కథలు సాహిత్యం

సుబ్రమణ్యం కంట తడి

ఒకప్పుడు సుబ్రమణ్యం మా ఇంటికి రోజూ వచ్చేవాడు. ఎక్కువగా పొద్దున పూటే. ప్రత్యేకించి నాతో పనేమీ ఉండనక్కర్లేదు. అమ్మతో, జయతోనే పలకరింపు, అదీ ఎంత సేపు, అమ్మ ఇచ్చే కాఫీ తాగే వరకే. ఎప్పుడన్నా ఆలోగా బయల్దేరబోతే ‘సుబ్బూ కాఫీ తాగి వెళ్లూ..’ అని అమ్మ ఆపేది. అట్లని తను మాకు చుట్టమేం కాదు. నా మిత్రుడు అంతే. ఎప్పటి నుంచో చెప్పలేను. గుర్తు చేసుకోలేను. అంతటి గతం. ఆ మధ్య సొంత ఇల్లు కట్టుకొని మారిపోయాడు. అప్పట్లా రోజూ కాకపోయినా సుబ్రమణ్యం వస్తూనే ఉంటాడు. 1 రాత్రి పదిన్నరప్పుడు ఆఫీసులో ఎంత బిజీగా ఉంటానో. అలాంటప్పుడు సత్తార్‌
సాహిత్యం కవిత్వం

ఈ పూలేమి నేరం చేసాయో చెప్పు ?

ఈ పూలు ఇలా చేతుల్లో ఉంటే చాలు..దేహామంతా పరిమళాల చెట్టు అయిపోక మరింకేమి అవుతుంది?ఈ పూల కెన్ని పేర్లూ -ఊర్లూఅందాలూ – బంధాలూరంగులూ – పరిమళాలు.ఈ పూలకెన్ని షాయారీలూ - గజళ్ళు.కథలూ -కవితలు .ముచ్చట్లు – మౌనాలూఈ పూలకెన్ని ఊర్లూ – దేశాలు- భూములుఇళ్ళూ – ఖబరిస్తాన్లు .ఈ పూలకెన్ని తోటలూ - ఎన్ని ఎడారులు అవన్నీ సరే .. ఇది చూడండిఈ పూలకెంత సమానత్వం., ఎంత లౌకికత్వం !కులమూ లేదు.. మతమూ లేదుకదిలే మనుషుల దేహాల మీద.. కదలని శవాల మీదఅందరి శ్మశానాల్లో సమాధుల మీదమందిరాల్లో .. మసీదుల్లో.. చర్చీల్లోఐక్యంగా ఒక్క మాలై ఊగుతాయి కదా !ఒక్కలాగే
సాహిత్యం సమీక్షలు

కార్మికుల సామూహిక చైతన్యమే “స్ట్రైక్” సినిమా సారాంశం

“ఈనాడు బూర్జువా వర్గానికి ముఖాముఖీగా నిలబడిన వర్గాలన్నిటి లోకీ కార్మిక వర్గం ఒక్కటే నిజమైన విప్లవ వర్గం. తక్కిన వర్గాలు ఆధునిక పరిశ్రమల ప్రభావం వల్ల క్షీణించి, క్షీణించి చివరకు అదృశ్యమవుతాయి. కార్మిక వర్గం ఆధునిక పరిశ్రమల ప్రత్యేక సృష్టి. ఆధునిక పరిశ్రమల అతి ముఖ్య సృష్టి”- మార్క్స్, ఏంగెల్స్-కమ్యూనిస్ట్ మేనిఫెస్టో.    1925 లో సోవియట్ యూనియన్ నుంచి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణ “స్ట్రైక్”. ఈ సినిమా డైరెక్టర్ ప్రపంచ ప్రఖ్యాత సోవియట్ చిత్రనిర్మాత “సెర్గీ మిఖాయ్లోవిచ్ ఐసెన్ స్టీన్”.  ప్రపంచ కార్మికులంతా ఏకం కావాలనే సమైక్యవాదం గురించి బలమైన ప్రకటనలు చేసిన  రాజకీయ చిత్రం! దీని నిడివి
సాహిత్యం కవిత్వం

