కవిత్వం

అంతిమయాత్రలు

ఉద్వేగపు అడుగులుఉప్పొంగిన కన్నీళ్లుఊరంతా విషాదందారిపొడవునాప్రతి పల్లెఅమరుడు హనుమంతన్నకిపూలతో, తమ కన్నీళ్లతో విప్లవ నినాదాలతోజేజేలు పలికాయిపుల్లెంల నిండా మోదుగుపూలువిరబూసినట్లుగాఎర్రజెండాల రెపరెపలుఆ ఎర్రజెండాలతోఎర్రబారిన ఆకాశంఎగిసిన ఉక్కు పిడికిళ్లుఅమర్ రహే అమర్ రహేహనుమంతన్న అమర్ రహేదిక్కులు పిక్కటిల్లేలాకళాకారుల ఆటలు పాటలుపోలీసుల పికెటింగ్పల్లె నిండా రాజ్యం ఆంక్షలుఅయినాఉసిల్ల పుట్ట పగిలినట్లుగా15 వేల మంది తరలొచ్చారుఇంతకుహనుమంతన్నఎవరికి ప్రత్యక్షంగా తెలుసు..?ఎవరికీ తెలవదు.కానీ అందరి మనసులనుకలియతిరిగాడుఅందరి ఆలోచనల్లోభాగమయ్యాడుఅందుకే అందరి నోళ్ళలోహనుమంతన్న నిండిపోయాడువాళ్ళ మాటల్లో, వాళ్ళ పాటల్లో. పల్లెలో ప్రతీ ఇల్లుదుఃఖపోయడంప్రతీ వ్యక్తి కన్నీరు కార్చడంఆ కన్నీళ్లలో కామ్రేడ్ల త్యాగాలకు నివాళులర్పించడంమొన్న హిడ్మా,నిన్న హనుమంతన్న అమరులందరిఅంతిమయాత్రలుతెలియజేస్తున్నవి ఒక్కటే.."ప్రజావీరులు మృత్యుంజయులు,విప్లవం వర్ధిల్లునని"
కవిత్వం

మరణాన్ని గెలిచే యుద్ధం

ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునివచ్చిన దారిలోనికలుపు మొక్కలను ఏరుకుంటూభుజం భుజం కలుపుతూమునుముందుకు సాగుదాంయుద్ధం మధ్యలో తుపాకీనిశత్రువు చేతిలో పెట్టినవాళ్ళ నవ్వులను తిప్పికొడుతూఅమరుల రెప్పల మాటున దాగినకలల సాకారం కోసం సాయుధమవుదాంవర్గ పోరాటం ఎప్పుడూముగిసిపోదు కదాఒకరు ఆపేస్తే ఆగేది కాదిదిపిరికి గుండెలకు చోటు లేనిదిమెలకువను మింగే మాయ తెరలనుఛేదిస్తూ ఉదయాస్తమయాల మధ్యనిత్యమూ సాగె బడలిక ఎరుగనిసుదూర ప్రయాణం కదాఅణగారిన ప్రజల హృదయాలేస్థావరాలుగా యుద్ధం చేసే వాళ్ళకిచివరి మజిలీ ఎన్నడూ లేదు కదాఇది మరణాన్ని గెలిచే యుద్ధం!మాతృత్వాన్ని ప్రేమించే యుద్ధం!మనుషులను కలిపే యుద్ధం!!
కవిత్వం

మణిపూర్ ఒక్కటే! సీతలే అనేకం

మలయ మారుతాలెక్కడివి దేశం నిండా ముళ్ల కంచలే పచ్చని పంటలాంటి పైటలెక్కడివి రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే వున్నది నా శరీరానికి రంగేమిటని నన్నడగబోకు ఏ జాతికి చెందినదాన్నో నన్నడగబోకు సిరి సంపదలున్న దేశంలో సీకులు దిగిన దేహం నాది గంగా నదిలో పారుతున్నది ఏమిటని ఇంకా నన్ను అడగబోకు సరస్వతీ దేవిని చావబాదిన చరిత్ర నీది లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది పార్వతీ దేవిని చెరిచిన మేధస్సు నీది తిరంగ జెండాను చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది ఫాసిజంలో ఫస్టు
కవిత్వం

మణిపూర్ మినిట్స్

అక్కడి మందార పూల రంగులన్నీ మా అక్కల నెత్తుటితో అద్దిన మెరుగులే...! అక్కడి వాకిట్లన్ని మా చెల్లెల కన్నీళ్ళతో అలకబడినవే....! అడుగు నేల కోసం అంటుకున్న మంటలు కావవి…! పాలకులే ఉత్ప్రేరకాలై ఉసిగొల్పబడ్డ అల్లర్లే…! మణిపూర్ ఇప్పుడు సర్జరీకి నోచుకోలేక పోస్టుమార్టంకు దగ్గరవుతున్న రోగి..! ఏ కృష్ణుడి సాయాన్ని నోచుకోని ద్రౌపది...! రామరాజ్యంలో ఊరేగే శవాల బండిపై ఎందరో తల్లుల కన్నీళ్ళ వడపోత...! అంతా ఆంతమయ్యాకా మణిపూర్ మినిట్స్ అంటూ ఆ మంటల సెగలను దేశమంతా వ్యాపితం చేసే మతోన్మాద పాలకుల చేతుల్లో ఓట్ల సాగరమైంది...!
కవిత్వం

కన్నీటిని రాల్చకు

నాకోసం కన్నీటిని రాల్చకండి వీలైతే కొన్ని అక్షరాల ఆమ్లాన్ని జల్లండి దీనంగా చూస్తున్న ఈ నాలుగు దిక్కులు అంతమవ్వని.. నా మీద జాలి చూపకండి కొన్ని పల్లేరు కాయల్ని నాటండి రేప్పొద్దున ఆ దారి గుండా నడిచే మత రాజకీయాల కాళ్ళను చీల్చనీ.. నాపై అమాయక స్త్రీ అని ముద్ర వేయకండి ఈ నీచ సంస్కృతి, సంప్రదాయాలను బోధించిన మత గ్రంథాల, కుల గొంతుకలకు నిప్పెటండి కాలి బూడిదవ్వని.. నన్ను ఇలానే నడిపించండి కశ్మీర్ నుండి కన్యాకుమారి దాక 21 వ శతాబ్దపు దేశ నగ్న చరిత్రను పుటలు పుటలుగా చదివి కాడ్రించి ఉమ్మనివ్వని.. నా తరపున న్యాయ
కవిత్వం

నగ్నదేహం

నగ్న దేహమొకటి దేశాన్ని కౌగిలించుకున్నది ఖైర్లాంజి ,వాకపల్లిని భుజాల మీద మోస్తూనే దేశాన్ని వివస్త్రం చేసింది లెక్కకు మించిన గాయల్ని తడిమి తడిమి చూపుతోంది ఇప్పుడా నగ్నదేహమొక దిక్సూచి.. పొదలమాటు హత్యాచారమే ప్రజాస్వామ్యపు తెరనెక్కి మంటల్లో కాలిన పిండాలని మర్మస్థానంలోని కర్రలనీ ఎత్తిచూపుతోంది ఇప్పుడా "హత్యా"చారమే ఈ దేశపు ముఖచిత్రం న్యాయం కళ్ళు మూసుకున్నది సహజంగానే.. చూసే కండ్లుoడాలి గానీ ఇప్పుడీ అడవులు నదులు మనుషులు ప్రతి అణువూ మానభంగ భారతమే తగలపడ్డ దేశంపై మూగి వెచ్చగా చలి కాచుకుంటున్న పవిత్రులారా రక్తం స్రవిస్తున్న దేశంపై జాలి జాలిగా ముసురుకున్న సున్నితులారా చెప్పండి చెరచబడ్డది ఎవరు? ఆమె నా
కవిత్వం

ఊరేగింపు

అనాదిగా మన పుర్రెల నిండా నింపుకున్న నగ్నత్వం వాడికిప్పుడొక అస్త్రం అయింది ఆ తల్లుల దేహ మాన ప్రాణాలను నగ్నంగా ఊరేగించి భయపెట్ట చూస్తున్నాడు వాడి వికృత చూపుల వెనక దాగి వున్నది మణిపూర్ ఒక్కటేనా కాదు కాదు కాదు దండకారణ్యం నుండి మలబారు వరకూ దేశ శిఖరంపైనున్న కాశ్మీరు దాకా ఎన్నెన్ని దేహాలను మృత కళేబరాలను నగ్నంగా ఊరేగించాడు వారి కాలికింద నేలలోని మణుల కోసం గనుల కోసం బుల్డోజర్తో ఊరేగుతూ బరితెగించి పెళ్లగిస్తూ వస్తున్నాడు వాడు నవ్వుతూనే వుంటున్నాడు దేశం ఏడుస్తూ వున్నప్పుడు దేహం రక్తమోడుతున్నప్పుడు పసిపాపల దేహాలు నలిపివేయబడుతున్నప్పుడు స్రీత్వం వాడికో ఆయుధం దానిని
కవిత్వం

