ఆర్థిక సంక్షోభ దిశగా భారత్
భారత్ భయంకరమైన ఆర్థిక సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని గ్లోబల్ బ్రోకరేజీ సంస్థలు బెర్న్స్టెయిన్, యుబిఎస్లు హెచ్చరిస్తున్నాయి. పశ్చిమాసియాలో అమెరికా సృష్టించిన యుద్ధం భారత్పై తీవ్ర ప్రతికూలతలను చూపనున్నాయని వెల్లడించాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత్ 2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. తదనుగుణంగానే ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో దురాక్రమణ యుద్ధా లు, ఆర్థిక అస్థిరతలు, ఇంధన సంక్షోభాలు పెరుగుతున్న ఈ కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొం టున్న సవాళ్లు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా దేశ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్










