మీరీ పుస్తకం చదివారా ?

ఉచ్చల జలధి వర్తమానం 

ఈ దేశం గమనం ఎటు ? ఈ దేశం భవిష్యత్తు ఎటు? ఎన్నాళ్ళీ అరాచకాలు? ఇంకెన్నాళ్ళీ దుర్మార్గాలు. అభం  శుభం తెలియని బాలికపై ఒకడు అత్యాచారం చేస్తాడు. ఇంకొక గుంపు వచ్చి కుటుంబాలకు కుటుంబాలను దౌర్జన్యం చేసి, ఆత్యాచారం చేస్తారు. కాదంటే హత్య చేస్తారు. 2012లో జలంధర్‌లో వొక దళిత విద్యార్థితో ఉచ్చ తాగిస్తారు. నొయిడాలో పోలీసులే దళితవర్గానికి చెందిన విద్యార్థితో ఉచ్చతాగిస్తారు. తమిళనాడులోని తిరుచ్చిలో లా చదువుతున్న దళిత విద్యార్థితో తోటి విద్యార్థులే ఉచ్చ తాగించారు. రాజస్థాన్‌ లోని అజ్మీర్‌ నడిబొడ్డున జనవరి 26న బహిరంగ ప్రదేశంలో రీల్‌ వేయడానికి ప్రయత్నించిన మైనర్‌ దళిత బాలుడిని వేధించి
మీరీ పుస్తకం చదివారా ?

1917లోనే అచ్చయిన చతురిక..!

ఈ నవల తొలి పుటలో పరిశోధనల చరిత్రకెక్కని నవల అంటూ ఈ నవలను సేకరించి ముద్రించిన తెలకపల్లి రవి చెప్పుకున్నారు. నిజమే చరిత్రకెక్కని, చరిత్రలో చోటివ్వని అనేక విషయాలు కర్నూలు సాహిత్య చరిత్రలో ఉన్నాయి. కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రను పరిశీలించినట్లైతే ప్రపంచంలోనే తొలి తెలుగుపదం ‘అన్‌ధిర లోహము’ అనగా ఆంధ్రలోకము అనే పదం కర్నూలు జిల్లా కన్నమడకలలో లభించినది.ఇది అత్యంత ప్రాచీన శాసనంగా గుర్తించారు. తొలి తెలుగుపదం ‘నాగబు’ అని నిర్ధారించినప్పటికీ అంతకుముందే ‘ఆంధ్రలోకము’ అనే పదమున్నప్పటికీ సాహిత్యకారులు, చరిత్రకారులు సమాజక్షేత్రంలోకి తీసుకెళ్ళలేకపోయారు. ఆ పదం కర్నూలుజిల్లాలో లభించడం అరుదున విషయం.  ప్రపంచానికి బౌద్ధ సిద్ధాంతాలను ప్రవచించిన
ఆర్ధికం

ఆక్స్ఫామ్: ప్రజల్ని దోచేసున్న గుత్త సంస్థలు

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జనవరి 20-25 తేదిలలో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్య్లూఇఎఫ్‌) 2025 వార్షిక సమావేశం తొలి రోజున (జనవరి 20) ఆక్స్‌ఫామ్‌ సంస్థ ‘టేకర్స్‌ నాట్‌ మేకర్స్‌’ పేరుతో ఆర్థిక అసమానతల నివేదికను విడుదల చేసింది. ఇందులో కీలక విషయాలు వెల్లడిరచింది. బిలియనీర్ల సంపద మునుపెన్నడు లేనంతగా పెరిగిపోయిందని, ప్రపంచవ్యాప్తంగా పేదరికంలో మగ్గుతున్న ప్రజలు అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్నారని నివేదిక నొక్కి చెప్పింది. రోజు రోజుకు ప్రపంచంలోని ధనిక, పేద ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం మరోసారి రుజువైంది. మానవజాతి చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఎరగని అసమానతలపర్వం ఇప్పుడు సమాజాన్ని
ఆర్ధికం

