ఓపెన్ పేజీ వ్యాసాలు

అమరావతి రైతుల ఉద్యమం – ప్రజాస్వామిక దృక్పథం

అమరావతి రైతుల ‘న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు’ పాదయాత్ర దాదాపు ముగింపు దశకు చేరుకుంది. అక్కడక్కడా ఆటంకాలెదురైనా, కోర్టు అనుమతివల్ల సాఫీగానే సాగిందని చెప్పవచ్చు. ఆ యాత్రకు అన్ని ప్రతిపక్షాల మద్దతు వున్నందువల్లనూ, మీడియా సహకారం పూర్తిగా వున్నందువల్లనూ అధిక ప్రచారం లభిస్తున్నది కూడా. అయితే, ఇది సరళమైన సమస్యకాదు. దీనిని కేవలం ఒక ప్రాంత రైతు సమస్యగానే చూడలేం. అందువల్ల ఎంత మద్దతు ఉన్నదో, అంతే వివాదాస్పదమైనది కూడా. అంతేగాక, ఇందులో అధికార రాజకీయ ప్రమేయాల పాత్రను చూడక తప్పదు. అంతేకాదు, అధికార రాజకీయాలంటే అధికార పార్టీల రాజకీయాలని అర్థంజేసుకుంటే ఈ వివాదం పట్ల ప్రజాస్వామిక వైఖరి
కాలమ్స్ అలనాటి రచన

రాజూ-పేదా

మార్క్ ట్వైన్ రాసిన “ప్రిన్స్ అండ్ పాపర్” ఇంగ్లీష్ నవలకు తెలుగు అనువాదం ఇది. సాహిత్యంలో కధలూ, నవలలనూ ఫిక్షన్ అంటారు. అంటే, కల్పన అని అర్ధం. కధలు యెంత సహజంగా రాసినా, యెంత సమాజాన్ని ప్రతిబింబించినా అవి కల్పనలే. ఆ పాత్రలు బయట ఎక్కడా కనిపించవు కదా! అయితే, కొన్ని కధలు ఒక కాలం నాటి చారిత్రక పరిస్థితులను చూపిస్తాయి. ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఎలా వున్నాయో చెబుతాయి. ఈ “రాజూ-పేదా“ అలాంటి నవలే. 1535 నాటి లండన్ నగరం. దుర్భర దారిద్ర్యం, ఆకలీ, భిక్షాటనా, దొంగతనాలూ. ఒకవైపు అంతులేని దుఃఖం, కన్నీళ్ళూ. హద్దులు లేని 
కాలమ్స్ లోచూపు

ప్రేమమయి, సాంస్కృతిక వారధి

(మొట్టమొదట ఈ పుస్తకం గురించి రాయడానికి  నిన్న నేటికి, నేడు రేపటికి విమర్శనీయం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్మడమే ప్రధాన కారణమని చెప్పాలి. అయితే నిన్నటి తప్పులను నేడు సరిచేయలేం. ఆ తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని నేడు అటువంటివి జరగకుండా ఆచరించడమే సరియైనది. ఎందుకంటే –నిజమైన మార్క్సిస్టుల దృష్టిలో నేర్చుకోవడమంటే మారడమే.) ఏ కాలపు మనుషుల జీవితాలైనా విలువలేనివేం కావు. కాని  విస్తృత సామాజిక సంబంధాలతో  కూడిన కొందరి జీవితానుభవాలు చాలా విలువైనవి. నిర్దిష్ట స్థల కాలాల జీవన వాస్తవికతను అవి సజీవంగా పట్టిస్తాయి. జీవన క్రమంలో స్వయం నిర్ణయపు  వ్యక్తిత్వ విశిష్టతలు, ఆత్మాభిమానపు స్పందనలు, సంవేదనలు ఎన్నెన్నో
సాహిత్యం కాలమ్స్ కథావరణం

పెత్తనం చలాయించే కర్ర చేతులు మారితే ఆ కథే వేరు!

