ప్రపంచ పీడిత ప్రజల ప్రియ మిత్రుడు,విప్లవ రచయిత గూగీకి జోహార్లు
గూగీ వా థియాంగో తన 87 ఏళ్ల ధిక్కార జీవితాన్ని ప్రపంచ పీడిత ప్రజల బలమైన సాంస్కృతిక ప్రతిఘటనగా నిలిపి మే 28, 2025 న భౌతికంగా నిష్క్రమించాడు. తూర్పు ఆఫ్రికా కెన్యా దేశంలోని ఒక చిన్న తెగలో జన్మించిన గూగీ తన ప్రజల గురించి, వారి బాధల గురించి, అణచివేతల గురించి రాస్తే అది తమ గురించే రాసినట్లు తెలుగు పాఠకులు భావించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా కెన్యా ప్రజల ‘మౌ మౌ’ గెరిల్లా పోరాటం తెలంగాణ సాయుధ పోరాటాన్ని తలపింపజేస్తుంది. అందులో పాల్గొన్న విప్లవ వీరుడి కుటుంబం గూగీ ది. ఆ కారణంగా ఆయన










