సంభాషణ

పోలీసులకు ఈ నాటిక మీద  కోపమెందుకు ?

వాస్తవం వేరు వాస్తవికత వేరు అని విన్నాను. వాస్తవానికున్న మూలాన్ని విశ్లేషిస్తే వాస్తవికత అవుతుందని కూడా విన్నాను. వాస్తవికత కళగా మారితే మూలంలోని సమస్య విస్తృత ప్రచారాన్నందుకుంటుంది. ప్రజల్లోకి చొచ్చుకు పోతుంది. ఇలా ప్రజల్లో ప్రచారం కావటం పాలక వర్గాలకు నచ్చదన్న విషయం విదితమే. ఈ నెల నాల్గవ తేదీన హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విరసం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జల్‌ జంగల్‌ జమీన్‌ హమారా అన్న లఘునాటికను ప్రదర్శించారు. ఈ నాటికలో వస్తువు ఆదివాసులు కార్పొరేట్‌ విస్తరణను అడ్డుకుంటారు. ప్రభుత్వం వారిని అణచివేస్తుంది. పోలీసు కాల్పుల్లో ఒక పాప  మరణిస్తుంది.  పిల్లలు ప్లకార్డులు పట్టుకుని ఈ
ఇంటర్వ్యూ నా క‌థ‌తో నేను

నిల‌దీసే క‌థ‌లు అవ‌స‌రం

1. కథలోకి ఎలా వచ్చారు? జ. మాది ఏ నీటి అదరుపూ లేని మారుమూలన ఉండే మెట్ట ప్రాంతం. నిత్యం కరువుతో పోరాడుతూనే. కథలతో కాలక్షేపం చేస్తూ ఎప్పటికప్పుడు జీవితేచ్ఛను రగిలించుకోవడం మా ప్రాంత లక్షణం. అందుకే నాకు చిన్నప్పటి నుంచి కథలంటే ఇష్టం, మా అమ్మ ఈశ్వరమ్మ అద్భుతమైన కథలు చెబుతుంది. నా చిన్నప్పుడు రోజూ రాత్రిపూట మా అమ్మ కథతోనే నిద్రపోయేవాడిని. నాన్న రెడ్డెప్పాచారి కూడా కథలు చెప్పేవాడు. మా మేనమామలు రాజగోపాలాచారి, బ్రహ్మయ్యాచారి, మా పెద్దమ్మ లక్ష్మీదేవి మంచి కథకులు. మా ఊళ్లో కాదరిల్లి తాత, బడేసాబ్ వారంలో మూడునాలుగు రోజులైనా మా ఇంటికి
కారా స్మృతిలో సంభాషణ

అవుట్ బరస్ట్!

ప్రపంచం ఎలా ఉండాలో అలా లేదు. ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నామో అందుకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం మన అభిప్రాయాల్ని స్పందనల్ని మనలోపల పెట్టుకొని దాచుకోలేక బయటపడుతూ ఉంటాం. ప్రభుత్వాలూ దాని వ్యవస్థలూ అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఈ భావాల వినిమయం మరింత ఎక్కువగా ఉంటుంది. అంతే బలంగా ప్రభుత్వాలు దాన్ని అడ్డుకోవడానికి మీడియా వాహకాలని నియంత్రిస్తుంది. కేసులు పెడుతుంది. అరెస్టులు చేస్తుంది. అణచివేస్తుంది. అదే మీడియా వాహకాలని తన సైన్యంతో అనుకూలంగా వొకవైపు వాడుకుంటూనే మరోవైపు తన చెప్పు చేతల్లోకి తీసుకోవడానికీ ప్రయత్నిస్తూవుంటుంది. మనకు ఇవాళ తక్షణ స్పందనల్ని బయట పెట్టుకొనే వీలూ వెసులుబాటూ ఉంది. ఏ మేరకు
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

లోచూపు!

