నివాళి

‘ఇప్పుడు కావల్సిన మనిషి’ జహీర్ భాయి

 జహీర్ భాయి (జహీర్ అలీ ఖాన్) విషాదకర ఆకస్మిక మరణంతో దేశం ఒక ఉత్తమమైన, ప్రజాస్వామికవాదిని కోల్పోయింది. ముస్లిం మైనారిటీలకు దేశంలో ప్రజాస్వామ్య ఆవరణ (స్పేస్) పూర్తిగా మృగ్యమవుతున్న కాలంలో, ఆత్మ రక్షణ కోసం వాళ్లు కూడా మతవిశ్వాసాన్నే కవచంగానూ, ఆయుధంగానూ ఎంచుకోవాల్సిన స్థితి ఏర్పడిన కాలంలో హైదరాబాదులోని పాత నగరంలో ఒక ప్రజాస్వామిక ద్వీపంలా జహీర్ అలీ ఖాన్ ఒక కొవ్వొత్తి వెలిగించుకొని లౌకిక ప్రజాస్వామ్య భావజాలం గల మనుషుల్లోకి, నిర్మాణాల్లోకి తన ప్రయాణం మొదలుపెట్టాడు. చార్మినార్ నుంచి, సాలార్‌జంగ్ మ్యూజియం నుంచి ఇమ్లీబన్ బస్‌స్టాండ్‌కు వచ్చే తోవలో అబీద్ అలీ ఖాన్ మెమోరియల్ కంటి వైద్యశాలను
నివాళి

విరసం సంతాపం

గద్దర్ లోని విప్లవ వాగ్గేయకారుడికి నివాళి.. తెలుగు ప్రజల విప్లవ సాంస్కృతిక చైతన్య ప్రతీక అయిన గద్దర్ హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీరని విషాదం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజానాట్యమండలి అందించిన ఒరవడిని మౌళి కంగానే విప్లవీకరించి, తెలంగాణ దళిత, వెనుకబడిన కులాల  సాంస్కృతిక  అభివ్యక్తిగా మార్చి రెండు మూడు తరాల ప్రజలను గద్దర్ పోరాటాల్లోకి కదిలించాడు. ఆర్ట్ లవర్స్తో ఆరంభమైన గుమ్మడి విఠల్‍ 1972లో ఏర్పడ్డ జననాట్యమండలికి దిశా నిర్దేశం చేయగల వాగ్గేయకారుడిగా రూపాంతరం చెందాడు. ఆ కాలంలో తెలంగాణ అంతటా ప్రజ్వరిల్లిన భూస్వామ్య వ్యతిరేక రైతాంగ సాయుధ పోరాటాల సాంస్కృతిక శక్తిగా కళారంగంలో చెరగని ముద్ర
నివాళి

విప్లవ కళాకారుడు డప్పు చంద్రకు నివాళి

ప్రజా సంగీత వాయిద్యాల్లో ప్రముఖమైన డప్పుతో గుర్తింపు పొందిన జననాట్యమండలి కళాకారుడు చంద్ర మే 12న గుండెపోటుతో మరణించాడు.  చంద్ర కుటుంబం దక్షిణాంధ్ర నుంచి ఉత్తర తెలంగాణ దాకా ప్రయాణించి తిరిగి స్వస్థలానికి వచ్చింది. ప్రకాశం జిల్లా జె. పంగులూరు మండలం రాంకూరు గ్రామానికి చెందిన నిరుపేద వ్యవసాయ కుటుంబం ఆయనది. తల్లిదండ్రులు ఆయన చిన్నప్పుడే తెలంగాణకు వలస వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి ప్రకాశం జిల్లా నార్నెవారి పాలేనికి వచ్చారు. పెద్దగా చదువుకోని చంద్రకు పేదరికం జీవితాన్ని నేర్పించింది. ఆ జీవిత అవగాహన నుంచి ఆయనలో కళలు వికసించాయి. 1980లలో తన సాహిత్య కళా ప్రదర్శనలతో దేశాన్ని