ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఇన్ సాలిడారిటీ విత్ పోలిటికల్ ప్రిసనర్స్
అంతిమ ప్రకటన ప్యారిస్, డిసెంబర్ 20-21, 2025 2025 డిసెంబర్ 20–21 తేదీలలో పారిస్లో జరిగిన "రాజకీయ ఖైదీలకు మద్దతుగా అంతర్జాతీయ సదస్సు"కు పాలస్తీనా, కుర్దిస్తాన్, టర్కీ, ఇటలీ, జర్మనీ, డెన్మార్క్, బెల్జియం, ఫ్రాన్స్, బ్రిటన్, భారతదేశం, ట్యునీషియా, చిలీ, ఆస్ట్రియా, ఫిలిప్పీన్స్, కెమరూన్, ఇరాన్, స్పెయిన్, స్విట్జర్లాండ్, పెరూ, గ్రీస్, మెక్సికో దేశాలకు చెందిన విప్లవకర, పోరాట సంస్థలు, వక్తలు హాజరయ్యారు. ఈ సదస్సు ముగింపు తీర్మానంతో—ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఖైదీలతో అంతర్జాతీయ సంఘీభావాన్ని తెలియచేస్తూ, ప్రజలు సాగిస్తున్న పోరాటాలు, ప్రతిఘటనల మార్గాన్ని వెలిగించే ఒక ప్రాథమిక శక్తిగా తీర్చిదిద్దడానికి మా ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాము. సామ్రాజ్యవాద


