వ్యాసాలు

సృజనాత్మక విమర్శ

‘సాహిత్య విలోచన’ మెదడుకు మేత పెట్టగల శీర్షిక.  ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా సాహిత్య విమర్శ తత్వాన్ని వెలికి తీసి చారిత్రక సైద్ధాంతిక దృక్పథంతో, నిర్మాణాత్మక పరిశీలన ఈ పుస్తకంలో ఉంటుందని పాఠకులకు అనిపించేలా వి. చెంచయ్యగారు  తన వ్యాస సంపుటికి ఈ పేరు పెట్టారు.  నిజంగానే ఇది సాహిత్యం గురించి, సాహిత్య విమర్శ గురించి  విస్తృతమైన రాజకీయ సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక ప్రశ్నలను, సమాధానాలను అందించింది. ఇందులోని ప్రతి వ్యాసం అలాంటి అనేక  వాదనలు, మేధో చర్చలను రేకెత్తిస్తుంది.             ఈ వ్యాసాలు కేవలం సాహిత్య విమర్శ వ్యాసాలే కాదు. విమర్శకుడి వ్యక్తిత్వమూ, అతని విమర్శ
వ్యాసాలు

హస్ దేవ్ సందేశం ఏమిటి?

హస్ దేవ్ నిరవధిక  పోరాటానికి ఏడాది అయిన సందర్భంగా   13, ఫిబ్రవరి 2023 న సర్గుజ జిల్లా హరిహరపురంలో జరిగిన ధర్నాకు దేశ వ్యాప్తంగా వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.   విద్యార్థి, రైతాంగ, యువజన, మేధావులు నలుమూలల నుండి రావడం ఒక  అద్భుతం.   . దేశ వ్యాప్త సమర్ధనతో ధర్నా విజయవంతం కావడం పోరాడితే పోయేదేమీ లేదు మన పై హింస తప్ప అని మరోసారి రుజువు చేసింది. అలాగే ధర్నా స్థలి నుండి దక్షిణ ఛత్తీస్గఢ్ లో సుక్మా జిల్లాలో జరుగుతున్న ఏరియల్ బాంబింగ్ ను ఆపేయాల్సిందిగా తీర్మానం చేస్తూ అక్కడ ఎంతో ధైర్యంగా పోరాడుతున్న ప్రజలకు
దండకారణ్య సమయం వ్యాసాలు

కోత్రి వంతెన ఎవరి కోసం? 

వంద రోజులు దాటిన వెచ్చఘాట్‌ పోరాటం దేశమంతా కార్పొరేట్ల కోసం చాలా అభివృద్ధి చెందుతోంది. ఏం చేస్తే కార్పొరేట్ల దోపిడీకి విచ్చలవిడి అవకాశాలు ఉంటాయో అవన్నీ చేయడమే అభివృద్ధి అని అడుగడుగునా రుజువు అవుతోంది. కార్పొరేట్‌ సంస్థల సహజవనరుల దోపిడీ కోసం అడవులలో తలపెట్టిన పోలీసు క్యాంపులు, రోడ్డు, వంతెనలు, ఇతర నిర్మాణ పనులు, పర్యాటక కేంద్రాలు, డ్యాంలు మాకొద్ద్దంటూ ప్రజలు పోరాడుతున్నారు. ఉత్తర్‌ బస్తర్‌ (కాంకేర్‌) జిల్లా కోయిల్‌బేడ బ్లాక్‌లోకి ఛోటావెటియాపోలీసు స్టేషన్‌ పరిధిలోని కోత్రి నదిపైన వెచ్చఘాట్‌ వద్ద రూ. 15 కోట్ల ఖర్చుతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కాంకేర్‌ జిల్లాలోనే మరోడా అనే గ్రామం
వ్యాసాలు

మోడీ+ అదానీ = భారత దేశం

దేశంలో క్రమశిక్షణారాహిత్యం పెచ్చరిల్లిపోతోంది. హిందూ ప్రభువు విధానాలను శంకిoచేవారూ, అనుమానాలను రేకిత్తించేవారూ ఎక్కువవుతున్నారు. అర్బన్ నక్సల్స్, ఖలిస్తాన్ వాదులు, పాకిస్తాన్, చైనా ఏజెంట్లు సరేసరి. చిన్నాచితకా వ్యాపారస్తులు, పొలానికెళ్ళి దుక్కి దున్ని నాలుగు చినుకులు పడగానే విత్తు విత్తి ఆ తర్వాత వానకై ఆకాశం వైపు జూస్తూ పంట చేతికొచ్చాక నాలుగురాళ్ళు చేతికందుతాయని ఆశగా జీవనం గడిపే అమాయక రైతన్నలు, నిత్యం దేశభక్తిని ఆహారంగా పొందుతూ, అది వారి ప్రాణ వాయువై , జీవిత సమస్యలను పట్టించుకోకుండా మసీదు-మందిరం తగువులాటల్లో ప్రాణాలు కోల్పోవడానికీ సిద్ధం కావాల్సిన యువకులు కూడా సామ్రాట్ మోదీ విధానాలను అపార్థం జేసుకుoటున్నారంటే ఇది కలికాలం
వ్యాసాలు

