఏమిటి? దాపరికం ఏమిటి? నామోషీ ఏమిటి? తరతరాల సంప్రదాయ వాసనలు కొడుతున్న పత్రికల్లో పీతి వాసన గురించిన కథలంటే భయం కలగడం సహజమే.ఈనాడు మంచి రచయితలు తమ కథల్ని ప్రచురించడానికి మంచి పత్రికలను వెతుక్కోక తప్పని పరిస్థితి. పత్రికలకు మంచి
సాహిత్యం కవిత్వం

నేను

నేను ఎవరినంటేపుట్టుకతో ప్రమేయం లేనివాడినిమరణంతోనూ ప్రమేయం ఉండీ లేనివాడినిమధ్యకాలంలో నేను,నేనే! గత నా మానవసారాన్ని అకళింపు చేసుకుంటున్నవాడినిగతం వర్తమానంలోకి ఎగబాకిన వైనాన్ని అధ్యయనంచేస్తున్నవాడినివర్తమానం భవిష్యత్‌లోకి పురోగమించే గతిశీలతనువిశ్వసించినవాడిని అందుకే నేనుచరిత్ర పురోగమిస్తుందని నమ్మినవాడినిఆ చరిత్ర పురోగమనంలో భాగమైనవాడినిచరిత్రను నడిపించే చోదకశక్తిని ఇక ఇప్పుడునేను ఎవరినంటే,నేను కమ్యూనిస్టును - విప్లవ కమ్యూనిస్టును.
సాహిత్యం వ్యాసాలు

కార్పోరేట్లకు ప్రజల ఆస్తులు

ఎన్నికల ప్రజాస్వామ్యంలో అధికారం కోసం, ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అనివార్యంగా ప్రభుత్వాలు ప్రజోపయోగ చట్టాలు చేస్తాయి . కొంతమేరకు అమలుజేస్తాయి కూడా. గత కాంగ్రెస్ ప్రభుత్వం, భూసంస్కరణల, అటవీ, గ్రామీణ ఉపాధి కల్పనల చట్టాలను,  మధ్యతరగతి ప్రజాస్వామిక వాదుల   డిమాండ్ మేరకు సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం లాంటివి జేసింది. వాటి అమలులో చిత్తశుద్ధి లేదని మ‌న‌కు తెలుసు. అయినా చట్టలు  వుంటే, వాటి అమలుకై పోరాడే అవకాశం వుంటుంది, కానీ బిజెపి ప్రభుత్వం వచ్చాక ఆ అవకాశం  కూడా లేకుండాపోయింది. సమాచారచట్టాన్ని, అటవీచట్టాలను,కార్మికచట్టాలను, వ్యవసాయరంగ చట్టాలను నీరుగార్చి పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను చేపడుతోంది. తానేమిజేసినా శ్రీరాముని కృప
కొత్త పుస్తకం సాహిత్యం

విప్లవాన్వేషణలో…..

ఇది విప్లవకారుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. 1925 ఆగస్టు 9న అంటే ఇప్పటికి తొంభై ఏడేళ్ల క్రితం కాకోరీ రైలునాపి ఖజానా కొల్లగొట్టిన విప్లవాకారుల బృంద నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ ఆత్మకథ. కాకోరీ కుట్ర కేసుగా ప్రసిద్ధమైన నేరారోపణలో శిక్షలు పడిన విప్లవకారుల కథ. వీరిలో రాంప్రసాద్ ‘బిస్మిల్’, అష్ఫఖుల్లా ఖాన్ ‘వారాసీ’, రాజేంద్రనాథ్ లాహిరి స్వయంగా ఖజానా కొల్లగొట్టిన ఘటనలో పాల్గొన్నవారు. వీరిలో రాజేంద్రనాథ్ లాహిరిని అప్పటి సంయుక్త రాష్ట్రాల (ఇప్పటి ఉత్తరప్రదేశ్) గోండా జైలులో నిర్ణీతమైన తేదీకి రెండు రోజుల ముందే 1927 డిసెంబర్ 17న ఉరి తీశారు. ఎందుకంటే అతన్ని నిర్ణీత తేదీకి ముందే