పత్రికా ప్రకటనలు

నిర్బంధంలో ఆదివాసీ నేతసుర్జు టేకమ్‌

సర్వ ఆదివాసీ సమాజ్ ఉపాధ్యక్షులు, బస్తర్ జన్ సంఘర్ష్ సమన్వయ్ సమితి కన్వీనర్, సుర్జు టేకమ్‌ను 2024ఏప్రిల్ 2  న క్రూర ఉపా, ఛత్తీస్‌గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్  కింద అరెస్టు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. సుర్జు "మావోయిస్ట్ సానుభూతిపరుడు" అనే సాకుతో తెల్లవారుజామున 4 గంటలకు, ఛత్తీస్‌గఢ్‌లోని మన్‌పూర్-మొహ్లా-అంబగఢ్ జిల్లాలోని కల్వార్ గ్రామంలోని అతని ఇంటి నుండి బలవంతంగా తీసుకెళ్లారు. సాక్షుల వాంగ్మూలాల ప్రకారం, అతని ఇంట్లో జరిగిన మొదటి దఫా సోదాలో పోలీసులు, పారామిలటరీ సిబ్బందికి ఏమీ దొరకలేదు. కానీ ఆ తర్వాత వారు తిరిగి లోపలికి వెళ్లి, సర్జు టెకామ్ మావోయిస్టు సానుభూతిపరుడు,
సంపాదకీయం

కార్పొరేట్‌ హిందూ రాష్ట్ర కోసమే కగార్‌

కొన్ని కొత్త పదాలు మన చెవిన పడేనాటికే అవి జీవితంలో భాగమైపోతాయి. జరగాల్సిన విధ్వంసమంతా జరిగిపోతుంది. మనం ఆ తర్వాత ఎప్పటికో గుర్తిస్తాం. పాలకులు ఒక పథకం ప్రకారమే ఈ పని చేస్తారు.  ఫాసిస్టు పాలకులైతే ఇక చెప్పనవసరమే లేదు. ఏ వైపు నుంచి ఎట్లా కమ్ముకొని వస్తారో ఊహించలేం. మనం దేనికది విడిగా విశ్లేషించుకుంటూ, ఒక్కోదాంట్లో తలమునకలవుతుంటాం. వాళ్లు మాత్రం అన్నిటినీ కలిపి ప్రజలపై ఎక్కుపెడతారు. దీన్ని మనం తెలుసుకోవడం ఏమోగాని అడుగడుగునా మనల్ని అనేక సందేహాలు వెంటాడుతుంటాయి.  ఏది హిందుత్వ? ఏది సనాతన? ఏది కార్పొరేటీకరణ? ఏది సైనికీకరణ? వాటి మధ్య సంబంధమేమిటి? తేడాలేమిటి? అనే
కరపత్రాలు

 ప్రజా పాలనా? నియంతృత్వ పాలనా?

పూసపల్లి కుట్ర కేసును ఎత్తివేయాలి!   ఏజెన్సీ గ్రామాలపై కూంబింగ్‌ను నిలిపి వేయాలి!! ప్రియమైన ప్రజలారా, రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ అక్రమ అరెస్టులు, కుట్ర కేసులు, పోలీసు   కూంబింగ్‌లు  షరా మామూలుగానే వుండబోతున్నాయా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాన్ని రేవంత్‌రెడ్డి గారి ప్రభుత్వం యిస్తున్నట్లుగా జరుగుతున్న పరిణామాలు విశదం చేస్తున్నాయి. సిపిఐ(ఎం-ఎల్‌)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్‌ అశోక్‌ అన్న (కుర్సం వజ్జయ్య), రాష్ట్ర నాయకులు కామ్రేడ్‌ గోపన్న (దనసరి సమ్మయ్య), జిల్లా నాయకులు కామ్రేడ్స్‌ పుల్లన్న (సంగపొంగు ముత్తయ్య), ఎస్‌కె.మదార్‌, కలకొండ సురేశ్‌లను పోలీసులు అరెస్టు చేసిన తీరూ, వారితో పాటు మొత్తం
పత్రికా ప్రకటనలు