మందగమనంలో భారత ఆర్థిక వ్యవస్థ

కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం,  స్థూల జాతీయోత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడం,  2047 నాటికి అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరడం..వంటి లక్ష్యాలు చెప్పడానికి బాగానే ఉంటాయి. కానీ కేవలం మాటల గారడీతో అభివృద్ధి సాధ్యం కాదని గత పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా చూశాం. మరోవైపు మోడీ ప్రచారానికి భిన్నమైన వాస్తవ దృశ్యాలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమవుతున్నాయి. వర్తమాన కాలంలో భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేదీ చేదు నిజం. వాస్తవానికి ‘ఆర్థిక వినాశనం’ అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుంటుంది.
కథనం

“రహ”

మణిపూర్, పర్వతాలు వున్న నదుల ఒడిలో మనోహరమైన రాష్ట్రం. భిన్న జాతులు, సంస్కృతుల సమ్మేళనం. కానీ అక్కడి ఆహ్లాదకరమైన ప్రకృతి వైభవం కన్నీటి ప్రవాహానికి దారి తీసింది. వివిధ తెగల మధ్య అవగాహన లోపం, రాజకీయ లబ్ధి కోసం ఆడే ఆటలు, సామాజిక అంతరాలు సమాజాన్ని చీల్చాయి. సూర్యుడు ఉదయించే ముందు గ్రామాల్లో మంటలు చెలరేగాయి. ఆ మరుసటి రోజు మహిళలు, పిల్లలు అరిచిన స్వరం గాలి ద్వారా అడవుల్ని దాటింది. నది తీరాన ఉన్న చిన్న గ్రామంలో సుందరి అనే యువతి తన ఇద్దరు చిన్న పిల్లలతో నిద్రపోతోంది. ఆమెకు తెలియదు, రాత్రి వాళ్ల గ్రామాన్ని ఆగంతుకులు
సమకాలీనం

మావోయిస్టులపై యుద్ధం నేపథ్యంలో చంద్రార్కర్ హత్య

2025 మొదటి వారంలో బస్తర్‌లో 16 మంది మరణించారు. వారిలో ఒకరు యువకుడు, ధైర్యవంతుడైన జర్నలిస్టు, ముఖేష్ చంద్రార్కర్. బీజాపుర్ జిల్లాలో రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆయన  బయటకు తీసిన వార్తలు  ప్రభుత్వ దర్యాప్తుకు దారితీసిన ఐదు నెలల తర్వాత, ఆయన మృతదేహం రోడ్డు కాంట్రాక్టర్ కు చెందిన స్థలంలోని  సెప్టిక్ ట్యాంక్‌లో  దొరికింది. అవినీతిని బహిర్గతం చేసినందుకు జరిగిన చంద్రార్కర్ హత్య, సహజంగానే దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టుల  పోరాటంతో ఎంత సన్నిహితంగా ముడిపడి ఉందో కొద్ది మందికే తెలుసు. చంద్రాకర్ మరణించిన కొన్ని రోజుల తర్వాత, 120
మీరీ పుస్తకం చదివారా ?

‘స్టిల్‌ షీ ఈజ్‌ అలైవ్‌’

సామ్రాజ్యవాదం ఉన్నంతకాలం యుద్దాలు ఉంటాయి-లెనిన్‌ కాసిన్నినినాదాలు..మరికొన్ని సానుభూతి వాక్యాలు..ఏదో వీలైతే వొక సదస్సో..లేదంటే చర్చావేదికో..ఏం మాట్లాడతారు..? అందరూ అంతకంటే ఏం చేస్తారు..?మళ్ళీ జీవితాలు ఎవరివివారివే. కాని ఆ దేశంలోని వాళ్ళకు జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు. అది ఏ క్షణమైన కావచ్చు..ఏ నిమిషమైన ఆఖరిదవ్వొచ్చు..ఎవరిమీదైనా బాంబు పడొచ్చు..ఎవరి  మీదైనా డ్రోన్సు మిస్సైళ్ళు..మారణాయుధాలు పడొచ్చు..నిరంతరం మండుతున్న దేశమది.. అసలు యుద్దం ఎందుకు..?కన్నీళ్ళుగా మొదలైన యుద్దం నెత్తుటినదిగా మారి,  నెత్తుటినది కాస్త  రుధిరజీవనదిగా మారుస్తున్నదెవరు..?సామ్రాజ్యవాదం కాదా? ఈ నెత్తుటి దాహం తీరేదెప్పుడు.. చౌశా తన కవిత్వ ప్రయాణంలో పదిపుస్తకాలు తీసుకొచ్చారు. ప్రపంచాన్ని కవితా వేదికగాచేసుకుని వర్తమాన ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్తులను, సంఘర్షణలను
మీరీ పుస్తకం చదివారా ?