వడ్డెబోయిన శ్రీనివాస్ మూడు కవితలు

1 ఆధునిక రామాయణం విద్వేషం తెంపిన తల వెదురు మనిషైంది నెత్తురొడుతున్న ప్రశ్నలా కళ్ళుమూసుకొని ఈ దేశం కళ్ళల్లోకి చూసింది మనిషిని పశువుకన్న హీనం చేసిన విలువల్ని గర్భీకరించుకున్న శవపేటిక మీది కౄరజంతువుల్ని దేశం నిండా విస్తరించిన అన్ని దిక్కుల్ని ధిక్కరిస్తూ మూసిన పెదాల్తో నవ్వింది 'అబ్దుల్ కలామ్ ప్రథమ పౌరుడైయ్యాడు గుజరాత్ ముస్లిం నెత్తుట్లో దాండియా ఆడాక దళిత రుధిరవర్షం ఉత్తర భారతాన్ని ముంచి వేస్తున్నప్పడే దళిత కోవిందు కొత్త ప్రథమ పౌరుడైయ్యాడు ఆదివాసీ ముర్ము ప్రథమ పౌరురాలైయ్యాక మరణ మృదంగ విన్యాసాలు ఆదివాసి కొండలు లోయలు అడవుల్లోకి విస్తరించాయి' హహహ అని అరిచింది కవులకు కళాకారులకు
కవిత్వం

జ్ఞాపకాన్ని పదిలంగా దాచుకుంటా

సాగిపోతున్న కాలంలో రాలిపోతున్న పువ్వులెన్నోబతికినంత కాలం సువాసనలు వెదజల్లాలని ఎంత పరితపించేనోఅందుకే నేలను తాకుతుంటే దుఃఖం ఆగట్లేదుఎర్రని మోదుగుపూలంటేనే ఎందుకిష్టమని ఎవరైనా అడిగితే సమాధానం ఒక్క మాటతో ఆగదు ప్రవాహమై సాగుతూ అమరత్వం దగ్గర ఆగుతుందిచీకటి అలుముకున్న ఈ అడవిలో ఎంతోకొంత కాంతినిచ్చేదిఆ మోదుగుపూలేనాలాంటి బాటసారికి దప్పిక తీర్చేవి కూడా అవేఅందుకే కాసింత ఎక్కువ ప్రేమ నరికివేతలో ఒక్కో పువ్వు నేల రాలగానే చాటుంగానైన ఏరి తెచ్చుకుంటాఆ పరిమళపు జ్ఞాపకాన్నిపదిలంగా దాచుకుంటా.
కవిత్వం

“రద్దు”

నగ్నంగా ఊరేగించబడింది అత్యాచారం గావించబడింది అత్యంత దారుణంగా హత్యగావించబడింది ఆదివాసీలు, అడవి బిడ్డలు మాత్రమే కాదు. ఇంకేదో.. ఇంకా ఏదో, ఏదేదో... * బలహీనుల ఎదుట అధికారం అస్సలు మాట్లాడదు నిశ్శబ్దంగా తన పనేదో తాను చేసుకుంటూ వెడుతుంది. హక్కుల్నే కాదు మాన ప్రాణాల్ని రద్దు చేసేస్తుంది మీరింకా పాఠాలు మాత్రమే మారిపోయాయని, అనుకుంటున్నారు. చిన్నప్పటినుండి చేస్తున్న 'ప్రతిజ్ఞ 'ను కూడా మార్చేసిన విషయం ఇంకా తెలియదు. మనుషులందరూ సమానం కాదని అందరూ సోదర సోదరీమణులు కాదని అందరికీ హక్కులు ఉండవని వాళ్లు కొత్త గొంతుతో ప్రతిజ్ఞ మొదలుపెట్టేశారు * నోట్ల కన్నా ముందే స్త్రీత్వం, మనిషితనం ఆత్మగౌరవం,