కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సుదర్శన్ తన ఏకైక సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. అరవై తొమ్మిదేళ్ల సిపిఐ (మావోయిస్ట్) అగ్రనేత, పొలిట్‌బ్యూరో, సెంట్రల్ కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ బహుశా అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్‌కి చెందిన కనిపించే ముఖాలలో ఒకరు. అతను అడవుల్లో మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే సంస్కృతిని ప్రారంభించాడు. కొత్తగా ఏర్పడిన ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే, అప్పటి నక్సల్స్ ప్రభావిత మానాల అడవిలో 1996 సెప్టెంబర్‌లో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ  జరిగింది.

నేను సెప్టెంబరు 1996లో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యాలయంలో ది హిందూ ప్రతినిధిగా చేరాను. కటకం సుదర్శన్ తన మొదటి – చివరి ఇంటర్వ్యూ కోసం ఆహ్వానించిన ఆరుగురు ఎంపిక చేసిన జర్నలిస్టులలో నేనూ ఒకణ్ణి.

ఉత్తర తెలంగాణలో నక్సల్స్ కార్యకలాపాలు తారాస్థాయికి చేరిన రోజులవి. ఏదో ఒక ఘటన జరగకుండా ఒక్కరోజు కూడా గడిచేది కాదు. అది నక్సల్స్ హింస అయినా, పోలీసుల ప్రతీకార చర్య అయినా, పేలుళ్లు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, ఇన్‌ఫార్మర్లుగా ముద్రపడిన వ్యక్తులను ఉరితీయడం, ఎన్‌కౌంటర్లలో నక్సలైట్లను చంపడం వంటివి రోజువారీగా జరిగేవి.

నిజామాబాద్ బస్టాండ్‌లో సమావేశమైన జర్నలిస్టుల బృందం సాయంత్రంలోగా మానాల అటవీ ప్రాంతంలోని ఆదివాసీ  కుగ్రామమైన భీమ్‌నగర్‌కు చేరుకోడానికి భీమ్‌గల్‌కు వెళ్ళే బస్సు ఎక్కింది. భీమ్‌నగర్‌కు చేరుకోవడానికి జర్నలిస్టులు భీమ్‌గల్‌ నుండి ఒక శిధిలావస్థలో ఉన్న కమాండర్ జీపులో నడుము విరిగిపోయే ప్రయాణం గంటపాటు సాగింది.

ఆ ఇంటర్వ్యూ జరిగిన దాదాపు 25 సంవత్సరాల తర్వాత జర్నలిస్టులు ఆ నక్సల్ నాయకుడిని కలిసే అవకాశం వచ్చిన  ఆ మధురమైన జ్ఞాపకాన్ని నెమరేసుకున్నారు. అతను తరువాత మావోయిస్టు పార్టీలో అగ్రస్థానంలో ఉన్నాడు.

తమ కుగ్రామానికి అపరిచితులు రావడమనేది అక్కడి గ్రామస్థుల్లో కలవరాన్ని సృష్టించింది. “ఒక కప్పు టీ దొరుకుతుందా” అని మేము అడిగినప్పుడు వారంతా బిగుసుకుపోయారు. వెనక్కి వెళ్ళిపోయి దూరంగా నిలబడ్డారు”అని సీనియర్ తెలుగు జర్నలిస్ట్ పిన్నం లింగం గుర్తు చేసుకున్నారు.

“మేము అడవికి ఆనుకుని వున్న భీమ్‌నగర్ శివార్లకు నడిచాము. బురదగా వున్న మట్టి బాట చీకటి పడేటప్పటికి ఒక అటవీ ప్రాంతానికి దారితీసింది. అక్కడ మేము ఆగిన కొన్ని నిమిషాలలో, యూనిఫాం ధరించిన సాయుధ వ్యక్తులు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు, ” అని అప్పటి నిజామాబాద్‌లోని వార్త తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్ పిట్టల రవీందర్ కూడా అడవికి వెళ్ళిన ఉద్విగ్న యాత్రను గుర్తు చేసుకున్నారు.

కటకం సుదర్శన్ ఎన్‌టీఎస్‌జెడ్‌సీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు జర్నలిస్టులతో మాట్లాడాలనుకున్నారని సుప్రభాతం తెలుగు పక్షం పత్రికకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. “అతను PWG (ఇప్పుడు సిపిఐ-మావోయిస్ట్‌‌లు) పని తీరుపై అంతర్దృష్టిని ఇవ్వాలనుకున్నాడు. మేమంతా ఆయనతో ఉన్న మూడు గంటల్లో ఆయన వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, నక్సల్ ఉద్యమంపై అణచివేత గురించి మాట్లాడారు.

కటకం సుదర్శన్‌తోనే మావోయిస్టు పార్టీ నాయకత్వం మీడియాతో సంప్రదింపులు ప్రారంభించిందని లక్ష్మయ్య అన్నారు. “అప్పటి వరకు కొండపల్లి సీతారామయ్య మాత్రమే ఇంటర్వ్యూ ఇచ్చారని, ఆ తర్వాత మాతో మాట్లాడింది సుదర్శన్.” దివంగత నేత చాలా మృదుభాషి అని, తన జీవితాంతం మావోయిస్టు ఉద్యమానికి కట్టుబడిన వ్యక్తి” అని ఆయన అన్నారు. నక్సల్ సానుభూతిపరులు వడ్డించిన ‘విస్తారాకు’లో అన్నం, కూరతో వున్న సరళమైన భోజనాన్ని ఎలా పంచుకున్నారో ఆ రోజు సీనియర్ నక్సల్ నాయకుడిని కలిసిన జర్నలిస్టులందరూ గుర్తు చేసుకున్నారు.

పత్రికలతో ఇంటర్వ్యూలను  ప్రారంభించిన తొలి మావోయిస్టు అగ్రనేత 

రవి రెడ్డి , ‘ది హిందూ’ విలేఖరి

5 , జూన్ , 2023

అనువాదం : కె  పద్మ

Leave a Reply