వ్యాసాలు

Caste and Religion in the 18th Lok Sabha Election

Introduction Election result of the 18th Lok Sabha is out. RSS-BJP’s dream of above 400 is decimated. RSS-BJP did not spare caste and religion for their political gains, like all other elections.  BJP was in the forefront but it was not alone in using caste and religion for political gains. These two identities, particularly caste as a peculiar character of Indian society have always been part and parcel of the
వ్యాసాలు

ప్రొ. సాయిబాబ కేసులో ఎల్గార్ పరిషత్ కేసు మూలాలు

ఎల్గార్ పరిషత్  కేసులో అరెస్టు అయిన వారిలో కొందరికి  సాయిబాబాతో 'ప్రత్యక్ష సంబంధం'లో ఉన్నాయని చార్జిషీట్‌లో   పూణే పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో 2018 చివర్లో   మొదటిసారిగా పూణే పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు, ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా వున్న కేసు దర్యాఫ్తు పైన “భారీగా ఆధారపడుతున్నాం” అని చెప్పారు.. అప్పటికే సాయిబాబాను, మరో ఐదుగురిని గడ్చిరోలి సెషన్స్ కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు అయిన మానవ హక్కుల కార్యకర్తలపై తమ కేసును తయారుచేసుకోవడానికి సాయిబాబాకు గడ్‌చిరోలి కోర్టు జీవిత ఖైదు విధించడంపై వారు దృష్టి సారించారు. 2020
సాహిత్యం వ్యాసాలు

ఆధునిక తెలుగు కవిత్వంలో భాష

రంగనాథాచార్యుల అభిప్రాయాలు ఇటీవల మనల్ని వదిలి వెళ్లిపోయిన కె.కె. రంగనాథాచార్యులు (కె.కె.ఆర్‌) ప్రగతిశీల తెలుగు సాహితీ మేధావుల్లో ఒక పెద్ద తల. వృత్తిరీత్యా ఆంధ్ర సారస్వత పరిషత్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా, కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసినా, వృతినీ ప్రవృత్తినీ ఒకటిగా మలుచుకున్న నిరంతర అధ్యయన శీలి ఆయన. తెలుగు, సంస్కృతం, ఆంగ్ల భాషల్లో పండితుడు. తెలుగు శాసన భాషలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పొందిన భాషావేత్త. ఆధునిక కాలంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలలో వేగంగా ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న మార్పులను ఒక కంట కనిపెడుతూ ఏక కాలంలో సాహిత్య బోధకుడుగా, సాహిత్య
వ్యాసాలు

3,588 రోజుల నిర్బంధం

ప్రొఫెసర్ సాయిబాబాను తొలిసారి 2014 మే 9నాడు ఢిల్లీలోని ఆయన నివాసం నుంచి అరెస్టు చేశారు. 2017లో సాయిబాబాతో పాటు మరో ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఉపా కింద అక్రమ నిర్బంధాన్ని పరిగణనలోకి తీసుకుని బాంబే హైకోర్టు 2022లో అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. 2023లో సుప్రీంకోర్టు అతని అప్పీల్‌ను మళ్లీ విచారించాలని నిర్ణయం ఇస్తూ  కేసును మెరిట్‌పై (తప్పు ఒప్పులపై ఆధారపడి) పరిగణించాలని ఆదేశించింది. మార్చి 5న, బాంబే హైకోర్టు మరోసారి నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించింది, అయితే ఈసారి ప్రాసిక్యూషన్ వాదనలు, సాక్ష్యాల్లోని బూటకత్వాన్ని బట్టబయలు చేస్తూ మెరిట్ ప్రాతిపదికన నిర్ణయం తీసుకొన్నది.
సాహిత్యం వ్యాసాలు

ప్ర‌కృతి, ప్ర‌జ‌ల ఎంపిక‌ – విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం

విశాఖలో సహజసిద్ధంగా పోర్టు ఎలా అయితే ఏర్పడిందో ఆ పోర్టే స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రాతిప‌దిక అయ్యింది. మత్యకారగ్రామం అయిన విశాఖ సముద్ర తీరంలోని డాల్ఫిన్‌ నోస్‌. డాల్ఫిన్‌ చేపముక్కు సముద్రంలోకి చొచ్చుకొని పొయినట్లు కనిపించే తీరం (యారాడ కొండలు), నౌకలు లంగరు వేసి నిలబెట్టేందుకు అనువైన స్థలంగా మారింది.ఇక్కడ లంగరు వేసిన నౌకలు ఎంత బలమైన తుఫాన్‌ గాలుకు కూడా కొట్టుకొనిపోకుండా ఈ యారాడ కొండ రక్షణగా నిలబడింది. బ్రిటీష్‌కాలం ముందు నుండి (1927 నుండి) ఓడ రేవుగా ఉంటూ 3 బెర్తులతో మొదలయ్యి తరువాత 24 బెర్తులతో మేజర్‌పోర్ట్‌గా విస్తరించి  ప్రపంచ వాణిజ్యానికి ద్వారాలు తెరిచింది.5వ పంచవర్ష
వ్యాసాలు

“నేను జైలు నుండి బయటపడటం యాదృచ్ఛికమే”

'నేను టాయిలెట్ కు వెళ్ళలేను, సహాయం లేకుండా స్నానం చేయలేను, జైలులో ఎలాంటి ఉపశమనం లేకుండా చాలా కాలం జీవించాను. నేను జైలు నుంచి సజీవంగా బయటపడడం కేవలం యాదృచ్ఛికం ' ' అని 56 ఏళ్ల ఢిల్లీ విశ్వవిద్యాలయ పూర్వ ప్రొఫెసర్ నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుండి విడుదలైన తరువాత గురువారం (మార్చి 7)న తన మొదటి పత్రికా సమావేశంలో చెప్పారు. బాంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ మార్చి 5న ఆయనతో పాటు మరో ఐదుగురిని ఉగ్రవాద కేసుల్లో నిర్దోషులుగా ప్రకటించింది. చక్రాల కుర్చీలో కూర్చొని 90 శాతానికి పైగా వికలాంగుడు అయిన సాయిబాబా, ఇతరుల సహాయం
సాహిత్యం వ్యాసాలు

కాకోరి నుండి నక్సల్బరి దాకా ….

ఉత్తర ప్రదేశ్‌లో వెనుకబడిన, భూస్వామ్య వ్యవస్థ వుండిన ప్రాంతాల్లో గొప్ప విప్లవ పోరాటాల చరిత్ర ఉంది. నక్సల్బరి ఉద్యమ ప్రభావం ఇక్కడ కొన్ని ప్రాంతాలలో చాలా ఎక్కువగా  ఉంది, కానీ దీనికి లిఖిత పూర్వక చరిత్ర లేదు. ఆ సమాచారాన్ని ఇచ్చే ఒకే పుస్తకం, శివకుమార్ మిశ్రా రాసిన 'కకోరి నుంచి నక్సల్బరి దాకా....'. శీర్షికలోనే వున్నట్లుగా శివకుమార్ మిశ్రా, ఉత్తర ప్రదేశ్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు, నక్సల్బరీ ఉద్యమంలో కూడా చురుకుగా పనిచేశారు. ఉత్తరప్రదేశ్‌ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. తను పనిచేసిన రంగాలన్నింటి అనుభవాల సంకలనం ఈ పుస్తకం. ఉత్తర ప్రదేశ్‌లోని
వ్యాసాలు

