కవిత్వం

నువ్వే కావాలి

ఎందుకో నువ్వంటేతెగ పిచ్చితీగలా అల్లుకు పోయిలోలోన ప్రకంపనలు సృష్టిస్తావు నిన్నునాలో సాన బట్టుకుంటూపదిలంగా దాచుకుంటా నువ్వే నా చుట్టూపెట్టని కోటవైనా రక్షణ గా ఎల్లవేళలా నువ్వే లేకపోతేనేను అజ్ఞాని గాఎక్కడ బడితే అక్కడ తిరిగే వాడ్నినన్నో మనిషి గా నిలబెట్టినది నీవే నాకు నేనుగాఊహ తెలిసిన దగ్గరి నుండినీ చుట్టే నా పరిభ్రమణంఅదే నా ఉజ్జ్వల భవిష్యత్తు కిరాచ బాట పరిచింది ఏదైనా తెలుసుకోవాలంటేనీవే నా ఆధారంతరాలుగా నీవూ నేనూకలిసి సాగామనే ఆలోచనలునన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటేఇలాగే భవిష్యత్తు లో కూడాసాగాలనే తాపత్రయంలో స్వార్థమున్నాతప్పట్లేదు నీ రూపం అపురూపంనాలో చెరగని రూపంచెక్కుకుంటూ పోలేనుఎప్పటికప్పుడు చెక్కక తప్పదుచెక్కితేనే నీ విలువ
సాహిత్యం కవిత్వం

నాలుగు పిట్టలు ( మినీ కవితలు)

కాలపు చరకలో కొంత గతాన్నివొదులుకున్నానుబంగారుభవిష్యత్తీగను వొడికిఇస్తుందని వేచి చూస్తున్నాను****చెరువును అంగీలాతొడిగిన నేలచేపల్నినగిషీలు చేసుకుంది***వెన్నెల అద్దంలోతన మోము చూసుకొనిచెరువుమురుసిపోతోంది***ఎండ మగ్గం తోమబ్బుల బట్టను అల్లుకొనికప్పుకుందినింగి***ఈ మౌన రాత్రిలోకొంత శబ్దాన్ని కోరుకున్నానువెన్నెల కొలనునుముద్దాడింది***చేపలకు కొలను చెబుతున్నకథలనుతారకలు కూడాఊ కొడుతూ వింటున్నాయి***కొలనును కాగితం చేసుకొనికవిత్వం రాస్తున్నాడుచందమామచేప పిల్లలు అక్షరాలు***సూఫీ పాడిన పాటనువినిఅలల చప్పట్లతోఆదరించింది చెరువు***16.11.22
కవిత్వం

సెంట్రి..!

రాత్రి చెందురుడు మా పల్లె మీద రాబందులు వాళ్ళకుండా డేగ కండ్లతో కాపు కాస్తున్నవాళ్ళు..!పూరి గుడిసెల వాడల్లోనిట్టాడుగా నిలిచిన చోట అర్ధరాత్రి అలికిడికి ఉయ్యాల నుండి లేచిన పసికూన కూతకు తుఫాకి మోన పెట్టి కాల్చాలని కలగన్న ఈ దోపిడీ రాజ్యాన్ని ధిక్కరించే తెగువైకాచిన కందిలి వెలుగులు వాళ్ళు..!!అడవి కాచిన వెన్నెల సంద్రాలను ఈదుతూ సెలయేరు పాయలుగా పారుతూ కొండలు, కోనలను తడుముతూ సకల జీవరాశులను ఓల్లో ఒంపుకుంటూ చుక్కాని అయిన వాళ్ళు ఈ దేశ పీడిత ప్రజలకు సెంట్రియే...!దిక్కు తెలియని వాళ్ళకు దిక్కై నలుదిక్కుల న్యాయముకై విముక్తి నావనెంచి సాగుతున్న వాళ్ళకు పోరు సమరంలో వాళ్లో స్నేహితులు
కవిత్వం

గుడిపల్లి నిరంజన్ రెండు కవితలు

1 .నలిపెడుతున్న భావమేదో..! ఏమీ తోచని స్థితి ఎప్పుడో ఒకసారి అందరికీ వస్తుంది. అమ్మ పోయినప్పుడో నాన్న ఊపిరి ఆగినప్పుడో మనసు వెన్ను విరిగినప్పుడో అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో.. దారితప్పినప్పుడో... ఎప్పుడో ఒకప్పుడు ఊపిరాడని స్థితి అందరికీ వస్తుంది. పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో.. కయ్యాలు కురిసినప్పుడో గింజలు మొలువనప్పుడో కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో.. అప్పుడే సోప్ప బెండులా అల్కగా బరువు తగ్గిపోతాం. ఈనెపుల్లలా సన్నగా మారుతాం. ఒక్కోసారి మనసు లోపల కసిబిసితో నలిపెడుతున్న భావమేదో బయటికి ఉసులుతుంది. అప్పుడే ఏమీతోచని స్థితి వేడి శ్వాసల రూపంతో బయటకు
కవిత్వం

ఇనుప మేకుల భూమి

భూతల్లి ఎదపై నాటిన ఇనుప మేకులు ఎవరి ఆకలిని తీర్చగలవు? ఎంత పచ్చదనాన్ని తుంచగలవు?? ఆ సిమెంట్ బ్యారి గేట్లు ఎవరి ఇంటికి గోడలుగా నిలబడగలవు? ఎంత ధైర్యాన్ని అణచగలవు?? గాలిలో ఎగిరే డ్రోన్లు ఎవరి పంట చేనులకు మందులు కొట్టగలవు? ఎంత ఆక్సిజన్ ను భర్తీ చేయగలదు?? వాడు చేస్తున్న దాడిలో కోల్పోయిన రైతుల ప్రాణాలను ఎవరు మొలకెత్తించగలరు? గడ్డిపోచల గుండె చప్పుడుతో ఊపిరి వీస్తున్న స్వదేశ రైతులను కట్టడి చేసే అట్టడుగుల్లో ఎంత కాలం కొట్టుమిట్టాడగలరు ?? రాజకీయం తెలిసిన ప్రభుత్వానికి రైతుల కన్నీటి బాధలను తీర్చడం తెలియనిదా? భారతరత్న అవార్డు ప్రకటనలో కూడా రాజకీయ
కవిత్వం

వర్షం లో రైతు

వాలే చినుకు లోఆశగా తడిశాను .బురద సాలుల్లో నారుగా మురిసాను .ఎండిన కలలని తడుపుతూవడివడిగా దున్నుకుంటున్నాను .ఎండలు శపిస్తాయోవానలు ముంచేస్తాయోకళ్ళనిండా  మేఘాలునిండి ఉన్నాయి .గుండెనిండా ధైర్యంపిండుకున్నాను .కాసింత ఉరుములు  భయపెడతాయికాసిన్ని పిడుగులు కూల్చేస్తాయికాళ్ళు మట్టి పెళ్ళల్లోఉదయించందేమనసు కుదుటపడదు .రెప్పల వాకిట్లోతెప్పలుగా కదిలే దృశ్యాల వెంటఆకు పచ్చని కలలుఊరటనిస్తాయి.ఊపిరి పోసినాఊపిరి తీసినామట్టిని నమ్ముకునేరైతు  జీవితం ముగుస్తుంది .  
కవిత్వం

అతనిప్పుడు మాటాడుతున్నాడు

అతనిప్పుడు మాటాడుతున్నాడుఒరిగిపోయాడన్న ప్రతిసారి మాటాడుతూనే వున్నాడు దేశమంతా అతన్ని ప్రతిబింబిస్తూనే వుంది శత్రువూ మాటాడుతున్నాడు తనవారూ మాటాడుతున్నారు నలుగురు కలిసిన చోట అతనే సంభాషణవుతున్నాడు అన్నం ముద్దలో అతని వెన్నెల వంటి ముఖం కనిపిస్తూ అడవి అంతా అతను అల్లుకుపోయిన తోవంతా కబుర్లలో అతనిప్పుడు మాటాడుతున్నాడు అతని చుట్టూ ముళ్లపొదను నాటిన ప్రతిసారీ మరల అతను మోదుగ పూల వనంలో ఎర్రని దేహంతో పుష్పిస్తూనే మనతో మాటాడుతున్నాడు నువ్వలిసి సేదదీరుతానన్న కాలంలో నీ అలసటను తన భుజానెత్తుకొని కాళ్ళ సత్తువగా మారుతూనే వున్నాడు ఎండలో వానలో చలిలో రుతువులన్నిటా అతను ముందు నడుస్తూనే వున్నాడు గాయపడ్డ సమయంలో తను
కవిత్వం

