పరిచయం

జీవించి ఉండగానే తన శ్రద్ధాంజలి రాసుకున్న విదర్భ రైతు

'గ్రామీణ ప్రాంతంలో ఘోరమైన ఏదో తప్పు జరుగుతోంది.' -ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్, 2005 యాభై ఏళ్ల రైతు శ్రీకృష్ణ కలంబ్ 2008 మార్చి 24న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  రెండు రోజుల ముందు, తన మరణానంతర నివాళిని తానే రాసుకున్నాడు. కేవలం ఆరు లైన్ల ఆ నివాళిని తన చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బ్రిటిషర్లు బరార్‌[i] గా పిలిచే పశ్చిమ విదర్భ ప్రాంతంలో మాట్లాడే మరాఠీ మాండలికం అయిన స్వచ్ఛమైన వర్హాడీలో, అది ఇలా  మొదలవుతుంది: మీ ఆగలా వెగలా, మాహి న్యారిచ్ జిందగాని; మహ్యే మరణ భీ ఆహే, జసే అవకలి పాని. నేనో ప్రత్యేకమైన