వసంతం

చిన్నబోయినా కనుల కన్నీటిని తుడిసిన వేళ నిండు పున్నమి నదిపై పరుసుకున్న వేళ ఎర్రని మేఘంపైఎగిరే పక్షిని నేనై రాగం పాడే వేళ రంగస్థలములో నేను ప్రేమ రంగులద్దిన వేళ రానే వచ్చింది వసంతం ప్రేమను పేర్చింది వసంతం రానే వచ్చింది వసంతం స్వేచ్ఛను తెచ్చింది వసంతం
సాహిత్యం కవిత్వం

దినమొక గండం పగలొక రాత్రి

రక్తంరుచి మరిగిన వలస రాబందులు వర్గ సమాజానికి వకాల్త పుచ్చుకొని రాజ్యం రక్షణే ధ్యేయంగా మా విప్లవ కేంద్రాలకు వలస సాచ్చాయి "సమాధానో"ప్రహార దాడులలో రణరక్కసి ధ్యేయంగా రక్త దాహపు వేట రాజ్యానికి పసందైన ఆట. నేడు తెలంగాణ ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్ రాజ్య నిర్బంధ శిబిరం 40 ఏళ్ల ఆవల నుంచే ఇక్కడ ఆ ఖాకీలకు మా రక్తం శీతల పానీయం మా శరీరపు మాంసపు ముద్దలు పంచభక్ష పరమాన్నాలు కానీ మా రక్తం   నిరంతర ప్రవాహం మా శరీరం అఖండితం స్మశాన ప్రశాంతత కోసమని హింస ప్రతి హింసల మధ్య యుద్ధ ఛాయలలో ఇప్పుడు ఊరు
సాహిత్యం కవిత్వం

జాగ్రత్త..?

ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త శవాల చేతులతోబంగ్లాలు కటించుకునేకుభేరులున్నారుజాగ్రత్త పచ్చి మాంసాన్నిపగడ్బందీగా పీక్కు తినేగుంట నక్కలున్నాయిజాగ్రత్త కాలి కాలనిబొక్కల్ని మెడలో వేసుకునికరోనాని కాటికి పంపాలనుకునేవైద్యులున్నారుజాగ్రత్త ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త మున్నూట అరవై వేల కోట్లదేవుళ్ళున్నఈ పుణ్య భూమిలోఆర్థా నాధాలకిఆయుశ్శే లేదుజాగ్రత్త భారత్ మాత కి జైఅనే నినాదంలోజై తెలంగాణఅను నినాదంలోఈ దేశ చరిత్ర బందీ అయిబ్రతుకు చాలిస్తున్నది జాగ్రత్త ఊపిరి బిగబట్టుకునిఉద్యమించకుంటేరేపటి భవిష్యత్ బర్తరఫే ఓ రోగిఓ త్యాగిజాగ్రత్త నిషేధ రేఖలునిన్ను నిలువునా…చీల్చాలనుకుంటాయిజాగ్రత్త
సాహిత్యం కవిత్వం

వాళ్లిద్దరు

ప్రజల ప్రయోజనాలే ప్రాణంగాబతికిన వాళ్లు, వాళ్లిద్దరుఒకరు హిమాలయాలంత ఎత్తుకెదిగినల్లమల కాఠిన్యాన్ని పుణికి పుచ్చుకొనిశత్రువుకు నిద్ర పట్టనీయనివిప్లవ శ్రేణులకు సేనానిమరొకరు ప్రేమ మాత్రమేచైతన్యాన్ని ఉద్దీపింప చేస్తుందనిబలంగా నమ్మి ఆచరించినవాడువిప్లవ శ్రేణుల గుండెల్లో నెలవైశత్రు సేనలపైకి ఉరికించినవాడుఈ యిద్దరు వ్యూహకర్తలను, ప్రజల ప్రేమికులనుకోల్పోవడం నా, మీ వ్యక్తిగత బాధే కాదునూతన సమాజాన్ని ప్రసవించేపుడమి తల్లి పురిటి నెప్పుల బాధ కూడాఇప్పుడు గుండెల నిండా కర్తవ్యంజయించాలనే తపన, జ్ఞానం కోసం మధనంచలన నియమాలను ఒడిసి పట్టుకోవాలనే ఆరాటంఅమరుల శక్తిని నిబిడీకృతం చేసుకున్న ప్రతి అడుగూమరింత దృఢంగా ప్రజల పక్షంఅందుకేఓటమి తాత్కాలికంగెలుపు ఖాయం! (కామ్రేడ్స్‌ సూర్యం, రవిల అమరత్వం నేపథ్యంలో దుఃఖమే అనంతమై ఆలోచనలు
సాహిత్యం కవిత్వం