జనతన రాజ్యంలో కా . గౌతమ్

(పాణి రాసిన దండకారణ్యంలో మావోయిస్టు ఆచరణ -జనతన రాజ్యం పుస్తకం నుంచి) పొద్దు వాలుతూ ఉన్నప్పుడు నడక ఆగిపోయింది. క్యాంపుకు ఇంకొంచెం దూరంలో  ఉండగానే కామ్రేడ్‌ గౌతం కనిపించాడు. ఆయన విప్లవోద్యమంలో సీనియర్‌ నాయకుడు. నేను అక్కడికి వస్తానని ఆయనకు ముందే తెలుసు. నన్నెంతో ఎరిగినవాడివలె ఆలింగనం చేసుకొని నా కళ్లలోకి ఆత్మీయంగా చూశాడు. అందులో ఎన్నో పరామర్శలు. నా ప్రయాణంలో పార్టీ నాయకులు ఎవరెవరు కలుస్తారో నాకెలాంటి ఊహ కూడా లేదు. అయితే నేను విని ఉన్న వాళ్లెందరినో కలవాలనే ఆశ ఉండేది. అయితే ఇన్ని రోజుల్లో అలాంటివారేమైనా కలుస్తారా? అని నేను కామ్రేడ్‌ ఇడిమెను ప్రత్యేకించి
వ్యాసాలు

ఆదాన ప్రదానాల్లో భారత్

అయినా మన పిచ్చిగానీ , ఎంత అమెరికన్ సెoట్లతో ముంచినా, ఎంత దేశభక్తి, జాతీయతా వాదంతో ముంచెత్తినా, కుళ్ళిన శవం కంపుగొట్టకుండా ఉంటుందా?  ఐదేండ్లకొకసారి, శవపేటిక నుండి బయటకు లాగి, ఎన్నికల ప్రజాస్వామ్య శవాన్ని జీవమున్న దానిగా ప్రదర్శిస్తే మాత్రం, ప్రతి ఏడాది, అత్తరుతో స్నానం చేయించి గులాబీ, మల్లెలతో అలంకరించి వీధుల వెంట  “భారత్ మాతాకు” జై,   “జై శ్రీరాం ” నినాదాలతో హోరెత్తిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినంత  మాత్రాన లేని జీవం ఎక్కడ నుండి వస్తుంది. ఈ కుళ్ళు వ్యవస్థను  సమూలంగా ధ్వంసం చేయకుండా, అది హర్షద్ మెహతా కావొచ్చు, లేక కేతన్ పరిక్ కావొచ్చు..
వ్యాసాలు

ఆపరేషన్ కర్రెగుట్టలు – సఫలమా? విఫలమా?

2025 మే 14నసి‌ఆర్‌పి‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, ఛత్తీస్‌గఢ్ డీజీపి సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఏప్రిల్ 21 నుండి 21 రోజుల పాటు జరిపిన మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ముగిసినట్లు ప్రకటించారు. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రధానంగా నెరవేర్చామనీ, అమిత్ షా ప్రకటించినట్లు 2026 మార్చ్ 31 నాటికి నక్సలిజాన్ని తుదముట్టించి తీరుతామని ప్రకటించారు. ఈ పత్రికా సమావేశానికి దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాను ఆహ్వానించారు. ఆ ప్రెస్ మీట్ లో పేర్కొన్న ముఖ్య అంశాలు: 1. ఆపరేషన్ కర్రెగుట్టలు విజయవంతమైంది. మొత్తంగా 31 మంది మావోయిస్టులను తుదముట్టించాము. 2. 450 ఐ‌ఈ‌డి లను నిర్వీర్యం చేశాము.
వ్యాసాలు

బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక సైనికచర్యలో మరణించిన బాల సైనికురాలు: ఆమె ఒక్కరే కాదు

మావోయిస్టులు తక్కువ వయస్సు గల సైనికులను రిక్రూట్ చేసుకుంటున్నారు; అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి రాజ్యం వారిని చంపేస్తోంది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ అడవులలో లోతట్టు ప్రాంతాలలో, స్థానిక ఆదివాసీ సముదాయాల నుండి పార్టీలోకి చేర్చుకొన్న మావోయిస్టు తిరుగుబాటుదారులు దాదాపు నాలుగు దశాబ్దాలుగా భారత రాజ్యంతో మంద్రస్థాయి యుద్ధంలో బంధితులయ్యారు. ఈ సంవత్సరం, ఘర్షణలో పెద్ద పురోగతి సాధించామని, దాదాపు 40 ఎన్‌కౌంటర్లలో 153 మంది మావోయిస్టులను హతమార్చామని, ఇది 2009 మినహా గతంలో చూసిన వార్షిక సంఖ్య కంటే ఎక్కువ అని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెబుతున్నారు. ఎన్‌కౌంటర్‌లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి, మరణించిన వారిలో 37 మంది కుటుంబాలతో
వ్యాసాలు

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణతో ట్రేడ్ యూనియన్ నాయకుడు అనిరుద్ధ్ అరెస్టు

కార్యకర్తల‘ఎరుపు ముద్ర’పైఆగ్రహం నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 34 ఏళ్ల వామపక్ష ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడం అతని సహచరుల, కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది; కార్యకర్తలపై ఎరుపు ముద్ర వేస్తున్నందుకు ప్రభుత్వ ఏజెన్సీలను విమర్శిస్తున్నారు. బెంగళూరులోని మెజెస్టిక్ బస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 5న రాత్రి 10.30 గంటలకు చెన్నై వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్న ఢిల్లీ ఎన్‌సి‌ఆర్ ఆధారిత మార్క్సిస్ట్ ట్రేడ్ యూనియన్, మనేసర్ జనరల్ మజ్దూర్ సంఘ్ (ఎం‌జి‌ఎం‌ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, అధ్యక్షుడు అనిరుద్ధ్ రాజన్‌ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్టు చేసింది.. ఉత్తర
వ్యాసాలు

ప్రజలు, ఉద్యోగులు, పాలకులు 

శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో