సంభల్: కల్పించిన నిశ్శబ్దం
మరోసారి 'మందిర్-మస్జిద్' వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది - చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు. పోలీసులు మొదట పోలీసు స్టేషన్కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్










