వ్యాసాలు

రాజ్య నిరంకుశత్వ బాధితుడు ఫాదర్ స్టాన్ స్వామి

(ఆగష్టు 9న కర్నూలులో విరసం నిర్వహించిన పుస్తకావిషకరణ సభ ప్రసంగ పాఠం) అరుణ్ గారు అనువదించిన "నేను నిశ్శబ్ద ప్రేక్షకుడిని కాను" అనే తెలుగు అనువాద పుస్తకం యొక్క ఆవిష్కరణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను గౌరవంగా భావిస్తున్నాను, ఇది ఫాదర్ స్టాన్ స్వామి రచించిన "I am not a Silent Spectator" అనే అసలు పుస్తకం నుండి వచ్చింది, ఇది అతని జైలు డైరీ. ఇతరుల కోసం తన ప్రాణాలను అర్పించిన, సరళతతో జీవించిన, న్యాయం కోసం నిలబడి, మనస్సాక్షి ఖైదీగా మరణించిన గొప్ప వ్యక్తి ఫాదర్ స్టాన్ స్వామి గురించి మాట్లాడటానికి నేను సంతోషిస్తున్నాను.
వ్యాసాలు

ఆదిలాబాద్ లో30 యాక్ట్ పోదా ?

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2018 జనవరి నుండి 30 పోలీసు చట్టంను  అమలుచేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల గొంతు నొక్కుతున్నది. 30 పోలీసు ఆక్ట్‌ అనేది ఎమర్జెన్సీ పరిస్థితులను పోలిన చట్టం.  జిల్లా సూపరింటెండెంట్‌ లేదా అసిస్టెంట్‌ డిస్ట్రిక్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ ద్వారా ప్రతి నెల 1 నుంచి నెలాఖరు  వరకు నెలరోజుల పాటు పోలీస్‌ యాక్ట్‌ నిబంధనలను అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా డీఎస్పీ లేదా ఆపై అధికారుల నుంచి అనుమతి పొందాల్సిదే. నెల రోజుల
వ్యాసాలు

ప్రియమైన అమ్మా…

ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది.
వ్యాసాలు

వియ్యుక్క: ప్రత్యామ్నాయ కథలు

భారతదేశంలో సాయుధ పోరాట ప్రాంతాలలో జరుగుతున్న మావోయిస్టు ఉద్యమాన్ని మహిళా విప్లవకారులు రాసిన 20 చిన్న కథల సంకలనం వియ్యుక్క (గోండి భాషలో "వేగుచుక్క") ప్రతిబింబిస్తుంది. తాను ప్రకటించిన గడువుతేదీకి ముందరే మావోయిజంను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ప్రయత్నిస్తున్న సమయంలోనే ఇది ప్రచురితమవడం ఒక వైచిత్రం. ప్రధాన స్రవంతి మీడియా తరచుగా ఈ విప్లవకారులను దండకారణ్య అడవులను "తెగుళ్ళ” లాగా వ్యాపిస్తున్న "భయంకరమైన ఉగ్రవాదులు" అని అంటూ వారిని తలలో పేలలాగా "దువ్వేసెయ్యాల్సిన" వారిగా చిత్రీకరిస్తుంటే, వియ్యుక్కలోని కథలు వారిని తాము పనిచేసే ఆదివాసీల పట్ల కరుణను, సున్నితత్వాన్ని కలిగినవారిగానూ  సమర్థులుగానూ తెలివైన, అంకితభావంతో కష్టపడి పనిచేసే
వ్యాసాలు

హిందూయిజం ఒక అబద్ధం
హిందూ మెజారిటీవాదం అగ్రకులాల సృష్టి

1వర్తమాన భారతదేశంలో ప్రసారమాధ్యమాలన్నీ ‘‘హిందూ జాతీయవాదం’’ చేతిలో బందీలయ్యాయి. రాజకీయాలలో ఆమోదయోగ్యమైన ఒకే ఒక దృక్పథంగా హిందూ జాతీయవాదం కనపడుతోంది. దీని ప్రకారం ‘హిందూ’ అనేది ఒక పురాతన మతం, దానితోపాటు కల్పనాత్మకంగా పుట్టిన ఒక నరవర్గ (ఎథినిక్‌) సమూహం. ఆ కారణంగా ‘హిందువులు’ ఈ దేశపు శాశ్వతమైన స్వదేశీయులైపోయారు. భారతదేశాన్ని చరిత్ర పూర్వదశకు (అచారిత్రక) తీసుకువెళ్లడానికి ఈ రాజకీయ పథకం ప్రయత్నిస్తూంది. ప్రాచీన గ్రీకుల నుండి ఐరోపా వలస శక్తులవరకు, దేశం వెలుపల వున్న ‘మ్లేచ్చులు’ లేదా అపవిత్రులు, మిశ్రమజాతుల నుండి, స్వతంత్రంగా వున్న జాతి హిందువులని నిర్ధారించే ఆలోచన ఈ పధకానికి వున్నది. రామాలయ నిర్మాణానికి
వ్యాసాలు

