కారా స్మృతిలో సాహిత్యం

సాహిత్యంలో ప్రాసంగికత: కారా ఉదాహరణ

కాళీపట్నం రామారావుగారు పూర్ణ జీవితం గడిపి వెళ్లిపోయారు. తాను రాయగలిగిన కథలే రాశారు. ఎంచుకున్న పనులనే చేశారు. మాష్టారు జీవించి ఉండగానే ఆయన కథల మీద చాలా చర్చ జరిగింది. తాను వెళ్లిపోయి మరోసారి ఇప్పుడు ఆ కథల గురించి మాట్లాడుకొనే అవకాశం ఇచ్చారు. కారా కథల్ని తెలుగు సమాజ, సాహిత్య వికాసానికి అతీతంగా చూడ్డానికి వీల్లేదు. ఎక్కువ చేయడానికైనా, తక్కువ చేయడానికైనా. మరణ సందర్భంలో అతి ప్రశంసల  ప్రమాదం ఎప్పుడూ ఉండేదే. నిజానికి కాళీపట్నం రామారావుగారి నుంచి కూడా కారా కథల్ని వేరు చేసి తెలుగు సాహిత్య, మేధో రంగాల అభివృద్ధి క్రమంలో భాగంగా చూడాలి. ఇది పూర్తిగా సాధ్యం
సాహిత్యం కవిత్వం

హంజా     

దేశ దేశాల కవిత్వంతో కరచాలనం (*అనువాద స్వరం* కొత్త కాలం ఈ సంచిక నుంచి మొదలవుతోంది . పాలమూరు నుంచి ప్రపంచ కవిత్వాన్ని పరిశీలిస్తూ , అధ్యనం చేస్తున్న  సీనియర్ కవి ఉదయమిత్ర ఈ శీర్షికను నిర్వహిస్తారు) హంజామా ఊళ్లోఒక సాధారణ వ్యక్తిరొట్టె ముక్క కోసంచెమటోడ్చే కూలి ఓ రోజునేను ఆయనను కలిసినప్పుడుఊరంతావిచారంలో మునిగి ఉందిగాలి మొత్తం స్తంభించినట్టుగా ఉందిలోలోపలేఓడిపోయిన ఫీలింగ్ కలిగింది హంజా నవ్వుతూ భుజం తట్టిఇలా అన్నాడు"అక్కాఇది పాలస్తీనా దీని గుండెలయసముద్రహోరుఆగేదిగాదు సమస్త పర్వతాల ,అగ్నిగర్భాల రహస్యాల్ని దాచిపెడుతుందిది ఈ నేలపొడుగునాఎన్ని నిర్బంధాలముళ్ళ తీగలు పరుచుకున్నాఇదినిరంతరం యోధులకు జన్మనిస్తుంది . ఇదిఉనికిని కోల్పోయే జాతులకువిశ్వాసాలనిచ్చే… వీరమాత
సాహిత్యం వ్యాసాలు

వర్గకసిని సిరా చేసుకున్న కో.ప్ర

విప్లవోద్యమ ప్రభావంతో 1980, 90లలో కవిత్వం రాసిన అప్పటి యువకవుల్లో కో.ప్ర. తనదైన ప్రత్యేక ముద్రతోవిలక్షణంగా కనిపించాడు. వచన కవితనూ, పాటనూ - రెండిటినీ అవలీలగా నడిపించగల నైపుణ్యం అతనిది. కవిగాఅతని మాటకు శక్తి వుంది. అతని భావంలో ఆర్తి ఉంది. అతని ఆవేదనలో చిత్తశుద్ధి వుంది. అంతకంటే ముఖ్యంగా అతనిఅవగాహనలో వర్గకసి వుంది. వీటన్నిటితో బాటు అతని కవిత్వంలో సూటిదనం, పోటుదనం వున్నాయి.కవిగా కో.ప్ర గా సాహిత్యలోకానికి పరిచయమైన అతని పూర్తిపేరు కోలపూడి ప్రసాద్. అతని వూరు నెల్లూరు జిల్లావెంకటగిరి సమీపంలోని డక్కిలి గ్రామం. 1966 జూన్ 2వ తేదీన పుట్టాడు. 1994 అక్టోబర్ 23న శ్రీకాకుళం
సాహిత్యం కవిత్వం

