సమకాలీనం

సొంత భూమిపై హక్కులు కోరుతున్న జేను కురుబలు

పులులకు దారి కల్పించడానికి నాగరహొళె నుండి బలవంతంగా వెళ్లగొట్టిన దశాబ్దాల తర్వాత జేను కురుబలు తమ పూర్వీకుల స్థలాన్ని తిరిగి ఆక్రమించుకున్నారు. దక్షిణ భారతదేశంలోని అడవులలో వారాంతంలో వచ్చే పర్యాటకులకు “మీరు మా ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు” అనే తమ సందేశాన్ని అందించడానికి డజన్ల కొద్దీ జేనుకురుబ ప్రజలు నాగరహొళె టైగర్ రిజర్వ్ ప్రవేశద్వారం దగ్గర వర్షం కురుస్తున్నా గొడుగులు పట్టుకుని నిలబడి ఉన్నారు: నాగరహొళె పులులను చూస్తారని పర్యాటకులకు హామీ ఇచ్చే సఫారీ పర్యటనలను ఆపడం వారి లక్ష్యం;  అటవీ సంరక్షణ పేరుతో తమను తరిమికొట్టిన పూర్వీకుల స్థలాన్ని వ్యాపారానికి ఉపయోగించారని జేనుకురుబలు అంటున్నారు. కర్ణాటక అటవీశాఖ, కర్ణాటక
సమకాలీనం

ఇది  నైపుణ్య శిక్షణా? నిర్బంధమా? లొంగిపోయిన మావోయిస్టుల పేరుతో హింస

ఫోటోలో హోంమంత్రి అమిత్ షా మెరిసిపోతుంటే, ఆయనకు కొన్ని వరుసల వెనుక విషాద వదనంతో ప్రసన్న నిలబడి ఉన్నాడు. జూన్ 23న షా తన X హ్యాండిల్‌లో ఈ గ్రూప్ ఫోటోను పోస్ట్ చేసాడు. “నక్సలైట్లు ఎవరి చేతుల్లో తుపాకులు పెట్టారో, ఆ పిల్లలు తమ  భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నారు.” అని కింద రాసి ఉన్నది. కానీ ప్రసన్న చిన్నపిల్లవాడు కాదు. అతను యాభై ఏళ్ల వయసున్న ఆదివాసి. బీజాపూర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందినవాడు - అతని భద్రత కోసం అసలు పేరును, ఊరును, గుర్తింపును చెప్పడం లేదు- జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఒక
సమకాలీనం

“తోలు కొరడాతో కొట్టారు” విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల చిత్రహింస

ఏ చట్టపరమైన విధానాన్ని అనుసరించకుండా, పౌర దుస్తులలో ఉన్న పోలీసు అధికారులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని అరెస్టు చేసిన విద్యార్థులు, కార్యకర్తలు ‘ది వైర్‌’కు చెప్పారు. తమ సహచరులు ఆరుగురిని, నజారియా పత్రికలో పనిచేస్తున్న ఒకరిని అవసరమైన ప్రక్రియను అమలుచేయకుండా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నిర్బంధించి దౌర్జన్యం చేసిందని ఢిల్లీకి చెందిన భగత్ సింగ్ ఛాత్రా ఏక్తా మంచ్ (బిఎస్‌సిఇఎమ్)  విద్యార్థి సంఘం, ఫోరమ్ అగైన్స్ట్ కార్పొరేటైజేషన్ అండ్ మిలిటరైజేషన్ (ఎఫ్ఎసిఎఎం-కార్పొరేటీకరణ, సైనికీకరణ వ్యతిరేక వేదిక) సభ్యులు ఆరోపించారు. ఒక ఐఎఎస్ ఆఫీసర్ కూతురు ఎక్కడ ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి “ఇంటరాగేషన్” చేసే పేరుతో జులై
సమకాలీనం

ఈ మరణాలు ప్రజాస్వామ్య సంక్షోభానికి సూచికలు

కొద్దికాలంపాటు నేను మౌన జీవితంలోకి వెళ్లిపోయాను. కానీ రాజ్య ప్రాయోజిత హింస పెరుగుదల, భారతదేశం అంతటా పునరావృతమయ్యే సంఘర్షణ మరింత లోతైన ప్రతిస్పందనకు బలవంతం చేసింది. మధ్య భారతదేశంలో, ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన హత్యలు విడి ఘటనలు కావు. ప్రజాస్వామ్య ఆరోగ్యం, అట్టడుగు వర్గాలతో వ్యవహారానికి సంబంధించిన విస్తృతమైన, కొనసాగుతున్న సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. సిపిఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంబాళ్ళ కేశవ రావు @ బసవరాజ్ సహా మావోయిస్టులుగా గుర్తించిన పలువురు వ్యక్తుల మరణానికి దారితీసిన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన భద్రతా కార్యకలాపాలు మరోసారి ఆదివాసుల ప్రాంతాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణపట్ల దృష్టిని ఆకర్షించాయి. విభేదాలు, తిరుగుబాటులను
సమకాలీనం

శాంతి చర్చలు-రాజ్యాంగబద్ధత: తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత

(విర‌సం ఆవిర్భావ దినం సంద‌ర్భంగా జూలై 6న హైద‌రాబాదులో నిర్వ‌హించిన స‌ద‌స్సులో *తెలంగాణ‌లో కాల్పుల విర‌మ‌ణ ఆవ‌శ్య‌క‌త‌* అనే అంశంపై జ‌రిగిన సెష‌న్ కోసం రాసిన పేప‌ర్‌) మావోయిస్టు పార్టీ మార్చి 28న కాల్పుల విరమణ ప్రతిపాదనతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ సూచన చేసింది. ప్రజా ప్రయోజనం కోసం తాను కాల్పుల విరమణకు సిద్ధమనితెలంగాణ ప్రభుత్వం ముందు కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మారణకాండను ఆపివేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో సహా
సమకాలీనం

బీహార్ జైళ్ల నిజస్వరూపం

బీహార్ జైళ్ళను ఎవరైనా ఊహించుకుంటే మేరీ టేలర్ చిత్రించిన చెరగని చిత్రాలు గుర్తుకు వస్తాయి. అప్పుడు హజారీబాగ్ ఇంకా బీహార్‌లో భాగం. దాదాపు అర్ధ శతాబ్దం తరువాత బి. అనురాధ ఐదేళ్ళు రాజకీయ ఖైదీగా గడిపి అదే హజారీబాగ్ జైలులో ఖైదీల కష్టాలను తన జైలు  కథల్లో చెప్పారు. కాలంతో పాటు అంతా మారుతుంది కానీ బీహార్, జార్ఖండ్ జైళ్లు ఈ మార్పు నియమానికి మినహాయింపులా? విజయ్ కుమార్ ఆర్య ఒక మావోయిస్టు రాజకీయ ఖైదీ. ప్రస్తుతం పాట్నాలోని బేవుర్ జైలులో ఉన్నాడు.. కేంద్రమావోయిస్ట్ పార్టీ  కేంద్ర  కమిటి సభ్యుడనే ఆరోపణ మీద ఎన్‌ఐఏ కేసులో అరెస్టయ్యిన అయ్యాడు.
సమకాలీనం

టెండూ ఆకును అమ్ముకునే  స్వేచ్ఛ కోసం కోరాపుట్ ఆదివాసుల పోరాటం

దేశ వ్యాప్తంగా ఆదివాసులకు కెండు లేదా టెండు ఆకు (బీడీ ఆకు) కేవలం అటవీ ఉత్పత్తి మాత్రమే  కాదు, వారి జీవనాధారం. పొడి నెలల్లో వచ్చే ఈ ఆకులు వేలాది కుటుంబాలకు కాలానుగుణ  ఆదాయాన్ని అందించే హామీనిస్తున్నాయి. కానీ అకారణ ఆలస్యాలు, అమ్ముకోడానికి అనుమతినివ్వడంలో ఆలస్యం, ప్రభుత్వ ఉదాసీన ప్రవృత్తి వల్ల ప్రతీ ఏడాదీ ఇబ్బందులు పడుతున్నారు. పంట కోత పూర్తి స్థాయిలో ఉండగా, రుతుపవనాలు వేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో, ఒడిశాలోని కొరాపుట్‌లోని ని బోయిపారిగుడా బ్లాక్‌లోని ఎనిమిది గ్రామ సభలు ఈ సీజన్‌లో తాము సేకరించిన బీడీ ఆకును స్వతంత్రంగా అమ్ముకోవడానికి అనుమతి కోసం ఇంకా వేచి
సమకాలీనం కాలమ్స్

