కథలు

“గూగు” కథ 

విశాఖపట్నం సముద్రపు గాలిలో ఇప్పుడు ఉప్పు వాసన లేదు. దానికి బదులుగా కాలిపోయిన రాగి తీగలు, వేడెక్కిన సిలికాన్ బోర్డుల వాసన గాలిలో నెమ్మదిగా, ఒక దీర్ఘకాలిక వ్యాధిలా వ్యాపిస్తోంది.  సాయంత్రం వేళ కొండల మీద పడే ఎండ కూడా సహజమైన రంగును కోల్పోయి, ఎల్‌ఈడీ స్క్రీన్ మీద వెలుగుతున్న పాలిపోయిన పసుపు రంగులా కనిపిస్తోంది. నగరంలో ఎవరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు, కానీ అందరి కళ్ళలో ఒక నిశ్శబ్దమైన, అర్థంకాని అలసట. అన్నిటికంటే విషాదకరమైన విషయం ముడసర్లోవ జలాశయం. రాత్రికి రాత్రే ఆ జలాశయం ఎండిపోవడం మొదలైంది. కానీ నీరు మామూలుగా ఆవిరి కావడం లేదు. ఆ
సమీక్షలు

నిశిత విశ్లేష‌ణ‌

తొమ్మిది విభిన్న అంశాల పుస్తకాల సమీక్షా వ్యాసాల పుస్తకం *నిశిత*. రచయిత విరసం సీనియర్లలో ఒకరైన చెంచయ్య గారు.  ఈ పుస్త‌కం వ‌చ్చిపదేండ్లైనా సాహిత్య కారులకు నిరంతర అవసరమైన సాహిత్య విమర్శ అయినందున ఈ వ్యాసాలకు కాలం తీరదు. "నిశిత" అనే ఈ పుస్తకం పేరు నూరుపాళ్ళు సార్థకమని మనం ఒప్పుకొని తీరుతాం. ఇందులో పరిశీలన నిశితమైనదే. కానీ చెంచయ్య గారి వ్యక్తిత్వం నుండి చెప్పిన తీరు "వ్యక్తిత్వమే సాహిత్య విమర్శ"  అనిపిస్తూంది.  "కవిలో చిత్తశుద్ధి ఉంది- అవగాహనే కొరవడింది" అనే సమీక్షా వ్యాసంలో కవిత్వం రాసే వాళ్లలోని గందరగోళాన్ని వివరించారు. సరియైన అధ్యయనం లేకపోవడం వల్ల కవిత్వంలో
సాహిత్యం వ్యాసాలు

నైతిక , మత , వ్యంగ్యాత్మకాలు

(1829లో వేమన పద్యాల కూర్పుకు బ్రౌన్‌ రాసిన ఇంగ్లీషు ముందుమాట)  తెలుగు: సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌ ఏదైనా ఒక భాషను అధ్యయనం చేయాలని అనుకున్నప్పుడు మనం సహజంగానే దేశీయులలో ప్రజాదరణపొందిన పుస్తకాలను గురించి తెలుసుకోవాలని అశిస్తాం. ఆ పుస్తకాలు సరళమైన శైలిలో వుండి విదేశీయులు కూడా తేలికగా అర్థం చేసుకునేటట్లు వుండాలని అనుకుంటాం. తెలుగుకు సంబంధించి 1824లో ఇలాంటి పరిశోధన ప్రారంభించాను. ఆ సందర్భంగా ఈ పుస్తకంలో ప్రచురించిన పద్యాలతో నాకు పరిచయం కలిగింది. ‘వేమ’ లేదా ‘వేమన’ (రెండు పేర్లూ వాడుకలో వుండేవి) రచించిన అనేకమైన రాత ప్రతులు నాకు లభ్యమయ్యాయి. నేను వాటిని చదివి నా ఉద్యోగబాధ్యతల్లో