నేనెప్పుడూ స్వేచ్చా జీవినే

 నీ హిందూత్వ ఫాసిస్టూ భూగర్భం లో  నన్ను బంధించావనుకోకు సామ్యవాద లావానై  చీల్చుకొని నిన్ను ముంచెత్తుతా జనం నిండా విస్తరిస్తా , నూతన మానవునిగా మళ్ళీ జన్మిస్తా. సోషలిస్టు వెల్లువుగా నీ సామ్రాజ్యవాద సామ్రాజ్యాన్ని ముంచెత్తి మండుతున్న ఎండిపోయిన గుండెలపై తొలకరినై సేదా  బిందువుల నెదజల్లుతా . అడివే కదా అనుకొని కార్పొరేట్ల దాహార్తి కై  ఖాండవ దహనానికి  పూనుకోకు,  ఆదివాసీ దండునై , నిన్నూ,నీ గోబెల్స్ ను సజీవంగా దగ్ధం జేస్తా అవును, నేను కలం పట్టిన కవినే మాత్రమే కాదు, నాగలిపట్టే రైతును,రైతు కూలీని, సహస్ర వృత్తుల కార్మికుణ్ణి, నారినే కాదు, నీ దోపిడీ పై
కథ..కథయ్యిందా! సాహిత్యం కాలమ్స్

అపార్థాల‌ను చెదరగొట్టిన కథ

ఉదయమిత్ర రాసిన కథ , ఈ పండుగ నీ పేరుమీద. దీన్ని జనవరి 2017 లో  అచ్చయిన దోసెడు పల్లీలు కథా సంపుటిలో చదవొచ్చు. పైకి  కథ  తాగునీటి సమస్య చుట్టూ  నడుస్తుంది. సారాంశంలో  కథ మతసామరస్యానికి ప్రాధాన్యతనిస్తుంది. ఒకానొక  కరువు పీడిత ఒక మోస్తరు(మేజరు పంచాయతీ) పట్టణంలో, దళిత కులాల నుంచి వచ్చి  లెక్చరర్ గా వున్న గృహస్తుడొకడు , వినాయకచవితి నాడు తాగునీళ్ల కోసం  పడే  తిప్పలు కథావస్తువు. వీధి కొలాయీ  కలలో మాత్రమే పారుతుంది. వాస్తవంలో  చుక్కరాల్చదు. ఆ టౌనుకు నీళ్లాధారమైన  వాగు యిసుక తోడేయడం వల్ల ఎండిపోయింది. పౌరులకు  నీటిని సరఫరా చేయడం
సాహిత్యం కవిత్వం

నా జీవితం

నా జీవితం, వడ్డించిన విస్తరే కాదనను. కానీ, అన్నార్తుల ఆకలి తీర్చడమే నా ఆరాటం,పోరాటం. కన్నీళ్లు,కడగండ్లు పెద్దగా నేనెరుగ , అయితే. కన్నీళ్లు,కడగండ్లు లేని సమాజమే, నా లక్ష్యం,నా ధ్యేయం. అవును, నేనగ్రవర్ణ సంజాతకున్నే,  కానీ, కుల,వర్గ రహిత సమాజంకై, జరిగే పోరులో నేనూ ఒక సాహితీ సైనికుణ్ణి. నేను పురుషున్నే , నాలోని పురుషాధిక్యతను అనుక్షణం ప్రశ్నించుకుంటూ క్షాళన చేసుకుంటున్న మనిషిని నేను. రేపటి ఉషస్సు విరజిమ్మే అరుణారుణ కాంతులకై , ఆవర్భవించే నూతన మానవునికై , అహర్నిసలు జరుగుతున్న యుద్దానికి భావజాల తూటాలందించే సాంస్కృతిక సైనికుణ్ణి నేను నేను కలాన్నే కాదు, కర్షకున్ని,కార్మికున్ని  దోపిడీ వ్యవస్థను