దండకారణ్య ఉల్‌గులాన్‌కు జేజేలు

ఉల్‌గులాన్‌ అంటే గోండీలో ప్రజా తిరుగుబాటు. ఇవాళ దండకారణ్యమంతా పోటెత్తిన ఉల్‌గులాన్‌. అణచివేత, నిర్బంధం తీవ్రమవుతున్న దశలో ప్రజా పోరాటాలు ఎట్లా ఉంటాయో  దండకారణ్యంలో చూడాల్సిందే. దేశమంతా పోరాట క్షేత్రంగా మారుతున్న తరుణంలో దాన్ని ఉన్నత రూపంలో ముందుకు తీసుకపోతున్నది దండకారణ్యం. బ్రిటిష్‌ వలసవాదులకు వ్యతిరేకంగా మనదేశంలో తొలుత పోరాట శంఖమూదినది లేదా విల్లంబులనెత్తినది,  తుపాకినెత్తినది అదివాసులేనని చరిత్ర నమోదు చేసింది. ఆ వీరసంప్రదాయాన్ని ఎరిగిన ‘‘రాజ్యాంగ నిర్మాతలు’’ భారత రాజ్యాంగంలో మూలవాసుల సంరక్షణ, వారి వికాసాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ఆర్టికల్స్‌ను రూపొందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌342లో మన దేశంలోని ఆదివాసులను గుర్తించడానికి కావలసిన ప్రక్రియను పేర్కొన్నారు. ఫలితమే
వ్యాసాలు

వేగుచుక్క సందేశం

(విప్లవ రచయిత్రి, విప్లవోద్యమ నాయకురాలు కామ్రేడ్ అరుణ కథల సంపుటి *అప్రతిహతం* కు రాసిన ముందు మాట ఇది . ఆమె ఈ ఏడాది జూన్ 18 న ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలైంది . అరుణ ఆంద్ర ఒడిశా సరిహద్దు విప్లవోద్యమ కమిటీ సభ్యురాలు ) ఒక దశాబ్ద కాలంపాటు ప్రతి నిత్యం  ఏడాది పత్రికల్లో నిలిచిన మావోయిస్టు నాయకురాలిగా కామ్రేడ్ అరుణ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరపరిచితమే. అయితే ఆమె రచయిత అనే విషయం చాలా మందికి తెలియదు. అజ్ఞాత మహిళా రచయితల కథలను సంకలనాలుగా
వ్యాసాలు

అప్పర్ భద్ర సరే.. రాయలసీమ ప్రాజెక్టుల మాటేమిటి ?

అప్పర్ భద్ర ప్రాజెక్ట్ పై నేడు ఆంద్రప్రదేశ్  ప్రభుత్వం, రాజకీయ పార్టీలు తెలియజేస్తున్న నిరసనలు “తానాడలేక మద్దెలవోడు అన్నట్లు” అనే  సామెతను గుర్తుకు తెస్తున్నాయి.  కె సి కాలువకు  కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకొనేoదుకై  గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణానికి ప్రయత్నించకపోగా, 2015 లోనే దానికి వివరమైన ప్రాజెక్టు నివేదిక(డిపిఆర్)ను ఆ నాటి కృష్ణా బోర్డ్ కు సమర్పించినా, డిపిఆర్ ఇవ్వలేదని కేంద్ర జల కమీషన్ కు తెలిపిన ప్రబుద్ధులు    మన అధికారులు. అంతేకాదు, ఎన్నికల ఎత్తుగడలో భాగంగానైనా 2019 మార్చి లో   గుండ్రేవులకు చంద్రబాబు నిధులు కేటాయించారు. అయితే రద్దుల జగనన్న దాన్ని తుంగలో తొక్కాడు. దానిపై  స్పoదించిన
వ్యాసాలు

‘బస్తర్‌లో ఆదివాసీ మహిళలకు స్వేచ్ఛ లేదు’- సోనీ సోరీ

భారతదేశం మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో చాలా కాలంగా ఖనిజాల దోపిడీ విపరీతంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. పెట్టుబడిదారులకు ఈ దోపిడీని సుసాధ్యం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశమంతటికన్నా అత్యధిక సంఖ్యలో అర్ధ సైనిక బలగాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన ఈ సైనిక బలగాలు ప్రభుత్వ విధానం ప్రకారం ఆదివాసీల ధైర్యాన్ని దెబ్బతీయడానికి మహిళలపై లైంగిక దాడులు చేస్తాయి. బస్తర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా స్వయంగా శారీరక రాజ్య హింసను భరించింది. మహిళా దినోత్సవం
వ్యాసాలు

మంజీర అడుగుజాడలు

(విప్లవ రచయిత, విప్లవోద్యమ నాయకుడు కామ్రేడ్ మంజీర స్మృతి వ్యాసాలతో, కొన్ని తన  రచనలతో విడుదలైన 'వివా కామ్రేడ్ రవి' పుస్తకం ముందుమాటలోని ఒక భాగం ఇది . ఈ పుస్తకం శనివారం ఆగస్టు 2 న హైదరాబాదులో విరసం ఆవిష్కరిస్తోంది ) రవి అమరుడయ్యి 19 నిండి 20వ యేడు నడుస్తున్న సందర్భంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలని మొదలుపెట్టిన. నిజానికి దీనికి మూలం 2025 ఫిబ్రవరిలో జరిగిన విరసం జనరల్‌ బాడీ మీటింగ్‌లో... నవలలు చాలా తక్కువగా వస్తున్నాయని, రాయాలని, వీలైనంత మంది నవలలు రాయాల్సి ఉన్నదనే చర్చ జరిగింది. అందులో భాగంగా నేనూ రాస్తానని చెప్పాను.