ఆన్ లైన్ విద్య బోధనలో అసమానత్వం

కరోనా మూడవ వేవ్ రిత్యా తెలంగాణ సర్కారు ఈ నెల 30 వరకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓయూ, జెఎన్ టి యు, శాతవాహన యూనివర్సిటీలతో పాటు మిగతా యూనివర్సిటీలు, ఉన్నత విద్యలో ఆన్ లైన్/డిజిటల్ విద్యభోదన జరుపుతామని ప్రకటించాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యలో ఆన్ లైన్ భోదనకు మొగ్గుచూపుతున్న తెలంగాణ సర్కారు పేద, మధ్యతరగతి విద్యార్థులు ఆన్ లైన్/డిజిటల్ పాఠాలు వినేందుకు ఎలాంటి సౌకర్యాలు కల్పించటం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మొదటి, రెండవ కరోనా వేవ్ లలో ఆన్ లైన్/డిజిటల్ భోదన పాఠాలు అందక తీవ్రంగా నష్టపోయిన పేద విద్యార్థులు మూడవ వేవ్ లో
సమకాలీనం

మావోయిస్టులు ఎందుకు ఆయుధాలు విడిచిపెట్టరు?

భారత ప్రభుత్వానికి ప్రకటన రూపంలో శాంతి చర్చలు ప్రారంభించడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ తమ సంసిద్ధతను తెలియజేసిన తరువాత,  భారత ప్రభుత్వ నాయకత్వం తాను బస్తర్‌లో శాంతి కోసం కట్టుబడి ఉన్నానని విశాల ప్రపంచానికి చూపించడానికి అనేక వాక్చాతుర్య ప్రకటనలు చేసింది. ప్రజాస్వామిక హక్కుల కార్యకర్తలు, ప్రతిపక్ష నాయకుల పైన కూడా 'అర్బన్ నక్సల్స్'గా ఎర్ర ముద్ర వేసే పనిలో తీరిక లేకుండా ఉన్న గృహమంత్రి అమిత్ షా, నక్సలైట్లను తన సోదరులుగా భావిస్తున్నట్లు అకస్మాత్తుగా ప్రకటించాడు. అమిత్ షా బహిరంగంగా శాంతి కేకలు వేస్తున్నప్పటికీ, ఆయన ఆధ్వర్యంలోని భద్రతా బలగాలు బస్తర్‌లో మావోయిస్టుల ఊచకోతను
సమకాలీనం

చంచల్‌గూడ జైలులో రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రోజంతా ఏకాంతవాసంలో(ఒంటరిగదుల్లో) నిర్బంధించకూడదనే ఏకైక డిమాండ్‌తో చంచల్‌గూడ సెంట్రల్ జైలు, నర్మదా బ్లాక్‌లోని రాజకీయ ఖైదీలు 2024 ఆగస్టు 27 నాడు నిరాహార దీక్ష మొదలుపెట్టారు. గత కొంతకాలంగా, సీపీఐ (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ఖైదీలు చంచల్‌గూడ జైలు నిర్బంధంలో వున్నారు. వారు విచారణ ఖైదీలైనప్పటికీ జైలు అధికారులువారి హక్కులను నిరంకుశంగా అణిచివేస్తున్నారు. జైలు నియమాలను ఉల్లంఘిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఇచ్చిన తీర్పులను (ఉదాహరణకు సునిల్ బాట్రా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్, 1980)సైతం లెక్కచేయడంలేదు. చదవడానికి పుస్తకాలు, పత్రికలు కావాలని, రాసుకోవడానికి పెన్నులు, నోట్‌ బుక్స్ లాంటి కనీస అవసరాల కోసం ఖైదీలు