తెలంగాణలో మళ్లీ ఎన్కౌంటర్లు
చరిత్ర మళ్లీ మొదటికే వచ్చింది. తెలంగాణలో మళ్ళీ ఎనకౌంటర్లు మొదలయ్యాయి. మూడేళ్ళ తరువాత మళ్ళీ తెలంగాణ నేల విప్లవకారుల రక్తంతో తడిసింది. జూలై 25న దామరతోగు అడువుల్లో జరిగిన కాల్పులలో నలమారి అశోక్ అలియాస్ విజేందర్ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. మరొక వైపు అనారోగ్యంతో ఉన్న అశెక్ను పట్టుకుని చంపివేసినట్టు విప్లవ పార్టీ ప్రకటించింది. వీటిలో వాస్తవాలు ఏవైనా.. ఎన్కౌంటర్ల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటని తేలాల్సి ఉన్నది. ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని అడగవల్సిన ప్రశ్న ఇది. ఒక్క ఎన్కౌంటర్కే ఇలా అడగవచ్చునా? అనేవాళ్లు కూడా ఉంటారు. కానీ ఇది ఇక్కడితో ఆగే వ్యవహారం