జీవితానికైనా రచనకైనా జీవధాతువు స్పందన. ఏయే స్పందించిన విషయాలు నిలువనీయవో ఆయా అంశాలు ఆయా రచయితలకు కథాంశాలవుతాయి. కథా వస్తువులవుతాయి. అందుకే ‘కథాకథనం’లో కారా మాస్టారు ‘కథ రాయాలంటే...’ అని ‘తమకు జరిగే మంచి చెడ్డలకు లోకంలో ప్రతివారూ స్పందిస్తారు. ఆ స్పందన కొందరిలో ఇతోధికంగానూ మరికొందరిలో సాధారణంగానూ ఉంటుంది. సాధారణతను మించి స్పందించే వారెవరైనా రచయితలయ్యే అవకాశం ఉంది’ అంటారు. ‘మన స్వభావం జీవితంలో మంచి చెడ్డలకి తీవ్రంగా స్పందించేదై ఉండాలి’ అని కూడా అంటారు. అలాగే కథకి వస్తువూ పాత్రలూ వాటి వర్ణనలూ సంభాషణలూ సన్నివేశాలూ సంఘటనలూ పాత్రోచిత భాష వాటి నిర్వహణతో అది కథ
కారా స్మృతిలో సాహిత్యం సంభాషణ

చదువు!

‘చదువు’ ఈ మాటని ఉచ్చరించి చూడండి. మనలో మనం అనుకున్నా పక్కవారితో అన్నా ‘చదువు’ అంటే చదవమన్న చదువుకోమన్న ధ్వని కూడా వస్తుంది. నిజానికి చదువు అంటే వేదం అని అర్థం. వేదం అంటే జ్ఞానం అని అర్థం. ఇంకా నేర్చుకోవడం, తెలుసుకోవడం, విద్య దాక అనేక అర్థాలు వున్నాయని నిఘంటువులు చెపుతున్నాయి. అభ్యసించడం అధ్యయనం చేయడం లాంటి పర్యాయ పదాలు కూడా వున్నాయి. అయితే చదువుకు కొత్త అర్థం ‘కారా’గా అనుభవమవుతుంది నాకు. ఆయన కథానిలయంలో పుస్తకాల మధ్య తిరగడమే కాదు, యెక్కువ సమయం చేతిలో పుస్తకంతోనే కనిపించేవారు. నోట్లో కిళ్ళీ  చేతిలో పుస్తకం లేకుండా మాస్టారిని
ఇంటర్వ్యూ సంభాషణ

మమత ఫాసిస్టు వ్యతిరేకి కాదు

1. బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు  కూడా  మమతకు  జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది? ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్‌లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా
సంభాషణ

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే

అక్షరాలపై నిషేధం ఆలోచనలపై నిషేధమే.అక్షరాలను బంధించడం అంటే ఆలోచనలను బంధించడం. సృజనాత్మకతను బంధించడం. వర్తమానాన్ని కాదు భవిష్యత్తును బంధించడం. అక్షరాల పై ఆలోచనలపై సృజనాత్మకత పై నిషేధం ఎప్పుడూ మంచిది కాదు. వర్తమాన ప్రపంచంలో అనేక సామాజిక సంక్షోభాలను అందుకు కారణాలను కారకాలను తక్షణం గుర్తించాల్సిన ప్రస్తుత తరుణంలో, సమానత్వం కోసం స్వేచ్ఛకోసం మానవీయత కోసం మెరుగైన మానవ సంబంధాల కోసం, మానవ హక్కుల కోసం మనం సృజనకారులను కాపాడుకోవాల్సి ఉంది.మెరుగైన సమాజం కోసం  మెరుగైన ఆలోచనలను విస్తృత పరచి, నిష్పాక్షిక దృష్టితో వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించాల్సి ఉంది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో వచ్చిన విస్తృతమైన సాహిత్యం, పాటలు
సంభాషణ

ఛత్తీస్ ఘడ్ లో మరో బూటకపు ఎన్కౌంటర్

మరణించిన మనురామ్ నూరేటి ‘మావోయిస్టు’ అన్న పోలీసులు ఆ తర్వాత కాదన్నారు . 2022 జనవరి 23న ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలోవున్న భరందా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మనురామ్ నూరేటి అనే యువకుడు చనిపోయాడని పోలీసుల కథనం. “ఎన్‌కౌంటర్  ప్రారంభమైనప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) బృందం ఏరియా డామినేషన్ ఎక్సర్‌సైజ్ లో ఉంది. అర్ధరాత్రి 1 గంటలకు, మావోయిస్టులు డిఆర్‌జిపై కాల్పులు జరపడంతో  ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఎన్‌కౌంటర్ 20 నిమిషాల పాటు కొనసాగింది. ఆగిపోయిన తరువాత, సంఘటన స్థలం నుండి ఒక మావోయిస్టు మృతదేహాన్ని, మజిల్ లోడింగ్ గన్ (ఎమ్‌ఎల్‌జి)ను స్వాధీనం చేసుకున్నది, ”అని నారాయణపూర్ పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్ చెప్పారు, ఎన్‌కౌంటర్ స్థలం నుండి మావోయిస్టులకు సంబంధించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. “రాత్రి 10 గంటల ప్రాంతంలో, నా భర్త పక్షులను వేటాడేందుకు స్లింగ్‌షాట్‌తో బయటికి వెళ్లాడు. అతను స్వెటర్‌ సాధారణ  చెప్పులు వేసుకున్నాడు, కానీ  పోలీసులు చూపించిన మృత దేహానికి యూనిఫాం వుంది, రైఫిల్‌
సంభాషణ

సంభల్: కల్పించిన నిశ్శబ్దం

మరోసారి 'మందిర్-మస్జిద్' వివాదంపైన పోలీసులతో జరిగిన ఘర్షణలో స్థానిక ముస్లిం పురుషులు మరణించిన, శతాబ్దాల నాటి ఉత్తరప్రదేశ్‌లోని సంభల్ పట్టణంలో నిర్జన వీధుల నిశ్చలత భారంగా వుంది. మసీదు వెలుపల జరుగుతున్న పథ్‌రావ్ (రాళ్లు విసరడం) మధ్య హసన్ తన తమ్ముడిని వెతకడానికి వెళ్లినప్పుడు ఒక బుల్లెట్ లేదా ఒక పదునైన ముక్క తగిలి  అతని కుడి చేతిని గాయపరిచింది. అది ఎటు వైపు నుంచి వచ్చిందో -స్థానిక ప్రజలా లేదా పోలీసుల వైపు నుంచా అనేది - చూడలేకపోయాడు. ఎవరు కాల్చుతున్నారో కూడా గమనించలేదు. పోలీసులు మొదట పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ తర్వాత చేర్చిన సంభల్
ఇంటర్వ్యూ సాహిత్యం సంభాషణ

దృక్ప‌థం అందించే ఎరుక వ‌ల్ల‌నే క‌థ గుర్తుండిపోతుంది

(వ‌ర్త‌మాన క‌థా సంద‌ర్భంలో వ‌సంత‌మేఘం తెలుగు క‌థ‌కులు, సాహిత్య విమ‌ర్శ‌కుల‌తో ఒక సంభాష‌ణ జ‌ర‌పాల‌నుకుంది. మాన‌వ జీవితానుభ‌వం, దానికి అవ‌త‌ల ఉండే సంక్లిష్ట  వాస్త‌విక‌త‌, అనుభ‌వానికి దృక్ప‌థానికి ఉండే ఉమ్మ‌డి ప్రాంతం, క‌ళ‌గా మారే అనుభ‌వంలో ప్ర‌యోగం పాత్ర‌.. వంటి అంశాల‌పై కొన్ని ప్ర‌శ్న‌ల‌ను వ‌సంత‌మేఘం టీం వారికి పంపించింది.  ఇదొక సంభాష‌ణా క్ర‌మం. తెలుగు కాల్ప‌నిక‌, విమ‌ర్శ‌రంగాల‌కు దోహ‌దం చేస్తుంద‌నే ఆశ‌తో ఆరంభించాం.  గ‌త  సంచిక‌లో ఇద్ద‌రు  సాహిత్య‌కారుల అభిప్రాయాలు  ప్ర‌చురించాం. ఈ సంచిక‌లో మ‌రో ఇద్ద‌రి స్పంద‌న‌లు మీ కోసం.. వ‌సంత‌మేఘం టీ) 1. కథా రచనలో అనుభవం మౌలిక వనరు. కానీ దాని అధిగమించి