సాహిత్యంలో చాలా ముఖ్యమైన కథలు అనే ఒక విభాగాన్ని ఏర్పాటు చేయగలిగితే, పాఠకలోకం శ్రద్ధాసక్తులతో తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని కథల్ని వర్గీకరించగలిగితే అందులో తప్పనిసరిగా ఉండాల్సినవి గీతాంజలి  కథలు.  అచ్చవున్న  కథలలో చాలా కథలను చదవకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదన్నది ఆ కథలు చదివిన తక్షణమే అనిపిస్తుంది. సాహిత్య చరిత్రలో భాగంగా గుర్తించి తప్పకుండా  చదవాల్సిన ముఖ్యమైన కథల జాబితా ఒకటి ఇమ్మంటే.. అందులో తప్పనిసరిగా గీతాంజలి కథలుంటాయి. ఎందుకంటే ఈ కథలను చదవటం ఒక  సామాజిక చారిత్రక అవసరం. ఈ కథలను చదవకపోతే పాఠకులకు ఈ కథలలోని జీవితం  మనుషుల సంఘర్షణలు, మనుషుల వ్యక్తిగత అంతర్గత
కాలమ్స్ ఓపెన్ పేజీ

ఏ వెలుగులకు ఆ వెన్నెల?

కళ కళ కోసం కాదు. ఎప్పటి మాట ఇది! ఈ నినాదం వెనక ఎంత పోరాటం! ఈ నినాదం వెంట ఎన్ని త్యాగాలు! కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా గుర్తు చేయాల్సి వస్తోంది. చర్చ మళ్ళీ మొదలు పెట్టాల్సి వస్తోంది. సినిమా పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గతించాడు. ఆయన పని చేసిన రంగంలో తనదైన బలమైన ముద్ర వేసిపోయాడు. దాని గురించి మీడియా ఆలపిస్తూనే ఉంది. దాన్నలా ఉంచితే రచయితగా ఆయనేమిటి, ‘వ్యక్తిగత’ రాజకీయ విశ్వాసాలపరంగా ఆయనేమిటి, ఈ రెండిటినీ కలిపి చూడాలా, వేరువేరుగా చూడాలా అనే ప్రశ్న ముందుకొచ్చింది. ఆయన స్వయంగా ప్రకటించి ఉన్నాడు గనక
కాలమ్స్ కథ..కథయ్యిందా!

చేదు మిగిల్చిన చెక్కెర కర్మాగారపు కథ ‘కంకాళం’

దేశవ్యాప్తంగా సహకార వ్యవస్థ పరిధిలో పనిచేస్తున్న అనేక సంఘాలు, సరళీకరణ ప్రైవేటీకరణ విధానాల దెబ్బకు కుదేలవడం తొంబైల తర్వాత  ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతదేశంలో అమలవుతున్న మిక్సెడ్ ఎకానమీ ప్రైవేటు వేటుకు గురవడం కూడా యీ కాలంలోనే జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు, కొద్దిగా ప్రతిఘటించడం తొలినాళ్లలో జరిగింది. అయితే సహకార రంగంలోని నూలు మిల్లులూ, చెక్కెర కర్మాగారాలూ చాలా సులభంగా ప్రైవేటు కుట్రలకు గురికావడం జరిగింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో చెక్కెర వినియోగదారులకు  చుక్కలు చూపించిన వైనం వొకవైపూ, వినియోగదారులకు విదేశీ చెక్కెరను సరఫరా చేయడాన్ని ప్రభుత్వాలు సమర్థించుకోవడం ఒకవైపు ఏకకాలంలో జరిగిపోయాయి. ప్రతిమ గారు
కాలమ్స్ లోచూపు

జీవన పునరుత్పత్తి సౌందర్యాన్ని చాటి చెప్పే ‘లద్దాఫ్ని’ కథలు

తన మొదటి కథా  సంకలనమే ఇంత ప్రభావశీలంగా ఉండడానికి అసలు జీవితం పట్లనే  షాజహానా గారి దృక్పథానికి  లోతైన, బలమైన పునాదులు ఉండడమే ప్రధాన కారణం. తన జీవితానుభవాల్లోంచి మాత్రమే కాకుండా, తన లాంటి వివక్షితులైన  మైనార్టీ సమూహపు పీడిత  ముస్లిం ప్రజల జీవిత వాస్తవికతా సంపర్కంలోంచి ఏర్పడడం వల్ల ఆమె దృక్పథానికి ఎంతో శక్తి సమకూరింది. ఆ శక్తితో నవనవోన్మేషంగా, సాహసోపేతంగా జీవిస్తూ ఆమె సృజించిన కళాత్మక డాక్యుమెంటులే యీ 14 ‘లద్దాఫ్ని- ముస్లిం స్త్రీ కథలు’.  నిత్యం అణిచివేయబడి  ధ్వంసమవుతున్న జీవితాన్ని తిరిగి ప్రజలు ఎలా పునర్నిర్మించుకుంటారో ఆమె కథలు పాఠకులకు చక్కగా  దృశ్యమానం చేస్తాయి. పైగా,
కాలమ్స్ క్యా చల్రా .?