మరల మరల అదే వాక్యం

ఒకరి గురించి దుఃఖపడడం గుండె కవాటాలను మెలితిప్పుతుంది కదా .... పెంచిన చేతులలోనే చివరి శ్వాస వదిలే పసిపాపల కనులను చూస్తూ ఆ గుండెలు మూగబోవా! .... నీకేమి కాదు మెదడులోకి ఇంకినది హృదయంలోకి ఇగరని మనిషివి కదా .... నాకెందుకో నా చెవులలో ఆ పసిపాపల రోదనలు తప్ప ఏమీ వినిపించదు .... ఆ కూలిన ఆసుపత్రుల గోడలనంటిన నెత్తుటి చారికల మధ్య నా మొఖం అగుపిస్తోంది .... ఎన్నిసార్లు రాసినా నీ దుఃఖ వాక్యమే మరల మరల వెంటాడుతోంది పాలస్తీనా ..... అంతరించిపోతున్న నీ నేల పచ్చని గురుతులు దుఃఖాన్ని ఆలపిస్తూ .
సాహిత్యం కవిత్వం

ప్రతిధ్వని

నేను ఉరిమితేనీ సింహాసనం కదిలిందినేను వర్షిస్తేవసంతం పులకించిందినాలుగు గోడల బందీఖాననా ఆలోచల్ని ఆపలేదుఅవి ప్రాణ వాయువులాప్రజల ఉచ్వాస నిశ్వాసలనుతడుముతూనే ఉంటాయినేను నిర్జీవంగాఇచ్చట వాలిపోలేదునా నినాదాలుప్రపంచ వ్యాపితంగాప్రతి ద్వనిస్తూనే ఉంటాయినేను స్వేచ్ఛా మానవినిఏ చెరసాలకు లొంగే దాన్ని కాదు
కవిత్వం

యుద్ధం ముగిసాక

దేశం ఒంటరైపోతుందిఎత్తైన హర్మ్యాలు తేజం కోల్పోతాయిగమ్యం చేర్చే రహదారులన్నీఅగమ్య గోచరాలవుతాయియుద్ధం వస్తే మాట్లాడల్సిందిరెండు పెదవులు కానీఇరువైపుల తుపాకులు మాట్లాడతుంటాయికొందరు బతకడం కోసం నిత్యంయుద్ధం చేస్తేఇంకొందరు బతికేదే యుద్ధం కోసంయుద్ధం తరువాతదేశం ఒంటరవుతోందిజనులొంటరౌతారుచేతులకు చేయి కాళ్లకు కాళ్లుఒంటరిగాయుద్ధం తరువాత నడుస్తాయియుద్ధంలో దగ్ధమైన అడవంతాపక్షులగానం కోసం ఏడుస్తుందిఅన్ని అసంపూర్ణంగా నడుస్తాయికానీయుద్ధానికి బలైన దేశం మాత్రంసంపూర్ణంగా ఏడుస్తుందిమొలకెత్తిన విత్తనం రెండు హరితదళాలు జోడించిసూర్యుడికి నమస్కరిస్తేపత్రాలనిండా రుథిర వర్ణం పూసుకున్నదిఇది అప్పుడే పుట్టిన బిడ్డక్కుడా మినహాయింపు కాదేమో. ..!యుద్ధాలోస్తేఆయుధ కర్మాగారాలపనేంటంటేదేశాన్ని శవకర్మాగారంగా మార్చేపత్రంపై సంతకం చేస్తున్నాయిచివరిగాయుద్ధం ముగిసాకసరిహద్దుల గోర్జల్లో పారేటినీళ్ళల్లో నెత్తురు కొలనులు పుట్టుకొస్తున్నాయి నేలంతా యింకానెత్తురు ఊటలు తాగాల్సిందేనా.... ?ఇప్పుడు ఎవ్వరు ఒక