సాహిత్యం కవిత్వం

దినమొక గండం పగలొక రాత్రి

రక్తంరుచి మరిగిన వలస రాబందులు వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని రాజ్యం రక్షణే ధ్యేయంగా మా విప్లవ కేంద్రాలకు వలస సాచ్చాయి "సమాధానో"ప్రహార దాడులలో రణరక్కసి ధ్యేయంగా రక్త దాహపు వేట రాజ్యానికి పసందైన ఆట. నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ రాజ్య నిర్బంధ శిబిరం 40 ఏళ్ల ఆవల నుంచే ఇక్కడ ఆ ఖాకీలకు మా రక్తం శీతల పానీయం మా శరీరపు మాంసపు ముద్దలు పంచభక్ష పరమాన్నాలు కానీ మా రక్తం   నిరంతర ప్రవాహం మా శరీరం అఖండితం స్మశాన ప్రశాంతత కోసమని హింస ప్రతి హింసల మధ్య యుద్ధ ఛాయలలో ఇప్పుడు ఊరు
సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

వాళ్లిద్దరు

ప్రజల ప్రయోజనాలే ప్రాణంగాబతికిన వాళ్లు, వాళ్లిద్దరుఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగినల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొనిశత్రువుకు నిద్ర పట్టనీయనివిప్లవ శ్రేణులకు సేనానిమరొకరు ప్రేమ మాత్రమేచైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందనిబలంగా నమ్మి ఆచరించినవాడువిప్లవ శ్రేణుల గుండెల్లో నెలవైశత్రు సేనలపైకి ఉరికించినవాడుఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులనుకోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదునూతన సమాజాన్ని ప్రసవించేపుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడాఇప్పుడు గుండెల నిండా కర్తవ్యంజయించాలనే తపన, జ్ఞానం కోసం మధనంచలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటంఅమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూమరింత దృఢంగా ప్రజల పక్షంఅందుకేఓటమి తాత్కాలికంగెలుపు ఖాయం! (కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
కథ..కథయ్యిందా! సాహిత్యం కాలమ్స్

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను
కథలు

ప్రవాహం

(కా. మిడ్కో గా పాఠకులకు సుపరిచితమైన కా. జి.రేణుక స్వస్థలం వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామం. తిరుపతిలో ఎల్‌ఎల్‌బి చదువుతుండగా “మహిళాశక్తి” సభ్యురాలిగా మహిళా ఉద్యమంలో పనిచేసింది. 1995 లో మహిళా శక్తి మరొక 9 సంఘాలతో కలిసి చైతన్య మహిళా సంఘంగా ఏర్పడిన తరవాత రాష్ట్రవ్యాప్త మహిళా ఉద్యమంలో తిరుపతి కేంద్రంగా 2000 వరకూ విశాఖపట్నం కేంద్రంగా 2004 వరకూ పనిచేసింది. మహిళామార్గం పత్రిక లో సంపాదక వర్గ సభ్యురాలుగా పనిచేసింది. తరవాత 2004 లో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకుని ఆంధ్ర ఒడిష బోర్డర్ జోన్ లోనూ, దండకారణ్యంలోనూ పనిచేసింది. అనేక కలం పేర్లతో 30 కి
సాహిత్యం కవిత్వం

అమాయకులు వాళ్ళు

అవును, వాళ్ళు  భ్రమల్లోనే వున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య చంద్రుడు వెన్నలకాంతులు విరాజిమ్ముతుంటే, కానన కారుచీకట్లో వెలుగుకై వెదుకుతున్నఅమాయకులు వాళ్ళు పచ్చని పంట పొలాలపై కార్పొరేట్ గద్దలు వాలుతుంటే, పంటను కాపాడే రైతన్న  వడిసెల విసురు నేరమైన చోట ప్రశ్నించిన ప్రతివాడూ దేశద్రోహయిన  నేతి బీరకాయ ప్రజాస్వామ్యం లో హక్కుల నేతికై దేవులాడక ,  ఫాసిస్ట్ ఎడారిలో సామ్యవాద ఒయాసిస్ కై దేబరించని అజ్ఞానులు వాళ్ళు.   కులం,మతం పేరుతో మానవత్వం మంటగలుస్తున్న మహోన్నత భారతంలో, హక్కులకై గొంతెత్తిన ప్రతివాడు అర్బన్ నక్సల్ దేశద్రోహి,పాకిస్తానీ ఏజెంట్ అయిన నేల ఎన్నికల చదరంగంలో పావులుగా మిగలక, బిర్శాముండా,కొమురం భీమ్ పంథానవసరంగా పట్టిన
ఎరుకల కథలు

దేనికీ భయపడొద్దు

“ దీన్ని టీ అంటారా ?  ” మొగిలప్ప గొంతు మెత్తగా వుంది. పైకి గట్టిగానే  అంటున్నట్లున్నా  ఆ గొంతులో ఏదో కోపం, ఉక్రోషం, నిరసన ఉన్నాయి,  కానీ అంతగా గట్టిగా మాట్లాడలేక పోతున్నాడు.ఆ  గొంతులో ఏదో మొహమాటం, బెరుకు. నాకు చప్పున అర్థం కాలేదు. కానీ నేను ఆలోచించే లోపే మొగిలప్ప గొంతు సవరించుకుని  బెరుగ్గా  “ స్టీల్ గ్లాస్ లోనే టీ  ఇవ్వు రెడ్డీ , వేడిగా  వుంటుందని ఎన్నోసార్లు చెప్పింటా.  అయినా నువ్వు ఆ ప్లాస్టిక్ కప్పులోనో , పేపర్ కప్పులోనో ఇస్తావు. టీ అస్సలు తాగినట్లే వుండదు రెడ్డీ ..  ” అంటున్నాడు
సాహిత్యం కవిత్వం

ఆకాంక్ష

శిశిరం లో రాలిన ఆకులుగలగలంటున్నాయ్వాడి గుండెల్లో అలజడిఅడుగులెవరివని కలంలో కాలాన్నిప్రశ్నించే అక్షరాలు తూటాల్లాదూసుకొస్తుంటేబుల్లెట్ ప్రూఫ్ అద్దాల మాటునవాడు కాపురం వసంతంలో చిగురిస్తున్నమొక్కల మాటునదాగే ప్రశ్నవిరుచుకుపడుతుందని వాడి వెన్నులో వణుకు నాటిన ప్రతి మొక్కఓ ఆయుధ భాండాగారమౌతుందేమోననికలవరింతకాకులే కాపలాగాఅరిచే అరుపుఎరుపై మూకుమ్మడి దాడి చేస్తారేమోననేభావి స్వప్నం వాడ్ని నిదుర పోనీయట్లేదేమో శరదృతువు లోకాచే వెన్నెల్లోపల్లె బతుకుల్లో వెలుగులు నింపే దారులు వెతికే పనుల్లో సేద్యగాళ్ళు వాడ్నినిలువెత్తు గొయ్యిలోపాతరేసి హేమంతాన్ని ఆహ్వానిద్దామనేఆకాంక్ష నేడు కాక పోయినా రేపైనానెరవేరుతుంది లే