మూడు రాజధానుల ముచ్చట ముగిసిన అధ్యాయం కాదు

 నేటి (21/11) జగన్ ప్రభుత్వ ప్రకటన అందర్నీ ఆశ్చర్యం లో ముంచిందనడంలో సందేహం లేదు. మొన్నటి మోడీ ప్రకటన, మూడు వ్యవసాయచట్టాల రద్దు, నేటి మూడురాజధానుల చట్టం రద్దులలో కొన్ని సారూప్యతలున్నా, కొన్ని తేడాలూ వున్నాయి. సారూప్యత, ఇరువురూ తాము మంచిబుద్ధితో చట్టాలు తెచ్చినా వాటి ప్రయోజనాల గురించి కొంతమందిలో కలిగిన అపోహలు తొలగించడంలో విఫలమయ్యామని, అందువల్ల తాము వాటిని రద్దుచేయక తప్పలేదని విచారం వ్యక్తం చేస్తూ ప్రకటించారు. తాము అనుసరించిన విధానాలలోని  తప్పులను అంగీకరించక, తామేదో ప్రజల్ని ఉద్ధరించే ప్రయత్నాలు జేస్తే, కొందరు... అందరూ కాదు, అడ్డుపడ్డారని వాపోయారు. ఈ సారూప్యతలటుంచుతే, మోడీ వెనుకంజకు కారణం రాబోయే
కాలమ్స్ ఆర్ధికం

ఎందుకీ ఆర్డినెన్సులు ?

మోడీ ప్రభుత్వం పార్లమెంటుతో, ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండానే నిస్సిగ్గుగా తమ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకే  చట్టాలు చేస్తోంది. సమకాలీన రాజకీయాలు ప్రజలను, పార్లమెంటును విస్మరిస్తున్నాయి. నవంబర్‌ 26 నుంచి శీతకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నప్పటికీ, ఆ సమావేశాల ప్రారంభానికి పది రోజుల ముందే సెంట్రల్‌ విజిలెన్స్‌ కమీషన్‌ చట్టం 2003, ఢిల్లీ  స్పెషల్‌ పోలీసు ఎష్టాబ్లిష్‌మెంట్‌ చట్టం 1941ల సవరణలతో నవంబర్‌ 15న ఇడి, సిబిఐ డైరెక్టర్ల గరిష్ట పదవి కాలాన్ని ఐదేళ్లకు పెంచుతూ రెండు ఆర్డినెన్సులు జారీ చేయించవలసిన అవసరం ఏమొచ్చింది? ఏ అత్యవసర ప్రజా సమస్య పరిష్కారం కోసమమని లేదా ఏ రాజ్యాంగ ధర్మపాలన
కాలమ్స్ అలనాటి రచన

ఒక బానిస ఆత్మకథ

ఇంగ్లీష్ : ఫ్రెడరిక్ డగ్లస్ తెలుగు అనువాదం: ముక్త వరపు పార్థ‌సార‌ధి  మానవ జాతి చరిత్రలో బానిస వ్యవస్థ అనేది ఒక దశ. అలాంటి దశ ఒకటి గత కాలంలో జరిగిందనీ, బానిసలు యెంత నికృష్ట, దయనీయమైన జీవితాల్ని అనుభవించారో కొంచెంగానైనా గ్రంధస్తం కాకపొతే, వాళ్ళ కన్నీళ్లు ఆనాటి శిథిలాల  కిందే ఇంకిపోయి ఉండేవి. “యెంత ప్రతిభా వంతులైన రచయితలైనా అసలు వాస్తవాలను అణుమాత్రంగా చెప్పలేకపోయారు”  అనేవాడట బానిస యోధుడు స్పార్టకస్. అంటే, వాస్తవ పరిస్థితులు ఎంత భయంకరమైనవో మనం ఊహించుకోవచ్చు. తెలుగులో ‘స్పార్టకస్, ఏడుతరాలూ, అంకుల్ టామ్స్ కేబిన్’ లాంటి పుస్తకాలు వున్నాయి. కానీ, ఒక బానిస