2025లో రికార్డు స్థాయిలో జర్నలిస్టుల మరణాలు: బాధ్యత ఇజ్రాయెల్దే
2024-2025 సంవత్సరాలలో జరిగిన జర్నలిస్టుల హత్యలలో మూడింట రెండు వంతుల బాధ్యత ఇజ్రాయెల్ మీద ఉన్నప్పటికీ, పాకిస్తాన్లో జర్నలిస్టులు ప్రేవెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ -2016 (పిఇసిఎ) కింద వేరే రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టుస్ (పిఎఫ్యుజె) సెక్రటరీ జనరల్ అర్షద్ అన్సారి మాట్లాడుతూ, 2025 సవరణ తర్వాత పిఇసిఎ కింద 500 మందికి పైగా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. న్యాయపరమైన కేసులు, అరెస్టులు, బెదిరింపులతో సహా జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిడితో పాకిస్తాన్ పోరాడుతున్నప్పుడు, జర్నలిస్టులను రక్షించే కమిటీ (సిపిజె) రూపొందించిన కొత్త ప్రపంచ నివేదిక- 2025 ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా










