వ్యాసాలు సాహిత్యం

ఈ నిషేధానికి అర్థం ఏమిటి ?

చరిత్రలో జరిగిన ప్రజా పోరాటాలే పౌర ప్రజాస్వామిక హక్కులకు జన్మనిచ్చాయి. రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నీ ఆ ప్రజా పోరాటాల ఫలితంగానే చట్ట రూపమెత్తాయి. ఇతర హక్కులతో పాటు, రాజ్యాంగంలో సొంత ఆస్తిని కలిగి ఉండే హక్కును కూడా పొందుపరచడమే మన దేశ పాలకుల వర్గ ప్రయోజనాల ప్రతిఫలనం అని ఇప్పుడు కొత్తగా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఇదట్లా వుండగా మన దేశాన్ని స్వాతంత్రోద్య‌మ ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించాల‌ని అధికార‌మార్పిడి అనంత‌రం మ‌న పాల‌కులు ప్ర‌క‌టించారు. ఆ ప‌ని చేయ‌డానికి వాళ్ల‌కు ఎటువంటి అడ్డు లేదు. కానీ దానికి పూనుకోలేదు.  సర్వసత్తాక, సార్వభౌమాధికార, స్వతంత్ర దేశం అనే మాట‌లు రాజ్యాంగంలో
సాహిత్యం వ్యాసాలు

నిషేధాన్ని ఇలా చూద్దాం!

నిషేధ కాంక్ష లేని సమాజాలు లేవు. అన్ని సమాజాలూ మనుషులపై పగ పూనినవే. ఏ సమాజంలోనూ మనుషులు తాము న్యాయం అనుకొన్నదానిని సాధించుకోలేకపోయారు. ఒక నమూనాగా కొంత నిడివితో నడిచిన సమాజాలు ఇందుకు మినహాయింపు కావచ్చు. నిరంకుశ పాలకవర్గ భావజాలాలన్నీ చరిత్రలో మనుషులను సమస్యగా చూసినవే. నేటి పాలకవర్గ భావజాలమైన ఫాసిజం ఈ చారిత్రక వాస్తవానికి విషాద ముగింపును ఇవ్వడానికి తొందర పడుతోంది. మరోవైపు, నేటి రాజకీయం మావోయిజం ఈ ప్రమాదాన్ని తప్పించి, మనిషిని ఏకైన పరిష్కారంగా ఎత్తిపట్టేందుకు ముందుకొచ్చింది. ఈ రెండు భావజాలాలకూ వేళ్లు రాజకీయార్థిక పునాదిలోనే ఉన్నాయి. ఆ విషయాల్లోకి వెళ్లే ముందు, ముందుగా మనుషులు తమ చైతన్యం, అవసరాలు,
సాహిత్యం వ్యాసాలు

సాహిత్య విమ‌ర్శ‌లో జేసీ

*క్లాసిక‌ల్* సంవిధానంలోని వెలుగు నీడ‌లు విప్లవ సాహిత్య విమర్శ చరిత్రలోని  1980ల  త‌రంలో  జేసీని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  ఆ ద‌శాబ్దంలోనే ఆయన ప్ర‌ధాన  రచనలు   వెలువడ్డాయి. కవిత్వం-గతితార్కికత అనే వ్యాస సంపుటి 1991 జనవరిలో సృజన ప్రచురణగా వచ్చింది. విప్లవ సాహిత్య విమర్శ ఆరంభకుల్లో  కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కెవిఆర్ ప్రముఖులు.  వారు విప్లవ సాహిత్య విమర్శకు పటష్టమైన పునాది వేశారు. ఈ ముగ్గురూ అభ్యదయ సాహిత్యోద్యమ సంప్రదాయంలోంచి నక్సల్బరీ పంథాలోకి వచ్చారు.  ఈ తొలి తరం ప్రముఖులతో పోల్చుకుంటే 1980లలో వచ్చిన విమర్శకుల మేధో వ్యక్తిత్వం చాలా భిన్నమైనది. ఒక్కొక్కరు ఒక్కో వరవడిని విమర్శలోకి తీసుకొచ్చారు. వీరంతా సుమారుగా
సాహిత్యం వ్యాసాలు

కథానికా విమర్శకుడుగా సింగమనేని

కథలు  రాయటం ఎంత సులువో అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయటానికి పెద్ద శ్రమ ఉండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ, జీవితం పట్ల పరిశీలన ఉండే, జీవతం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకుడికి అందించగలందుకు రాయటం మాత్రం కష్టమయిన పనే అని నేను ఒప్పుకుంటాను’’(సింగమనేని : కథ రాయటం గురించి కొంచెం, కథలెలా రాస్తారు సంకలనం 1992)  ప్రతి రచయితా ఒక విమర్శకుడే అనే మాట చాలా కాలం నుంచీ వినిపిస్తున్నది. ప్రాచీన కావ్యావతారికలో అప్పటి కవులు కవిత్వం, కావ్యం వంటి వాటి గురించి చెప్పిన
సాహిత్యం వ్యాసాలు

ఆన్ లైన్ విద్యతో పెరిగిన డ్రాపౌట్లు

అంతర్జాతీయ కరోనా సంక్షోభం నేపథ్యంలో గత ఏడాది నుండి నేటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 24 మిలియన్ల పాఠశాల స్థాయి విద్యార్థులు డ్రాపౌట్లుగా మారినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన అనుబంధ సంస్థ యునెస్కో(UNESCO) ప్రకటించింది. మార్చి 20,2020 నాడు దేశవ్యాప్త లాక్ డౌన్ లో భాగంగా తెలంగాణలో విద్యా సంస్థలు మూసివేయటంతో విద్యార్థుల చదువులు నిలిచిపోయాయి.అనంతరం ప్రభుత్వం ప్రకటించిన వర్చువల్ విధానంలో ఆన్ లైన్ తరగతులు పేరుకే మిగిలిపోయాయి.గ్రామీణ ప్రాంతాలలోని,పట్టణ ప్రాంతాలలోని యస్సీ,యస్టీ,బిసి,మైనార్టీ వర్గాల-కులాల పేద విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వినేందుకు అవసరమైన సౌకర్యాలు,కనీసం స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ లేక తీవ్రంగా నష్టపోయారు.వీరి చదువులు నిలిచిపోయాయి.తెలంగాణలో ప్రాథమిక స్థాయి విద్యార్థుల
వ్యాసాలు

ఎవరిపై పోరాడుతున్నారో తెలుసుకోండి

పోలీసు, అర్ధ సైనిక, సైనిక జవాన్ లారా! భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) గత 50 సంవత్సరాలకు పైగా మన దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మిస్తోంది. భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి మిమ్మల్ని పెద్ద సంఖ్యలో పాలకులు మోహరిస్తున్నారు. ఇప్పటికే దేశానికి ఉత్తరాన కశ్మీర్ లో, ఈశాన్యాన అసోం నుండి అరుణాచల్ ప్రదేశ్ ల వరకు లక్షల సంఖ్యలో మిమ్మల్ని మోహరించారు. మధ్య, తూర్పు భారత రాష్ట్రాలలో మీరు ఆరు లక్షలకు పైగానే మోహరించబడి ఉన్నారు. ఇటీవల 2019 డిసెంబర్ లో జాతీయ భద్రతా సలహాదారు విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఐదు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో నూతనంగా విప్లవోద్యమం నిర్మూలనకు
వ్యాసాలు

హిడ్మే మర్కం అక్రమ అరెస్టును ఖండిద్దాం!

హిడ్మే మర్కంను వెంటనే విడుదల చేయాలీ! చత్తిస్‌ఘఢ్‌లో పౌర హక్కుల కార్యకర్తలపై వేధింపులను ఆపాలి! మార్చి 9, 2021 ఛత్తీస్‌‌ఘఢ్ పోలీసులు, పారా మిలటరీ దళాలు అదుపులోకి తీసుకుని శారీరక, లైంగిక హింసలకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకొన్న కావ్య నంది, పండే కవాసీ అనే యిద్దరు ఆదివాసీ యువతుల స్మృతిలో దంతేవాడ, సమేలిలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంనుంచి 28 ఏళ్ల ఖనిజ తవ్వకాల వ్యతిరేక, ఆదివాసీ హక్కుల కార్యకర్త హిడ్మే మార్కమ్‌ను నిస్సిగ్గుగా, చట్టవిరుద్ధమైన తీరులో ఎత్తుకెళ్లిన ఘటన మమ్మల్ని దిగ్భ్రాంతుల్ని చేసింది. ఆ తరువాత హిడ్మే మార్కంను, (d/o పోడియం మార్కం, బుర్గం గ్రామం,
వ్యాసాలు

కథలవనం ఎండిపోయింది..

ఆకులన్నీ రాలి మోడై ఎండిన కథల చెట్టు కూలిపోయిన వర్తమాన స్థితి కనబడుతుంది. రాయలసీమలోకథల పెద్దోళ్ళలో.. బహుశా ఆధునిక కథను వొడిసిపట్టుకుని దాంతోనే నాలుగైదు దశాబ్ధాలు సాహచర్యంచేసిన కథల రారాజు అస్తమించిన దుఃఖ సందర్భమిది. ఆయన గూర్చి మాట్లాడ్డమంటే మానవీయ విలువలగూర్చి మాట్లాడటమే. సింగమనేని నారాయణ అసలు సిసలైన మార్క్సిస్టు కథకుడు. నిఖార్సైన భావజాలంతోజీవించినవాడు. కథల కార్థానాలోనే జీవితఖైదీగా బతికినవాడు. ఎవరేకథ రాసినా ఆ కథను అసాంతం చదివిఆ కథపై నాలుగుమాటలు మాట్లాడి కథకుడిని ఉత్సాహ పరిచే సాహిత్య సంస్కారమున్నవాడు. రాయలసీమకథను కథల ప్రపంచంలో అగ్రభాగాన నిలిపిన కథకుడు. ఆయన రాయని కథావస్తువు మిగల్లేదు. ఇదిరాయలేదనడానికి వీల్లేని వస్తువులన్నింటిని
వ్యాసాలు అనువాదాలు

కోవిడ్ 19 విపత్తుని ఎదుర్కోవడంలో క్యూబా సహకారం

‘వారు తెలివైన ఆయుధాలను కనిపెట్టారు. కానీ మేము మరింత ముఖ్యమైనది కనిపెట్టాము: ప్రజలు ఆలోచిస్తారు, అనుభూతి చెందుతారు.’ ఫెడల్ కాస్ట్రో అనేక పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రజారోగ్య విధానాలలో వైఫల్యాన్ని COVID-19 విపత్తు బహిర్గతం చేసింది. IMF, ప్రపంచ బ్యాంక్ పునర్నిర్మాణ కార్యక్రమాల ద్వారా ప్రేరేపించబడిన ఆరోగ్యం, విద్యా కార్యక్రమాలలో కోతలు చేసిన దశాబ్దాల నయా ఉదారవాద కాఠిన్యం, ఇప్పుడు లాటిన్ అమెరికా, యూరప్, అమెరికా అంతటా వ్యాప్తిస్తున్న ప్రమాదకరమైన అంటువ్యాధులు, మరణాలలో ఫలితాలను చూపుతోంది. పాశ్చాత్య దేశాలలో, క్యూబా సమర్థతకు ఒక ఉదాహరణగా నిలిచింది. విపత్తుకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మరొక మార్గం సాధ్యమని చూపించింది. సంఖ్యలు
వ్యాసాలు అనువాదాలు

పశ్చిమ బెంగాల్‌లో బ్రాహ్మణీయ ఫాసిజం ఆవిర్భావం

ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడటంలో పార్లమెంటరీ విధానం ప్రధాన రూపం కాదు. ఫాసిస్టు వ్యతరేకులు వీధుల్ని తమ అజమాయిషీలోకి తీసుకోవాలి డాక్టర్‌ అమితవ చక్రవర్తి ఫిబ్రవరి 4, 2021 పశ్చిమ బెంగాల్‌లో రానున్న శాసనసభ ఎన్నికలు అర్‌యస్‌య‌, భాజపా పరివారంలో అనందోత్సాహాల్ని రేకెత్తించాయి. ఎన్నికల్లో తాము ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. ఉత్తరభారతంలో జరుగుతున్న రైతాంగ పోరాటం మోడీ ప్రభుత్వపు “అభివృద్ధి నమూనా వాస్తవరూపాన్ని బహిర్గతం చేసింది. అయితే గత పార్లమెంటు ఎన్నికల నుండి బెంగాల్‌లో భాజపా అసాధారణ అభివృద్ధిని సాధించింది. దాని అవిర్భావ కాలం నుండి ఇంతటి పెరుగుదలను అర్‌యస్‌యస్‌ కలలో కూడా ఊహించలేదు. పశ్చిమబెంగాల్‌లో అధికారాన్ని