వ్యాసాలు

దియే జల్తే హై!

రాజేంద్రబాబు అర్విణి అది అక్టోబర్‌ 6 2021. రాంమోహన్‌ కు రోజూ 6, 7 కిలోమీటర్లకు తక్కువకాకుండా మార్నింగ్‌ వాక్‌ చేసే అలవాటు. వనస్థలిపురం లో పార్కులు, రోడ్లు అన్నీ కలగలిపి తిరిగేవాడు. ఆ రోజు కూడా మార్నింగ్‌ వాక్‌ లో భాగంగా దాదాపు 6 కిలోమీటర్ల నడక పూర్తి చేసాడు. ఎప్పటి లాగా దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాడు. అనారోగ్య లక్షణాలు చూచాయగా కూడా ఏమీ లేవు. ఆ రోజు... ఆ క్షణాలు... ఆ కాలం అలాగే ఘనీభవించి పోయి ఉంటే ఎంత బాగుండేది! ఆ తర్వాత మూడవ రోజు... అది అక్టోబర్‌ 9 - ఆ
వ్యాసాలు

మ‌న‌  కాలపు మావోయిస్టు జీవన సందేశం

ప‌ద్మ‌కుమారి (అమ‌రుల బంధు మిత్రుల సంఘం త‌ర‌పున అచ్చ వేయ‌ద‌ల్చుకున్న సాయుధ‌ శాంతి స్వ‌ప్నం పుస్త‌కానికి ప్రచురణకర్తగా రాసిన ముందుమాట‌) కా. మున్నా అమరుడయ్యాక   ఆర్‌కే నాకు పదే పదే గుర్తుకొచ్చాడు.  శిరీష దు:ఖాన్ని దగ్గరిగా చూశాను కాబట్టి.. ఇప్పుడు ఆర్‌కే మనసు ఎలా ఉంటుంది? అనే ఆలోచన కలిగింది.  ఉద్యమంలో   పని చేసిన రోజుల్లో ఆయన నాకు తెలుసు. ఇప్పుడు    ఈ విషాదంలో ఎలా ఉండి ఉంటాడో అనుకున్నాను. రాంగుడా ఎన్‌కౌంటర్‌లో మున్నాతోపాటు మరో ముప్పై ఒక్క మంది అమరులయ్యారు. ఇంత మంది దుఃఖాన్ని ఆయన మోయాల్సి వచ్చింది కదా అనిపించింది.                 కుటుంబ వ్యవస్థలో నాది
వ్యాసాలు

రోనా: జన హృదయాల్లోనిప్రతిఘటనా స్వరం

బి‌కె -16  కేసులో కటకటాల వెనుక ఉన్న కార్యకర్త రోనా విల్సన్ క్రియాశీలత ఫాసిస్టు  రాజ్యాన్ని      లక్ష్యంగా చేసుకొంది. కేరళలోని కొల్లంలో పెరిగి, 1990 ల ప్రారంభంలో న్యూఢిల్లీకి వెళ్ళిన రోనా తన అరెస్టు వరకు తన జీవితాన్ని అక్కడే గడిపాడు. దక్షిణ ఢిల్లీలోని మునీర్కా గ్రామంలో అద్దెకు తీసుకున్న ఒక గదిలో పూనే, ఢిల్లీ పోలీసుల సంయుక్త చర్యలో రోనాను అరెస్టు చేశారు. జంతుశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పొందిన తరువాత, రోనా తాను  కృషి చేయాల్సింది ఆ రంగం కాదని గ్రహించి, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్‌లో తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి
వ్యాసాలు

“ఎన్నికల బహిష్కరణ” నినాదం – ప్రాముఖ్యత

(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు  జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం ) ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని  వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్
వ్యాసాలు

ప్రసంగించాడని అరెస్ట్ చేశారు

2023 అక్టోబర్ 28 తెల్లవారుజామున 4 గంటలకు సర్వ ఆదివాసీ సమాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్ తిరుమల్ సర్జూ టేకమ్‌ను ఒక కార్యక్రమంలో ఉపన్యాసం యిచ్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని మాన్‌పూర్ జిల్లాలోని అతని నివాసం నుండి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 295A, 153A, 506B, 435, 34 కింద, అబద్ధపు ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. భారతదేశంలోని సహజ వనరులు అధికంగా ఉన్న బస్తర్‌లో జరుగుతున్న కార్పొరేటీకరణ, సైనికీకరణలకు వ్యతిరేకంగా సర్జూ టేకం తన స్వరాన్నెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆ ప్రాంతంలోని భూమి, సహజ వనరులను దోచుకోవడానికి వీలు కల్పించడానికి అనేక మంది ఆదివాసీలను
వ్యాసాలు

జాతీయ విద్యా రాజకీయాలు

జాతీయ విద్యా విధానం-2020(జా.వి.వి.)ని భారత యూనియన్ ప్రభుత్వం కేవలం ఒక ప్రకటన ద్వారానే పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పార్లమెంటులో ఎటువంటి చర్చ గాని, ఆమోదం గాని లేకుండానే ప్రవేశపెట్టబడిన ఈ జా.వి.వి. కవర్ పేజీ సరిగ్గా జా.వి. వి-1986 కవర్ పేజీ లాగే కనబడుతుంది. ఆ తర్వాత రాష్ట్రపతి, ఆర్థిక మంత్రుల ప్రసంగాలలో దీనిని అత్యంత గొప్పదిగా ప్రశంసించారు. ఇప్పటికే ఇందులోని అనేక అంశాలను అమలులోకి తీసుకొచ్చారు. ఇంకా ఇతర అంశాలను తన అధికారిక ప్రకటనలు, మెమొరాండాల ద్వారా యూనియన్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలను, అకడెమిక్ సంస్థలను  కూడా త్వరగా అమలు చేయమని ఒత్తిడి చేస్తోంది. నిజానికి
వ్యాసాలు