WTO నుంచి బైటికి రావాలి

"డబ్ల్యుటిఓను విడిచి పెట్టండి " అనే నినాదంతో సంయుక్త్ కిసాన్ మోర్చా యిచ్చిన పిలుపును దేశంలోని 400 జిల్లాల్లో ట్రాక్టర్ ప్రదర్శన  జరిగింది. రైతులు డబ్ల్యుటిఓ దిష్టి బొమ్మను కాల్చారు. డబ్ల్యుటిఓను వదిలి పెట్టాలని డిమాండ్ చేసారు. రైతులపై కాల్పులు, దాడులకు గృహ మంత్రి అమిత్ షా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, రాష్ట్ర హోంమంత్రి అనిల్ విజల్‌ను బాధ్యులుగా పేర్కొంటూ వారి రాజీనామాను డిమాండ్ చేసింది.  పంజాబ్‌ను విచ్ఛిన్నం చేయడానికి, దేశంలోని ఇతర ప్రాంతాలలో ఈ అంశాన్ని ఉపయోగించి  ఎన్నికల ప్రయోజనాన్ని పొందటానికి, పంజాబ్ రైతులపై తీవ్ర అణచివేతకు కుట్ర పన్నడానికి నేరుగా బాధ్యుడని కేంద్ర
వ్యాసాలు

శుభ్‌కరణ్  హత్యకు హర్యానా పోలీసులే కారణం 

ఫిబ్రవరి 21న పంజాబ్ - హర్యానా ఖనౌరి సరిహద్దులో హర్యానా పోలీసుల చర్యలో శుభ్‌కరణ్ మరణించాడు. ఆయన మరణం కారణంగా రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’ నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. 22 ఏళ్ల రైతు శుభ్‌కరణ్ సింగ్ రైతు ఉద్యమ సమయంలో మరణించడంతో  పంజాబ్ లోని బటీండా జిల్లాలోని బల్లో గ్రామంలో విషాదకర వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 21 న పంజాబ్, హర్యానా సరిహద్దులోని పటియాలా జిల్లాలోని పతారాన్ పట్టణానికి సమీపంలో ఖనౌరీ సరిహద్దులో కొందరు నిరసనకారులు బారికేడ్ల వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. అందువల్ల రైతులు ‘ఢిల్లీకి వెళ్దాం’  నిరసన ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు.
ఓపన్ పేజ్

భారత ప్రజాయుద్ధానికిఎల్లెలెరుగని సంఫీుభావం

ప్రపంచంలో ఎక్కడున్నా ప్రజల ఆకాంక్షలు కలుస్తాయి. మానవాళి  స్పందనలు ఉమ్మడి రూపం ధరిస్తాయి. ఒకే హృదయంలోంచి వ్యక్తమవుతాయి. చరిత్ర నిర్దేశించే లక్ష్యాలను విశాలమైన చూపులతో మారుమూలల నుంచి కూడా పోగు చేసుకుంటాయి.  విశ్వాసాలు, విలువలు, ప్రయోజనాలు భౌతిక రూపం ధరిస్తాయి. న్యాయాన్యాయ వైఖరులు ఎల్లప్పుడూ మానవీయత వైపే  నిలబడతాయి. లేకపోతే పాలస్తీనా అస్తిత్వం కోసం ప్రపంచమంతా  ఒకే గొంతుగా ఎట్లా ప్రతిధ్వనిస్తుంది? రక్తసిక్త  బస్తర్‌ అంతర్జాతీయ చైతన్యంగా ఎట్లా ప్రతిఫలిస్తుంది? దేశాల, సమూహాల ఉనికిని దురాక్రమిస్తున్న మార్కెట్‌కు, యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన ఎందుకు వెల్లువెత్తుతుంది? బాధితులకు ఈ ప్రపంచమంతా సంఫీుభావం ఎందుకు అందిస్తుంది? పాలస్తీనాలాగే బస్తర్‌ కూడా ఇవాళ
వ్యాసాలు

సోషలిస్టు సమాజ విజయాలు: విద్య – ఉపాధి

నేడు మన నిరుద్యోగ యువత ప్రభుత్వం ఉపాధి కల్పించమని రోడ్లపైకి వస్తే పోలీసుల లాఠీదెబ్బలు తిని చేసి జైలుకు వెళ్లాల్సి వస్తున్నది . కానీ కేవలం ఏడు దశాబ్దాల క్రితం, పూర్తిగా యిందుకు భిన్నంగా పాలన ఉన్న దేశాలు ఉన్నాయి. అంటే, మీరు పని లేదా ఉద్యోగం చేయకూడదనుకుంటే, మిమ్మల్ని అరెస్టు చేసి 'లేబర్ క్యాంపు'లో శ్రమ చేయడానికి పంపిస్తారు. మీరు పరాన్నజీవి వర్గానికి  చెందినవాళ్ళు కాబట్టి  మీరు పని చేయకూడదని అనుకుంటున్నారని భావిస్తారు. ఈ దేశాల్లో, 18 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలందరికీ ఉపాధి హామీ వుండింది. ఈ దేశాలను సోషలిస్టు దేశాలు అని పిలిచేవారు, ఆ
వ్యాసాలు

“ఎన్నికల బహిష్కరణ” నినాదం – ప్రాముఖ్యత

(ఢిల్లీ నుంచి వచ్చే *నజారియా* పత్రికలో ఒపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీలో లా విద్యార్థిని రాసిన వ్యాసం ఇది . సాధారణ ఎన్నికల మీద భిన్న రాజకీయ కోణాల్లో చర్చలు  జరుగుతున్నసందర్భంలో మే 21, 2024 సంచికలో ఇది అచ్చయింది. వసంత మేఘం టీం ) ఇటీవలి సాధారణ ఎన్నికల సందర్భంగా కేరళలోని  వాయనాడ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని అనేక జిల్లాలు, ఇతర ప్రాంతాల నుండి సీపీఐ (మావోయిస్ట్) కార్యకర్తలు “ఎన్నికలను బహిష్కరించండి!” అనే నినాదంతో ప్రచారం చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నినాదం వెనుక ఉన్న సంభావ్య తార్కిక కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది. రివిజనిస్ట్
కాలమ్స్

ఈ కవిత్వం గూర్చి మాట్లాడదాం రండి..!!

(ప్రముఖ కవి , సాహిత్య విశ్లేషకుడు , సాహితి స్రవంతి నాయకుడు కంగార మోహన్ ఈ సంచిక నుంచి కొత్త పుస్తకాల సమీక్షా కాలం *ఈ పుస్తకం  చదివారా ?* ప్రారంభిస్తున్నారు - వసంత మేఘం టీం ) సాహిత్యంలో వస్తువు పాఠకులకొక సారాన్ని అందించాలి. అలా అందించడానికి తగిన రచనా విధానాన్ని వదిలిపెట్టి, వస్తువుకు అనవసరమైన అలంకరణల్ని అతికించడం వల్ల ప్రయోజనం లేదు. సాహిత్యాన్ని చదివినవాడు లేదా విన్నవాడు ఆనందించడంతోబాటు ఎంతో కొంత చైతన్యానికి గురికావాలి. సుష్టుగా భోంచేశాక నిద్ర వచ్చినట్టుండకూడదు సాహిత్యం. అది ఆలోచింపజెయ్యాలి. ఆ ఆలోచనచైతన్యాన్నివ్వాలి. ఆ చైతన్యం కార్యరూపం ధరించాలి. ఆనందించడానికే అయితే
stories

A Mother and Father in the Revolution

“How come you are back so early?” asked Myni anxiously when she saw Rukni and Sindayi coming towards her when she looked up from her writing. She had sent them to the village on work just a short while ago. “I believe the police are here. Comrades from Salepal village met us and told us”. “Where did they come?” “Supposedly to Bodili village” “Who saw them?” asked Myni closing her