దేహం కూడా పొయ్యిలాంటిదే..

దేహాన్ని కవిత్వదీపంగా వెలిగించుకున్నవాడు. దేహం నిండానేకాదు.. అణువణువు మస్తిష్కపు నాఢులనిండా కవిత్వపు ప్రేమను నింపుకున్నవాడు. అతడి వాక్యం ప్రేమ, అతడి అక్షరం ప్రేమ, అతడొక ఎల్లలులేని కవిత్వపు ద్వీపంలో వొక ప్రపంచాన్ని నిర్మించుకున్నవాడు. ఈప్రపంచంలో ఎగరేసిన కవిత్వపు అరుణపతాకం. మాటల్ని మండిస్తాడు. మనుషుల్ని ప్రేమిస్తాడు. ఏతరమైనా అతడికవిత్వానికి, అతడి ఆత్మీయతకు బానిసవ్వాల్సిందే. కవిత్వపు సీసానిండా ప్రేమల్ని, ఆవేధనల్ని, ప్రాపంచిక పరిణామాల్ని నింపి వర్తమాన ప్రపంచపు వీధుల్లోకి విసిరేస్తున్నవాడు. కళ్ళనిండా కవిత్వపు కాంతుల్ని, గుండెనిండా ఈ కాలపుకవుల ప్రేమను నింపుకున్న  అసాదారణ కవితా యాత్రికుడు. వొకతరానికి శివుడు, మరొక తరానికి ప్రేమైక మానవుడు. అంతటి మహోన్నత కవిత్వపు  శిఖరం గూర్చి
సమకాలీనం

ఇజ్రాయెల్ సాంస్కృతిక సంస్థల బహిష్కరణ

"వర్ణవివక్ష, నిర్వాసిత్వంతో వారికి గల సంబంధాన్ని విచారణ చేయకుండా మేము మా మనస్సాక్షితో ఇజ్రాయెల్ సంస్థలతో కలిసి పని చేయలేం." పెర్సివల్ ఎవెరెట్, సాలీ రూనీ, వియట్ థాన్ న్గుయెన్, కవే అక్బర్, మిచెల్ అలెగ్జాండర్, అన్నీ ఎర్నాక్స్, నవోమి క్లైన్, టీ ఒబ్రెహ్ట్, పీటర్ కారీ, జెరిఖో బ్రౌన్, నటాలీ డియాజ్, మేరీ గైట్స్కిల్, హరి కుంజ్రు, రాచెల్ పా కుష్రు, జస్ట్ టి. లీలానీ, సుసాన్ అబుల్హావా, వలేరియా లూయిసెల్లి, జియా టోలెంటినో, బెన్ లెర్నర్, జోనాథన్ లెథెమ్, హిషామ్ మాటర్, మాజా మెంగిస్టే, చైనా మివిల్లే, టోర్రీ పీటర్స్, మాక్స్ పోర్టర్, మిరియమ్ టోవ్స్,
ఆర్ధికం

‘బేరు’ మంటున్న రూపాయి

విశ్వగురుగా చెప్పుకొంటున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రపంచ మార్కెట్‌లో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడు లేనివిధంగా రికార్డ్‌ పతనాన్ని చవి చూస్తోంది. 2014 మేలో డాలర్‌కు 63 రూపాయలుగా ఉన్న మారకం 2024 డిసెంబర్‌ నాటికి జీవితకాల కనిష్ట స్థాయి రూ.85.25కి పడిపోయింది. ఈ స్థాయిలో పతనం కావడం ముందెన్నడూ లేదు. చరిత్రలో ఇదివరకూ ఎప్పుడూ లేని విధంగా రూపీ క్షీణించడంతో పేద, సామాన్య ధనిక భారతీయులందరిపై ప్రత్యక్షంగా... పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. వరుస పతనంతో రూపాయి చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శనను కనబర్చుతోంది. గడిచిన ఐదేండ్లలో ఈ కరెన్సీ 20 శాతం పైగా పడిపోయింది.