గుడి కట్టి దేశం గాయాన్ని మాన్పగలమా?
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ సమక్షంలో, కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాణం ప్రారంభమైన రామ మందిరం శిఖరంపైన జెండాను ఆవిష్కరిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ ధ్వజారోహణం రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలియజేస్తుంది అని అన్నాడు. “శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయి, ఉపశమనం కలుగుతోంది; వందల సంవత్సరాల క్రితం తీసుకున్న సంకల్పాలు నెరవేరుతున్నాయి!” అని కూడా అన్నారు. ఆయన పదేపదే రాముని నామాన్ని ఉచ్చరించాడు; మన అంతరాత్మలో కొలువైన రాముడు, రామరాజ్య భావన నుండి ప్రేరణ పొందిన దేశాన్ని స్థాపించాలని పిలుపునిచ్చాడు. ఈ కార్యక్రమం సమాజంలోని కొన్ని వర్గాలలో ఉత్సవ వాతావరణాన్ని సృష్టించింది;