హక్కుల చైతన్యాన్ని కార్మికవర్గ దృక్పథాన్ని పెంచే వ్యాసాలు

(ఇటీవల పౌరహక్కుల సంఘం యాభై వసంతాల సభల్లో విడుదలైన అమరుడు ప్రొ. శేషయ్య గారి పుస్తకానికి రాసిన ముందుమాట ) ప్రొ. శేషయ్యగారి రచనా సర్వస్వంలో ఇది మూడో సంపుటం. మొదటిది ‘రాజ్యాంగం-పౌరహక్కులు, విమర్శనాత్మక దృక్పథం(2021)’. రెండో సంపుటి ‘కాలంతో కరచాలనం, స్వేచ్ఛ సంపాదకీయాలు(2023)’. ఇప్పుడు ‘నూతన ఆర్థిక విధానాలు-కార్మికోద్యమం’. శేషయ్యగారి అమరత్వం తర్వాత ఆయన రచనలన్నీ ప్రచురించాలని పౌరహక్కుల సంఘం అనుకుంది. సంస్థ నాయకుడిగా, హక్కుల ఉద్యమ వ్యాఖ్యాతగా ఆయన వేర్వేరు సందర్భాల్లో రాసిన వ్యాసాలను పాఠకులకు అందించాలని ఈ పని ఆరంభించాం.  ఇందులోకి దిగాక ఈ వ్యాసాల విస్తృతి, లోతు మరింతగా అర్థమవుతున్నది. తెలుగు సమాజాలు,
సాహిత్యం వ్యాసాలు

అంబానీ రాజ్యంపై ముంబాయి విద్యుత్ కార్మికుల పోరాటం

భీమా కోరెగావ్ సంఘటన తరువాత యుఎపిఎ కింద కొంతమంది కార్మికులను అరెస్టు చేసిన రాజ్యం యథావిధిగా  తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోయింది. అసలు భీమా కోరేగాంకు కార్మికులకు సంబంధం ఏమిటి? ఏమీ లేదు. అయితే వాళ్ళు తమ శక్తివంతమైన యజమాని రిలయన్స్‌ కు వ్యతిరేకంగా కాంట్రాక్ట్ కార్మికులను సమీకరించి పెద్ద నేరం చేశారు. ఈ కార్యకలాపాలపై దేశద్రోహ అభియోగాలు మోపలేక, వందలాది మంది కార్యకర్తలు, కార్మికులను ఇతర సాకులతో జైలులో ఉంచడానికి రాజ్యం నిస్సారమైన ఆరోపణలను చేస్తుంది. తమపై మోపిన అభియోగాలను తొలగించుకోడానికి చాలా కాలమే పట్టింది. చిట్టచివరికి ఖైదులో వున్న ముంబై ఎలక్ట్రిక్ ఎంప్లాయీస్ యూనియన్ (MEEU) కార్మికులకు 3 సంవత్సరాల తరువాత బెయిల్ మంజూరయింది. వారి యూనియన్ (ముంబై ఎలెక్ర్టిక్ ఎంప్లాయీస్ యూనియన్) అరెస్టు చేసిన కార్మికులకు సంఘీభావం
వ్యాసాలు

‘మే డే’, భారతదేశ శ్రామికులు.

ఒక పక్క, దేశమంతా ఎండలు భగ భగ మండుతున్నాయి. మండుతున్న సరుకుల ధరలు ఆకాశానికి ఎగుస్తున్నాయి. ఈ మంటలకు భారతదేశ శ్రామికులు కుతకుత ఉడికిపోతున్నారు.  మరో పక్క, దేశం ప్రయివేటీకరణ వెల్లువలో కొట్టుకుపోతోంది. గుప్పెడు పెట్టుబడిదారుల చేతుల్లోకి ప్రజా సంపద అంతా ప్రవహిస్తోంది. 75 ఏళ్లుగా పార్లమెంటరీ ఓట్ల రాజకీయం దేశంలో నిరాటంకంగా కొనసాగుతోంది. ఇప్పుడు దానికి అమృతోత్సవ పండగ.  ప్రజలు నమ్మి, ఓట్లేసి, గెలిపిస్తున్న పార్లమెంటరీ  పార్టీలు, పాలనా వ్యవస్థలు.. శ్రామిక ప్రజా శ్రేణులను స్వాతంత్రం, గణతంత్రం, రాజ్యాంగం సాక్షిగా వంచిస్తూనే ఉన్నాయి. సామాజిక సంపదను వ్యక్తిగత సంపదగా మార్చుకునే క్రమాన్ని అవిరామంగా కొనసాగిస్తు న్నాయి. ఇప్పుడు