నిప్పు కణిక

కణ కణ మండే నిప్పు కణిక ఆ బాలిక తన సమస్యలన్నింటికీ  నిప్పెలాబెట్టాలో తెలుసు ఆమెకు తల్లికెలా సాయపడాలో తన కలలసౌధం ఎలా నిర్మించుకోవాలో తెలుసు ఆ చిన్నారికి ప్రమోదం కన్నా ప్రమాదమే తనకోసం ఎదురు చూస్తూ ఉన్నా నిప్పు, ఉప్పు తానై నలుగురి కోసం వండడం తెలుసు తన భవిష్యత్తు కోసం కాలాన్ని తన చేతుల్లో బంధించటం తెలుసు ఏడు దశాబ్దాల ఎదురు చూపుల్లో కాల్చి బూడిద చేయాల్సినవేమిటో తెలుసు ఓటుకు నోట్లతో పిట్టకథలు చెప్పే మహా మాంత్రికుల పని పట్టటం ఎలాగో తెలుసు ప్రామిసింగ్ పాలన పునాది ఆ బాలిక భవిష్యత్ కాలాన్ని తన గుప్పిట
సాహిత్యం కవిత్వం

అలల కెరటాలు

అనంత విశ్వాన్ని నిబ్బరంగా చూస్తానుఅంతా అర్థం అయినట్టే కట్టిపడేస్తుందిజీవితం కూడా. ఆకర్షణ తో కట్టుబడ్డట్టుముడిపడటాలు చెదిరిపోవటాలు చూస్తాం. కాలం పైన చిరు నవ్వు తాకికాసేపు చేసే కాలక్షేపం చూస్తాం. మరుక్షణంగాలికి కాలం ఊగిపెట్టే కన్నీటిని చూస్తాం. మురిసిపోయే లోపేతుపాను ముసిరినట్లుఅంతలోనేస్వచ్ఛం గా దృశ్యాలుగా చెక్కబడుతున్నట్లుఅనుభవాలు కుదుపుతుంటాయి . తీరం వైపు కళ్ళను పరచిఅలల కెరటాలను చూస్తాను.సంతోషాలు దుఃఖాలు పోటీపడిఊగిపోతుంటాయి. అయినానిశ్చలంగా సముద్రం వైపు చూస్తూప్రశాంతతను పల్లవిస్తాను.
కథలు

దొర్లు దొర్లు పుచ్చకాయ్

జేబులోవున్న ఆ ఒక్కరూపాయి బందా కంబగిరికి అగ్నిపరీక్ష పెడుతున్నది. స్కూలు బయట అమ్ముతున్న బొంబాయి మిఠాయి, ఉప్పుసెనగలు, బఠాణీలు, సొంగలు అంతగనం వూరిస్తున్నాయి. "మా! మా! ఉప్పుసెనగలు కొనుక్కుంటానే!” గంట బంగపోతే ఉట్టిచట్టిలో నుండి అమ్మ తీసి ఇచ్చిన గుండ్రని మిలమిలలాడుతున్న కొత్త రూపాయి బందా. పొద్దుటినుంచి దాన్ని చూస్తున్నాడు… జేబు లోపలికి తోస్తున్నాడు. చూస్తున్నాడు …లోపలికి తోస్తున్నాడు. ఆ రూపాయి వాడికి అపురూపం. కనీసం రెండురోజులన్నా దాన్ని జేబులో వూరబెట్టి…వూరబెట్టి కొనుక్కుంటే…అప్పుడు సెనిగబ్యాల్ల పాశం తిన్నంత తృప్తి. వాని తంటాలు చూసిన జేజి "పాపోడా ! ఎంగావాల్నో కొనుక్కోని తినుకోపోరా! కావాలంటే అనిక నేను రూపాయి ఇత్సా
సాహిత్యం కవిత్వం

తునకలు మా ప్రాణం

మా పోలేరమ్మ కాడనరికిన దున్నపోలేరమ్మ తినదని ఎరుకేపోగులు వేసిదండేలపై వేలాడే ఎర్ర గులాబీలువాటికి ముల్లుండవ్ముక్కల పులుసు కుతకుత వుడుకుతా వుంటేవాడంతా ఘుమఘుమమీకేం నొప్పిదున్న మీది కాదునరికింది మీరు కాదుసాకింది సవర తీసింది మీరు కాదు కట్ట మైసమ్మ కాడఒక్క వేటుకి యాటనేసినంయాతలన్నీ బోవాలనిమా మైసమ్మ ని మా యాసలో నే మొక్కుతాంబాగా అర్థమైతది ఆమెకీ మాకూవూర్లన్నీ జన సందోహం తోచెర్లన్నీ అలుగులు దుంకుతాయనితెగిన యాటల కుప్పలుమా పొట్టలు నింపు అదేందోమా గంగమ్మ తల్లి కీమా మల్లన్న కీమా కాటమయ్యకిమా ఎల్లమ్మ ఉప్పలమ్మ ముత్యాలమ్మ మారెమ్మలకి సైతంజంతు మాంసమే ఇష్టంమాకూ అదే ఇష్టంసిన్నప్పట్నుంచి మా అయ్య గదే పెట్టిండుమా అయ్య
సాహిత్యం కవిత్వం

నావికుడు

నెత్తురు కక్కుతున్న కాలాన్ని తన నగ్న పాదాలతోనే అధిగమించాడతను పూసే పొద్దుకు అభిముఖంగా అనివార్యపు యుద్ధంలా పర్చుకొని చరిత్రను విస్తృతం చేశాడు అతను కేవలం అస్తమించాడు ఈ ముసురు యుద్ధపు విచ్ఛిత్తిలో అనునయంగా మనతో సంభాషిస్తూనే ఉంటాడు కాళ్ల కిందికి విస్తరిస్తున్న మృత్యువును శతృ కల్పిత వేల వేల సందిగ్ధాలను నిరంతరంగా తిరగ రాసుకుంటూ ఆయువును ద్విగుణీకృతం చేసుకున్నాడు 0   0 0 ఒక్కడిగా పేరుకుపోయిన మానవుడ్ని శుభ్రం చేస్తూ నగరానికొచ్చినా సమూహాల నిస్సత్తువకు మందుగుండు దట్టించినా కల్పన కానిది.. కత్తుల అంచున రొమ్ము విరిచిన యుద్ధ ప్రియుడి సారాంశం కథకాదది గుండె విప్పిన దుక్కిలా రేపటిని
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

తెలుగు కథకు కారా చేసిందేమిటి ?

తెలుగు సాహిత్యానికి కాళీపట్నం రామారావు గారి చేర్పు ఏమిటి? నిర్దిష్టంగా ఆయన తన కథల ద్వారా కొత్తగా చెప్పిందేమిటి? దీనికి జవాబు వెతికేముందు కారాని ప్రభావితం చేసిన స్థలకాలాలను కూడా చూడాలి.  స్వాతంత్రం వచ్చేసిందని , నెహ్రు సోషలిజం కూడా తెచ్ఛేస్తాడనే భ్రమలు తొలగి అంతటా ఒక అసమ్మతి రాజుకుంటున్న కాలం. గ్రామాలలో చెక్కుచెదరని భూస్వామ్యంపై జనం తిరగబడుతున్న కాలం. సర్దుబాటు కాదు మౌలిక మార్పు కావాలనే తండ్లాట మొదలైన కాలం. రాజకీయార్థిక తలంలో మొదలైన ఈ కదలికను గుర్తుపట్టడమే కారా గొప్పదనం. గ్రామం నుండి పట్టణానికి అనే రాజకీయ అవగాహనను, ఈ అవగాహన పర్యవసానంగా తనకు సమీపంలో
కారా స్మృతిలో సాహిత్యం వ్యాసాలు

కారా కథా దృక్పథం

కాళీపట్నం రామారావు   కథా రచన విషయంలో ‘చూపు’  అనే భావనకు చాలా ప్రాధాన్యం ఉంది. కథా వస్తు సేకరణకు చూపు విశాలం కావాలి. అందుకు నాలుగు పక్కలూ కలయ చూడాలి అంటారాయన. చూపు అంటే కంటికి వస్తువుకి మధ్య సంబంధమే కాదు. వస్తువు వెనుక దాని చలనానికి కారణమైన శక్తులను గుర్తించటం. వస్తువు ఉపరితలాన్నిచీల్చుకొంటూ లోలోతులకు ప్రసరిస్తూ వస్తు తత్వాన్ని గాలం వేసి గ్రహించగలటం . చూపుకు ఆ నైశిత్యం ఇచ్చేది చైతన్యం. అది అనుభవం నుండి. సామాన్య లౌకిక జ్ఞానం నుండి అంతకన్నా ఎక్కువ రాజకీయార్థిక అవగాహన నుండి అభివృద్ధి చెందుతుంది.   దానినే జీవిత