నా అనుభ‌వాలు

ఒక గ్రామంలో  –పిల్లల దగ్గర నుండి..  మంచికంటి             ఊహ తెలిసినప్పటి నుండి సంఘర్షణ...   బతకడంలో సంఘర్షణ... చుట్టూ ఉన్న మనుషుల మధ్య సంఘర్షణ... అర్థం కాని ఎన్నో రకాల జీవితాలు...  ఉపాధ్యాయ వృత్తి లోకి ప్రవేశించిన తరువాత అక్కడ కూడా  సంఘర్షణ. ఉండాల్సినవి ఉండాల్సినట్టు కాకుండా... చేయాల్సిన వాళ్లు చేయాల్సిన పనులు చేయకుండా ఉండడం ఎంతో బాధ... ఎంతో అసహనం....            మనం ఏమీ చేయలేమా! చెయ్యాలి.... ఏదో చేయాలి.. బాల్యం నుండి  ఉన్న ఆలోచన అదే. గ్రామంలోనూ బడిలోనే  కాదు.. జీవితంలో కూడా ఏదో చెయ్యాలి... ఏదో సాధించాలి.. ఇలా  ఎన్నో అర్థం కాని
వ్యాసాలు

నిరంతర చలనశీలి, 

పాలమూర్‌ అపురూప హృదయం రామ్మోహన్‌సార్‌ విద్య నారాయణస్వామి           1985   జనవరి 12 రాత్రి పది దాటింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ లో  ఉన్నం మేము నలుగురం. చాలా చలిగా ఉండినదా రాత్రి. పొగమంచు కురుస్తున్నది. ఊపిరి తీసి వదిలితే పొగ వస్తున్నది సిగరెట్‌ తాగినట్టు. మాకది గమ్మత్తుగ ఉండెడిది. ఇగ సిగరెట్‌ యెందుకు ఇట్లే పొగ మబ్బులు చేస్తె చాలు అనుకునెటోల్లము. ఆ సాయంత్రం చాలా సేపు శివారెడ్డి సార్‌ దగ్గర ద్వారకా లో గడిపిన. ‘రాత్రికి  గద్వాల పోతున్నం సార్‌’ అన్న.           ‘విరసం సాహిత్య పాఠశాల జరుగుతున్నదక్కడ మేమంత కలిసి పోతున్నం’ అన్న  ‘తప్పకుండ
వ్యాసాలు

గులాం మహమ్మద్ భట్ కాళ్ళకి జిపిఎస్ బెల్ట్

యూఏపీఏ, తీవ్రవాద సెక్షన్ల కింద నిందితుడు, ఢిల్లీలోని ఎన్‌ఐఏ పాటియాలా కోర్టు దోషిగా నిర్ణయించిన గులాం ముహమ్మద్ భట్‌కు జమ్ము ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు, అతని పాదాలకు జీపీఎస్ బెల్టును (గ్లోబల్ పోసిషనింగ్ సిస్టమ్- అతను ఎక్కడ వున్నాడో తెలియచేసే పరికరం) ధరించాలని ఆదేశం యిచ్చింది. అతని పాదాలకు ఆ బెల్ట్ వేశారు కూడా. ‘ది సండే ఎక్స్‌‌ప్రెస్’ తొమ్మిదవ పేజీలో ప్రచురించబడిన ఈ వార్త ఒక అధికారిని ఉటంకిస్తూ: "ప్రాసిక్యూషన్ చేసిన వాదన ఆధారంగా, ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు, నిందితుడి కాలుకి జీపీఎస్ ట్రాకర్లను అమర్చమని జమ్ము, జమ్ము- కశ్మీర్ పోలీసులను ఆదేశిస్తే
వ్యాసాలు

నిండైన ఆలోచనాపరుడు రామ్మోహన్‌సార్‌

పాణి           రామ్మోహన్‌ సార్‌కు ఆరోగ్యం బాగోలేదని, ఆయన కోసం పుస్తకం తీసుకరావాలనుకొని రాఘవాచారిగారు వ్యాసం రాయమన్నారు.  తనతో కలిసి జీవిస్తున్న వారు తన గురించి ఏమనుకుంటున్నదీ, ఈ   ప్రపంచ కల్లోలాలపై  వేర్వేరు సందర్భాల్లో ఆయన చేసిన విశ్లేషణల్లో ఏమున్నదీ ఒక చోటికి చేర్చి రామ్మోహన్‌సారుకు అందించాలని పాలమూరు అధ్యయన వేదిక అనుకున్నది.             మామూలుగా అయితే ఇలాంటి పుస్తకం చదివాక రామ్మోహన్‌సారు తప్పన  ఏదో ఒక సునిశిత వ్యాఖ్య చేసేవారే. కానీ ఇంకా పుస్తకం పని పూర్తి కాక ముందే ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దాంతో అప్పటికి సేకరించిన వ్యాసాలను ఒక పుస్తకంగా కూర్చి ఆయన చేతిలో