దేశద్రోహుల జేబు సంస్థ ఎన్ఐఏ ముస్లింలను దేశద్రోహులని ఆరోపించడమా?
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) 18వ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మూకుమ్మడిగా ముస్లింల ఇండ్ల మీద దాడి చేసింది. దేశద్రోహ నేరారోపణ చేసి అరెస్టులు చేసింది. హైదరాబాదులోని తమ కార్యాలయంలో విచారణకు రావాలని కొన్ని డజన్ల మంది ముస్లింలకు నోటీసులు ఇచ్చింది. వీళ్లందరూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఆఫ్ ఇండియా అనే సంస్థ నాయకులని, సభ్యులని, వీళ్లంతా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పనుల్లో ఉన్నారని, దేశద్రోహ కార్యకలాపాలు నడుపుతున్నారని ఎన్ఐఏ అభియోగాలు మోపింది.నిజామాబాద్లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముస్లింలకు లీగర్ అవేర్నెస్ ప్రోగ్రాం పేరుతో కర్రసాము, కత్తిసాము నేర్పిస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతోందనే ఒక కేసు స్థానిక పోలీసులు